breaking news
Pakistan
-
రెండు నెలలుగా పాకిస్థాన్కు ఎగుమతులు బంద్
భారత్ నుంచి పాకిస్థాన్కు చేసే ఫార్మా ఎగుమతులు రెండు నెలలుగా కస్టమ్స్ వద్ద నిలిచిపోవడంతో భారత ఔషధ ఎగుమతిదారులు అనిశ్చితితో సతమతమవుతున్నారు. ఫార్ములేషన్లు, వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)తో సహా పాకిస్థాన్కు ఏటా 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఫార్మా ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. పాకిస్థాన్తో భారతదేశం 2025 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో 18% వృద్ధిని నమోదు చేసింది. అయితే 2025 మే తర్వాత కస్టమ్స్ అనుమతులు నిలిపివేయడంతో దేశీయ ఎగుమతిదారులు ఆందోళన చెబుతున్నారు.కశ్మీర్లో పర్యాటకులపై దాయాది దేశం ఉగ్రదాడి, ఆ తర్వాత సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిస్పందనగా భారత్ అధికారికంగా పాకిస్థాన్తో అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. సస్పెన్షన్ తర్వాత కూడా ఫార్మా ఎగుమతులు కొంతకాలం కొనసాగినప్పటికీ, అధికారిక వివరణ లేకుండా ఫార్మా ఎగుమతులు కొద్దికాలంలోనే నిలిచిపోయాయి. పాకిస్థాన్తో ట్రేడ్ సస్పెన్షన్ తర్వాత కొన్ని వారాల పాటు ఎగుమతులను కొనసాగించామని, సాధారణంగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని భావిస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కానీ కస్టమ్స్ క్లియరెన్స్ అకస్మాత్తుగా ఆగిపోయిందని, ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదని చెప్పారు.‘ఔషధ ఎగుమతులపై నిషేధాన్ని సాధారణంగా మానవతా ప్రాతిపదికన ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక ఆంక్షల నుంచి మినహాయిస్తారు. అయితే ఇప్పటివరకు బహిరంగంగా ఎటువంటి అధికారిక నిషేధం లేదా నోటిఫికేషన్ జారీ చేయలేదు. దాంతో ఎగుమతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ సహా కీలక ఫార్మా హబ్ల్లో ఎగుమతిదారులు ఆర్థిక, కాంట్రాక్టు చిక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’ అని సీనియర్ అధికారి చెప్పారు.ఈ సమస్యకు పరిష్కారంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గత నెలలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(డీజీఎఫ్టీ)కి అధికారిక వినతిపత్రాన్ని సమర్పించింది. పాకిస్థాన్కు ఔషధ ఎగుమతులను నిషేధించడం లేదా పరిమితం చేయడంపై ఏదైనా అధికారిక నోటిఫికేషన్ ఉందా?.. ఉంటే కంపెనీలకు స్పష్టమైన కటాఫ్ తేదీ వివరాలు ఏవైనా ఉన్నాయా అని వివరణ కోరింది. దీనిపై డీజీఎప్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ఫార్మెక్సిల్ ప్రతినిధి తెలిపారు. ఇదీ చదవండి: బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు -
పాక్ను అప్రమత్తం చేసి మానవత్వం చాటిన భారత్
-
ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు.. కట్ చేస్తే 'మెరుపు శతకం'తో బీభత్సం
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టులో విధ్వంసకర బ్యాటర్ ఉస్మాన్ ఖాన్కు చోటు దక్కలేదు. ఫామ్లేమి కారణంగా పాక్ సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఆసియా కప్ కోసం ఎంపిక చేయకపోవడాన్ని అవమానంగా భావించిన ఉస్మాన్ ఖాన్.. దేశవాలీ టీ20 టోర్నీలో తన ప్రతాపాన్ని చూపించాడు.ఘనీ రాయల్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో వైటల్ టీ జట్టుకు ఆడుతున్న ఖాన్.. ఆదివారం జరిగిన మ్యాచ్లో 69 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. ఫలితంగా అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకుంది.కాగా, ఉస్మాన్ ఖాన్కు పాక్ క్రికెట్ బోర్డు ఈ మధ్యకాలంలోనే మరో షాక్ కూడా ఇచ్చింది. ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది. ఖాన్ గతేడాది డి-కేటగిరిలో కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఖాన్ పీసీబీ తాజాగా కాంట్రాక్ట్ను కూడా కోల్పోయాడు. పీసీబీ తమ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్లను తమ అత్యున్నత కాంట్రాక్ట్ అయిన ఏ కేటగిరి నుంచి తప్పించి బి కేటగిరికి డిమోట్ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో దారుణంగా విఫలమవుతున్న కారణంగా పీసీబీ ఏ ఒక్క పాక్ ఆటగాడికి కూడా ఏ కేటగిరి కేటాయించలేదు.30 ఏళ్ల ఉస్మాన్ ఖాన్కు పాక్ దేశవాలీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. పీఎస్ఎల్ ద్వారా ఇతను భారీ హిట్టర్గా పేరు గడించాడు. అయితే ఖాన్కు పాక్ తరఫున పేలవమైన రికార్డు ఉంది. ఈ కుడి చేతి వాటం బ్యాటర్ తన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ 19 టీ20ల్లో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క అర్ద సెంచరీ మాత్రమే ఉంది. పాక్ తరఫున 2 వన్డేలు కూడా ఆడిన ఖాన్.. ఇక్కడ కూడా విఫలమయ్యాడు. -
ఇంగ్లండ్ గడ్డపై పాక్ ఓపెనర్ సెంచరీల మోత.. రీ ఎంట్రీ ఇస్తాడా?
పాకిస్తాన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయిన స్టార్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్.. ఇంగ్లండ్ గడ్డపై మాత్రం అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్ 2025లో యార్క్షైర్ తరపున ఆడుతున్న ఇమామ్ పరుగుల వరద పారిస్తున్నాడు.ఆదివారం హోవ్ కౌంటీ గ్రౌండ్ వేదికగా ససెక్స్తో జరిగిన మ్యాచ్లో ఇమామ్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 286 పరుగుల లక్ష్య చేధనలో ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇమామ్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు జేమ్స్ వార్టన్(85), మాథ్యూ రేవిస్(39), జార్జ్(31) రాణించారు. దీంతో 285 పరుగుల లక్ష్యాన్ని యార్క్షైర్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 47.4 ఓవర్లలో చేధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో ఓలీవర్ కార్టర్(94), సింమ్సాన్(65), డానీ లంబ్(53) రాణించారు. యార్క్షైర్ బౌలర్లలో మిల్నెస్ 7 వికెట్లతో చెలరేగాడు.ఇమామ్ రీ ఎంట్రీ ఇస్తాడా?ఇంగ్లాండ్ దేశవాళీ వన్డే కప్ 2025లో ఇమామ్ ఉల్ హాక్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఇమామ్.. 102.60 సగటుతో 513 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్లో అతడికి ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం.దీంతో ఇమామ్ తిరిగి పాక్ వన్డే జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇమామ్ చివరగా ఈ ఏడాది ఏప్రిల్లో న్యూజిలాండ్లో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాక్ తరపున ఆడాడు. మూడు మ్యాచ్లలోనూ అతడు విఫలమయ్యాడు. దీంతో వెస్టిండీస్తో జరిగిన వైట్-బాల్ సిరీస్లకు అతడిని పక్కన పెట్టారు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్ పుజారా -
ODI World Cup 2025: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ఆల్రౌండర్ ఫాతిమా సనా నాయకత్వం వహించనుంది. ఐసీసీ టోర్నీల్లో పాక్ జట్టు కెప్టెన్గా ఫాతిమా సనా వ్యవహరించడం ఇదే తొలిసారి.అదే విధంగా నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్ వంటి యంగ్ ప్లేయర్లు తొలిసారి వన్డే ప్రపంచకప్లో పాక్ తరపున ఆడనున్నారు. డయానా బేగ్, ఒమైమా సోహైల్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్లో పాకిస్తాన్ మహిళల జట్టు తమ అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. అదేవిధంగా ఆక్టోబర్ 5న కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హర్మాన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా శ్రీలంకతో ఆడనుంది.మహిళల వన్డే ప్రపంచకప్కు పాక్ జట్టుఫాతిమా సనా (కెప్టెన్), మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, ఎమాన్ ఫాతిమా, నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, ఒమైమా సొహైల్, రమీన్ షమీ, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, షావాల్ జుల్ఫికర్, సిద్రా అమిన్ (సిద్రా అమీన్ మరియు) అరూబ్ షానాన్-ట్రావెలింగ్ రిజర్వ్లు: గుల్ ఫిరోజా, నజిహా అల్వీ, తుబా హసన్, ఉమ్-ఎ-హని మరియు వహీదా అక్తర్వన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి -
నేల విడిచిన సమరం
చిన్నపాటి ప్రాంతాన్ని ఏలిన రాజును సైతం భూమండలమేలినవాడిగా పేర్కొని ఆకాశానికెత్తడం మన ఇతిహాస, పురాణాల్లో కనిపిస్తుంది. మహాభారతంలో దుష్యంతుని గురించి నన్నయ రాస్తూ, అతడు మహాబలవంతుడనీ, దిక్కుల చివర ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్య కిరణాలు, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతో ఏలాడనీ అంటాడు. అన్ని రకాల బలాలూ, బలగాలూ కలిసొస్తే భూమి మొత్తాన్ని శాసించాలనే పాలకుల ఆకాంక్ష అలాంటి అభివర్ణనలలో తొంగిచూస్తుంది. యుద్ధాలనేవి భూమినింకా దాటని దశ అది. నేటి సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని యుద్ధాలు ఆకాశ మార్గం పట్టేశాయి. భూయుద్ధాలు గతస్మృతులై, యుద్ధం ఈ రోజున అక్షరాలా నేల విడిచిన సమరమైంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దానిని అత్యాశ్చర్య కరంగా కళ్ళకు కట్టింది. ‘అర్థశాస్త్రం’తో సహా ప్రాచీన గ్రంథాలు యుద్ధతంత్రంలో చెప్పిన అన్ని ఉపాయాలను, మాయోపాయాలను, పూర్తిగా సైనిక సాయంతో కాకుండా శాస్త్ర సాంకేతిక సాయంతో అందులో ప్రయోగించినట్టు చెబుతున్నారు. అంతర్జాల కేంద్రితంగా, కృత్రిమ మేధ సృష్టించిన సమాచారంతో, ద్రోణులపైనా, గ్రౌండ్ పొజిషనింగ్ సిస్టమ్స్(జీపీఎస్)పైనా, ఉపగ్రహాలపైనా ఆధారపడి చేసిన ఎలక్ట్రానిక్ యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. రష్యా సాయంతో మనం అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను, రఫేల్ వంటి యుద్ధ విమానాలను బరిలోకి దింపి విజయవంతంగా వాడుకున్న తీరు, నేటి యుద్ధాలు భూమ్యాకాశాల మధ్య పోరుగా మారడాన్ని ప్రత్యక్షంగా చాటాయి. సాంప్రదాయిక యుద్ధాలతో పోల్చితే, ఈ గగనతల యుద్ధాలు దేశాలకూ, జనాలకూ తెచ్చిపెట్టే కష్టాలూ అనేక రెట్లు ఎక్కువనీ; ఏ దేశానికాదేశం ఎప్పటికప్పుడు సాంకేతికంగా పై చేయిని సాధించడమే దీనికి పరిష్కారమన్న హెచ్చరికా వినిపిస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వెలుగు చూసిన వివరాలు ఇలాంటి యుద్ధాలతో ముడి పడిన ప్రమాదాలను భయభ్రాంతంగా చూపిస్తున్నాయి. ఉక్రెయిన్ జనానికి టెలివిజన్ సేవలందించే ఒక ఉపగ్రహాన్ని రష్యా నిపుణులు హ్యాక్ చేసి వాటిలో యుద్ధ శకటాల తోనూ, ఆయుధ సంపత్తితోనూ తమ సైనికులు జరిపే విన్యాసాల దృశ్యాలను ప్రసారం చేశారు. ఒక్క గుండు కూడా పేల్చకుండా, ఉపగ్రహాలను నిర్వీర్యం చేయడం ద్వారా, సమాచార అంధకారాన్ని సృష్టించి ఒక దేశ భద్రతనూ, దాని ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీసే ప్రమాదాన్ని రూపుగడుతున్నారు. సాంకేతికతను మెరుగుపరచుకుంటూ అన్ని విధాలా పోటీకి సన్నద్ధమైతే తప్ప ఈ సవాలును ఎదుర్కోవడం కష్టమనీ, సాంకేతిక సంపత్తి దేశాల మనుగడకు గీటురాయి అయిందనీ అంటున్నారు. అంతేకాదు, యుద్ధాలు గగన సీమను దాటి గ్రహాంతరాలకు చేరుకోవడమూ పొడగడుతోంది. చంద్ర మండలం మీది ఖనిజాలను, ముఖ్యంగా అణు విచ్ఛేదానికి తోడ్పడే హీలియం–3ను కొల్లగొట్టే పోటీకి అగ్రదేశాలు సిద్ధమవుతూ, అక్కడ అణు రియాక్టర్లను నెలకొల్పే యత్నంలో ఉన్నాయట! మబ్బు చాటు మాయా యుద్ధాలను మన పూర్వులు ఊహించకపోలేదు. రాక్షసులు వాటిలో ప్రవీణులని మన ఇతిహాస, పురాణాలంటాయి. రామాయణంలో మారీచ సుబా హులు అలాంటివారే. రావణుని కొడుకు ఇంద్రజిత్తయితే, నింగి నుంచే కానీ, నేల మీద యుద్ధం చేయడు. మాయసీతను చూపించి నిజసీతగా భ్రమింపజేసి హత మార్చడం లాంటి మాయావి చేష్టలలో రావణుడు కూడా అతనికి చాలడు. సూర్యాస్తమ యంలోగా సైంధవుని చంపుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు సూర్యుడికి చక్రాన్ని అడ్డేసి సూర్యాస్తమయాన్ని సృష్టించడం నేటి కృత్రిమ సాంకేతిక విన్యాసాల్లాంటిదే. అప్పటివన్నీ ఊహలనుకుంటే, ఇప్పటి శాస్త్ర సాంకేతికత సృష్టించేవి నిండునిజాలు. యుద్ధాలు నేలనూ, నింగినీ దాటి గ్రహాంతరాలకు చేరుకునే పరిస్థితిలో శాంతి గతే మిటి; ఇది పురోగమనమా, తిరోగమనమా అన్న ప్రశ్నా వేసుకోక తప్పదు; యుద్ధమూ, శాంతి అనే జంటలో ఒకటి కాపురం కూల్చేసి గగనమార్గం పట్టిపోతే రెండవది నేల మీద కుమిలిపోతూ ఉండవలసిందేనా అన్న బాధకూ లోనవక తప్పదు. బాహ్యయుద్ధాల ఎండమావుల వేట నుంచి మనిషి వెనుదిరిగి అంతరంగ యుద్ధం వైపు ఎప్పుడు దృష్టి సారి స్తాడు?! లోకాలన్నీ జయించావు కానీ, అరిషడ్వర్గాలనే నీ లోపలి శత్రువులను ఎప్పుడు జయిస్తావని హిరణ్యకశిపుని ప్రహ్లాదుడు అడిగిన ప్రశ్న ఇప్పటికీ ఎంత ప్రాసంగికం!! -
Bihar: ఓటర్ లిస్టులో ఇద్దరు పాక్ మహిళలు.. దర్యాప్తు షురూ
పట్నా: బీహార్ ఓటర్లు లిస్టులో వింత వైనాలు వెలుగు చూస్తున్నాయి. 1950లలో భారత్లోకి ప్రవేశించిన ఇద్దరు పాకిస్తానీ మహిళలు బీహార్లో ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు వెల్లడయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ ఇటీవల వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉండిపోయిన విదేశీయుల రికార్డులను తనిఖీ చేస్తున్నప్పుడు ఈ ఉదంతం వెలుగు చూసింది.భాగల్పూర్కు చెందిన ఇద్దరు మహిళలు విదేశీ పౌరులుగా ఓటర్ల సవరణలో తేలారని అధికారులు నిర్ధారించారు. ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)మాట్లాడుతూ ఆ మహిళలకు సరిపోయే పాస్పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు. అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. #WATCH | Bhagalpur, Bihar: A Pakistani woman, who came to India in 1956, has been found to be in Bihar's voter list and was even verified in the SIR carried out in the state. When the Home Ministry started carrying out an investigation regarding foreign nationals who had… pic.twitter.com/CodczsabaD— ANI (@ANI) August 24, 2025కాగా ఈ పాక్ మహిళల ఉదంతం అధికారిక విచారణలో ఉంది. ఉన్నతాధిధికారులు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సివుంది. దీనిపై ఆగస్టు 11న హోం మంత్రిత్వ శాఖ నుండి నోటీసు స్థానిక ఎన్నికల కార్యాలయానికి చేరుకుంది. తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని దానిలో కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఓటరు కార్డుల సవరణ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇవి జరగుతున్నాయని ఆరోపించాయి. అయితే నిస్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యతతోన ఈ సవరణ చేపట్టామని సంబంధిత అధికారులు తెలిపారు. -
ఈసారి పాక్ను కలిపి ఇచ్చి పడేశారు..!
