ఆరేళ్ల బాలుడిపై కుక్కల దాడి
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మూగనూరులో ఘోరం జరిగింది. మంగళవారం మధ్యహ్నం ఇంటిముందు ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మూగనూరులో ఘోరం జరిగింది. మంగళవారం మధ్యహ్నం ఇంటిముందు ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి. తీవ్ర గాయాలపాలైన పిల్లాడిని కుటుంబ సభ్యులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నబాలుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వేసవిలో సంభవించే జన్యుపరమైన మార్పుల కారణంగా కుక్కలు హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై ఇటు వైద్యాధికారులుగానీ, మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులుగానీ దృష్టిపెట్టకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తగిన చర్యలు చేపట్టకుంటే పరిస్థితి తీవ్రతరమయ్యే అవకాశం ఉంది.


