-
సరిహద్దులో చైనాతో కొత్త బెడద
‘షావోకాంగ్’ పథకం ద్వారా వందల ఆధునిక గ్రామాలను సరిహద్దుల్లో చైనా నిర్మించింది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట సాగుతున్న ఇది పూర్తిగా నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘భౌగోళిక పటాల దాడి’ని కూడా ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. టిబెట్, షిన్జాంగ్ లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. ‘ఎత్తుకు పై ఎత్తు’ వేయడం కాకుండా, చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. సరిహద్దులలో చైనా ఆధునిక గ్రామాలను నిర్మించడం, వాటిని నివాస ప్రాంతాలుగా చేసుకోవడం గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. మార్చ్ 28న, టిబెట్ను చైనా స్వాధీనం చేసుకున్న ఘటన 65వ వార్షికోత్సవం సందర్భంగా, భారత్, భూటాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న కొత్త గ్రామాలలో చైనా ప్రభుత్వం అనేక వేడుకలను నిర్వహించింది. తాజా వార్తల ప్రకారం, ఇప్పటికే ఉన్న 628 ‘సవొకాంగ్’ (సంపన్న గ్రామా లు)తో పాటు, మరో 175 సరిహద్దు గ్రామాలను చైనా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట, షావోకాంగ్ చొరవ అనేది నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ద్వారా చైనా సమాజపు సమాన అభివృద్ధిని నిర్ధారించ డానికి 1979లో డెంగ్ జియావోపింగ్ ఈ నమూనాను ప్రతిపాదించారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దీనిని, ప్రధాన భూభాగంతో సరిహద్దు ప్రాంతాల ఏకీకరణ వ్యూహంగా మార్చారు. తద్వారా అరుణాచల్ప్రదేశ్కు ఎదురుగా ఉన్న టిబెట్లో దాని భూసరిహద్దుల భద్రతను మెరుగుపరిచారు. షావోకాంగ్ పథకంలో భాగంగా, 427 మోడల్ గ్రామాలను ఫ్రంట్ లైన్లో నిర్మించగా, 201 గ్రామాలు రెండవ శ్రేణిలో ఉన్నాయి. ఈ సంపన్న గ్రామాలు షిగత్సే, లోహ్కా, న్యింగ్చి, ఎన్గారి వంటి ముఖ్య మైన పట్టణాలతో సహా 21 సరిహద్దు కౌంటీలలో విస్తరించి ఉన్నాయి. భూటాన్, అరుణాచల్ప్రదేశ్లతో సరిహద్దును పంచుకునే లోహ్కా ప్రాంతంలోనే, చైనా 354 ‘సంపన్న’ సరిహద్దు స్థావరాలను అభివృద్ధి చేసింది. ఈ గ్రామాలలో దాదాపు మూడింట ఒక వంతు వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) సమీపంలో నిర్మించారు. మౌలిక సదు పాయాలు సహా, ఈ ఆవాసాల నిర్మాణం కోసం సుమారుగా 4.6 బిలి యన్ డాలర్లు కేటాయించారు. 2017 అక్టోబర్లో జరిగిన 19వ పార్టీ కాంగ్రెస్లో, ప్రతిభావంతులైన చైనీస్ పౌరులు మారుమూల జాతిపరమైన మైనారిటీ ప్రాంతాలలో పని చేయాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. దీంట్లో నిగూఢంగా దాగి ఉన్నది, ప్రధానంగా అక్కడి జనావాసాల స్థితిగతులను మార్చడమే. గత దశాబ్దంలోనే, టిబెట్లో హాన్ జనాభా సుమారు 12 శాతం పెరిగింది. కమ్యూనిస్ట్ పాలన అంతిమ లక్ష్యం, టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో పూర్తిగా చైనీకరణను సాధించడం. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దు ప్రాంతాలలో అన్ని సరిహద్దు గ్రామాలకు రోడ్లు, విద్యుదీకరణ, ఆఖరికి ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి నాణ్యమైన సౌకర్యాలు అందించారు. అదనంగా, దాదాపు 206 పారిశ్రామిక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సరిహద్దు నిర్వహణను బలోపేతం చేయడానికి చైనా ఇటీవలి సంవత్సరాలలో రెండు జాతీయ చట్టాలను ప్రవేశపెట్టింది. 