ప్రధానితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం 11.45 గం.లకు ప్రధానమంత్రిని విజయసాయిరెడ్డి కలిసి ఏపీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా నెలకొన్న వివిధ ప్రజా సమస్యలపై దాదాపు 15 నిమిషాలసేపు చర్చించారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించిన అన్ని అంశాలపైనా ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఆ అంశాలను త్వరలోనే పరిశీలించి వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని మోదీ సూచించారు.


