ఆధార్ పై ఒత్తిడి చేయొద్దు:సుప్రీం
ఆధార్ కార్డు అంశంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ:ఆధార్ కార్డు అంశంపై గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డుకు సంబంధించి ప్రజలపై ఒత్తిడి చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. సామాజిక, భద్రత పథకాలకు ఆధార్ కార్డు తప్పనసరి కాదని సుప్రీం మరోమారు సృష్టం చేసింది.
గతేడాది ఇదే తరహా ఆదేశాలను సుప్రీం ఇచ్చినా.. వాటిని ప్రభుత్వాలు పక్కకు పెట్టి ప్రతీ పథకానికి ఆధార్ ను లింక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారణకు స్వీకరించిన సుప్రీం పై విధంగా స్పందించింది.