2021లో ఆమోదించిన నేషనల్ డిఫెన్స్ లా, జాతీయ ప్రయోజనాల కోసం పౌర సంస్థలతో కలిసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పనిచేయడానికి అధిక పాత్రను అందిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత, ఆక్రమిత ప్రాంతా లపై చైనా పట్టును ఏకీకృతం చేసేందుకు భూ సరిహద్దు చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టంలోని ఆర్టికల్స్ 10, 43... సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి యథాతథ స్థితిని సవాలు చేస్తున్నాయి. ఇది భారతదేశ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘మ్యాప్ల దాడి’ని ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. ఇది ప్రచారపరమైన, మానసికపరమైన, చట్టపరమైన కోణాలను కలిగి ఉంటుంది. జూలై 2021లో, జిన్పింగ్ లాసాను సందర్శించారు. గత మూడు దశాబ్దాలలో చైనా దేశాధినేత చేసిన మొదటి సందర్శన. ఆయన టిబెట్ను ‘ఇనుప కవచం’గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దీని ప్రకారం, డోక్లామ్, లాంగ్ జు వంటి వివాదాస్పద ప్రాంతాలలోని సరిహద్దు గ్రామాలు ఫార్వర్డ్ పోస్ట్లుగా వ్యవహరించడానికి చైనా సైన్యపు రక్షణ ప్రణాళికలలో విలీనం చేయబడ్డాయి. హాన్ జాతికి చెందిన మాజీ సైనిక సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చైనా చర్యలు దాని ‘గ్రే జోన్ వార్ఫేర్’కు అనుగుణంగా ఉన్నాయి. ఇందులో పౌరులు, పౌరసైనికులు ‘నాన్–కాంటాక్ట్’ యుద్ధంలో భాగమ వుతారు. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ కార్యాచరణ దీనికి ఒక ఉదాహరణ. ఒక స్పష్టమైన విధానం లేనందున, ముఖ్యంగా చైనాకు ఎదు రుగా ఉన్న భారత సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. టిబెట్, షిన్జాంగ్లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (వీవీపీ)ని గతేడాది ప్రారంభించారు. దీని ప్రకారం, చైనా సరిహద్దులో కనెక్టివిటీ లోపించిన 168 గ్రామాలను ఈ ఏడాది చివరి నాటికి అనుసంధానం చేయనున్నారు. 19 జిల్లాల్లోని 663 సరి హద్దు గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4,800 కోట్ల బడ్జెట్ను కేటాయించారు.చైనా నియంత్రణలో పూర్తిగా ఉండే సవొకాంగ్ పథకానికి విరు ద్ధంగా, భారత్ కార్యక్రమం ‘హబ్ అండ్ స్పోక్’(ఒక దగ్గరి నుంచి అందరికి) నమూనాను అనుసరిస్తోంది. ఇది జిల్లా పరిపాలన, గ్రామ పంచాయతీల ద్వారా అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వ పాత్ర నిధులు ఇవ్వడానికే పరిమితమైంది. వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ప్రధాన దృష్టి సామాజిక–ఆర్థిక కార్యక్రమాల ప్రచారంపై ఉంది. అయితే, భద్రతా అంశాలను కూడా చేర్చడం ద్వారా ద్వంద్వ–వినియోగ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, దిబాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు, జలమార్గాలతో సహా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సరిహద్దుల్లో భారత్ చేపడుతోంది. ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధికి రూ. 12,882.2 కోట్ల నిధులను ‘స్థూల బడ్జెట్ సహాయం’ కింద సమకూర్చారు. వివాదాస్పద సరిహద్దు, లద్ధాఖ్లలో కొనసాగుతున్న ప్రతిష్టంభన దృష్ట్యా, చైనా ప్రణాళిక తీవ్రమైన వ్యూహాత్మక పరిణామాలను కలిగి ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ స్థితిని ఏకపక్షంగా మార్చాలనే బీజింగ్ ఉద్దేశం, సవొకాంగ్ పథకంతో మరింత తోడ్పాటును పొందు తుంది. 2005 (ఆర్టికల్ 7)లో పొందుపర్చిన ‘సరిహద్దు సమస్య పరి ష్కారానికి రాజకీయ పరామితులు, మార్గదర్శక సూత్రాలు’ ఒప్పందాన్ని కూడా చైనా విస్మరించింది. ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దుల వెంబడి జనాభా ప్రస్తుత అమరికకు ఎవరూ భంగం కలిగించకూడదు. చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. ‘ఎత్తుకు పై ఎత్తు’పై ఆధారపడిన మన ప్రస్తుత ప్రతిస్పందనా విధానానికి కాలం చెల్లిపోయింది. సరిహద్దు నిర్వహణ మొత్తంగా సమగ్ర సమీక్షకు గురికావాలి. ఇది జాతీయ భద్రతా వ్యూహంలో కీలకమైన అంశంగా ఉండాలి. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పటికీ రూపు దాల్చుతూనే ఉంది! మేజర్ జనరల్ జిజి ద్వివేది (రిటైర్డ్) వ్యాసకర్త చైనాకు భారత మాజీ డిఫెన్స్ అటాచె (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అమెరికా–చైనా చర్చలపర్వం
