ఎయిర్ పోర్ట్ కు భూమి ఇచ్చిన అశ్వనీదత్
కృష్ణా జిల్లా గన్నవరంలో ఎయిర్పోర్ట్ విస్తరణకు తన 40 ఎకరాల భూమిని సినీ నిర్మాత అశ్వనీదత్ ఇచ్చేశారు.
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలో ఎయిర్పోర్ట్ విస్తరణకు తన 40 ఎకరాల భూమిని సినీ నిర్మాత అశ్వనీదత్ ఇచ్చేశారు. గన్నవరం మండలం కీసరపల్లిలో ఉనన భూమిని ఇస్తున్నట్లు అంగీకార పత్రాన్ని నూజివీడు ఆర్డీఓకి ఆయన అందించారు. ల్యాండ్పూలింగ్ పద్ధతిలో కొత్త రాజధానిలో ఎకరానికి 1450 చదరపు గజాల భూమిని అశ్వినీదత్కు కేటాయిస్తున్నట్లు ఆర్డీఓ సీహెచ్.రంగయ్య తెలిపారు. ఆ లెక్కన అశ్వనీ దత్ కు కొత్త రాజధాని ప్రాంతంలో సుమారు 12 ఎకరాల భూమి వస్తుంది.


