ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదు | Sakshi
Sakshi News home page

ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదు

Published Tue, Oct 21 2014 1:42 AM

ఆ చానళ్లను ప్రజలు కోరుకోవడం లేదు

తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి
 
సూర్యాపేట:  టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ప్రజలు ప్రసారం చేయాలని కోరుకోవడం లేదని,  వారు కోరుకుంటే ప్రసారం చేస్తామని తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణ సమీపంలోని సీతారామ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రెండు చానళ్ల ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్ర ఏమీ లేదన్నారు.

వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు యాజమాన్యాలకు లేదని చెప్పారు. ఉన్నత న్యాయస్థానాలు సైతం ఎంఎస్‌ఓలకు అనుకూలంగానే తీర్పు చెప్పాయని గుర్తు చేశారు. ఎంఎస్‌ఓలందరూ సమస్యల పట్ల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే హక్కులను సాధించుకోగలుగుతామని తెలిపారు.
 

Advertisement
Advertisement