ఎడతెగని చర్చలు జరుగుతున్నాయంటే, అయినా కనుచూపుమేరలో పరిష్కారం కానరా లేదంటే... కనబడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం. సమస్య తీవ్రంగా ఉన్నదని తాత్పర్యం. ఈనెల ప్రారంభంనుంచి అమెరికా–చైనాలమధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్లు నేరుగా ఫోన్లో సంభాషించుకున్నారు. నాలుగు నెలలక్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పనిబడటం గమనించదగిందే. వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ చైనా సందర్శనకొచ్చి ప్రధాని లీ కియాంగ్తోపాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. అంతకుమునుపే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చర్చించుకున్నారు. త్వరలోనే అమెరికా విదేశాంగమంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనా వెళ్లబోతున్నారు. ఇలా సంభాషణల పరంపర కొనసాగుతున్నది గానీ పరిష్కారం కానరావటం లేదు. వీటికి సమాంతరంగా చైనాను కట్టడి చేసే ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా 2021లో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ‘ఆకస్’ కార్యకలాపాలు చురుకందు కున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ రక్షణమంత్రులు ఇటీవల భేటీ అయ్యారు. ఇందులో మనదేశాన్ని కూడా చేర్చు కోవాలని అమెరికా తహతహలాడుతున్నా ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికే ఇంతవరకూ మన దేశం కట్టుబడివుంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగని మన దేశం మౌనంగా ఏమీ లేదు. దక్షిణ చైనా సముద్రంలో చైనానుంచి తరచు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనేవుంది. ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిప్పీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఆ దేశాన్ని సందర్శించి అండగా వుంటామని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది. నిరంతర గస్తీ కాస్తోంది. సమస్యేమంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో 60 శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది. అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దూకుడు ఊహించని పరిణామం. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది. ఉక్రెయిన్కు ఆయుధాలందించటం ద్వారా రష్యాను దారికి తేవొచ్చని భావించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. రష్యాకు ఇరాన్ నుంచి డ్రోన్లు అందుతున్నాయి. ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది. ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయసహకారాలందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దుందుడుకుతనంతో గాజా మండుతోంది. ఇజ్రాయెల్ను ఎలాగైనా దారికి తేవా లన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించటం లేదు. కనుకనే దౌత్యరంగంలో వున్నంత దూకుడు రక్షణరంగంలో కనబడటం లేదన్నది బైడెన్పై వున్న ప్రధాన విమర్శ. ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్ను కలవరపెడుతున్నాయి. పర్యవసానంగా చైనాతో చర్చోప చర్చలు సాగుతున్నాయి. వాణిజ్యపరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా వుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి. వాటివల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుకావటం కష్టమవుతోంది. అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నెల మొదట్లో జో బైడెన్, షి జిన్పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంశాలపై చర్చలు నడిస్తే... చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లెం వేయటంపై జానెట్ ఎలెన్ ప్రధాని లీ కియాంగ్తో చర్చించారు. దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా 50 లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్కొస్తాయన్నది అమెరికా అంచనా. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ తదితర అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తున్నదని చైనా ఆరోపణ. కనుకనే ఇరుదేశాల ఉన్నతాధికారులమధ్యా వరసగా నాలుగురోజులపాటు చర్చలు సాగినా... నేరుగా ఎలెన్, లీ కియాంగ్లు సంభాషించుకున్నా పరిష్కారం దొరకలేదు. చిత్రమేమంటే అమెరికా, చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నా వాణిజ్యపరంగా ఆ రెండు దేశాలూ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని స్థితి. అందుకే ఇండో–పసిఫిక్ అంశంలో దూకుడుగా వున్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదోవిధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు. వీటికి మరిన్ని జోడిస్తానన్న బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామన్న సంకేతాలు రెండు దేశాలూ ఇస్తున్నాయి. ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి. ఘర్షణల నివారణ ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే ఘర్షణలవల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమీ మిగలదు. అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా వుండాలి. చిత్తశుద్ధితో సాగాలి. లేనట్టయితే నిష్ఫలమవుతాయి. -
సైన్యంలోని అవినీతిపై చైనా పోరాటం
2013 నుండి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ప్రజా విముక్తి సైన్యం(పీఎల్ఏ)లోని అవినీతిని తొలగించలేకపోయారు. దానికోసం ఆయన అమలు చేసిన పర్యవేక్షణ వ్యవస్థ కూడా పనిచేసినట్లు లేదు. జిన్పింగ్కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, సీనియర్ అధికారులందరూ ఆయన ద్వారానే పదోన్నతి పొందారు. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న కనీసం 70 మంది పీఎల్ఏ అధికారులను తాము గుర్తించినట్లు ఒక కెనడా థింక్ ట్యాంక్ పేర్కొంది. ఇక, తైవాన్ పై దాడికి పీఎల్ఏ సిద్ధంగా లేదని మరో నివేదిక పేర్కొంది. పీఎల్ఏ రాజకీయ విశ్వసనీయతను, సైద్ధాంతిక నిబద్ధతను బలోపేతం చేయడానికి చైనా అధ్యక్షుడు ఒక కఠినమైన ప్రచారం నిర్వహించనున్నారనేది స్పష్టం. గత సంవత్సరం మధ్య నుండి చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ–ప్రజా విముక్తి సైన్యం) ఉన్నత స్థాయులలో స్పష్టంగా గందరగోళం కనిపిస్తోంది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) నిర్వహించిన నూతన సంవ త్సర ప్రదర్శనలో జనవరి 29న కనిపించిన సీఎంసీ సీనియర్ వైస్ ఛైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియాను, రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్ఫును ఆకస్మికంగా తొలగించడం గురించి సుదీర్ఘకాలంపాటు చైనా ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. వీరిద్దరికీ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్తో సన్నిహిత కుటుంబ సంబంధాలు ఉండటం అనిశ్చితిని మరింతగా పెంచింది. అవినీతి లేదా రాజకీయ క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆరోపణలపై చాలా మంది