ఎన్ జైశంకర్.. భారత విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమయ స్ఫూర్తిగా స్పందించడంలో జై శంకర్ది ప్రత్యేక శైలి. ఆయనలోని చలోక్తిని కౌంటర్ అనుకోవచ్చు.. చమత్కారం అనుకోవచ్చు.. ఆయన మాటలు ప్రత్యర్థులకు బాధ కల్గించినా కాస్త కచ్చితత్వంతోనే ఉంటాయి. ఈ క్రమంలోనే నేడు(శనివారం, ఆగస్టు 23వ తేదీ) అమెరికా-పాకిస్తాన్లపై సెటైరిక్గా స్పందించారు. ఎకనమిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలోఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్ల ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా జై శంకర్కు ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా పాక్-అమెరికాల వైఖరిపై జై శంకర్ ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అంటూనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ ఇరు దేశాలు వారి చరిత్రను మర్చిపోయినట్లు ఉన్నాయంటూ సమాధానం చెప్పారు. #WATCH | Delhi: "They have a history with each other, and they have a history of overlooking their history... It is the same military that went into Abbottabad (in Pakistan) and found who there?..." says EAM Dr S Jaishankar on relations between US and Pakistan, at The Economic… pic.twitter.com/wpYGfdLpbc— ANI (@ANI) August 23, 2025 ఆ రెండు దేశాలు వారి చరిత్రను విస్మరించినట్లు ఉన్నారు అంటూ ఆల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ను అమెరికా ఎలా హతమార్చిందనే సంగతిని ఇక్కడ ప్రస్తావించారు. అమెరికా-పాకిస్తాన్లకు చరిత్ర ఉంది. కానీ వారి చరిత్రను వారే మర్చిపోయారో, విస్మరించారో అనేది వారికే తెలియాలి అంటూ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారు జైశంకర్.ఇదీ చదవండి: భారత్తో సమస్య ఉంటే.. ట్రంప్కు జై శంకర్ స్పష్టీకరణ -
ఆసియా కప్ కోసం భారత్కు రావడం లేదు: పాక్ హాకీ దిగ్గజం
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ హాకీ టోర్నమెంట్కు ఇదివరకే పాకిస్తాన్ జట్టు దూరంగా ఉంది. ఇప్పుడు ఆ దేశ దిగ్గజం సొహైల్ అబ్బాస్ కూడా మలేసియా జట్టు అసిస్టెంట్ కోచ్ హోదాలో భారత్కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.ఈ మేరకు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే టోరీ్నకి అందుబాటులో ఉండటం లేదని ప్రకటించాడు. పాక్ దిగ్గజ డ్రాగ్ఫ్లికర్గా ఖ్యాతి గడించిన అతను ప్రస్తుతం మలేసియా హాకీ జట్టుకు సేవలందిస్తున్నారు. ఈ జట్టు ఆసియా కప్ కోసం భారత్కు రానుంది. ఈ టోర్నీ విజేత నేరుగా ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఆసియా ఈవెంట్కు మలేసియా జట్టు తరఫున వచ్చేందుకు అనాసక్తి చూపడం విడ్డూరంగా ఉంది. అయితే తన నిర్ణయానికి స్వదేశం (పాక్) తీసుకున్న గైర్హాజరుకు సంబంధం లేదని అబ్బాస్ చెప్పుకొచ్చాడు.‘నేను ఆసియా కప్ కోసం భారత్కు వెళ్లడం లేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఆ ఈవెంట్కు అందుబాటులో ఉండటం లేదు. ఇది నా సొంత నిర్ణయం. దీనిపై ఎవరి ప్రభావం లేదు’ అని అన్నాడు. అబ్బాస్ 2012లో అంతర్జాతీయ హాకీకి గుడ్బై చెప్పారు. ఆ తర్వాత 2024 వరకు లోప్రొఫైల్ జీవితాన్నే గడిపారు. గతేడాది మలేసియా కోచింగ్ బృందంలో చేరారు. 48 ఏళ్ల సొహైల్ అబ్బాస్ ఏకంగా నాలుగు ప్రపంచకప్లు (1998, 2002, 2006, 2010), మూడు ఒలింపిక్స్ (2000, 2004, 2012)లలో పాల్గొన్నారు. 1998, ఫిబ్రవరిలో భారత్తో పెషావర్లో జరిగిన మ్యాచ్తో అరంగేట్రం చేసిన అబ్బాస్ 311 మ్యాచ్లు ఆడి 21 సార్లు హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. భారత్లో 20 ఏళ్ల క్రితం జరిగిన ఇండియన్ ప్రీమియర్ హాకీ లీగ్లో విజేత హైదరాబాద్ సుల్తాన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. -
‘భారత్ ఫెరారీ కారు, పాక్ చెత్త ట్రక్కు’.. పాక్ ఆర్మీ చీఫ్కు రాజ్నాథ్ కౌంటర్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను విలాసవంతమైన ఫెరారీ కారుతో, తమ దేశాన్ని చెత్త ట్రక్కుతో పోలుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ దీటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. దీంతో, దాయాదికి ఎదురుదెబ్బ తగిలింది.తాజాగా కేంద్రమంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ.. ‘రెండు దేశాలూ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయి. ఒక దేశం మంచి విధానాలు, ముందుచూపు, కష్టించేతత్వంతో ఫెరారీ కారు వంటి మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పర్చుకోగా, మరో దేశం అప్పటి నుంచి ఇప్పటి దాకా చెత్తగానే మిగిలిపోయింది. అది వాళ్ల సొంత వైఫల్యం. ఇదే విషయాన్ని అసిమ్ మునీర్ స్వయంగా అంగీకరించారని నాకనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మునీర్ పోలిక పాకిస్తాన్ సమస్యాత్మక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని రాజ్నాథ్ అన్నారు. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, తెలిసో తెలియకో దోపిడీదారు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. అవతరించినప్పటి నుంచీ ఆ దేశానిది ఇదే తీరు. పాక్ సైన్యం భ్రమలను మనం తొలగించాలి’ అని మంత్రి పేర్కొన్నారు.ఇటీవల అమెరికా పర్యటనలో మునీర్ మాట్లాడుతూ.. ‘హైవేపై ఫెరారీ కారు మాదిరిగా మెరుస్తూ వస్తున్న భారత్ను, గులకరాళ్ల ట్రక్కు వెళ్లి ఢీకొట్టిందనుకోండి, నష్టం జరిగేది ఎవరికి?’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. భారత్ అభివృద్ధి దిశగా సాగుతుండగా, పాకిస్తాన్ వెనుకబడి ఉందని, సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ మునీర్పై విమర్శలు వచ్చాయి.ఆర్మీలో మహిళలకు అనుకూల విధానాలు సాయుధ బలగాలతోపాటు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అనే విధానాలను అమలు చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సేవలందించడమే కాదు, నాయకత్వం వహించేందుకు అవకాశమిస్తున్నామన్నారు. శుక్రవారం ఢిల్లీలో మొదలైన 15 దేశాల మహిళా అధికారుల ఐరాస ఉమెన్ మిలటరీ ఆఫీసర్స్ కోర్స్లో ఆయన మాట్లాడారు. ఐరాస మిషన్లలో వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం రెండు వారాలపాటు కొనసాగనుంది. -
ఏంటి రిజ్వాన్ ఇది.. జట్టు నుంచి తీసేసినా మారవా? వీడియో
పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఆసియాకప్ జట్టులో చోటు కోల్పోవడంతో రిజ్వాన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే రిజ్వాన్ తన అరంగేట్ర మ్యాచ్లోనే తీవ్ర నిరాశపరిచాడు.సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రిజ్వాన్.. శుక్రవారం బార్బడోస్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన రిజ్వాన్ బార్బోడస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్ చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఏంటి రిజ్వాన్ జట్టు నుంచి తీసేసినా మారవా అంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా రిజ్వాన్ గత కొంత కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు.గత ఆరు ఇన్నింగ్స్లలో రిజ్వాన్ చేసిన స్కోర్లు ఇవి 0, 16, 53, 4, 17,0. 12 పరుగుల తేడాతో సెయింట్ కిట్స్ విజయం సాధించింది. ఈ విజయంలో కెప్టెన్ జాసెన్ హెల్డర్ది కీలక పాత్ర. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సెయింట్స్ కిట్స్ బ్యాటర్లలో కైల్ మైర్స్(42), హోల్డర్(38), ఫ్లెచర్(25) రాణించారు. బార్బోడస్ బౌలర్లలో రిమాన్ సిమాండ్స్ మూడు, డానియల్ సామ్స్ రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు వారికన్, బాష్ ఒక వికెట్ సాధించారు.నిప్పులు చెరిగిన హోల్డర్అనంతరం 175 పరుగుల లక్ష్య చేధనలో బార్బోడస్ 18.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ 4 వికెట్లు పడగొట్టి బార్బోడస్ను దెబ్బతీశాడు. అతడితో పాటు నసీం షా, నావియన్ బిడైసీ తలా రెండు వికెట్లు సాధించారు. బార్బోడస్ బ్యాటర్లలో కదీమ్ అల్లెన్(42) టాప్ స్కోరర్గా నిలిచాడు.Mohammad Rizwan bowled out on 3(6) on his CPL debut 🙈#CPLpic.twitter.com/4fhAqphS0U— Fourth Umpire (@UmpireFourth) August 22, 2025 -
అప్పటి హైజాక్కు ఇప్పుడు కంగారు!
శంషాబాద్: అప్పుడెప్పుడో 27 ఏళ్ల కిందట పాకిస్తాన్లో ఓ విమాన హైజాక్ ఘటన జరిగితే శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు మాత్రం తెగ కంగారు పడిపోయి ఇప్పుడు కేసు పెట్టారు!! పోలీసులు కూడా పూర్వాపరాలు తెలుసుకోకుండానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేశారు!! ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే.. 1998 మే 28న జరిగిన పాక్ విమాన హైజాక్ ఉదంతం, హైజాకర్ల అరెస్టును ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ఈ నెల 14న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్లో హైదరాబాద్ ఎయిర్పోర్టు అనే పేరు పలుమార్లు రావడంతోపాటు హైజాకర్లు, ఢిల్లీ తదితర పదాలు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రెడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ (ఏపీఓసీ) ఉపయోగిస్తున్న ఓ ఏఐ ఆధారిత టూల్ పొరబడింది. ‘ఎక్స్’ వేదికగా ‘బెదిరింపు సందేశం’ వచ్చిదంటూ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో ఏసీఓసీకి చెందిన రాకేశ్ కుమార్ శర్మ అనే సెక్యూరిటీ, విజిలెన్స్ అధికారి.. పూర్వాపరాలు చూసుకోకుండానే అదే రోజు ఆర్జీఐఏ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని వివిధ సెక్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని.. ‘ఎక్స్’లో ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నామని ఆర్జీఐఏ పోలీసులు పేర్కొనడం గమనార్హం. నిజాంల కాలంలో మన భాగ్యనగరం పేరును అన్ని రకాల సమాచార సందేశాల్లో హైదరాబాద్ అని కాకుండా హైదరాబాద్ (డెక్కన్) అని సంబోధించేవారు. అలాగే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న మరో హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ (సింధ్)గా పిలుస్తున్నారు.నాడు జరిగింది ఇదీ..బలోచ్ హైజాకర్లు పాక్ విమానాన్ని ఢిల్లీ మళ్లించాలని డిమాండ్ చేయగా అంతదూరం వెళ్లేందుకు ఇంధనం సరిపోదంటూ హైజాకర్లను విమాన కెప్టెన్ ఉజెయిర్ ఖాన్ బురిడీ కొట్టించాడు. కావాలంటే తొలుత గుజరాత్లోని భుజ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయి ఇంధనం నింపుకున్నాక ఢిల్లీ తీసుకెళ్తానంటూ వారిని నమ్మించాడు. హైజాక్ ఉదంతాన్ని సింధ్ ప్రావిన్స్లో ఉన్న హైదరాబాద్ ఎయిర్పోర్టుకు కోడ్ భాషలో పంపాడు. వారు సైతం భారత అధికారులుగా హైజాకర్లను భ్రమింపజేస్తూ భుజ్లో విమాన ల్యాండింగ్కు అనుమతిస్తున్నట్లు రిప్లై ఇచ్చారు. చివరకు విమానం అక్కడి హైదరాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవగా తాము భారత భూభాగంలోకి ప్రవేశించామని హైజాకర్లు నమ్మారు. ఆ వెంటనే పాక్ కమాండోలు విమానంలోకి చొరబడి హైజాకర్లను అరెస్టు చేయడంతో కథ సుఖాంతమైంది. ఆ ఘటనలో ప్రయాణికులెవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఆ ఉదంతం జరిగిన 17 ఏళ్లకు.. అంటే 2015 మే 28న హైజాకర్లను పాక్ ప్రభుత్వం ఉరితీసింది. -
భారత్, పాక్ పోరుకు రాజముద్ర
ఒకవైపు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం... మన దేశంలో ఉన్న పాక్ జాతీయులను వెంటనే వెనక్కి పంపడంతో పాటు అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటూ ప్రభుత్వ స్పందన... ఇలాంటి స్థితిలో శత్రుదేశం పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లను బాయ్కాట్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు... స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ తటస్థ వేదికల్లో కూడా ఆడకూడదంటూ వ్యాఖ్యలు ... వెటరన్ ఆటగాళ్ల ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’లో పాక్తో రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగకుండా తప్పుకున్న భారత బృందంపై ప్రశంసలు...మరోవైపు ‘ఆ మ్యాచ్’ కోసమేనా అన్నట్లుగా ఆసియా కప్ వేదిక భారత్ నుంచి యూఏఈకి మారడం... కొద్ది రోజులకే షెడ్యూల్ విడుదల... జోరుగా ప్రచారం మొదలు పెట్టిన ప్రసారకర్తలు... భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు 10 సెకన్ల ప్రకటనకు రూ. 16 లక్షల రేటు... చూస్తుండగానే టోర్నీలో పాల్గొనే జట్ల ప్రకటన... అయినా సరే చివరి నిమిషంలో మ్యాచ్ రద్దు కావచ్చని, లేదా భారత్ ఆడకుండా పాయింట్లు ఇవ్వవచ్చని చర్చ... కానీ అలాంటి అవసరం లేదని తేలిపోయింది. ఇప్పుడు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి భారత్, పాక్ పోరుకు ఆమోద ముద్ర వేసింది. న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్లో జరిగే మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను చూసేందుకు అమితోత్సాహంతో సిద్ధం కావచ్చు! ఆసియా కప్లో పాక్తో తలపడేందుకు కేంద్ర ప్రభుత్వం మన జట్టుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న ‘మల్టీలేటరల్ ఈవెంట్’ కావడంతో ఈ మ్యాచ్లో ఆడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం లేదని ప్రకటించింది. టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్లపై ఉన్న ఆసక్తి, ప్రాధాన్యతను బట్టి చూస్తే తాజా ప్రకటనతో వాణిజ్యపరంగా భాగస్వాములందరూ సంతోషించే నిర్ణయం వెలువడటం విశేషం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. మార్గదర్శకాలతో స్పష్టత... భారత్, పాకిస్తాన్ మధ్య నిజానికి 2012–13 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కానీ ఇరు జట్లు ఐసీసీ టోర్నీలైన వన్డే, టి20 వరల్డ్ కప్లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ మ్యాచ్లలో తలపడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ప్రకటనలో కొత్తగా పేర్కొన్న అంశం ఏమీ లేదు. అయితే దీనికే మరింత స్పష్టతనిస్తూ అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సరిహద్దు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రీడా సంబంధాల విషయంలో కేంద్రం వీటిని ప్రకటించింది. ‘క్రీడలకు సంబంధించి పాకిస్తాన్తో ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడిస్తోంది. ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఉండవు. మన జట్టు అక్కడికి వెళ్లి ఆడేందుకు లేదా ఆ జట్టు ఇక్కడికి వచ్చే ఆడేందుకు కూడా అనుమతించేది లేదు. అయితే పలు ఇతర జట్లతో ముడిపడి ఉన్న టోర్నీల విషయంలో ఆయా క్రీడల అంతర్జాతీయ సంఘాల నిబంధనలను, మన ఆటగాళ్లను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ పెద్ద ఈవెంట్ల వేదికగా మారుతున్న అంశాన్ని కూడా చూడాలి. కాబట్టి ఇలాంటి ఈవెంట్లలో పాక్ ఆడుతున్నా సరే మన జట్టు పాల్గొనవచ్చు. భారత్ ఆతిథ్యం ఇచ్చే ఇలాంటి టోర్నీల్లో కూడా పాకిస్తాన్ ఆడేందుకు అభ్యంతరం లేదు’ అని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. అధికారుల కోసం వీసా సడలింపులు... భవిష్యత్లో కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ కూడా నిర్వహించాలని ఆశిస్తున్న నేపథ్యంలో మన దేశానికి అత్యుత్తమ వేదికగా గుర్తింపు రావాలని కూడా కేంద్రం భావిస్తోంది. అందుకే వివిధ క్రీడా ఈవెంట్ల సమయంలో వీసాలు జారీ చేసే విషయంపై కూడా ప్రకటనలో వివరంగా పేర్కొంది. ‘క్రీడాకారులు, అధికారులు, సాంకేతిక సిబ్బందితో పాటు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులకు వారి అధికారిక పర్యటన సమయం, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వీసాలు జారీ చేస్తాం. ఇది గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. టోర్నీల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వచ్చే అధికారులకు ఇబ్బంది లేకుండా తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది. -
చరిత్రపుటల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ చరిత్రపుటల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్లో 400 వికెట్లు తీసిన రెండో పాక్ బౌలర్గా అవతరించాడు. ఓవరాల్గా టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్గా నిలిచాడు.ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న ఆమిర్ (ట్రిన్బాగో నైట్రైడర్స్).. ఇవాళ (ఆగస్ట్ 21) ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ మైలురాయిని తాకాడు. ఆమిర్కు ముందు పాక్ తరఫున వాహబ్ రియాజ్ ఈ ఘనత సాధించాడు. రియాజ్ 2005 నుంచి 2023 మధ్యలో 348 టీ20లు ఆడి 413 వికెట్లు సాధించగా.. ఆమిర్ 2008 నుంచి ఈ ఫార్మాట్లో కొనసాగుతూ 343 మ్యాచ్ల్లో 400 వికెట్లు తీశాడు.పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రషీద్ ఖాన్ (658), డ్వేన్ బ్రావో (631), సునీల్ నరైన్ (590), ఇమ్రాన్ తాహిర్ (549), షకీబ్ అల్ హసన్ (499), ఆండ్రీ రసెల్ (485), క్రిస్ జోర్డన్ (438), వాహబ్ రియాజ్ (413) ఆమిర్ కంటే ముందున్నారు.33 ఏళ్ల ఆమిర్ 2021లోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఆతర్వాత మనసు మార్చుకున్నాడు. 2024 టీ20 వరల్డ్కప్కు ముందు తిరిగి అతడు పాకిస్తాన్ జట్టులో చేరాడు. ఆ టోర్నీ అనంతరం మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అప్పటి నుంచి ఐపీఎల్ మినహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ లీగ్ల్లో పాల్గొంటున్నాడు. ఆమిర్ ఇటీవల ఐపీఎల్ ఆడాలనే కల ఉందని చెప్పాడు. అవకాశం వస్తే ఆర్సీబీకి ఆడతానని అన్నాడు. ఆమిర్ ప్రస్తుతం బ్రిటన్ పౌరసత్వం పొంది ఐపీఎల్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా, పాక్ ఆటగాళ్లపై ఐపీఎల్లో నిషేధం ఉన్న విషయం తెలిసిందే.ఆమిర్ పాక్ తరఫున 36 టెస్ట్లోల 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు తీశాడు. పాక్ తరఫున ఆమిర్ కెరీర్ వివాదాల మయంగా ఉంది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అతను ఐదేళ్లు (2010-15) నిషేధం ఎదుర్కొన్నాడు. -
Asia Cup 2025: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్కు గ్రీన్ సిగ్నల్
ఆసియా కప్-2025లో భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. ఖండాంతర టోర్నీలో దాయాదితో సమరానికి భారత క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. బహుళ దేశాలు పాల్గొనే టోర్నీలో టీమిండియా పాక్తో ఆడితే ఆపబోమని స్పష్టం చేసింది. అయితే పాక్తో ఏ క్రీడలో అయినా ద్వైపాక్షిక సిరీస్లు మాత్రం ఉండవవి తేల్చి చెప్పింది. వారు తమ గడ్డపై అడుగు పెట్టడానికి కానీ.. భారత జట్టు పాక్లో ఆడటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని తెలిపింది. అంతర్జాతీయ టోర్నీల్లో, తటస్థ వేదికలపై పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడితే అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ లెక్కన సెప్టెంబర్ 14న దుబాయ్లో జరుగబోయే భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు లైన్ క్లియర్ అయినట్లే.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా కప్లో భారత్, పాక్ మ్యాచ్పై అనుమానాలు ఉండేవి. ఈ టోర్నీలో టీమిండియా పాక్తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించదని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ భారత క్రీడా మంత్రిత్వ శాఖ టీమిండియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి దుబాయ్, అబుదాబీ వేదికలుగా జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్లో (ఏ) ఉన్నాయి. టీమిండియా సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో.. సెప్టెంబర్ 19న ఒమన్తో టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఆగస్ట్ 19న ప్రకటించారు.ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ -
భారత్లో లైంగిక హింసపై పాక్ మాట్లాడటం సిగ్గు చేటు
న్యూయార్క్: జమ్మూకశ్మీర్లో లైంగిక హింస జరిగిందంటూ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తిప్ప కొట్టింది. తమ దేశంలో మైనారిటీ మహిళలపై జరుగుతున్న నేరాలపై స్పందించని పాక్. భారత్పై మాట్లాడటం సిగ్గుచేటని ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ వ్యాఖ్యానించారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఆ దేశానికే దారుణమైన రికార్డు ఉందని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో సంఘర్షణ సంబంధిత లైంగిక హింసపై మంగళవారం జరిగిన బహిరంగ చర్చలో పున్నూస్ మాట్లాడారు.ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతికత పాకిస్థాన్కు లేదని స్పష్టం చేశారు. ‘1971లో పూర్వపు తూర్పు పాకిస్తాన్లో లక్షలాది మంది మహిళలపై పాకిస్తాన్ సైన్యం పాల్పడిన లైంగిక హింస నేరాలకు ఎలాంటి శిక్ష వేయకపోవడం సిగ్గు చేటు. ఆ దేశంలో మైనారిటీ వర్గాల్లో మహిళలు, బాలికలు నేటికీ అపహరణకు గురవుతున్నారు. అక్రమ రవాణా జరుగుతోంది. బలవంతపు వివాహాలు, మత మారి్పడులను ఎదుర్కొంటున్నారు. ఈ నేరాలకు పాల్పడేవారు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నట్లు నటించడం విడ్డూరంగా ఉంది. పాక్ ద్వంద్వ వైఖరి, కపటత్వం స్పష్టమవుతున్నాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. ఘర్షణ సంబంధిత లైంగిక హింస, దారుణమైన చర్యలకు పాల్పడేవారిని న్యాయం ముందు నిలబెట్టాలని పున్నూస్ డిమాండ్ చేశారు.మహిళల రక్షణకు భారత్లో ప్రత్యేక వ్యవస్థలు అంతేకాదు.. మన దేశంలో, ప్రపంచ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన వెల్లడించారు. లైంగిక దోపిడీ, దురి్వనియోగ బాధితుల కోసం యూఎన్ సెక్రటరీ జనరల్ ట్రస్ట్ ఫండ్కు విరాళాలు అందించిన మొదటి దేశాల్లో భారతదేశం ఒకటని గుర్తు చేశారు. ఇటువంటి నేరాలను నివారించడానికి యూఎన్తో స్వచ్ఛంద ఒప్పందంపై 2017లోనే భారత్ సంతకం చేసిందన్నారు. 2007లో లైబీరియాకు మొదటి పూర్తి మహిళా పోలీసు యూనిట్ను మోహరించిందని, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలకు మహిళా బృందాలను పంపుతూనే ఉందని పున్నూస్ ఎత్తి చూపారు. దేశీయంగా మహిళలను రక్షించడానికి భారత్ ప్రత్యేక వ్యవస్థలను సృష్టించిందని పున్నూస్ చెప్పారు. వీటిలో మహిళల భద్రత కోసం 1.2 బిలియన్ డాలర్లను నిర్భయ నిధికి కేటాయించిదని చెప్పారు.పాక్లో 24 వేల మంది కిడ్నాప్.. పాకిస్తాన్లో గతేడాది 24 వేలమందికి పైగా కిడ్నాప్కు గురయ్యారని సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 2024 నివేదిక వెల్లడించింది. అంతేకాదు 5వేల మందిపై అత్యాచారం, 500 హానర్ కిల్లింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. సింధ్ ప్రావిన్స్లోని చాలా మంది హిందూ మైనారిటీ బాలికలకు బలవంతంగా వివాహం చేస్తున్నారని, మత మారి్పడి చేస్తున్నారని పేర్కొంది. -
‘ఆపరేషన్ సిందూర్’కు తోక ముడిచిన పాక్.. శాటిలైట్ చిత్రాలివే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో చొటుచేసుకున్న ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని లక్షిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.ఈ దాడులకు పాక్ వణికి పోయిందనడానికి నిదర్శనంగా కొన్ని శాటిలైట్ చిత్రాలు వెలువడ్డాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ నావికాదళం భయంతో ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని కొత్త ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయి. పాకిస్తాన్ యుద్ధనౌకలు ప్రధాన నావికా స్థావరాల నుండి తరలించడాన్ని ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని నౌకలను కరాచీ వాణిజ్య రేవులకు తరలించారు. మరికొన్నింటిని ఇరాన్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ సరిహద్దుకు తరలించారు.పాకిస్తాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యలలో ఆపరేషన్ సింధూర్ ప్రముఖమైనదిగా నిలుస్తుంది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ప్రతి రోజూ కొత్త నివేదికలు అందుతున్నాయి. తాజాగా వెలువడిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ నావికాదళం ఇరానియన్ సరిహద్దుకు తరలిపోవడాన్ని చూపిస్తున్నాయి.మే 7- మే 10 మధ్య భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అ సమయంలో భారత్కు తగిన సమాధానం ఇచ్చామని పాకిస్తాన్ గతంలో వాదనకు దిగింది.అయితే ఇప్పుడు ప్రత్యక్షమైన శాటిలైట్ చిత్రాలు దీనికి భిన్నమైన తీరును చూపిస్తున్నాయి. పాకిస్తాన్ తన నావికాదళాన్ని సురక్షితంగా ఉంచేందుకు వెనక్కి తగ్గినట్లు ఈ దృశ్యాలు వెల్లడిస్తున్నాయి. మే 8న భారత్ దాడుల తరువాత రోజున పాక్ యుద్ధనౌకలు వాటి సాధారణ ప్రదేశాలలో కనిపించలేదు. మూడు యుద్ధనౌకలు కరాచీ వాణిజ్య నౌకాశ్రయంలో కనిపించాయి. -
నెహ్రూ వల్ల రెండు సార్లు దేశ విభజన: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్తో నెహ్రూ కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందంతో మనకు పూడ్చలేని నష్టం జరిగిందన్నారు. అప్పటి మంత్రివర్గాన్ని గానీ, పార్లమెంట్ను గానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఈ ఒప్పందంపై ఆమోదముద్ర వేశారని విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ఎంపీలకు మోదీ పిలుపునిచ్చారు.దేశానికి.. ప్రధానంగా రైతన్నలకు నష్టం చేకూర్చేలా నెహ్రూ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తాము అధికారంలోకి వచి్చన తర్వాత నిలిపివేశామని గుర్తుచేశారు. నెహ్రూ నిర్వాకం వల్ల రెండుసార్లు దేశ విభజన జరిగిందన్నారు. ఒకసారి రాడ్క్లిఫ్ లైన్తో భారత్ను విభజించారని, సింధూ నదిని ముక్కలు చేసి దేశాన్ని మరోసారి విభజన తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. అధికార ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సి.పి.రాధాకృష్ణన్ను ప్రధాని మోదీ మంగళవారం ఎన్డీయే ఎంపీలకు పరిచయం చేశారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే... రాద్ధాంతం ఎందుకని దబాయింపు ‘‘సింధూ నదిలో 80 శాతానికి పైగా నీటిని పాకిస్తాన్కే అప్పగించారు. మన రైతులను దగా చేశారు. అప్పటి జనసంఘ్ ఎంపీ అటల్ బిహారీ వాజ్పేయి సహా పలువురు పార్లమెంట్ సభ్యులు నెహ్రూ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నిరసన వ్యక్తంచేశారు. దీనిపై పార్లమెంట్లో రెండు గంటలపాటు చర్చ జరిగింది. కొన్ని బకెట్ల నీరు పోతే రాద్ధాంతం ఎందుకని నెహ్రూ దబాయించారు. పైగా లద్ధాఖ్లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే చూసీచూడనట్లు వదిలేశారు. అక్కడ గడ్డి పరక కూడా పెరగదని వ్యంగ్యంగా మాట్లాడారు. చేసిన పొరపాటును నెహ్రూ కొన్నిరోజులకు ఒప్పుకున్నారు. సింధూ నది జలాల ఒప్పందం కుదుర్చుకుంటే పాకిస్తాన్తో ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయని భావించానని, కానీ, అలా జరగలేదని ఒక సహచరుడితో అన్నారు. నెహ్రూ హయాంలో చేసిన తప్పిదాలను సరి చేస్తున్నాం’’ అని అన్నారు. సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు ‘‘ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఇండియా క్రెడిట్ రేటింగ్ను ఇటీవల అప్గ్రేడ్ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఇదొక నిదర్శనం. దీనివల్ల మన దేశానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు తీసుకొస్తామని, జీఎస్టీ రేట్లను సరళీకృతం చేస్తామంటూ ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనను స్టాక్మార్కెట్ స్వాగతించింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు ర్యాలీ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్పోర్టుల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. విదేశీ మారకద్రవ్య నిల్వలకు ఢోకా లేదు. సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి’’ అని అన్నారు.రాజకీయాలతో రాధాకృష్ణన్ ఆడుకోలేదు ‘‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ను ఎంపిక చేయడం హర్షణీయం. ఆయన ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు. దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమయ్యారు. క్రీడల్లో ఆయనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ రాజకీయాలతో ఏనాడూ ఆడుకోలేదు. రాధాకృష్ణన్తో నాకు నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. మాకు నల్లజుట్టు ఉన్నప్పటి నుంచి పరస్పరం మంచి పరిచయం ఉంది. ప్రజాసేవ అంటే ఆయనకు అమితమైన అనురక్తి. వివిధ స్థాయిలో ప్రజలకు సేవలందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్ను గెలిపించాలని అన్ని రాజకీయ పారీ్టలకూ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరుతున్నా’’ అని అన్నారు. -
భారీగా తగ్గిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ల జీతాలు.. టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే..!
పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ నెల వేతనాలు భారీగా తగ్గాయి. ఈ ఇద్దరు తాజాగా ప్రకటించిన పాక్ సెంట్రల్ కాంట్రక్ట్ (2025-26) ఆటగాళ్ల జాబితాలో కేటగిరి-ఏ నుంచి కేటగిరి-బికి పడిపోయారు. ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనల కారణంగా వీరిద్దరు డిమోషన్కు గురయ్యారు.కేటగిరి-బికి పడిపోయాక బాబర్, రిజ్వాన్ నెల జీతాల్లో కూడా భారీ మార్పు వచ్చింది. కేటగిరి-ఏలో ఉండగా వీరి జీతం భారత కరెన్సీ ప్రకారం రూ. 13.95 లక్షలుగా ఉండేది. కేటగిరి-బికి పడిపోయాక అది కాస్త రూ. 9.28 లక్షలకు పడిపోయింది.భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లతో పోలిస్తే ఈ వేతనం చాలా తక్కువ. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో అతి చిన్నదైన కేటగిరి-సిలో ఓ ఆటగాడికి నెలసరి వేతనం రూ. 8.3 లక్షలుగా ఉంది. అదే అత్యుత్తమమైన కేటగిరి-ఏ ప్లస్లో ఉన్న ఆటగాడికి రూ. 58.3 లక్షలుగా ఉంది. ఈ లెక్కన చూస్తే భారత అత్యుత్తమ ఆటగాడికి లభించే వేతనంలో పాక్ అత్యుత్తమ ఆటగాడికి కనీసం 20 శాతం కూడా లభించడం లేదు. పాక్ ఆటగాళ్లతో పోలిస్తే భారత ఆటగాళ్లకు లభించే మ్యాచ్ ఫీజులు కూడా చాలా ఎక్కువే. భారత ఆటగాడికి జీతంతో సంబంధం లేకుండా ఓ టెస్ట్ మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు, వన్డే ఆడితే రూ. 6 లక్షలు, టీ20 ఆడితే రూ. 3 లక్షలు లభిస్తాయి. అదే పాక్ ఆటగాళ్లకు టెస్ట్ మ్యాచ్కు 2 లక్షలు (భారత కరెన్సీలో), వన్డేకు రూ. లక్ష రూపాయలు, టీ20కి రూ. 60 నుంచి 80 వేలు లభిస్తాయి. -
ఆస్ట్రేలియా టీ20 టోర్నీ.. పాక్ ఆటగాడి మెరుపు శతకం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టాప్ ఎండ్ టీ20 టోర్నీలో పాకిస్తాన్ షాహీన్స్ ఆటగాడు అబ్దుల్ సమద్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్ అకాడమీతో ఇవాళ (ఆగస్ట్ 18) జరిగిన మ్యాచ్లో 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 110 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు యాసిర్ ఖాన్, ఖ్వాజా నఫే డకౌట్లు కాగా.. అబ్దుల్ సమద్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్ను నిర్మించాడు. అతనికి మొహమ్మద్ ఫైక్ (23), కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ (21) సహకరించారు. మెల్బోర్న్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్, సదర్ల్యాండ్, మైఖేల్ ఆర్చర్, కల్లమ్ స్టో, ఒలివర్ పీక్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన మెల్బోర్న్.. మాజ్ సదాకత్ (4-0-22-3), ఫసల్ అక్రమ్ (4-0-19-2) ధాటికి 19.2 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. తద్వారా పాక్ షాహీన్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్లో జోష్ బ్రౌన్ (36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.కాగా, 11 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా లోకల్ జట్లతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్కు చెందిన జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీలో పాక్కు చెందిన షాహీన్స్ జట్టు 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. నార్త్రన్ టెరిటరీ స్ట్రయిక్ అనే జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి అగ్రస్థానంలో ఉంది. -
భారత్-పాక్లపై ‘అనుమానం’: ట్రంప్కు రూబియో వంతపాట
వాషింగ్టన్: భారత్- పాక్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అమెరికా అనుక్షణం గమనిస్తున్నదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. సుదీర్ఘ ఘర్షణల తర్వాత కాల్పుల విరమణను కొనసాగించడం సవాలుగా మారుతుందని అందుకే అమెరికా.. భారత్-పాక్లపై ఓ కన్నేసి ఉంచిందని ఆయన పేర్కొన్నారు.ప్రపంచంలోని ఇతర ఉద్రిక్తతల దేశాలతో పాటు భారత్-పాకిస్తాన్ల మధ్య నెలకొన్న పరిస్థితిని అమెరికా ప్రతిరోజూ గమనిస్తున్నదని, ప్రస్తుత, భావి సంఘర్షణలను నిరోధించే శాంతి ఒప్పందం లక్ష్యంగా అమెరికా దృష్టి సారించిందని రూబియో అన్నారు. ‘ప్రతిరోజూ పాకిస్తాన్-భారతదేశం మధ్య ఏమి జరుగుతున్నదో, కంబోడియా- థాయిలాండ్ మధ్య ఏమి చోటుచేసుకుంటున్నదో తాము నిరంతరం గమనిస్తూనే ఉన్నామని రూబియో మీడియాకు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు అమెరికా కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నదని, అయితే శత్రుత్వం కొనసాగుతున్నప్పుడు చర్చలు జరపడం కష్టమని రూబియో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. Hopefully everybody is OK in South Provo where there’s a large fire raging on the mountain side within the last hour. pic.twitter.com/f96mSWMVH3— Jarom Jordan (@jaromjordan) August 17, 2025యుద్ధ విరమణకు ఏకైక మార్గం ఇరుపక్షాలు పరస్పరం కాల్పుల విరమణకు అంగీకరించడమేనన్నారు. అయితే రష్యన్లు ఇందుకు అంగీకరించలేదని, ఉక్రెయిన్తో యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఆయన అన్నారు. సుదీర్ఘ ఘర్షణల తర్వాత కాల్పుల విరమణ అనేది చాలా త్వరగా విచ్ఛిన్నమవుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రమే కాకుండా, భవిష్యత్తు సంఘర్షణలను నిరోధించేలా శాంతి ఒప్పందం కుదరడం లక్ష్యంగా ఉండాలని రూబియో పేర్కొన్నారు.కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో తాను భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని, పదేపదే చెబుతూ వచ్చారు. తన జోక్యంతో రెండు అణ్వాయుధ దేశాల మధ్య కాల్పుల విరమణకు సహకరించానని ట్రంప్ వాదించారు. అయితే భారత్ ఈ వాదనలను తిరస్కరించింది. పాకిస్తాన్తో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారం ద్వైపాక్షికంగానే జరుగుతున్నదని, మూడవ పక్షం మధ్యవర్తిత్వం పాత్ర ఏమీలేదని స్పష్టం చేసింది. -
ఆసియాకప్లో టీమిండియాపై విజయం మాదే: పాక్ క్రికెట్ డైరక్టర్
ఆసియాకప్-2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలి అడుగు వేసింది. ఈ మెగా టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా సల్మాన్ అలీ అఘా ఎంపికయ్యాడు. అదేవిధంగా స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లపై సెలక్టర్లు వేటు వేశారు.అయితే జట్టు ప్రకటన అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్లో భారత జట్టును ఓడించే సత్తా పాక్కు ఉందని జావేద్ అభిప్రాయపడ్డాడు. జట్టులోని ప్రతీ ఆటగాడు టీమిండియా విసిరే సవాల్కు సిద్ధంగా ఉన్నారని ఈ పాక్ మాజీ పేసర్ తెలిపాడు. కాగా పాకిస్తాన్పై టీ20ల్లో భారత్కు అద్బుతమైన రికార్డు ఉంది. కానీ పాక్ జట్టు మాత్రం ఆసియా కప్-2022లో విజయాన్ని పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 13 మ్యాచ్లలో ముఖాముఖి తలపడగా.. భారత్ తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ మూడు మ్యాచ్ల్లో గెలుపొందింది. పాక్ చివరగా దుబాయ్లో జరిగిన 2022 ఆసియా కప్ సూపర్ ఫోర్లో భారత్పై టీ20 విజయం సాధించింది."పాకిస్తాన్ టీ20 జట్టు టీమిండియాను ఓడించగలదు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ మేము ఎంపిక చేసిన ఈ 17 మంది సభ్యుల జట్టు ఏ టీమ్నైనా ఓడించగలదు. అయితే వారిపై మేము ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు.ఈ జట్టుపై నాకు చాలా నమ్మకం ఉంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్లను మేము పూర్తిగా పక్కన పెట్టలేదు. ప్రస్తుత ప్రదర్శనల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశాము. సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖార్ జమాన్ వంటి ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. అందుకే వారిని జట్టులో కొనసాగించాము. సైమ్ తన రీ ఎంట్రీలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఆ తర్వాత తన రిథమ్ను అందుకున్నాడు. ప్రతీ ప్లేయర్కు జట్టులోకి తిరిగొచ్చేందు ఎల్లప్పుడూ తలపులు తెరిచే ఉంటాయి. ఎవరు మెరుగైన ప్రదర్శన చేస్తే వారు ఖచ్చితంగా జట్టులో ఉంటారు. వారే పాక్ తరపున ఆడటానికి అర్హులు" జావేద్ పేర్కొన్నాడు.ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్చదవండి: Asia Cup 2025: పాక్-భారత్ మ్యాచ్కు భారీ డిమాండ్.. 10 సెకన్లకు రూ.16 లక్షలు! -
ఏపీలో ‘ఉగ్ర’ కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా చెందిన ఓ వంట మనిషికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బయటకు సాధారణ జీవితం గడుపుతూ.. లోపల మాత్రం పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసిన వైనం తీవ్ర సంచలనం గా మారింది.ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ లోనికోట ఏరియాలో నివసిస్తున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా... టీ చేసే వ్యక్తిగా సాధారణ జీవితం గడుపుతున్నారు. చాలీచాలని జీతంతో అప్పులు చేసిన ఇతను... కొంత కాలం క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహామైన నూర్ మహ్మద్కు నలుగురు పిల్లలు ఉన్నారు. భార్యతో విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు నూర్ మహ్మద్. తాడిపత్రికి చెందిన ఓ మహిళతో నూర్ మహ్మద్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.నూర్ మహ్మద్ అరెస్ట్ తర్వాత తాడిపత్రికి చెందిన మహిళ అదృశ్యం అయ్యింది. ఆమెకు కూడా ఉగ్ర లింకులు ఉన్నాయా? ఆమె ద్వారానే నూర్ మహ్మద్కు ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధర్మవరం ఉగ్రవాది నూర్ మహ్మద్ ఇంట్లో జిహాద్ పుస్తకాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న మీడియాకు వివరాలు వెల్లడించారు.అరెస్ట్ అయిన నూర్ మహ్మద్పై దేశ ద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కదిరి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. ఎన్ఐఏ, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సహకారంతో పూర్తి స్థాయిలో ధర్మవరం పోలీసులు విచారణ చేస్తున్నారు. ధర్మవరంలో నూర్ మహమ్మద్తో పాటు మరో వ్యక్తిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న వెల్లడించారు. వీరిద్దరూ నిషేధిత వాట్సప్ గ్రూపుల్లో సమాచారం షేర్ చేసినట్లు గుర్తించినట్లు ఆమె తెలిపారు.నిందితులను అరెస్టు చేసి కడప జైలుకు తరలించామని.. పాక్కు చెందిన వాట్సప్ గ్రూపుల్లో నిందితుడు సభ్యుడిగా ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు. కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారిస్తామని ఎస్పీ తెలిపారు. నిషేధిత వాట్సప్ గ్రూప్లు 6, పాక్కు చెందిన మరో 30 గ్రూపుల్లో నూర్ మహ్మద్ సభ్యుడిగా ఉన్నాడు’’ అని ఎస్పీ రత్న మీడియాకు వివరించారు. -
ఆసియా కప్కు పాక్ జట్టు ప్రకటన.. అనుకున్నదే జరిగింది..!
