మొండి బకాయిలను ఎస్‌బీఐ ఏం చేసింది? | SBI writes off Rs 7,016 crore loans owed by wilful defaulters | Sakshi
Sakshi News home page

మొండి బకాయిలను ఎస్‌బీఐ ఏం చేసింది?

Nov 16 2016 2:05 PM | Updated on Sep 4 2017 8:15 PM

మొండి బకాయిలను ఎస్‌బీఐ ఏం చేసింది?

మొండి బకాయిలను ఎస్‌బీఐ ఏం చేసింది?

దేశ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో ఉన్న రుణ బకాయిలను వేరే ఖాతాలోకి మళ్లించి... తన బ్యాలెన్సు షీటులో మొండి బకాయిల భారం లేకుండా చూసుకుంది.

న్యూఢిల్లీ: దేశ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో ఉన్న రుణ బకాయిలను వేరే ఖాతాలోకి మళ్లించి... తన బ్యాలెన్సు షీటులో మొండి బకాయిల భారం లేకుండా చూసుకుంది. ఇందుకోసం రిజర్వు బ్యాంకు అనుమతించిన పద్ధతి అయిన 'అడ్వాన్స్‌ అండర్ కలెక్షన్ అకౌంట్స్ (ఆకా)' అనే పద్ధతిని అవలంబించింది. దీని ప్రకారం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంటులోకి బదిలీ చేస్తారు. తద్వారా ముందుగా అవి బ్యాంకు బ్యాలెన్సు షీటులో కనిపించవు. తద్వారా బ్యాంకు పనితీరు మెరుగుపడినట్లు అవుతుంది. కానీ, అంతమాత్రాన వాటిని పూర్తిగా మాఫీ చేసినట్లు కాదు. వన్‌టైమ్ సెటిల్మెంట్లు తప్ప మిగిలిన బకాయిలన్నింటినీ సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు చూపించినా, వాటిని 'ఆకా'లో యథాతథంగా ఉంచుతారు. అంటే, చిట్టచివరి రూపాయి వసూలయ్యే వరకు వాటి రికవరీ విధానం కొనసాగుతూనే ఉంటుంది. 
 
ఈ పద్ధతిలో మొత్తం 63 మంది డిఫాల్టర్లకు చెందిన మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.7,016 విలువ చేసే  నిరర్థక ఆస్తులను ఇలా చేసినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ మేరకు డైలీ న్యూస్ & అనాలిసిస్ బుధవారం ఒక కథనం ప్రచురించింది. 
 
Advertisement
 
Advertisement
Advertisement