సీనియర్ అధికారులను ఇటీవలి నెలల్లో పదవుల నుండి తొలగించారు. అవినీతి ఆరోపణలపై విచారణలో ఉంచిన కనీసం 70 మంది పీఎల్ఏ అధికారులను తాము గుర్తించినట్లు ఒక కెనడా థింక్ ట్యాంక్ (మేధా సంస్థ) పేర్కొంది. అదనంగా, తైవాన్ పై దాడికి పీఎల్ఏ సిద్ధంగా లేదని పీఎల్ఏ అధికారులు జిన్ పింగ్కు తెలియజేసినట్లు మరో నివేదిక పేర్కొంది. అవినీతిని నిర్మూలించడం, రాజకీయ క్రమశిక్షణ, విశ్వసనీయతను నిర్ధారించడంపై చైనా అధ్యక్షుడు దృష్టి సారించడంతో, పీఎల్ఏ పూర్తిగా ‘ప్రక్షాళన’ లేదా దిద్దుబాటుకు లోనవుతుందనే విషయం దాదాపు నిశ్చయమైంది. కదులుతున్న సోపానక్రమం గత ఏడాది సెప్టెంబర్లో జనరల్ లీ షాంగ్ఫు ఆకస్మికంగా ప్రజల దృష్టి నుండి అదృశ్యమైనప్పటి నుండి, ఇది ఎందుకు జరిగింది, అతని స్థానంలో ఎవరు ఉంటారు? అనే దానిపై నిరంతర ఊహాగానాలు కొనసాగుతున్నాయి. జిన్ పింగ్ మరొక ఆశ్రితుడైన విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ జూలైలో ఆకస్మికంగా, ఇప్పటికీ వివరించలేని విధంగా అదృశ్యమవడం కారణంగా మరింతగా ఊహాగానాలు పెరిగాయి. బహుశా వారు అవినీతికి పాల్పడ్డారనీ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనీ ఆ తర్వాత సంకేతాలు వచ్చాయి. ఆసక్తికరంగా, వీరిద్దరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులుగా తమ స్థానాన్ని మాత్రం నిలుపుకొన్నారు. 2023 సంవత్సరం అక్టోబరులో జనరల్ లి షాంగ్ఫు అధికారికంగా రక్షణ మంత్రి పదవి నుండి వైదొలిగారు. అయితే పీఎల్ఏ మాజీ నేవీ కమాండర్ జనరల్ డాంగ్ జున్ ను ఆయన వారసుడిగా నియమించటానికి మరో మూడు నెలలు పట్టింది. మొదటిసారిగా, మాజీ పీఎల్ఏ నేవీ కమాండర్ను రక్షణ మంత్రిగా నియమించడం వలన పీఎల్ఏ పదాతి బలగం, పీఎల్ఏ రాకెట్ బలగం గురించి సందేహాలు తలెత్తాయి. అదే సమయంలో, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జనరల్ జాంగ్ చాలా కాలం గైర్హాజరు కావడం, మళ్లీ అడపాదడపా సుదీర్ఘకాలం కనిపించకపోవడం వల్ల, జిన్పింగ్తో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయని ఊహాగానాలు వచ్చాయి. జనవరి 16న బీజింగ్లోని సెంట్రల్ పార్టీ స్కూల్లో ‘అధిక నాణ్యత, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం’పై జరిగిన అధ్యయన సెషన్లో జనరల్ జాంగ్, జనరల్ హీ వీడాంగ్ వెనుక మూడవదైన చివరి వరుసలో కూర్చున్నట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని సీసీటీవీ కవరేజి చూపించింది. ఇది పీఎల్ఏ సోపానక్రమం విషయంలో చాలా అసాధారణమైనది తనిఖీ పరిధిలోకి వచ్చినప్పటికీ... పీఎల్ఏలో దశాబ్దాలుగా అవినీతి రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. 2012 నవంబర్లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్ గా జిన్పింగ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పీఎల్ఏను చైనా కమ్యూ నిస్టు పార్టీకి చెందిన అవినీతి నిరోధక సంస్థ అయిన కేంద్ర క్రమశిక్షణా తనిఖీ కమిషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. దానిని ఏడాది పొడవునా సైద్ధాంతిక, అవినీతి వ్యతిరేక ప్రచారాలకు గురిచేశారు. పీఎల్ఏ ఆధు నీకరణ, ఆల్–రౌండ్ టెక్నాలజీ అప్గ్రేడ్పై కొత్త, ప్రధాన ప్రాధాన్యత కారణంగా భారీ మొత్తంలో డబ్బు అందుబాటులోకి వచ్చేది. పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ ముఖ్యంగా క్షిపణుల జాబితాను పెంచడానికి, కొత్త రకాల క్షిపణులను ప్రవేశపెట్టడానికి, అనేక భూగర్భ గోతులను నిర్మించడానికి చేసిన కృషి కారణంగా పెద్ద మొత్తాలను అందుకుంది. పీఎల్ఏ సామగ్రి అభివృద్ధి విభాగానికి సంబంధించిన రక్షణ శాస్త్రీయ సంస్థల్లోని అధికారుల తొలగింపు, వారు కూడా అవినీతికి పాల్ప డ్డారని