యూఏఈ వేదికగా త్వరలో జరుగనున్న ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 17) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించినట్లుగానే స్టార్ ఆటగాళ్లుగా చెప్పుకునే బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్లకు చోటు దక్కలేదు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్గా కొనసాగనున్నాడు. వేటు పడుతుందని భావించిన మరో స్టార్ షాహీన్ అఫ్రిది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.పాక్ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు పెద్ద పీఠ వేశారు. రిజ్వాన్ స్థానంలో మహ్మద్ హరీస్ వికెట్కీపర్గా ఎంపికయ్యాడు. ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ లాంటి గుర్తింపు ఉన్న ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కింది.పాక్ సెలెక్టర్లు ఇదే జట్టుకు ఆసియా కప్కు ముందు యూఏఈలోనే జరిగే ట్రై సిరీస్కు కూడా ఎంపిక చేశారు. ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే ఈ ట్రై సిరీస్లో పాక్తో పాటు ఆతిథ్య జట్టు యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఆసియా కప్ ప్రారంభమవుతుంది (సెప్టెంబర్ 9-28 వరకు). ఈ ఖండాంతర టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. పాక్, భారత్.. ఒమన్, యూఏఈతో కలిసి ఒకే గ్రూప్లో (ఏ) ఉన్నాయి.ఆసియా కప్లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్లో జరుగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరో రెండు మ్యాచ్లకు కూడా ఆస్కారం ఉంది. అయితే ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుందా లేదా అన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. పహల్గాం దాడి తర్వాతి పరిణామాల్లో భారత్ పాక్ను అన్ని విషయాల్లో వెలి వేసింది. క్రికెట్ సహా అన్ని రంగాల్లో పాక్ను బహిష్కరించింది.ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో భారత్ పాక్తో మ్యాచ్లను బాయ్కాట్ చేసింది. ఆసియా కప్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. భారతీయులంతా పాక్తో ఏ విషయంలోనూ సంబంధాలు కోరుకోవడం లేదు. ట్రై సిరీస్, ఆసియా కప్-2025 కోసం పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్ -
పట్టాలు తప్పిన పాక్ రైలు.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఓ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం నాడు లోధ్రాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెషావర్ నుండి కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్ప్రెస్ రైలు లాహోర్కు దాదాపు 400 కి.మీ దూరంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కోచ్లు చెల్లాచెదురయ్యాయి. డిప్యూటీ కమిషనర్ లుబ్నా నజీర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్దారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు. One killed, several injured as passenger train derails in Pakistan's Punjab#trainaccident #Pakistan #awamexpresshttps://t.co/UiKhnREKAy— IndiaTV English (@indiatv) August 17, 2025ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. అధికారులు దెబ్బతిన్న కోచ్లను పక్కకు తొలగిస్తున్నారు. ట్రాక్ను పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పాక్లోని పంజాబ్లో ఇది మూడవ రైలు ప్రమాదం. కొన్ని రోజుల క్రితం ముసా పాక్ ఎక్స్ప్రెస్ రైవిండ్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆగస్టు ప్రారంభంలో ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. నాడు 10 కోచ్లు బోల్తాపడి, 30 మంది గాయపడ్డారు. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
పక్కా ఏవిడెన్స్.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బాగోతం బట్టబయలు
హర్యానాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. యూట్యూబర్పై 2,500 పేజీల ఛార్జ్షీట్ను హిసార్ కోర్టులో దాఖలైంది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్థారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ సిట్ చార్జ్షీట్లో పేర్కొంది.జ్యోతి మల్హోత్రాపై అఫిషియల్ సీక్రెట్స్ చట్టంలోని సెక్షన్లు 3, 5తో పాటు బీఎన్ఎస్లోని సెక్షన్ 152 కింద కేసు నమోదైంది. ఈ చార్జ్షీట్ను పరిశీలించిన అనంతరం న్యాయపరంగా స్పందిస్తామంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఆగస్టు 18న జరగనుంది. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ పేరిట ట్రావెల్ వ్లాగ్ నడిపేంది. ఆమెపై పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో.. మూడు నెలల పాటు సిట్ అధికారులు విచారణ చేశారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్లోని అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేశారన్న తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో హర్యానా పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 2,500 పేజీలతో కూడిన చార్జ్షీట్ను హిసార్ కోర్టులో సిట్ శనివారం దాఖలు చేసింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్ధారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని సిట్ చార్జ్షీట్లో పేర్కొంది.ఆమె ఐఎస్ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ ధిల్లన్లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 2024లో పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాలకు ఆమె ప్రయాణించిన వివరాలను పోలీసులు చార్జ్షీట్లో నమోదు చేశారు. పాకిస్తాన్లో ఆమె మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మేరియం షరీఫ్ను కలిసినట్లు సమాచారం. ఆమె మొబైల్ ఫోన్, డిజిటల్ డేటా ద్వారా గూఢచర్యానికి సంబంధించిన పలు ఆధారాలను పోలీసులు సేకరించారు.కాగా, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకోగా.. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చింది.హిస్సార్కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ను నడిపేది. ఈ ఛానెల్కు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్చేశారు. ఈమె ట్రావెల్విత్జో1 ఇన్స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లింది.అక్కడ ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్ ఆదేశానుసారం అలీ అహా్వన్ అనే వ్యక్తి ఈమెకు పాక్లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్బాజ్లతో పరిచయం పెంచుకుంది. షహ్బాజ్ ఫోన్నంబర్ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్ఫోన్లో జాట్ రంధావా అనే వేరే పేరుతో సేవ్చేసింది.వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాప్ యాప్లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్చేసింది. పాక్లో కతాస్ రాజ్ టెంపుల్ సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది. -
భార్యను మోసం చేసిన వ్యక్తి అరెస్టు
బంజారాహిల్స్/లంగర్హౌస్: భార్యను మోసం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని లంగర్హౌస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఫరీసా షాహీన్ 1990లో సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ పాకిస్థానీ జాతీయుడు సాహెద్ అఖిల్ను వివాహం చేసుకున్నారు. .వీరికి 1991లో ఫహద్ అఖీల్ గోందల్ జన్మించాడు. భర్త చనిపోయిన తర్వాత ఫరీసా 1998లో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నగరంలోని విద్యనభ్యసించిన ఫహద్ ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో అసోసియేట్ మేనేజర్గా పని చేస్తున్నారు. గతంలో ఉప్పల్లోని సంస్థలో పని చేసినప్పుడు అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన మహిళను వివాహం చేసుకుని లంగర్హౌస్ నేతాజీనగర్లో నివసిస్తున్నారు. ఫహద్కు ఏడాది క్రితం మరో మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దాని తీసింది. వీళ్లిద్దరూ బంజారాహిల్స్లోని ఓ ఫ్లాట్లో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఫహద్ భార్య తొమ్మిది నెలలుగా దూరంగా ఉంటోంది. గురువారం రాత్రి ఫహద్ ఆ మహిళతో కలిసి ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఫహద్ను లంగర్హౌస్ ఠాణాకు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఫహద్పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. -
పాక్లో వర్ష విలయం
పెషావర్/ఇస్లామాబాద్: పాకిస్తాన్తోపాటు పీవోకేలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం మిగిల్చాయి. గత 36 గంటల వ్యవధిలో 214 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్స్లో ఆకస్మిక వర్షాలు, వరదల్లో అత్యధికంగా 198 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 14 మంది మహిళలు, 12 మంది చినానరులు ఉన్నారన్నారు. పీవోకేలోని గిల్గిట్–బాల్టిస్తాన్, కారకోరమ్ హైవే దెబ్బతిన్నాయన్నారు. ఖైబర్ ప్రావిన్స్లోని బునెర్ జిల్లాలో అత్యధికంగా 92 మంది చనిపోగా మన్òÙరా జిల్లాలో 17 మంది బజౌర్, బటగ్రామ్ జిల్లాల్లో 18 మంది చొప్పున మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. లోయర్ దిర్ జిల్లాలో ఐదుగురు, స్వాత్లో నలుగురు, సంగ్లాలో ఒకరు చనిపోయారు. పలువురు చిన్నారులు సహా మొత్తం 125 మంది చనిపోయినట్లు విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. సహాయ, అన్వేషణ కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు వివరించింది. స్వాత్, బజౌర్లలో ఆర్మీ సహాయ కార్యకలాపాల్లో పాల్గొంటోంది. ఆకస్మిక వరదల్లో గిల్గిట్–బల్టిస్తాన్లోని ఘిజర్ జిల్లాలో 8 మంది చనిపోగా ఇద్దరు గల్లంతయ్యారు. జిల్లాలో పలు నివాసాలు, వాహనాలు, స్కూలు భవనాలు, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. కారకోరమ్ హైవే, బల్టిస్తాన్ హైవే పలు చోట్ల దెబ్బతింది. లింకు రోడ్లు తెగిపోవడంతో నీలమ్ లోయలోని రట్టి గలి సరస్సు వద్ద చిక్కుకుపోయిన 600 మందికి పైగా పర్యాటకులను అక్కడే ఉండాలంటూ అధికారులు సూచనలు చేశారు. కుందల్ షాహి వద్ద వంతెన కొట్టుకుపోయింది. వరద ఉధృతికి ఒక రెస్టారెంట్తో పాటు మూడిళ్లు నేలమట్టమయ్యాయి. జీలమ్ నదికి వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. పీవోకేలోని ముజఫరాబాద్ జిల్లాలోని సర్లి సచాలో ఇల్లు కూలి కుటుంబంలోని ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. సు«ద్నోటి, బాగ్ జిల్లాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.కూలిన హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్ శుక్రవారం ఖైబర్ ప్రావిన్స్లో కూలిందని అధికారులు తెలిపారు. ఘటనలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సహాయక సిబ్బంది సహా ఐదుగురు చనిపోయారని చెప్పారు. వాతావరణం ప్రతికూలంగా మారడమే ఇందుకు కారణమని భావిస్తున్నామన్నారు. పెషావర్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఎంఐ–17 హెలికాప్టర్ మహ్మంద్ జిల్లాలోని చంగి బండా వద్ద కూలిందని వివరించారు. ఘటన నేపథ్యంలో మరో హెలికాప్టర్ను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నామన్నారు. -
Independence Day 2025: దుస్సాహసానికి దిగారో ఖబడ్దార్!
ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. స్వదేశీ వస్తువులే అమ్ముతాం అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలి. వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి. టారిఫ్లతో మన రైతులు, పశుపాలకులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా. ..: మోదీ :..న్యూఢిల్లీ: దాయాది గుండెలదిరేలా ప్రధాని నరేంద్ర మోదీ సింహనాదం చేశారు. పహల్గాం పాశవికత్వం వెనక పాక్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ పలుగు రాళ్లతో నలుగు పెట్టారు. ‘‘పహల్గాం ఉగ్రోన్మాదానికి ప్రతీకారంగా మన సైన్యం చేసిన ‘సిందూర’ గర్జన తాలూకు భయంతో శత్రు దేశం నేటికీ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది. మన దళాలు పాక్ భూభాగంలో వందలాది కిలోమీటర్ల మేరకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర, సైనిక లక్ష్యాలను తుత్తునియలు చేశాయి. ఆ విధ్వంసానికి సంబంధించి నేటికీ రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ అలాంటి దుస్సాహసానికి దిగితే దాయాదికి జన్మలో మర్చిపోలేని రీతిలో గట్టి గుణపాఠం నేర్పి తీరతామంటూ ప్రతినబూనారు. అణు బెదిరింపులకు జడిసే రోజులు గతించాయంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు పదునైన హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి మతిలేని ఉన్మాదానికి దిగితే దీటుగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘‘60 ఏళ్లుగా భారత రైతుల పొట్ట కొడుతూ పాక్ పొలాలను తడుపుతున్న ఏకపక్ష సింధూ నదీ జల ఒప్పందం శాశ్వతంగా కాలగర్భంలో కలిసినట్టే. నీరూ నెత్తురూ కలిసి పారడం జరగని పని’’ అంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘భరత జాతి దశాబ్దాలుగా పదేపసదే ఉగ్ర భూతానికి బలవుతూ వస్తోంది. దాయాది దన్నుతో జాతి గుండెను ఉగ్ర పోట్లు పదేపదే చీలుస్తూ వచ్చాయి. అది ఇకపై సాగదు. ఉగ్రవాదానికి మహారాజ పోషకులుగా మారి దానికి జవసత్వాలు అందజేస్తున్న దేశాలు, శక్తులను కూడా ఇకపై విడిగా చూడబోం. వారినీ ఆ ముష్కరులతో సమానంగా శిక్షించి తీరతాం. ఇదే మా నయా మంత్రం’’ అంటూ పాక్కు పెను హెచ్చరికలు చేశారు. ‘‘వారి మధ్య ఎలాంటి తేడా లేదు. ఇద్దరూ మానవాళికి సమాన శత్రువులే’’ అని స్పష్టం చేశారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ఏకంగా 103 నిమిషాల పాటు ప్రసంగించారు. గతేడాది 98 నిమిషాలు ప్రసంగించిన స్వీయ రికార్డును అధిగమించారు. అంతేగాక ఎర్రకోట నుంచి వరుసగా 12 వసారి పంద్రాగస్టు ప్రసంగం చేయడం ద్వారా ఇందిరాగాంధీ రికార్డు (11)ను అధిగమించారు. వరుసగా 17సార్లు పంద్రాగస్టు ప్రసంగాలు చేసిన తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోస్థానంలో నిలిచారు. అన్ని రంగాల్లోనూ ఆత్మ నిర్భరత తాలూకు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో పదేపదే నొక్కిచెప్పారు. సెమీ కండక్టర్లు మొదలుకుని కీలక ఖనిజాలు, అణు ఇంధనం దాకా అన్నింట్లోనూ స్వయంసమృద్ధి సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. తన వికసిత్ భారత్ కలలను సవివరంగా దేశ ప్రజల ముందుంచారు. కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నాయంటూ తూర్పారబట్టారు. అర్థం లేని డిమాండ్లతో పార్లమెంటును నిత్యం స్తంభింపజేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కీలక పథకాల అమలులో ఇప్పటికైనా కేంద్రంతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.బలగాలు సత్తా చాటాయి ‘‘రాజస్తాన్ ఎడారులు మొదలుకుని హిమ శిఖరాలు, సముద్ర తీరం, అత్యంత జనసమ్మర్ధ ప్రాంతాల దాకా ఇంటింటా నేడు త్రివర్ణ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. కానీ గత ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులను ఉగ్ర ముష్కరులు పిరికిదెబ్బ తీశారు. పిల్లల కళ్లముందు తండ్రులను పొట్టన పెట్టుకున్నారు. భార్యల సిందూరాన్ని కర్కశంగా తుడిపేశారు. ఆ దారుణాన్ని తలచుకుని జాతి యావత్తూ క్రోధావేశాలతో ఆక్రోశించింది. అందుకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సత్తా చాటాయి’’ అన్నారు.శ్రీకృష్ణుడే స్ఫూర్తిగా మిషన్ సుదర్శన చక్ర దేశ భద్రతకు ఛత్రం పదేళ్లలో అందుబాటులోకి దేశ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ‘మిషన్ సుదర్శన్ చక్ర’ పేరుతో 2035 నాటికి అత్యంత శక్తిమంతమైన సరికొత్త రక్షణ వ్యవస్థ ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు. దీనిద్వారా దేశ భద్రతా ఛత్రాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేసి ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. ‘‘శనివారం శ్రీకృష్ణుని జన్మదినం. కచి్చతత్వంతో పని పూర్తి చేయడం, ఆ వెంటనే కృష్ణున్ని చేరుకోవడం సుదర్శన చక్రం ప్రత్యేకత. దాని స్ఫూర్తితో రూపొందే పూర్తి దేశీయ భద్రతా వ్యవస్థ కూడా అలాగే అత్యాధునికంగా రూపుదిద్దుకుంటుంది’’ అన్నారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటివాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పని చేస్తుందన్నది నిపుణుల అంచనా.‘సింధూ’ ఇక భారత సొత్తే! ‘‘మన నేలపై పుట్టి పారే నదులు శత్రు దేశపు పొలాలను తడుపుతున్నాయి. మన రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. సింధూ ఒప్పందం 70 ఏళ్లుగా వారికి చేసిన నష్టం మాటలకందనిది. అది ఎంతటి ఏకపక్ష ఒప్పందమో ఇప్పుడు దేశవాసులందరికీ తెలిసొచ్చింది. దీన్నిక సహించేది లేదు. ఆ ఒప్పందానికి నూకలు చెల్లినట్టే. సింధూ జలాలన్నీ ఇక పూర్తిగా మన రైతులవే. టారిఫ్లతో మన రైతులు, మత్స్యకారులతో సహా ఎవరూ నష్టపోకుండా అండగా నిలుస్తా’’.అక్రమ వలసలు... అతి పెద్ద కుట్ర! హై పవర్ మిషన్తో అడ్డుకట్ట అక్రమ వలసలు దేశానికి తలనొప్పిగా మారాయని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఇది పక్కా పథకం ప్రకారం కొందరు పన్నిన కుట్ర. ఉద్దేశపూర్వకంగా చొరబాట్లను ప్రోత్సహిస్తూ పెను సంక్షోభానికి బీజం వేస్తున్నారు. దేశంలో జనాభా సమతౌల్యాన్నే దెబ్బతీయజూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇది జాతీయ భద్రత పాలిట పెను ప్రమాదంగా పరిణమిస్తోంది. మన ఐక్యతకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతోంది. సామాజిక ఉద్రిక్తతల బీజాలు నాటుతోంది. చొరబాటుదార్లు అమాయక గిరిపుత్రులను మోగిస్తున్నారు. వారి అటవీ భూములను కాజేస్తున్నారు. ఈ ఘోరాలను ఇకపై సహించే ప్రసక్తే లేదు. అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతస్థాయి డెమోగ్రాఫిక్ మిషన్కు రూపకల్పన చేస్తున్నాం’’ అని ప్రకటించారు. నారీ శక్తికి సలాం ‘‘స్త్రీ శక్తి ప్రతి రంగంలోనూ సత్తా చాటుతోంది. స్టార్టప్లు, క్రీడలు, సైన్యం మొదలుకుని అంతరిక్షం దాకా ప్రతి రంగంలోనూ దేశ సామాజిక, ఆర్థిక ప్రగతిలో కీలక చోదక శక్తిగా నిలుస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) నుంచి తాజాగా తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న చరిత్రాత్మక క్షణాలను తలచుకుని జాతి యావత్తూ గర్వంతో ఉప్పొంగిపోయింది. లక్పతీ దీదీ పథకంతో కోట్లాది మంది మహిళలు స్వయంసమృద్ధి సాధించారు’’.స్వదేశీ సత్తా చాటుదాం-ఆ కలను నిజం చేయండి యువతకు మోదీ సవాలు వందేళ్ల పై చిలుకు దాస్యం మనలను నిరుపేదలుగా, పరాధీనులుగా మార్చిందని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. నేటికీ ఏ జాతి ఆత్మ గౌరవానికైనా ఆత్మ నిర్భరతే అతి పెద్ద తార్కాణమని నొక్కిచెప్పారు. స్వయం సమృద్ధ భారతే వికసిత భారత్కు పునాది అని స్పష్టం చేశారు. ‘‘ఇది ఎగుమతులు, దిగుమతులు, కరెన్సీలకే పరిమితం కారాదు. మేడిన్ ఇండియా ఆయుధాల తాలూకు గొప్పదనాన్ని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచమంతటికీ ఘనంగా చాటాం. శత్రు లక్ష్యాలను రెప్పపాటులో తుత్తునియలు చేశాం. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించకపోతే ఇది సాధ్యపడేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘ప్రతి ఒక్కరమూ భారత్లో, మన తోటివారు చెమటోడ్చి తయారు చేసిన వస్తువులనే వాడతామని ప్రతినబూనుదాం. ఇతరులూ వాడేలా చేద్దాం. ‘స్వదేశీ వస్తువులే అమ్ముతాం’ అంటూ ప్రతి చిరు వ్యాపారీ, దుకాణదారూ బోర్డు పెట్టాలి. ప్రతి రంగంలోనూ దేశీయ తయారీ వస్తువులే ఉండాలని, వాటిని ప్రపంచ దేశాలన్నింటికీ ఎగుమతి చేసే స్థాయికి చేరాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘దేశీయ జెట్ ఇంజన్లు, యుద్ధవిమానాలు మొదలుకుని సోషల్ మీడియా వేదికల దాకా తిరుగులేని రీతిలో డిజైన్ చేయాలి. మన యువతకు, ఇన్నొవేటర్లకు, సైంటిస్టులకు, ఇంజనీర్లకు, ప్రొఫెషనల్స్కు ఇదే నా సవాలు’’ అని పేర్కొన్నారు. తద్వారా దేశాన్ని బలోపతంగా, స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ‘‘అంతరిక్ష రంగంలోనూ ఆత్మ నిర్భరత అత్యవసరం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా రికార్డు నెలకొల్పిన వాయుసేన గ్రూప్కెపె్టన్ శుభాన్షు శుక్లాను చూసి జాతి యావత్తూ పొంగిపోతోంది. తొలి దేశీయ మానవసహిత అంతరిక్ష గగన్యాన్కు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. అంతేకాదు, సొంత అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించుకోనున్నాం’’ అని చెప్పారు. అతి పెద్ద సేవాసంస్థ ఆరెస్సెస్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆవిర్భావానికి వందేళ్లవుతున్న సందర్భంగా మోదీ అభినందనలు తెలిపా రు. దాన్ని ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా అభివరి్ణంచారు. ‘‘దేశానికే గర్వకారణమైన ప్రస్థానం ఆరెస్సెస్ది. అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్న ఆరెస్సెస్ కార్యకర్తలందరికీ నా సెల్యూట్. కోట్లాది మంది ప్రజలు, సాధుసంతులు, సైంటిస్టులు, టీచర్లు, రైతులు, సైనికులు, శ్రామికులు, వ్యక్తులు, సంస్థల మొక్కవోని ప్రయత్నాల ఫలస్వరూపంగా ఆరెస్సెస్ ఎదిగింది. వ్యక్తి, జాతి నిర్మాణానికి, దేశ సంక్షేమానికి వందేళ్లుగా వారంతా తిరుగులేని త్యాగాలు చేస్తూ వస్తున్నారు. ఆ స్వయం సేవకులదరినీ ఎర్రకోట వేదికగా సగౌరవంగా గుర్తుచేసుకుంటున్నా’’ అన్నారు.తగ్గనున్న జీఎస్టీ శ్లాబులు-దివాలీ డబుల్ బొనాంజా ‘‘త్వరలో భారీస్థాయిలో సరికొత్త జీఎస్టీ సంస్కరణలు తేనున్నాం. జీఎస్టీ శ్లాబులను బాగా తగ్గించనున్నాం. తద్వారా పౌరులపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ దీపావళికి వారికిది కేంద్రం తరఫున డబుల్ బొనాంజా. వార్షిక వ్యక్తిగత ఆదాయ పన్ను చట్టాలను కూడా సరళీకరించాం’’. యువత కోసం... రూ.లక్ష కోట్లు ‘‘దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ‘ప్రధాన్మంత్రీ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నాం. దీనికింద ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతీ యువకులందరికీ రూ.15 వేలు అందజేయనున్నాం. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందించే కంపెనీలకు ప్రోత్సహకాలు అందుతా యి. ఈ పథకం ద్వారా కనీసం 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తాం’’. కీలక ఖనిజాలపై దృష్టి ‘‘ఇది టెక్నాలజీ ఆధారిత శతాబ్ది. దాన్ని అందిపుచ్చుకున్న దేశాలే అభివృద్ధిలో దూసుకెళ్లాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గత ప్రభుత్వాలను విమర్శించడం నా లక్ష్యం కాదు. కానీ మన దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించిన ఫైళ్లు కదలడం 60 ఏళ్ల కిందే మొదలైంది. కానీ ఏళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడే! అలా మనం అతి విలువైన 50 ఏళ్లను కోల్పోతే మిగతా దేశాలు ఆ రంగంలో దూసుకెళ్లాయి. మేం అధికారంలోకి వచ్చాక సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నాం. ఇక కీలక ఖనిజాల అవసరాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ఈ రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించడం అత్యంత కీలకం. పరిశ్రమలు, ఇంధనం, రక్షణ, టెక్నాలజీ... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా కీలక ఖనిజాలే ప్రాణావసరంగా మారిన పరిస్థితి! ఈ అవసరాలను పూర్తిస్థాయిలో దేశీయంగానే తీర్చుకునేందుకు నేషనల్ క్రిటికల్ మిషన్కు శ్రీకారం చుట్టాం. దేశవ్యాప్తంగా ఏకంగా 1,200 చోట్ల కీలక ఖనిజాల అన్వేషణకు తెర తీశాం’’.పదింతలకు ‘అణు’ పాటవం ‘‘దేశవ్యాప్తంగా 10 కొత్త అణు రియాక్టర్లను శరవేగంగా నిర్మిస్తున్నట్టు మోదీ వెల్లడించారు. దేశ అణు ఇంధన సామర్థ్యాన్ని 2047 నాటికి పదింతలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు’’. -
పాక్, పీవోకేలో జల విలయం.. 150 మందికి పైగా మృతి
గత 24 గంటలుగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK) ప్రాంతాలను ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించినట్లు ఆ దేశ జాతీయ, ప్రాంతీయ విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. వర్ష బీభత్సంతో 154 మంది మృతి చెందారని... పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ప్రాంతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిందని.. భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.పీవోకేలోని గిల్గిత్-బాల్టిస్తాన్లో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. పలు భవనాలు ధ్వంసం కాగా.. ఎనిమిది మంది మరణించారు. ఘైజర్ జిల్లాలో ఇద్దరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. బునేర్ జిల్లాలో 75 మంది, మాన్సెహ్రా జిల్లాలో 17 మంది, బాజౌర్, బాటాగ్రామ్ జిల్లాల్లో 18 మంది మృతి చెందినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావంతో పలువురు చిన్నారులు సహా 125 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.Breaking News: Fllods in North West Pakistan wreak havoc as death toll in KP nears 100 in a single day so far. Only Buner death toll has reached to 75, 56 dead bodies have been recovered so far says Dy Commissioner. pic.twitter.com/iCbrIMcvwV— Fakhar Ur Rehman (@Fakharrehman01) August 15, 2025కారకోరం, బాల్టిస్తాన్ జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా, సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి. నీలం లోయలో లింక్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వందలాది మంది పర్యాటకులు రట్టి గలి సరస్సు బేస్ క్యాంప్ వద్ద చిక్కుకుపోయారు. కుండల్ షాహిలోని ఒక ప్రధాన వంతెనతో పాటు ఇళ్ళు, నది తీరంలోని రెస్టారెంట్ను వరద తుడిచిపెట్టేసింది. ముజఫరాబాద్లోని సర్లి సచాలో కొండచరియలు విరిగిపడి ఒక ఇల్లు కుప్పకూలి ఆరుగురు కుటుంబ సభ్యులు చనిపోయినట్లు సమాచారం. -
ఎర్రకోట వేదికగా పాకిస్తాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక
సాక్షి,న్యూఢిల్లీ: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ పాకిస్తాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ.. దేశ భద్రతపై తన దృఢమైన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. పాకిస్తాన్ పదే పదే చేస్తున్న అణు బెదిరింపులను ఖండించారు. అణు దాడుల బెదిరింపులకు భారత్ భయపడదని తేల్చి చెప్పారు. అదే సమయంలో సింధూ జలాల ఒప్పందానికి తాము అంగీకరించబోమని పాక్కు స్పష్టం చేశారు. రక్తం, నీరు కలిసి పారటం కుదరదన్నారు.సింధూ జలాల ఒప్పందం కారణంగా నా దేశ భూమి నీరు లేక కటకటలాడింది. రైతులు నీరు లేక అనేక బాధలు పడ్డారు. ఇకపై రైతులు అలాంటి బాధలు పడకూడదు. భారతదేశానికి హక్కుగా చెందాల్సిన నీరు భారతదేశానికి మాత్రమే’ అని తెలిపారు. నయా భారత్ థీమ్తో అంతకు ముందు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్ర కోట వేదిగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. న్యూఇండియా (Naya Bharat) అనే థీమ్ ప్రతిబింబించేలా వస్త్రధారణతో దేశభక్తిని చాటిచెప్పారు. ఇక ప్రధాని మోదీ ఇది వరుసగా 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం. ఆచారం ప్రకారం, ప్రధానమంత్రి రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుష్పగుచ్ఛాలు అర్పించి, జాతినుద్దేశించి ప్రసంగించే ముందు రెడ్ ఫోర్డ్ వద్ద ఉన్న చారిత్రాత్మక లాహోరి గేట్ (ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాన ద్వారం) వద్దకు చేరుకున్నారు. అక్కడ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, తన ప్రసంగాన్ని ప్రారంభించారు. -
పాక్లో కొత్తగా ఆర్మీ రాకెట్ ఫోర్స్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ వేళ భారత క్షిపణుల ధాటికి పూర్తిగా చేతులెత్తేసిన పాకిస్తాన్కు నెమ్మదిగా తత్వం బోధపడింది. దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసుకోవాలని ఎట్టకేలకు నిర్ణయించుకుంది. అందులోభాగంగా నూతనంగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ పేరిట నూతన విభాగాన్ని ఏర్పాటుచేసుకుంటోంది. పాక్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సంప్రదాయక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే లక్ష్యంతో ఈ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేస్తున్న ట్లు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, త్రివిధ దళాధిపతుల సమక్షంలో షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. భూతలం నుంచి ప్రయోగించే అణు, అణ్వస్త్రయేతర బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణులతో ఈ కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ను తీర్చిది ద్దనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్తో భారత్ తన క్షిపణుల సత్తాను పాక్కు రుచి చూపించాక ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం మేల్కొంది. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో రక్షణరంగ బడ్జెట్ను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
టీమిండియా మాతో ఆడకపోవడమే మంచింది.. ఆ చావుదెబ్బను ఊహించలేము: పాక్ మాజీ
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల The Game Plan అనే యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2025లో భారత్ తమతో ఆడకపోతేనే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ తమతో మ్యాచ్లను ఎలాగైతే బాయ్కాట్ చేసిందో ఆసియా కప్లోనూ అలాగే చేస్తే బాగుంటుందని అన్నాడు.ఒకవేళ భారత్ ఆసియా కప్లో తమతో మ్యాచ్లు ఆడేందుకు ముందుకు వస్తే మాత్రం వారు కొట్టే చావుదెబ్బను ఊహించలేమని తెలిపాడు. ఇలా జరగకూడదని దేవుడిని ప్రార్దిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.బాసిత్ అలీ చేసిన ఈ వ్యాఖ్యలు పాక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. బాసిత్ వ్యాఖ్యలపై పాక్ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తుంది. మరోవైపు భారత అభిమానులు మాత్రం బాసిత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. కరెక్ట్గా చెప్పాడంటూ సోషల్మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా పాక్ విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత బాసిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విండీస్తో జరిగిన చివరి వన్డేలో పాక్ 92 పరుగులకే ఆలౌటై, 202 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో పాక్ విండీస్కు 35 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను కోల్పోయింది.ఈ ఓటమి తర్వాత బాసిత్ అలీ పాక్ జట్టుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి జట్టుతో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎప్పుడు ఓడించాలంటూ కామెంట్లు చేశాడు.కాగా, యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరిన్ని మ్యాచ్లు జరిగే ఆస్కారం కూడా ఉంది. దీనికి ముందు పాక్తో ఆడేందుకు భారత ప్రభుత్వం సమ్మతించాలి. పాక్తో ఆడే విషయమై భారత క్రీడాభిమానులు, క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు క్రికెట్ వేరు, దేశ సమస్య వేరని అంటుంటే.. మరికొందరు మాత్రం నీచ బుద్ది ఉన్న పాక్తో క్రికెటే కాకుండా ఏ ఆట ఆడకూడదని భీష్మించుకూర్చున్నారు. -
విభజన భయానక స్మృతి దినం: 1947, ఆగస్టు 14న ఏం జరిగింది?
న్యూఢిల్లీ: 1947.. ఆగస్టు 14.. అది భారత ఉపఖండం చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఆ రోజున భారతదేశ విభజన జరిగింది. పాకిస్తాన్ పేరుతో ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం ఉద్భవించింది. నాటి దేశ విభజన కోట్లాదిమంది జీవితాలను శాశ్వతంగా మార్చివేసింది. లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దేశంలో భారీ స్థాయిలో మత అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు దక్షిణాసియా భౌగోళిక స్వరూపాన్ని , చరిత్రను మార్చివేశాయి.1947లో దేశ విభజన సమయంలో నిరాశ్రయులైన లక్షలాది మంది పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసుకునేందుకు భారత్ ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ‘విభజన భయానక స్మృతి దినం’ను పాటిస్తుంది. 1947లో బ్రిటిష్ వలస పాలకులు భారతదేశాన్ని విభజించారు. అదే ఏడాది ఆగస్టు 14 న భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్ కరాచీకి వెళ్లారు. అక్కడ ఆయన పాకిస్తాన్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. కరాచీని కొత్త దేశపు రాజధానిగా ప్రకటించారు. తరువాత ఇస్లామాబాద్ను రాజధానిగా మార్చారు. పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్గా ముహమ్మద్ అలీ జిన్నా ప్రమాణ స్వీకారం చేశారు.విభజన అధికారిక ప్రకటనకు ముందుగానే, పెద్ద ఎత్తున వలసలు, మత హింస చోటుచేసుకుంది. లక్షలాది మంది హిందువులు, సిక్కులు, ముస్లింలు కొత్తగా విభజితమైన దేశాలలో భద్రత కోసం తమ స్థానాన్ని వెతుక్కోవలసి వచ్చింది. ఆగస్టు 14న పాకిస్తాన్ తన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా, మరుసటి రోజు ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 2021లో తన రెండవ పదవీకాలంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 14న ‘విభజన భయానక స్మృతి దినం’గా పాటించాలని ప్రకటించారు. విభజన సమయంలో నాటి ప్రజలు అనుభవించిన బాధలను భవిష్యత్ తరాలకు గుర్తుచేసేందుకు ఆగస్టు 14న విభజన భయానక స్మృతి దినంగా పాటిస్టున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ జారీ చేసింది. -
Pakistan: స్వాతంత్ర్య సంబరాల్లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
కరాచీ: పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కరాచీ నగరంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అలాగే నగరంలో జరుగుతున్న దోపిడీలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐదుగురు హతమయ్యారు.కరాచీలోని పలు ప్రాంతాలలో వైమానిక కాల్పులు జరిగినట్లు పాక్ మీడియా తెలిపింది. వివిధ ఘటనల్లో 20 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురి నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. వైమానిక కాల్పులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారువైమానిక కాల్పుల కారణంగా కరాచీలో ఒక వృద్ధుడు, ఎనిమిదేళ్ల బాలిక, మరొక యువకుడు మరణించారని రెస్క్యూ అధికారులు పాకిస్తాన్ జియో న్యూస్కు తెలిపారు. నగరం అంతటా చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో 64 మంది గాయపడ్డారు. పాకిస్తాన్లోని లియాఖతాబాద్, కోరంగి, లియారి, మెహమూదాబాద్, అక్తర్ కాలనీ, కీమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్లలో వైమానిక కాల్పుల సంఘటనలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని సివిల్, జిన్నా, అబ్బాసి షహీద్ ఆసుపత్రులకు, ప్రైవేట్ వైద్య కేంద్రాలకు పోలీసులు తరలించారు. వైమానిక కాల్పులకు పాల్పడినవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
జేడన్ సీల్స్. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్లో తరుచూ వినిపిస్తున్న పేరు. ఈ విండీస్ నయా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాదిలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తూ బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ట్రినిడాడియన్ బౌలర్ ఈ ఏడాదే లైమ్లైట్లోకి వచ్చాడు. సీల్స్ ఈ ఏడాది 8 వన్డేల్లో 18 వికెట్లు.. 21 టెస్ట్ల్లో 88 వికెట్లు తీశాడు.తాజాగా పాకిస్తాన్పై సంచలన ప్రదర్శనతో సీల్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాక్తో నిన్న జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సీల్స్ 7.2 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. ఫలితంగా పాక్ విండీస్ నిర్దేశించిన 295 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ 92 పరుగులకే కుప్పకూలింది.ఈ ఇన్నింగ్స్లో సీల్స్ నిప్పులు చెరిగే బంతులతో పాక్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేశాడు. సీల్స్ దెబ్బకు పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. పాక్ ఇన్నింగ్స్లో డకౌటైన ఐదుగురు ఆటగాళ్లలో సీల్స్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు. సీల్స్ బౌలింగ్లో పాక్ ఆటగాళ్లు బంతి బంతికి గండాన్ని ఎదుర్కొన్నారు. బంతిని వదిలేసినా సమస్యే, ఆడాలని ప్రయత్నించినా సమస్యే.సీల్స్ ప్రదర్శనలు ఈ ఏడాదంతా ఇలాగే కొనసాగాయి. పాక్తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్లో 3 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ సిరీస్కు ముందు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో 3 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీశాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సీల్స్ వేసిన స్పెల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పెల్స్లో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ సంచలన ప్రదర్శనల అనంతరం సీల్స్ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు. అంతర్జాతీయ క్రికెట్కు మరో పేసు గుర్రం వచ్చిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. విండీస్ జట్టు త్వరలో భారత్లో పర్యటంచనుండగా సీల్స్పై ఫోకస్ మరింత పెరిగింది. వరల్డ్ క్లాస్ భారత బ్యాటర్లను అతను ఏ మేరకు నిలవరించగలడో అని చర్చలు మొదలయ్యాయి. సీల్స్ ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలంలోనూ హాట్ పిక్ అయ్యే అవకాశం ఉంది. అతడిని కేకేఆర్ తన్నుకుపోవచ్చు. ఎందుకంటే అతను కరీబియన్ లీగ్లో ఇదివరకే వారి సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ట్రిన్బాగో నైట్రైడర్స్కు ఆడుతున్నాడు.రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సీల్స్ విండీస్ తరఫున ఇప్పటివరకు 21 టెస్ట్లు ఆడి మూడు 5 వికెట్ల ప్రదర్శనలతో 88 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 31 వికెట్లు తీశాడు. -
Jammu and Kashmir: ఆర్మీ పోస్ట్పై పాక్ దాడి విఫలం.. సైనికుడు మృతి
బారాముల్లా : జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోగల ఉరి సెక్టార్ లో భారత సైన్యం పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఒక సైనికుడు మృతిచెందాడు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో గల టిక్కా పోస్ట్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదులు జరిపిన దాడి, చొరబాటు యత్నాన్ని బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తిప్పికొట్టింది. ఆగస్టు 12- 13 తేదీల మధ్య రాత్రివేళ అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు పాక్ దాడిని తిప్పికొట్టాయి. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు ఒక ఫార్వర్డ్ పోస్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్రమత్తమైన దళాలు వారిని ప్రతిఘటించి, వారి చొరబాటు యత్నాన్ని విఫలం చేశాయి. తదనంతరం చొరబాటుదారులను గుర్తించేందుకు, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్డన్, సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. The Indian Army launched a large-scale cordon and search operation in the Uri sector of Baramulla district, foiling a major infiltration attempt. | Ashraf WaniRead more: https://t.co/fqZp5RcT8I#JammuandKashmir #Baramulla #Uri pic.twitter.com/gn7SIrk8wl— IndiaToday (@IndiaToday) August 13, 2025పాక్ ముష్కరులను తరిమికొట్టే ప్రయత్నంలో పరస్పరం జరిగిన జరిగిన కాల్పుల్లో హవల్దార్ అంకిత్, సైనికుడు బానోత్ అనిల్ కుమార్ గాయాల పాలయ్యారు. వీరిలో బానోత్ అనిల్ కుమార్ ప్రాణాలు విడిచారని ఆర్మీ అధికారులు ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు. ‘జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సిపాయి బానోత్ అనిల్ కుమార్కు భారత సైన్యం వందనాలు అర్పిస్తున్నది. ఈ దుఃఖ సమయంలో భారత సైన్యం ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నది.మృతుల కుటుంబానికి సంఘీభావం తెలుపుతోందని’ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. -
మునీర్ మంతనం.. పాక్ మద్దతుగా అమెరికా సంచలన నిర్ణయం
వాషింగ్టన్: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), మజీద్ బ్రిగేడ్లను విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్టీఓ)లుగా అమెరికా ప్రకటించింది. బీఎల్ఏని 2019లోనే.. స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్డీజీటీ) జాబితాలో చేర్చిన అమెరికా.. తాజాగా మజీద్ బ్రిగేడ్ను కూడా బీఎల్ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. 2019 నుంచి ఆ రెండు సంస్థలు చేసిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఎఫ్టీవోలుగా గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు.ఈ సంస్థల హింసాత్మక చర్యలు పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అమెరికా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ‘ఉగ్రవాద సంస్థలను ఇలా గుర్తించడం వల్ల వాటికి లభించే సహాయాన్ని, నిధులను నిరోధించవచ్చు. ఈ సంస్థలకు ఆర్థికంగా, భౌతికంగా లభించే మద్దతును చట్టపరంగా నిలిపివేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం’అని ఆయన పేర్కొన్నారు. పాక్పై ఔదార్యం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉండగానే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆయన చేసిన విజ్ఞప్తితోపాటు బలమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. జూన్లో అమెరికా అధ్యక్షుడితో ము నీర్ ఒక ప్రైవేట్ విందుకు హాజరైనప్పటి నుంచి పాకిస్తాన్ పట్ల అమెరికా అమితమైన ఔదా ర్యం చూపుతోంది. బీఎల్ఏని విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడం అందులో భాగం. మునీర్ అమెరికా పర్యటన సందర్భంగానే ఈ ప్రకటన రావడం అతనికి దౌత్యపరమైన విజయాన్ని అందించింది. అయితే.. తమ దేశంలో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి బీఎల్ఏను భారత్ రెచ్చగొడుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేయడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. 1970 నుంచి.. బీఎల్ఏ ఖనిజ సంపన్న ప్రావిన్స్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తోంది. 1970వ దశకంలో బీఎల్ఏ ప్రారంభమైంది. పాక్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో మొదట అధికారంలోకి వచి్చనపుడు బలూచిస్తాన్లో సాయుధ తిరుగుబాటు మొదలైంది. సైనిక నియంత జియావుల్ హక్ అధికారం చేజిక్కించుకోవడంతో చర్చల తరువాత సాయుధ తిరుగుబాటు ముగిసింది. బీఎల్ఏ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మళ్లీ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాలనలో 2000 సంవత్సరంలో బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలు, భద్రతాదళాలపై వరుస దాడులు చేసింది. 2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ సంస్థ చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ ట్రాన్సిట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో చైనా కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బీఎల్ఏ బషీర్ జేబ్ నాయకత్వంలో కొనసాగుతోంది. మజీద్ బలూచ్ అనే మిలిటెంట్ పేరుతో మజీద్ బ్రిగేడ్ ఏర్పడింది.హింసాత్మక దాడులు.. అమెరికా నిఘా నేత్ర బీఎల్ఏను చాలా ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. అయితే బీఎల్ఏ 2019 తర్వాత అనేక హింసాత్మక దాడులకు పాల్పడింది. మజీద్ బ్రిగేడ్ పేరుతో అనేక దాడులను నిర్వహించింది. 2024లో కరాచీ విమానాశ్రయం సమీపంలో, అలాగే గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడులకు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీయే బాధ్యత వహించింది. 2025 మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసింది. ఈ దాడిలో 31 మంది పౌరులు, భద్రతా సిబ్బంది చనిపోగా>.. 300 మందికి పైగా రైలు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. -
Shai Hope: వన్డే క్రికెట్ చరిత్రలో మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్
ప్రస్తుత వన్డే క్రికెట్లో విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్గా మిగిలిపోయాడు. ఇతగాడు కేవలం 137 ఇన్నింగ్స్ల్లో 49.82 సగటుతో 18 సెంచరీలు, 29 అర్ద సెంచరీల సాయంతో 5879 పరుగులు చేశాడు. ప్రస్తుత తరంలో ఇంత గొప్ప గణాంకాలు చాలా తక్కువ మందికి ఉన్నాయి.హాషిమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, ఏబీ డివిలియర్స్ మాత్రమే హోప్ కంటే మెరుగ్గా ఉన్నారు. తాజాగా హోప్ పాక్పై విధ్వంసకర శతకం (94 బంతుల్లో 120 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) బాది మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించాడు. స్వదేశంలో పాక్తో జరిగిన మూడో వన్డేలో ఇది జరిగింది.హోప్ మెరుపు సెంచరీ.. పాక్ను చిత్తు చేసిన విండీస్ఈ మ్యాచ్లో హోప్ మెరుపు సెంచరీ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ను జేడన్ సీల్స్ బెంబేలెత్తించాడు. 7.2 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలి, 202 పరుగుల భారీ తేడాతో ఘెర పరాజయంపాలైంది.34 ఏళ్ల తర్వాతఈ గెలుపుతో విండీస్ 3 మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పాక్పై విండీస్కు 34 ఏళ్ల తర్వాత దక్కిన సిరీస్ విజయం ఇది. ఈ సిరీస్లోని తొలి వన్డేలో పాక్, రెండో వన్డేలో విండీస్ గెలిచాయి.83 బంతుల్లో శతకంసిరీస్ డిసైడర్లో హోప్ చెలరేగి ఆడాడు. తొలుత నిదానంగా ఆడినా, ఆతర్వాత గేర్ మార్చి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న హోప్ ఆతర్వాత అస్సలు ఆగలేదు. హోప్ ధాటికి పాక్ బౌలర్లు చివరి 7 ఓవర్లలో ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నారు.సిరీస్ ఆధ్యాంతం అదిరిపోయే ప్రదర్శనలుఈ సిరీస్ ఆధ్యాంతం హోప్ అదిరిపోయే ప్రదర్శనలు చేశాడు. తొలి వన్డేలో 55, రెండో వన్డేలో 32, తాజాగా జరిగిన వన్డేలో అజేయమైన 120 పరుగులు చేసి విండీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్లో హోప్ కెప్టెన్గానూ కీలకంగా వ్యవహరించాడు. బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్ను సెట్ చేయడం, రివ్యూలు తీసుకోవడం లాంటి విషయాల్లో పరిణితి ప్రదర్శించాడు.28 పరుగుల తేడాతో ఓడించిన హోప్హోప్కు వన్డేల్లో ఇది 18వ సెంచరీ. ఈ సెంచరీ అతడికి చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. సిరీస్ డిసైడర్లో చేసినది కావడం, అందులోనూ జట్టు విజయానికి దోహదపడటం ఈ సెంచరీకి ఉన్న ప్రత్యేకత. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్లో హోప్ ఒక్కడే (తన 120 పరుగుల స్కోర్తో) పాక్ను 28 పరుగుల తేడాతో ఓడించాడు.టాప్-3లోకి ఈ సెంచరీతో హోప్ మరో ఘనత కూడా సాధించాడు. విండీస్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డెస్మండ్ హేన్స్ను (17 సెంచరీలు) వెనక్కు నెట్టి టాప్-3లోకి (మూడో స్థానం) చేరాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (301 మ్యాచ్ల్లో 25 సెంచరీలు), బ్రియాన్ లారా (299 మ్యాచ్ల్లో 19 సెంచరీలు) టాప్-2గా ఉన్నారు. -
‘భారత్కు ఒక్క చుక్క నీటినీ ఇవ్వం’.. మళ్లీ పాక్ తాటాకు చప్పుళ్లు
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలోని ఒక్క చుక్క నీటిని కూడా భారత్కు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ శత్రు దేశం.. సింధునదిలోని ఒక్క చుక్కనీటిని లాక్కున్నా సహించేది లేదన్నారు.జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఏప్రిల్ 23న భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్యూటీ)నిలిపివేసింది. ఈ నేపధ్యంలో ఇదే నీటిపై ఆధారపడిన పాక్.. సింధు ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది. తాజాగా ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘మీరు మా నీటిని నిలిపివేస్తామని బెదిరిస్తే, పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి.అలాంటి చర్యకు ప్రయత్నిస్తే, మీకు మళ్లీ గుణపాఠం చెబుతామని, అప్పుడు మీరు మీ చెవులు పట్టుకోవాల్సి వస్తుందని’ హెచ్చరించారు. Shehbaz Sharif warns India of “serious consequences” if the Indus Water Treaty is touched… because in Pakistan’s worldview, water is off-limits but exporting militants is fair game.Four threats in 48 hrs from 4 men reading the same ISI script. Islamabad’s version of water… pic.twitter.com/DwXV9hbsPn— Mariam Solaimankhil (@Mariamistan) August 12, 2025షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు. కాగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల.. సింధు జలాల ఒప్పందం రద్దును సింధు నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ, ఈ విషయంలో భారత్.. పాకిస్తాన్ను యుద్ధ పరిస్థితుల్లోకి నెట్టివస్తే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసే ఏ ఆనకట్టనైనా ఇస్లామాబాద్ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు.భారత్ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని, తరువాత దానిని నాశనం చేస్తామని హెచ్చరించినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది. -
PAK Vs WI: హోప్ విధ్వంసకర శతకం.. 34 ఏళ్ల తర్వాత పాక్పై సిరీస్ గెలిచిన విండీస్
స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వెస్టిండీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 1991 (34 ఏళ్లు) తర్వాత విండీస్కు పాక్పై ఇదే తొలి సిరీస్ విజయం. నిన్న జరిగిన సిరీస్ డిసైడర్లో విండీస్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. తొలుత కెప్టెన్ షాయ్ హెప్ విధ్వంసకర శతకంతో.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జేడన్ సీల్స్ సంచలన బౌలింగ్తో సత్తా చాటారు. ఈ సిరీస్లోని తొలి వన్డేలో పాక్, రెండో వన్డేలో విండీస్ గెలిచాయి.RAW EMOTIONS BY WEST INDIES PLAYERS...!!! 🥺❤️- The wait of 34 years is over, West Indies has defeated Pakistan in a ODI series. pic.twitter.com/LTukEY5hTi— Johns. (@CricCrazyJohns) August 13, 2025భారతకాలమానం ప్రకారం నిన్న (ఆగస్ట్ 12) రాత్రి మొదలైన మూడో వన్డేలో విండీస్ పాక్ను 202 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. షాయ్ హోప్ విధ్వంసకర శతకంతో (94 బంతుల్లో 120 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) విండీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు.అతడికి రోస్టన్ ఛేజ్ (29 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జస్టిన్ గ్రీవ్స్ (24 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు తోడయ్యాయి. 32 ఓవర్ల వరకు విండీస్ ఇన్నింగ్స్ చాలా నిదానంగా సాగింది. ఆ దశలో వారి స్కోర్ 118/4గా ఉండింది. అయితే ఆతర్వాత హోప్ గేర్ మార్చడం.. ఛేజ్, గ్రీవ్స్ మెరుపులు మెరిపించడంతో విండీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. చివరి 18 ఓవర్లలో ఆ జట్టు ఏకంగా 176 పరుగులు పిండుకుంది.చివరి ఓవర్లలో విండీస్ బ్యాటర్ల వీరంగం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. నసీం షా, హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు.. సైమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ను జేడన్ సీల్స్ బెంబేలెత్తించాడు. సీల్స్ 7.2 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌటయ్యారు. 30 పరుగులు చేసిన సల్మాన్ అఘా టాప్ స్కోరర్ కాగా.. హసన్ నవాజ్ (13), మొహమ్మద్ నవాజ్ (23 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (9) ఈ మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. -
మునీర్ మూర్ఖత్వం!
ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పాలకులకూ, సైన్యానికీ ఆత్మాహుతి భాష నిండా ఒంటబట్టినట్టుంది. మున్ముందు భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగించి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పాకిస్తాన్ సైనిక చీఫ్ మునీర్ బెదిరించటాన్ని గమనిస్తే ఆ దేశంలో మూర్ఖత్వం ఎంతగా ముదిరిందో అర్థమవుతుంది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిన నాటినుంచీ సక్రమంగా మాట్లాడటం, సవ్యంగా మసులుకోవటం దానికి చేతకావటం లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు దాన్ని తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తూనే వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఎదురుతిరిగిన పాలకుల్ని సైనిక కుట్రలో కూలదోయటం, కీలుబొమ్మను ప్రతిష్ఠించటం దానికి అలవాటైన విద్య. అమెరికా సాగు, పాడి రంగ ఉత్పత్తుల్ని భారత్లో అనుమతించాలన్న డిమాండ్ను మన ప్రభుత్వం అంగీకరించనందుకు ఆగ్రహంతో రగిలిపోతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మన సరుకులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆసిఫ్ మునీర్ అధిక ప్రసంగం కూడా ఆయనగారి పథక రచనే కావొచ్చన్న సంశయాలు తలెత్తుతున్నాయి. మొన్న జూన్లో మునీర్ను పిలిపించుకుని అయిదు రోజులపాటు ఇంటల్లుడి మర్యాదలు చేసిన వైనం మరవకముందే మరోసారి ఆయన అక్కడికి వెళ్లి వాలాడంటే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకూడదు. తొలి పర్యటనలో ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మునీర్కు దేశాధినేతలకిచ్చే స్థాయి ఘనమైన విందునిచ్చి, ముడి చమురు సహా పాకిస్తాన్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించిన తీరు చూసి ప్రపంచం విస్మయపడింది. పాకిస్తాన్లో చచ్చో పుచ్చో... ఎన్నికైన ప్రభుత్వం అంటూ ఒకటుంది. అమెరికాతో సహా ఏ దేశంలోనైనా సైన్యం పని ప్రభుత్వాదేశాలు పాటించటం మాత్రమే. కానీ తోకే కుక్కను ఆడిస్తున్న చందంగా పాక్ పోకడ ఉంది. సైన్యం ఏం చేసినా అక్కడి పాలకులు కిక్కురుమనరు. అందువల్లే మునీర్ ట్రంప్తో సహకార ఒప్పందాలు కుదుర్చుకోగలిగాడు. ఈ విషయంలో ట్రంప్ను తప్పుబట్టాలి. తమ సైనిక దళాల చీఫ్ జనరల్ రాండీ ఏ. జార్జి ఏ దేశమైనా పోయి ఒప్పందాలు కుదుర్చుకొని వస్తే ఆయన శిరసావహిస్తారా? ఈసారి మునీర్ నాలుగు రోజులు అక్కడ తిష్ఠ వేశారు. నెల రోజుల్లోనే ఎందుకెళ్లాడో, ఆయన చేస్తున్న రాచకార్యమేమిటో తెలియదు. అటు అమెరికా ప్రభుత్వమూ బయటపెట్టదు. కానీ అమెరికాకు సంబంధించిన రాజకీయ నాయకులతోనూ, సైనిక నాయకత్వంతోనూ ఆయన భేటీలు జరిపాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ ఈ.కురిలా రిటైర్మెంట్ సభలో పాల్గొనడానికి అక్కడికెళ్లినట్టు మీడియా కథనం. పాకిస్తాన్ సంతతి ప్రజలతోనూ సమావేశమయ్యారు. మునీర్ బెదిరింపులుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నవన్నీ ఆ సమావేశంలో మాట్లాడినవేనని చెబుతున్నారు. అధికారికంగా అయితే మునీర్ లేదా పాకిస్తాన్ సైన్యం ఈ మాటల్ని ధ్రువీకరించటానికి సిద్ధపడటం లేదు. అణ్వస్త్ర దేశమని మిడిసిపడితే ఎవరు వూరకున్నా ఇరుగు పొరుగు దేశాలు మౌనంగా ఉండవు. మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పినట్టు ఈమాదిరి బాధ్యతా రాహిత్యాన్నీ, బ్లాక్మెయిలింగ్నూ మన దేశమైతే సహించదు. మునీర్ మాటల్ని భారత్ వక్రీకరిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనేమీ కోడ్ భాషలో మాట్లాడలేదు. ఆ ప్రసంగానికి సంబంధించిన కథనాన్ని బయటపెట్టింది కూడా అమెరికా మీడియానే. పైగా పాకిస్తాన్ ఏలికలు ఇలా మాట్లాడటం మొదటిసారేమీ కాదు. ఇక వక్రీకరణకు చోటెక్కడ?! ఏదో ఉన్మాదంలో నోరు జారివుంటే ఆ మాట చెప్పి తప్పయిందని ఒప్పుకోవాలి. విషయం బయటికొచ్చాక వణుకుడు దేనికి? ఉగ్రవాద మూకల్ని పంపి కల్లోలం సృష్టిస్తే, అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తే భారత్ హడలెత్తుతుందని పెహల్గాం అనంతర పరిణామాల తర్వాత కూడా పాకిస్తాన్ భ్రమల్లో ఉందంటే దాన్ని ఎవరూ రక్షించలేరు. అమెరికా సంపన్న రాజ్యమే కావొచ్చుగానీ మంచీ మర్యాదా పాటించటం నేర్చుకోవాలి. కొత్తగా వచ్చిన భుజకీర్తుల మత్తుతో అమెరికాలో వాలిన మరో దేశ సైనిక దళాల చీఫ్ మిత్రదేశంతోపాటు ప్రపంచాన్నే బెదిరిస్తున్న వైనం కనబడుతున్నా గుడ్లప్పగించి చూడటం సబబేనా? చీవాట్లు పెట్టి పంపాల్సిన బాధ్యత లేదా? ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఈ మాదిరి వైఖరే ప్రదర్శించి అమెరికా భారత్కు దూరమైంది. ఆర్థిక సంస్కరణల అనంతరం క్రమేపీ చక్కబడుతూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలు ఇలాంటి వింత చేష్టలతో ఛిద్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రంప్దే! మునీర్ లాంటివాళ్లు ఇష్టానుసారం చెలరేగటాన్ని నిలువరించకపోతే తమకూ నష్టమేనని ఆయన గ్రహించాలి. -
ఒక్క నీటి చుక్కా తీసుకోనివ్వం..!
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు చెందాల్సిన జలాల్లో భారత్ను ఒక్క నీటి చుక్క కూడా తీసుకోనివ్వబోమని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 22న కశ్మీర్లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్కు వ్యతిరేకంగా పలు చర్యలను ప్రకటించింది. ఇందులో 1960ల నాటి సింధూ జలాల ఒప్పందం(ఐడబ్ల్యూటీ)నుంచి వైదొలగడం కూడా ఉంది. తద్వారా సిందూ జలాలను దిగువకు విడుదల చేయకుండా ఆపేసింది. దీనిపై పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇది యుద్ధ నేరమే అవుతుందంటూ ప్రకటనలు కూడా చేసింది.ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ప్రధాని షరీఫ్..‘మా శత్రు దేశానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. మా నీళ్లను ఆపుతామంటూ మీరు బెదిరిస్తున్నారు కదా. పాకిస్తాన్కు చెందాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా మిమ్మల్ని తీసుకోనివ్వం. ఇది గుర్తుపెట్టుకోండి’అంటూ వ్యాఖ్యానించారు. పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా సోమవారం ఇలాంటి ప్రేలాపనలే చేయడం గమనార్హం. -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పై భారత విదేశాంగ శాఖ ఫైర్
-
Babar Azam: 71 ఇన్నింగ్స్లు, 712 రోజులు.. ఎలా భరిస్తున్నార్రా సామీ..!
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఆహా, ఓహో అని కీర్తించే వారి మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పని అయిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో అతను సెంచరీ చేసి ఏకంగా 712 రోజులు గడిచింది. ఈ మధ్యలో అతను 71 ఇన్నింగ్స్ల్లో ఒక్కసారి కూడా మూడంకెల మార్కును తాకలేదు. అడపాదడపా అర్ద సెంచరీలు చేసినా అవేవి అతని జట్టుకు అక్కరకు రాలేదు. అతను చివరిసారిగా 2023 ఆగస్ట్లో సెంచరీ చేశాడు. అది కూడా పసికూన నేపాల్పై. అప్పటి నుంచి రెండేళ్లు గడిచినా బాబార్ నుంచి ఒక్క సెంచరీ లేదు.తాజాగా బాబర్ వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో డకౌటై సొంత అభిమానులకే మరోసారి టార్గెట్ అయ్యాడు. ఎన్ని అవకాశాలు కావాలి రా బాబూ అంటూ అతని ఓన్ ఫ్యాన్స్ తలలు బాదుకుంటున్నారు. ఒక దశలో బాబర్ ఫ్యాన్స్ అతన్ని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో పోల్చేవారు. ఇంకా చెప్పాలంటే బాబర్ విరాట్ కంటే చాలా మెరుగైన ఆటగాడని డప్పు కొట్టుకునే వారు. ఇప్పుడిప్పుడే వారి తెలిసొస్తుంది బాబర్ ఎంత ఘనమైన ఆటగాడో అని.బాబర్ వయసు 30లు కూడా దాటకుండానే సుదీర్ఘకాలం ఫామ్ కోల్పోయి కెరీర్ను చరమాంకంలోకి తెచ్చుకున్నాడు. కొద్ది కాలంగా అతనికి పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో అవకాశాలు రావడం లేదు. టీ20 ఫార్మాట్లో అతని ఊసే లేదు. వన్డేల్లోనూ అడపాదడపా అవకాశాలే వస్తున్నాయి. టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నా ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పసికూనలు జింబాబ్వే, నేపాల్, ఐర్లాండ్ లాంటి జట్లపై మాత్రమే అతను ప్రతాపం చూపిస్తుంటాడు. అందుకే అతనికి జింబాబర్ అని పేరు కూడా ఉంది.ఇలాంటి జింబాబర్కు విరాట్ కోహ్లితో పోలిక ఏంటని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇంత చెత్తగా ఆడుతున్నా అతన్ని ఎలా భరిస్తున్నార్రా బాబూ అంటూ పాక్ అభిమానులపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న జట్లు కూడా వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లకు ఇన్ని అవకాశాలు ఇవ్వవని గుర్తు చేస్తున్నారు. బాబర్ ఇంకాస్త దిగజారక ముందే రిటైర్మెంట్ ప్రకటించడం మర్యాదగా ఉంటుందంటూ సలహా ఇస్తున్నారు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా విండీస్తో నిన్న జరిగిన రెండో వన్డేలో పాక్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ (31), హసన్ నవాజ్ (36 నాటౌట్) గుడ్డి కంటే మెల్ల మేలన్నట్లు ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బాబర్ ఆజమ్ 3 బంతులు ఆడి డకౌటయ్యాడు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (45), రోస్టన్ ఛేజ్ (49 నాటౌట్) విండీస్ను గెలిపించారు. ఈ గెలుపుతో విండీస్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. ఈ సిరీస్లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనుంది. -
నోరు పారేసుకున్న మునీర్
న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి రెచి్చపోయారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన భారత్పై నోరుపారేసుకున్నారు. భారత సైన్యం గనుక పాకిస్తాన్పై దాడి చేస్తే తాము నష్టపోవడం కాకుండా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. శనివారం ఫ్లోరిడాలోని టాంపా పట్టణంలో ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్ అంశాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్కు ‘తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే సిర’ లాంటిదని చెప్పారు. తమ దేశానికి రావాల్సిన నీటిపై హక్కులను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల హక్కులకు కాపాడుకుంటామన్నారు. ఇటీవల భారత్–పాక్ మధ్య ఘర్షణలో తాము పైచేయి సాధించమని వ్యాఖ్యానించారు. భారత్ మరోసారి దాడిచేస్తే తగిన సమాధానం చెప్తామన్న సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాదని, అది పూర్తిగా అంతర్జాతీయ ఎజెండా అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్కు కాశ్మీర్ అత్యంత కీలకమని మహ్మద్ అలీ జిన్నా చెప్పారని గుర్తుచేశారు. Pakistan Army Chief Asim Munir in Florida dinner:“We are a nuclear nation — if we go down, we’ll take half the world down with us.”On India’s Indus dam plan: “We’ll wait for them to build it, then destroy it with 10 missiles.”Loose threats, no shame. Remember Kargil — we…— Praffulgarg (@praffulgarg97) August 10, 2025సింధూ నది ఇండియా జాగీర్ కాదు తమ దేశానికి నీరు రాకుండా ఎగువన భారత్ గనుక డ్యామ్లు నిర్మిస్తే వాటిని కచ్చితంగా పేల్చేస్తామని అసిమ్ మునీర్ హెచ్చరించారు. డ్యామ్లు నిర్మించేదాకా వేచి చూస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యాక ధ్వంసం చేస్తామని అన్నారు. సింధూ నది ఇండియా జాగీర్ కాదని స్పష్టంచేశారు. అది సొంత ఆస్తిలాగా భావించొద్దని ఇండియాకు సూచించారు. నదులకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అడ్డుకొని శక్తి తమకు ఉందన్నారు. పాకిస్తాన్–అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని మునీర్ హర్షం వ్యక్తంచేశారు. నెలన్నర వ్యవధిలోనే తాను మరోసారి అమెరికాకు రావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని అపేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మునీర్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ⚡️🤯 Asim Munir Threatens Nuclear Armageddon: "We'll Take Half the World Down with Us" - ReportThe Pakistani military chief was speaking at a black-tie event in the US, saying if his country faces an existential threat in a future war with India, “we are a nuclear nation, if we… pic.twitter.com/P8E3n0yUHJ— Tarique Hussain (@Tarique18386095) August 11, 2025 -
బాబర్ ఆజమ్ డకౌట్.. పాక్ను చిత్తు చేసిన విండీస్
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హుస్సేన్ తలాత్ 31, హసన్ నవాజ్ 36 (నాటౌట్), సైమ్ అయూబ్ 23, అబ్దుల్లా షఫీక్ 26, మొహమ్మద్ రిజ్వాన్ 16, సల్మాన్ అఘా 9, మొహమ్మద్ నవాజ్ 5, షాహీన్ అఫ్రిది 11 (నాటౌట్) పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ డకౌటయ్యాడు.విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. జెదియా బ్లేడ్స్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్.. 33.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (45), రోస్టన్ ఛేజ్ (49 నాటౌట్), షాయ్ హోప్ (32), జస్టిన్ గ్రీవ్స్ (26 నాటౌట్) విండీస్ గెలుపులో తలో చేయి వేశారు. బ్రాండన్ కింగ్ (1), ఎవిన్ లూయిస్ (7), కీసీ కార్టీ (16) నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్ తలో 2 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి వన్డేలో పాక్ విజయం సాధించింది. ఈ సిరీస్లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనుంది. -
భారత విమానాలకు గగనతలం మూసేసి.. రూ.1,240 కోట్లు నష్టపోయిన పాక్
ఇస్లామాబాద్: భారత విమానాలకు గగనతలాన్ని మూసేసిన పాకిస్తాన్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (పీఏఏ) కేవలం రెండు నెలల్లో రూ. 1,240 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తరువాత, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, భారత్ విమానాలకు పాక్ గగనతలాన్ని మూసేయడం తెలిసిందే. ఇది ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశం ఆదాయంలో భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. దీనివల్ల రోజుకు 100 నుంచి 150 భారతీయ విమానాలు ప్రభావితం అయ్యాయన్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 30 మధ్య ఓవర్ఫ్లైయింగ్ ఛార్జీల నుంచి పీఏఏ ఆదాయం పడిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆంక్షల వల్ల పాకిస్తాన్ విమాన ట్రాఫిక్ దాదాపు 20 శాతం తగ్గిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. భారత విమానాలకు తన గగనతల మూసివేతను ఆగస్టు 24 వరకు పాక్ పొడిగించింది. -
అమెరికాలో ఆసిమ్ మునీర్ పర్యటన.. రెండు నెలల్లో రెండోసారి
వాషింగ్టన్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మునీర్ అమెరికా రాజకీయ, సైనిక నాయకులతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్లో ఆసిమ్ తొలిసారి పర్యటించగా.. ఇప్పుడు మరోసారి అమెరికాలో అడుగు పెట్టారు. మునీర్ తన పర్యటనలో భాగంగా అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కైన్తో సమావేశమయ్యారు. ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించారు. టాంపాలో అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మాజీ చీఫ్ జనరల్ మైకేల్ కురిల్లా రిటైర్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం అడ్మిరల్ బ్రాడ్ కూపర్ బాధ్యతలు స్వీకరించిన వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని మునీర్ కోరారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.జూన్ పర్యటనలో, మునీర్.. ట్రంప్తో ప్రైవేట్ లంచ్లో పాల్గొన్నారు. ఇది సాధారణంగా దేశాధినేతలకు మాత్రమే లభించే గౌరవం.ఈ వరుస పర్యటనలు అమెరికా–పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడుతున్నాయని’ విశ్లేషకులు భావిస్తున్నారు. మునీర్ పాకిస్తాన్ తరఫున సహకారాన్ని, భద్రతా అంశాలను చర్చించేందుకు ఈ పర్యటన చేస్తున్నట్లు సమాచారం. -
భారత్తో పెట్టుకుంటే ఇంతే.. పాకిస్తాన్కు చావు దెబ్బ!
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ కారణంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలు, నిర్ణయాలు వల్ల ఆ దేశానికే ఊహించని షాక్ తగిలింది ఈ కారణంగా కేవలం రెండు నెలల కాలంలో పాక్కు ఏకంగా రూ.1,240 కోట్ల నష్టం వాటిల్లినట్టు డాన్ పత్రిక ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ నివేదించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల్లో.. భారత్ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో భారత్పై కక్షగట్టిన పాక్.. తన గగనతలాన్ని మూసివేసింది. భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా పాక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంతో దాయాదికే భారీ నష్టం ఎదురైంది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాక్ తమ గగనతలాన్ని మూసివేయడంతో దాదాపు రూ.1240కోట్లు(భారత కరెన్సీ) నష్టం వాటిల్లిందని పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారతపై ఆంక్షల నేపథ్యంలో రోజుకు 100-150 విమానాలపై ప్రభావం పడిందని తెలిపింది.దీని కారణంగా విమానాల రాకపోకలు 20శాతం తగ్గిపోయాయని వెల్లడించింది. ఫలితంగా పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నందుకు భారత విమానాలపై విధించే ఛార్జీలపై వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించింది. మరోవైపు.. ఈ ఆంక్షలను ఆగస్టు 24 వరకు పొడిగించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పాక్ విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది.Pakistan's ministry of Defence informed National Assembly on Friday that Pakistan lost Rs 4.1 billion in 2 months due to closure of airspace for Indian aircraftIn 2019, a similar closure led to an estimated Rs7.6 billion ($54 million) revenue loss to Pakistan#OperationSindoor pic.twitter.com/BdLlZVmPB2— Anmol (@anmol_kaundilya) August 9, 2025పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై దేశమంతా ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులోభాగంగా సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతోపాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచివెళ్లాలని ఆదేశించింది. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి.. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. -
‘ఆపరేషన్ సిందూర్తో చెక్మేట్.. భారత్ సత్తా పాక్ ప్రజలకు తెలుసు’
మద్రాస్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. భారత సైనిక చర్య పాత్రను ఆపరేషన్ సిందూర్ నొక్కిచెబుతుందన్నారు. ఆపరేషన్ సిందూర్లో తాము చెస్లో పావుల మాదిరిగా శత్రువుల కదిలికలు తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు.ఐఐటీ మద్రాస్లోని అగ్నిశోధ్-ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ (IARC)ను ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ఆపరేషన్ సిందూర్ అంశంపై జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడారు.‘ఆపరేషన్ సిందూర్లో మేం చెస్ గేమ్ ఆడాం. శత్రువు తదుపరి కదలికలు ఎలా ఉండబోతున్నాయో.. మేం ఏం చేయబోతున్నామో మాకు తెలియదు. దీనిని గ్రే జోన్ అంటారు. గ్రే జోన్ అంటే మనం సంప్రదాయ కార్యకలాపాలకు వెళ్లడం లేదు. మనం చెస్ గేమ్లో పావుల్లా ముందుకు సాగాం. శత్రువు అంచనా వేయలేని విధంగా దాడులు చేశాం. పాకిస్తాన్, పీఓకేలో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి అని చెప్పుకొచ్చారు. 'If you ask a Pakistani, you lost or won...our chief has bcm field Marshal..we must have won, that is why he became the field Marshal', Army Chief General Upendra Dwivedi on Pakistan's narrative strategy for own domestic population after Indian strikes pic.twitter.com/VX5MD12p7u— Sidhant Sibal (@sidhant) August 9, 2025ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 23వ తేదీన మరుసటి రోజే మేమందరం సమావేశం అయ్యాం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలు చాలు అని చెప్పడం ఇదే మొదటిసారి. ముగ్గురు చీఫ్లు ఏదో ఒకటి చేయాలని చాలా స్పష్టంగా ఉన్నారు. ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అనే స్వేచ్ఛ ఇచ్చారు. అదే మా మనోధైర్యాన్ని పెంచింది అని చెప్పారు. 25వ తేదీన నార్తర్న్ కమాండ్ను సందర్శించాం. అక్కడ మేం తొమ్మిది లక్ష్యాలను నాశనం చేశాం. 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఏప్రిల్ 29న మేం మొదటిసారి ప్రధానమంత్రిని కలిశాము. ఆపరేషన్ సిందూర్ అనే చిన్న పేరు మొత్తం దేశాన్ని ఉత్తేజపరిచింది’ అని తెలిపారు. ఇదే సమయంలో పాకిస్తాన్పై భారత్ గెలిచిందా లేక ఓడిందా అనే విషయం పాకిస్తానీలను అడిగితే బాగా చెబుతారు అని చెప్పుకొచ్చారు. -
ఐదు పాక్ యుద్ధ విమానాలు కూల్చేశాం
బెంగళూరు: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్ వైమానిక దళాన్ని భారీగా దెబ్బకొట్టామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఆ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన ఐదు యుద్ధ విమానాలు, మరో భారీ విమానాన్ని కూల్చివేశామని ప్రకటించారు. మన సైన్యం ఇప్పటిదాకా ఉపరితలం నుంచి ఉపరితలానికి చేసిన నమోదిత దాడుల్లో ఇది అతిపెద్ద దాడి అని పేర్కొన్నారు. శనివారం బెంగళూరులో 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్.ఎం.కాట్రే స్మారక ప్రసంగంలో అమర్ప్రీత్ సింగ్ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్పై వివరాలు పంచుకున్నారు. ఆ ఆపరేషన్లో పాకిస్తాన్పై జరిగిన నష్టంపై భారత సైనికాధికారి బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. తొమ్మిది పాక్ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అమర్ప్రీత్ సింగ్ ప్రదర్శించారు. దాడికి ముందు, దాడి తర్వాత దృశ్యాలు ఇందులో ఉన్నాయి. పాకిస్తాన్ చెబుతున్నట్లుగా సాధారణ జనావాసాలపై, పౌరులపై దాడి చేయలేదని స్పష్టంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘‘పటిష్టమైన ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించాం. దాదాపు 90 గంటల వ్యవధిలోనే అనుకున్న లక్ష్యం సాధించి, ప్రత్యర్థి దేశాన్ని భారీగా నష్టపరిచాం. పాకిస్తాన్కు చెందిన రెండు వైమానిక స్థావరాలు సైతం ధ్వంసం చేశాం. భారత ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థలు సమర్థవంతంగా పని చేశాయి. పాక్ సైన్యం ప్రయోగించిన మానవ రహిత వైమానిక వాహనాలు(యూఏవీ), డ్రోన్లను కూల్చివేశాం. వాటిలో చాలావరకు మన భూభాగంలో పడి పోయాయి. కొన్ని క్షిపణులను సైతం తుత్తునియలు చేసి మన సత్తా చాటాం. కాళ్లబేరానికి వచ్చిన పాక్ ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్ సైనిక స్థావరాలపై దృష్టి పెట్టి, క్షిపణులతో దాడికి దిగాం. జకోబాబాద్ ఎయిర్బేస్లో కనీసం ఒక ఏడబ్ల్యూసీ విమానంతోపాటు ఎఫ్–16 యుద్ధ విమానాలను పార్క్ చేసిన హ్యాంగర్ సగం వరకు నామరూపాల్లేకుండా పోయింది. అమెరికా ఇచ్చిన ఎఫ్–16లు చాలావరకు దెబ్బతిన్నాయి. రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయి. సర్గోధా ఎయిర్బేస్ను సైతం నేలమట్టం చేశాం. పదవీ విరమణ కంటే ముందే ఈ ఎయిర్బేస్పై దాడి చేసే అవకాశం రావడం సంతోషకరం. సుకుర్ ఎయిర్బేస్లో యూఏబీ హ్యాంగర్తోపాటు రాడార్ సైట్పై దాడి చేశాం. మరింత నష్టం జరిగే ప్రమాదం కనిపించడంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. దాడులు ఆపాలంటూ ఫోన్చేసి అభ్యరి్థంచింది. కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. మన దాడిలో దెబ్బతిన్న పాక్ ఎయిర్బేస్లు ఎప్పటికీ వినియోగంలోకి రావు. వాటికి మరమ్మతు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యాలో తయారైన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు ఎంతగానో తోడ్పడింది. ఇదొక గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది పాక్ ముష్కరులపై ఆపరేషన్ విషయంలో సైన్యంపై రాజకీయపరమైన ఒత్తిళ్లేవీ రాలేదు. దాడులకు ప్రణాళిక రచించి, అమలు చేయడానికి మాకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఆపరేషన్ సిందూర్ విజయానికి మన ప్రభుత్వ పట్టుదల కూడా కారణమే. మాకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఒత్తిళ్లు లేవు, ఆంక్షలు విధించలేదు. మేము ఏవైనా నియంత్రణలు పాటించి ఉంటే అవి సొంతంగా పాటించినవే. పాక్ ఉగ్రవాదులను భారీగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే పనిచేశాం. మన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పాం. ‘ఇంకా చావగొట్టాలి’ అన్నారు పాకిస్తాన్పై ఆపరేషన్ను త్వరగా ముగించడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. వాస్తవం ఏమిటో చెప్పుకోవాలి. మా ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉగ్రవాదులకు మర్చిపోలేని గుణపాఠం చెప్పాలన్నదే మా లక్ష్యం. భారత్పై మళ్లీ దాడికి దిగితే ఏం జరుగుతుందో వారికి తెలిసిరావాలి. ఆపరేషన్ సిందూర్తో ఆ లక్ష్యం నెరవేరింది. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఎంత మూల్యం చెల్లించాలో ముష్కరులకు అర్థమైంది. లక్ష్యం నెరవేరింది కాబట్టి దాడులు ఆపేశాం. ఆపరేషన్ ముగించిన రోజు చాలామంది మాట్లాడారు. నాకు సన్నిహితులైనవారు మాట్లాడుతూ.. ‘ఇంకా చావగొట్టాలి’ అన్నారు. అనుకున్నది సాధించిన తర్వాత కూడా దాడులు కొనసాగించడంలో అర్థం లేదు. ‘బాలాకోట్’పై ఒప్పించలేకపోయాం పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ధ్యేయంతో బాలాకోట్లో భీకర దాడులు చేశాం. వైమానిక దాడులతో పాక్ సైనిక శిబిరాలను నేలమట్టం చేశాం. బాలాకోట్ దాడికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు అందుబాటులో లేవు. అవి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. విమర్శలకు తావిచ్చింది. మేము ఏం సాధించామో ప్రజలకు చెప్పలేకపోవడం నిజంగా దురదృష్టకరం. బాలాకోట్ దాడులతో పాకిస్తాన్కు పెద్ద నష్టం జరిగినట్లు నిఘా సమాచారం ఉంది. ఈ దాడుల్లో ఎంతోమంది ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ, ఆ విషయంలో ప్రజలను నమ్మించలేకపోయాం. కానీ, ఆపరేషన్ సిందూర్ విషయంలో మేము అదృష్టవంతులమే. ఎందుకంటే వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఈ ఆపరేషన్లో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ది అత్యంత కీలక పాత్ర. సైనిక దళాలను, ఇతర సంస్థలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. ఏ యుద్ధంలోనైనా తొలుత గగనతల దాడులే ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ ద్వారా మరోసారి తేటతెల్లమైంది’’ అని అమర్ప్రీత్ సింగ్ వివరించారు. -
