మరో పార్టీతో సన్నిహితంగా ఉంటూ విమర్శలా? | Sakshi
Sakshi News home page

మరో పార్టీతో సన్నిహితంగా ఉంటూ విమర్శలా?

Published Wed, Jul 30 2014 12:19 PM

మరో పార్టీతో సన్నిహితంగా ఉంటూ విమర్శలా? - Sakshi

విజయనగరం: అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై కురుపాం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి గౌరవం ఇస్తున్నారని ఆమె బుధవారమిక్కడ అన్నారు. మరో పార్టీతో సన్నిహితంగా ఉంటూ సొంతపార్టీపై విమర్శలు చేయటం సరికాదని పుష్పశ్రీవాణి వ్యాఖ్యానించారు.

అరకు ఎంపీగా ఉంటూ మీ నియోజకవర్గ పరిధిలో ....చెన్నై భవనం కూలిన ఘటనలో బాధితులను ఇప్పటివరకూ ఎందుకు పరామర్శించలేదని కొత్తపల్లి గీతాను పుష్పశ్రీవాణి సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలు మాట్లాడటానికి ఉన్న సమయం ప్రజా సమస్యలపై స్పందించలేరా అని అన్నారు. పార్టీని విమర్శించాలనుకుంటే బయటకు వెళ్లి ఆ పని చేయాలని కొత్తపల్లి గీతకు సూచించారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
Advertisement