నిర్ధారిస్తుంది. తాను కనీవినీ ఎరుగని స్థాయిలో అవినీతి వ్యతిరేక ప్రచారం సాగించినప్పటికీ, పీఎల్ఏలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి కొనసాగడంపై జిన్ పింగ్ ఆగ్రహం చెందారు. దీని ఫలితంగా 2017 నాటికి అవినీతి ఆరోపణలపై 40 శాతం మంది అధికారులను తొలగించారు. రిపోర్టింగ్, పర్యవేక్షణ యంత్రాంగం పని చేయలేదనీ, దానిని పర్య వేక్షించడానికి పార్టీ చేసిన ప్రయత్నాలను పీఎల్ఏ ప్రతిఘటించిందనీ ఇది సూచిస్తుంది. దీనికి అనుగుణంగా, 2024 జనవరి 1న నాటి పీఎల్ఏ దినపత్రిక సంపాదకీయం, అవినీతిపై పోరాటానికి ప్రాధాన్య తనిస్తూ మూడుసార్లు ‘అవినీతి’ని ప్రస్తావించింది! అప్పటి నుండి, పీఎల్ఏ అవినీతిని అరికట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే దాదాపు అరడజను కథనాలు వచ్చాయి. కఠిన ప్రచారం ఇంతలో, రహస్య పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ కమాండర్, పొలిటికల్ కమిస్సార్, జనరల్ లీ యుచావో, జనరల్ గ్జూ జోంగ్బోలను, వరు సగా వారి పదవుల నుండి తొలగించారు. అవినీతి ఆరోపణలపై వీరిపై విచారణ సాగించారు. విశ్వసనీయ నివేదికల ప్రకారం, ఈ అవినీతి సొమ్ము విలువ మొత్తం 2 బిలియన్ డాలర్లు అని అంచనా. డిసెంబర్ 29న, చైనా పార్లమెంటుగా పేర్కొనే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొమ్మిది మంది సీనియర్ పీఎల్ఏ అధికారులను వారి పదవుల నుండి తొలగించింది. 2023 జూన్ లో, అణువ్యతిరేక దాడిని ప్రారంభించడం కోసం చర్యలను పర్యవేక్షించిన జనరల్ లి యుచావో, జనరల్ జు, ఆయన సహాయకులు లియు గ్వాంగ్బిన్, జాంగ్ జెన్ జాంగ్లను కూడా వారి పదవుల నుండి తొలగించారు. పీఎల్ఏ సామగ్రి అభివృద్ధి విభాగం అధికారులైన జాంగ్ యులిన్, రావో వెన్ మిన్ లను తొలగించడం మరింత ఆసక్తికరంగా ఉంది. గత నెల ప్రారంభంలో, దాదాపు 15 మంది సీనియర్ పీఎల్ఏ రాకెట్ ఫోర్స్ అధికారులను కూడా తొలగించి విచారణలో ఉంచారు. వారిలో ఐదుగురు ఆ సంస్థకు చెందిన గత లేదా ప్రస్తుత కమాండర్లు. 2013 నుండి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, జిన్పింగ్, పీఎల్ఏ నుండి అవినీతిని తొలగించలేకపోయారు. పైగా ఆయన అమలులో ఉంచిన పర్యవేక్షణ వ్యవస్థ కూడా పనిచేసినట్లు లేదు. జిన్పింగ్కు మరింత ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే, సీనియర్ అధికారులందరూ ఆయన ద్వారానే పదోన్నతి పొందారు. జనరల్ లి షాంగ్ఫు వంటి ఆయన సన్నిహిత వ్యక్తులు కూడా వారి స్థానాల నుండి తొలగించబడిన అధికారులలో ఉన్నారు. పీఎల్ఏ రాజకీయ విశ్వసనీయతను, సైద్ధాంతిక నిబద్ధతను బలోపేతం చేయడానికి ఒక కఠినమైన కేంపెయిన్ నిర్వహించనున్నారని స్పష్టం అవుతోంది. జయదేవ రానాడే వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ చైనా ఎనాలిసిస్ అండ్ స్ట్రాటెజీ’ అధ్యక్షుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి!
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి! -
బైడెన్తో జిన్పింగ్ భేటీ
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చైనా అధినేత షీ జిన్పింగ్ సమావేశానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన ఈ భేటీ జరుగనుంది. ఇటీవలి కాలంలో అమెరికా–చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురు నాయకుల సమావేశం అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధాలను పునరుద్ధరించుకొనే దిశగా వారిద్దరూ చర్చలు జరుపునున్నట్లు తెలుస్తోంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జిన్పింగ్ మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయన అమెరికాకు రావడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
Advertisement