'హీరో శివాజీకి బీజేపీతో సంబంధం లేదు'

'హీరో శివాజీకి బీజేపీతో సంబంధం లేదు' - Sakshi


న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న శివాజీకి బీజేపీతో సంబంధం లేదని ఆ పార్టీ జాతీయ నేత సోము వీర్రాజు ప్రకటించారు. మంగళవారం న్యూఢిల్లీలో సోము వీర్రాజు విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.


ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు రూ. 7 వేల కోట్లు మంజూరు చేశామని.... అలాగే ప్రత్యేక హోదా కావాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న వాటికి మాత్రం రూ. 3 వేల కోట్లు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. టీడీపీ డిమాండ్ చేయక ముందే 24 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తామని కేంద్రం ఇచ్చిన హామీని మరవరాదని ఆయన అన్నారు.


విజయవాడ - కర్నూలు నగరాల మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. తాము మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం... కానీ టీడీపీ మాత్రం ఆ ధర్మాన్ని ఉల్లంఘిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top