అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం | telugu student dies in illilnoiss | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

May 14 2017 10:19 PM | Updated on Aug 30 2018 4:10 PM

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు.

ఇల్లినాయిస్‌ :
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఇల్లినాయిస్‌లోని లింకన్‌ హైవే పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతున్ని చిత్తూరు జిల్లా నగరికి చెందిన సాయి కుమార్‌ అడ్లూరిగా గుర్తించారు. సాయికుమార్‌ నార్తన్‌ ఇల్లినాయిస్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నట్టు సమాచారం.

ఈ ప్రమాదంలో సాయికుమార్‌తోపాటూ మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి. సాయికుమార్‌ ఘటనా స్థలంలోనే మృతిచెందగా, యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయికుమార్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐలు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement