గోదావరి జిల్లాలలో రాముసూర్యారావు విజయం

రాము సూర్యారావు - Sakshi


ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో  యుటీఎఫ్ అభ్యర్థి రాము సూర్యారావు విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లతో రాము సూర్యారావు గెలుపొందారు. టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ఓడిపోయారు.



ఈ ఫలితం టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 9 నెలలకే టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. ఈ జిల్లాలలోని ఉద్యోగస్తులలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకుంటున్న ఈ జిల్లాలలో ఓటమి ఆ పార్టీకి గట్టి దెబ్బగా భావిస్తున్నారు.



ఈ రోజు జరిగిన టీడీఎల్సీ సమావేశంలో ఈ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. ఇక్కడ అభ్యర్థి ఎంపికలో పొరపాటు జరిగినట్లు సమావేశం భావించినట్లు తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top