భారత్-పాక్ సీజ్ఫైర్.. ‘ట్రంప్ నేరుగా జోక్యం చేసుకున్నారు’
తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరైన సమయంలో కలుగజేసుకున్నారని.. లేకుంటే భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండేదని అమెరికా మరోసారి ప్రకటించుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ట్రంప్ నేరుగా జోక్యం చేసుకున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో తాజాగా ప్రకటించారు.‘‘ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారు. అందుకే శాంతి అధ్యక్షుడిగా ఆయనకు గుర్తింపు దక్కింది. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది ఆయనే. ఆ సమయంలో ఆయనే నేరుగా జోక్యం చేసుకున్నారు. తద్వారా ఇరు దేశాల ఉద్రిక్తతలను చల్లార్చారు. లేకుంటే ఆ దక్షిణాసియా దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉండేదేమో.. ఇది వాస్తవం’’ అని రుబియో గురువారం ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరికొన్ని దేశాల సంక్షోభాలకు ట్రంప్ తెర దించారని.. అది అమెరికన్లు ఎంతో గర్వించదగ్గ విషయమని రుబియో అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై అమెరికా దృష్టిసారించిందని అన్నారాయన. భారత్ ఖండనపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్. అయితే ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపై ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఇరు దేశాల యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ఇప్పటికి పదుల సంఖ్యలో ప్రకటించుకున్నారు. అయితే భారత్ మాత్రం ఆ దౌత్య ప్రకటనను తోసిపుచ్చుతూ వస్తోంది.ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు జరిగాయని.. పాక్ కోరినందునే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని, ఇందులో అమెరికా సహా మరేయితర దేశపు జోక్యంగానీ.. ఒత్తిడిగానీ చేసుకోలేదని భారత ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే ట్రంప్ జోక్యంపై విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. ఈ తరుణంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్లు ‘‘ఎవరీ జోక్యం లేదు’’ అని పార్లమెంట్లోనూ స్పష్టమైన ప్రకటనలు చేశారు. అయినప్పటికీ అమెరికా మాత్రం ట్రంప్కు క్రెడిట్ ఇచ్చుకోవడం మానడం లేదు. -
పాక్తో వన్డే సిరీస్కు ముందు వెస్టిండీస్ జట్టుకు బిగ్ షాక్
స్వదేశంలో పాకిస్తాన్తో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 8) ప్రారంభం కాబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ మాథ్యూ ఫోర్డ్ నిన్న ట్రైనింగ్ సెషన్ సందర్భంగా గాయపడ్డాడు. అతని భుజం రీలొకేట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో అతను సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.ఫోర్డ్కు ప్రత్యామ్నాయంగా విండీస్ క్రికెట్ బోర్డు 21 ఏళ్ల బౌలింగ్ ఆల్రౌండర్ జోహన్ లేన్కు పిలుపునిచ్చింది. లేన్ ఇటీవల వెస్టిండీస్-ఏ జట్టు తరఫున విశేషంగా రాణించాడు. లేన్ తన స్వల్ప దేశవాలీ కెరీర్లో 12 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడి 13 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో 17.71 సగటున 124 పరుగులు చేశాడు. లేన్ ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.వెస్టిండీస్కు 2027 వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించాలంటే పాక్తో ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్లో గెలిస్తే ఆ జట్టు వరల్డ్కప్ డైరెక్ట్ క్వాలిఫికేషన్ అవకాశాలు మెరుగవుతాయి. ఈ సిరీస్కు ముందు విండీస్ పాక్కు టీ20 సిరీస్ కోల్పోయింది. 3 మ్యాచ్ల ఈ సిరీస్ను పాక్ 2-1 తేడాతో గెలుచుకుంది.పాక్తో తొలి వన్డే భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో వన్డే ఆగస్ట్ 10, మూడో వన్డే ఆగస్ట్ 12న జరుగనున్నాయి. మూడు వన్డేలు ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగనున్నాయి.పాక్తో వన్డే సిరీస్కు అప్డేట్ చేసిన వెస్టిండీస్ జట్టు:షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్, జోహన్ లేన్ -
ఇంగ్లండ్లో పాక్ క్రికెటర్ అరెస్ట్
పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీపై ఇంగ్లండ్లో అత్యాచార ఆరోపణల కేసు నమోదైంది. ఈ కేసులో అతన్ని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతను బెయిల్పై విడుదల అయ్యాడు. ఈ కేసు విషయం తెలిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) హైదర్ అలీని సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది.ఓ యువతి ఫిర్యాదు మేరకు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు హైదర్ అలీని ఈ నెల 3వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను పాకిస్తాన్-ఏ (షాహీన్స్) తరఫున బెకెన్హెయిమ్లో ఇంగ్లండ్-ఏ జట్టుతో వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. గత ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగిందని పీసీబీ ప్రకటించింది.పోలీసుల ప్రాథమిక విచారణ సందర్భంగా హైదర్ అలీ కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తాను నిర్దోషినంటూ వాదించినట్లు సమాచారం. 24 ఏళ్ల హైదర్ అలీ పాక్ జాతీయ జట్టు తరఫున ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అతను పాక్ తరఫున 35 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 547 పరుగులు చేశాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన హైదర్ అలీ 2020లో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు.కాగా, పాక్ క్రికెటర్లకు ఇంగ్లండ్లో వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్ లైంగిక వేధింపులు సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. హైదర్ అలీ విషయంలో పాక్ క్రికెట్ పైకి హుందాగా ఉన్నట్లు నటిస్తున్నప్పటికీ, లోలోపల తమ దేశ క్రికెటర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హైదర్కు కావాల్సిన లీగల్ సపోర్ట్కు పీసీబీనే సమకూర్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే, పాక్ క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో పాక్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇవాళ (ఆగస్ట్ 8) ఆ జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్ ఆడనుంది. -
పాకిస్తాన్కు షాకిచ్చిన ఐర్లాండ్
మహిళల క్రికెట్లో ఐర్లాండ్ జట్టు తమకంటే మెరుగైన పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఐర్లాండ్ పాక్ను 11 పరుగుల తేడాతో ఓడించింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. పాక్ పేసర్ (కెప్టెన్) ఫాతిమా సనా 4 వికెట్లు తీసి ఐర్లాండ్ పతనాన్ని శాశించింది. సదియా ఇక్బాల్, డయానా బేగ్, రమీన్ షమీమ్, నష్రా సంధు తలో వికెట్ తీశారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ యామీ హంటర్ (37) టాప్ స్కోరర్గా నిలువగా.. ఓర్లా ప్రెండర్గాస్ట్ (29), లయా పాల్ (28) నామమాత్రపు స్కోర్లు చేశారు. కెప్టెన్ గాబీ లెవిస్ (1) నిరాశపరిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 131 పరుగులకే చాపచుట్టేసింది. పాక్ ఇన్నింగ్స్లో టాపార్డర్ అంతా విఫలం కాగా.. లోయర్ ఆర్డర్ ప్లేయర్లు నతాలియా పర్వేజ్ (29), ఫాతిమా సనా (14), రమీన్ షమీమ్ (27) తమ జట్టును గెలిపించేందుకు పోరాడారు. ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్గాస్ట్ 3, జేన్ మగూర్ 2, ఆవా కాన్నింగ్, కారా ముర్రే, లారా మెక్బ్రైడ్ తలో వికెట్ తీశారు. వీరిలో కాన్నింగ్ అత్యంత పొదుపుగా (4-1-9-1) బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేసింది. ఈ సిరీస్లోని రెండో టీ20 బెల్ఫాస్ట్ వేదికగా ఆగస్ట్ 8న జరుగనుంది. 3 మ్యాచ్ల ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ ఐర్లాండ్లో పర్యటిస్తుంది. -
పాక్ ప్రమిదకు ట్రంప్ చమురు
పాకిస్తాన్–అమెరికాలు జూలై 31న ఒక నూతన వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తాన్లోని చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా కృషి చేయడంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇంధనం, ఖనిజాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, క్రిప్టో కరెన్సీలలో కూడా విస్తృత సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలని రెండు దేశాలూ కోరుకున్నాయి. ఇది పాకిస్తాన్లోని మౌలిక సదుపాయాలపై అమెరికా పెట్టుబడులను పెంపొందించేందుకు తోడ్పడవచ్చు. ద్వైపాక్షిక మార్కెట్ సౌలభ్య విస్తరణకు సాయపడవచ్చు. ‘మేం ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహించగల ఆయిల్ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ చమురు సంపద మొదట్లో ఆ దేశ సెంట్రల్ పంజాబ్ లోని టూట్ చమురు క్షేత్రానికే పరిమితమైంది. ఆ ప్రాంతం పోటో హార్గా సుపరిచితం. అది ఇస్లామాబాద్కు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొదటి చమురు బావిని 1964లో తవ్వారు. వాణి జ్యపరమైన ఉత్పాదన 1967లో మొదలైంది. సుమారు 6 కోట్ల పీపాల చమురు ఉందని భావించారు. దాని నుంచి 12–15 శాతం భాగం మాత్రమే తవ్వితీయగలమని నిర్ణయించారు. ఉత్పాదన 1986లో శిఖర స్థాయికి చేరి, రోజుకు సుమారు 2,400 పీపాల చమురు వెలికి తీశారు. పెట్రో దిగ్గజం యూనియన్ టెక్సాస్కు చెందిన పాకిస్తానీ అనుబంధ సంస్థ... సింథ్ దిగువన ఒక చమురు క్షేత్రాన్ని 1981లో కనుగొంది. సింథ్ చమురు క్షేత్రాలు 1998–1999 నాటికి టూట్ చమురు క్షేత్రం కంటే ఎక్కువ చమురును అందించాయి. టూట్ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ జాతీయ చమురు కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్ మెంట్ కంపెనీ (ఓజీడీసీ) లిమిటెడ్తో వాంకూవర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ సావరిన్ ఎనర్జీ కార్పొరేషన్ 2005లో ఒక అవగా హనా పత్రంపై సంతకాలు చేసింది. షుంబర్గర్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ 2006లో అక్కడ మొదట కార్యకలాపాలు ప్రారంభించింది. టూట్ చమురు క్షేత్రంలోను, దాని పొరుగునున్న మిస్సా కేశ్వాల్ చమురు క్షేత్రంలోను పనిచేసేందుకు రెండు కెనడియన్ కంపెనీలు రంగంలోకి దిగాయి. వీటి స్థానాన్ని ఇపుడొక అమెరికన్ కంపెనీ భర్తీ చేయవచ్చు. పాక్లో ఐదు చోట్ల –చెంగియూ పీకే లిమిటెడ్ (బెలూచిస్తాన్ లోని హబ్ ), పాక్–అరబ్ రిఫైనరీ కంపెనీ లిమిటెడ్ (గుజరాత్లోని కస్బా), పాకిస్తాన్ రిఫైనరీ లిమిటెడ్ (కరాచి), అటాక్ రిఫైనరీ లిమి టెడ్, నేషనల్ రిఫైనరీ లిమిటెడ్ (కామ్చి)–చమురు శుద్ధి కర్మాగారా లున్నాయి. వాటన్నింటి చమురు శుద్ధి సామర్థ్యం రోజుకు 4,20,000 పీపాల వరకు ఉంటుంది. గ్వాదర్లో మరో ఆయిల్ రిఫైనరీ నెల కొల్పే ఆలోచనలో ఉన్నట్లు సౌదీ ఆర్మకో 2019లో ప్రకటించింది. అమెరికా–పాకిస్తాన్ల మధ్య వాణిజ్యం 2024లో 7.3 బిలియన్ల డాలర్ల మేరకు ఉంది. అమెరికా వస్తువుల వాణిజ్య లోటు 300 కోట్ల డాలర్ల మేరకు ఉంటుంది. పాకిస్తాన్ నుంచి అమెరికా లినెన్ ఉత్ప త్తులు, లెదర్ వస్తువులు, కలపతో చేసిన ఫర్నిచర్ వస్తువులను దిగు మతి చేసుకొంటూ, పాకిస్తాన్కు ముడి పత్తి, విమానాల భాగాలు, ఇతర యంత్ర సామగ్రి పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఈ అసమతౌల్య సమస్యను పరిష్కరించేందుకు అమెరికా నుంచి వస్తువుల దిగుమతులను పెంచుకుంటామని పాక్ పేర్కొంది. పాకిస్తాన్లోని ఖనిజ నిక్షేపాల పట్ల అమెరికాకు కొత్తగా ఆసక్తి పుట్టుకురావడం వెనుక వేరే లావాదేవీలు ఉన్నాయని వాషింగ్టన్ లోని విల్సన్ సెంటర్లో సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైకేల్ కుగెల్ మ్యాన్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ట్రంప్ బంధువులకి వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ సంస్థలో షేర్లు ఉన్నాయి. ఆ సంస్థ పాక్లో 2025 మార్చిలో ఏర్పడిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఆ వెంటనే ఏప్రిల్లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. పాక్లో కొత్తగా మంత్రిగా నియమితుడైన బిలాల్ బిన్ సాకిబ్ ఆ కౌన్సిల్కి నేతృత్వం వహిస్తున్నారు. సాకిబ్ ఇటీవల బిట్ కాయిన్ల రంగంలోకి ప్రవేశించారు. లాస్ వేగాస్లో మే నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాకిబ్, క్రిప్టోను కాపాడిన అధ్యక్షుడిగా తాను ట్రంప్ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తర్వాత, వైట్ హౌస్లో అమెరికా అధికారులతో సాకిబ్ మంతనాలు జరిపారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్కి వైట్ హోస్లో ట్రంప్ విందు ఏర్పాటు చేయడానికి ఆ సమావేశమే మార్గం సుగమం చేసిందని చెబుతారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకుని నాలుగేళ్ళు గడుస్తున్నా, అమెరికా–పాక్ సంబంధాలలో ఇప్పటికీ చాలా అనిశ్చితి ఉంది. పాకిస్తాన్కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమా నాల నిర్వహణ, మరమ్మతు పరికరాలకు సంబంధించి ఈ ఏడాది మొదట్లో అమెరికా సైన్యం సమకూర్చిన సాయం 397 మిలియన్ల డాలర్ల మేరకు ఉంది. చైనా ఆయుధాలపై మితిమీరి లేదా దాదాపు పూర్తిగా ఆధారపడుతున్న స్థితి నుంచి పాక్ రక్షణ వ్యవస్థను తప్పించాలని అమెరికా కోరుకుంటూ ఉండవచ్చుకానీ, మునుపు పాక్తో భారీ స్థాయిలో ఉన్న ఆయుధాల సంబంధాలను పునరు ద్ధరించుకోవడంపై అమెరికా వైపు ఏకాభిప్రాయం లేదు.ఈ నేపథ్యంలో, భారత్–పాక్ల మధ్య శాంతికి ప్రయత్నించినట్లు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నా, భారత్తో కలసి అడుగులు వేయడంపై అమెరికా తాత్సారం చూపడం సహజ పరిణామంగానే తోస్తుంది. రాణా బెనర్జీ వ్యాసకర్త క్యాబినెట్ సెక్రటేరియట్లో మాజీ ప్రత్యేక కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
భారత్, పాక్ శత్రుత్వం.. కశ్మీర్ ప్రధాన కారణం: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: జమ్ము కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370 రద్దు విషయమై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీర్ ప్రధాన కారణం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును షరీఫ్ తప్పుబడుతూ కేంద్రం నిర్ణయంపై మండిపడ్డారు.పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీరే ప్రధాన కారణం. భారత ప్రభుత్వం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం సరైన నిర్ణయం కాదు. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కశ్మీరీ ప్రజల సంకల్పం, ఆకాంక్షలు మాత్రమే ముందుకు సాగడానికి ఏకైక మార్గం. కశ్మీరీల స్వేచ్చను భారత ప్రభుత్వం హరించింది. కశ్మీర్ ప్రజలను మోదీ ప్రభుత్వం అణిచివేసింది. కశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం పాకిస్తాన్ విదేశాంగ విధానంలో కీలకమైంది. ఆర్టికల్ 370 రద్దు వంటి ఏకపక్ష చర్యలను తిప్పికొట్టడంలో అంతర్జాతీయ సమాజం పాత్ర పోషించాలి’ అని కామెంట్స్ చేశారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంగా భారతదేశం చర్యకు నిరసనగా పాకిస్తాన్ ఈ రోజును యూమ్-ఇ-ఇస్తేసల్గా పాటిస్తోందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. Prime Minister Shehbaz Sharif reaffirmed that lasting peace in the region is impossible without resolving the Kashmir issue. He stated that India cannot strip Kashmiris of their right to freedom, the era of oppression will end, and justice will prevail. pic.twitter.com/WjXezNPmgl— Fizza Butt (@fizzaabutt12) August 5, 2025మరోవైపు.. పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఎల్లప్పుడు తమ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుంది. పొరుగు దేశాలతో ఘర్షణల కంటే సంభాషణ, దౌత్యాన్ని ఎంచుకుంటుంది. పాకిస్తాన్ ప్రజలు, సాయుధ దళాలు ఏదైనా దురాక్రమణ చర్యకు ధృఢమైన ప్రతిస్పందన అందించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. కశ్మీర్ విషయంలో పాక్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేసి మంగళవారానికి ఆరేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ సహా మరికొన్ని పార్టీలు మంగళవారం బ్లాక్ డేగా పాటించాయి. అలాగే మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పిలుపు మేరకు మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 15 నిమిషాల పాటు కశ్మీర్ వ్యాప్తంగా లైట్లను బంద్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యాంగ విలువలపై దాడిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ మంగళవారం స్థానికంగా నిరసన చేపట్టింది. ఇదిలా ఉండగా జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను ఎప్పుడిస్తారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక, ఆగస్టు 5వ తేదీన జమ్ము కశ్మీర్లో శాంతి, వికాసం, సమాన హక్కులకు బాటలు వేసిన గొప్ప రోజని బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ థోకర్ తెలిపారు. దీన్ని ఇతర రాజకీయ పార్టీలు బ్లాక్డేగా పాటించడం సరికాదని హితవు పలికారు. -
మోదీజీకి స్పెషల్ రాఖీ.. పాక్ ముస్లిం సోదరి రాఖీ ఇదే..
ఢిల్లీ: అన్నా చెళ్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు చిహ్నంగా దేశవ్యాప్తంగా రక్షబంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా రాఖీ పండుగ కోసం ప్రజలు సిద్దమవుతున్నారు. కాగా, రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఏడాది కూడా రాఖీ కట్టేందుకు ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్ ప్రత్యేక రాఖీని తయారు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఆనందం వ్యక్తం చేశారు.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లోని కరాచీలో 1981లో జన్మించిన ఖమర్ షేక్.. గుజరాత్కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంతో భారత్లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత 30 సంవత్సరాలుగా తాను మోదీజీకి రాఖీ కడుతున్నట్టు తెలిపారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా రాఖీ పంపిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సంవత్సరం ఆమె తన చేతులతో ఓం, గణేష్ జీ డిజైన్లతో నాలుగు రాఖీలను తయారు చేసింది. రాఖీ కట్టేందుకు ఆమె పీఎంఓ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.VIDEO | As Rakshabandhan approaches, Qamar Mohsin Sheikh, a Pakistani-origin woman living in Ahmedabad, is once again preparing to tie a handmade rakhi to Prime Minister Narendra Modi, continuing a unique tradition that has lasted around 30 years.Every year, Sheikh crafts… pic.twitter.com/SMWi5iPyc6— Press Trust of India (@PTI_News) August 6, 2025ఈ సందర్బంగా ఖమర్ మొహ్సిన్ షేక్ మాట్లాడుతూ..‘ప్రతి సంవత్సరం తాను స్వయంగా రాఖీలు తయారు చేస్తానని, తనకు అత్యంత ఇష్టమైన రాఖీని ప్రధాని మోదీ చేతికి కడతానని చెప్పారు. మోదీ సంఘ్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునని ఆమె చెప్పింది. ఒకసారి ప్రధాని మోదీ తన క్షేమం గురించి అడిగి, ‘సోదరి ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. అప్పటి నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో మోదీజీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తాను ప్రార్థించినట్టు షేక్ చెప్పారు. అప్పుడు ఆయన నవ్వినట్టు తెలిపింది. అయితే, గత సంవత్సరం తాను ఢిల్లీకి వెళ్లలేకపోయానని, కానీ ఈ సంవత్సరం తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వస్తుందని, రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తన భర్తతో కలిసి మోదీని కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు -
ఉక్రెయిన్పై దాడి.. రష్యాకు మద్దతుగా పాక్, చైనా సైనికులు: జెలెన్స్కీ
కీవ్: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా తరఫున చైనా, పాకిస్తాన్ దళాలు పాల్గొంటున్నాయని వ్యాఖ్యానించారు. వీరందరిపై తమ సైన్యం పోరాటం చేస్తోందని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్బంగా జెలెన్స్కీ.. ఉక్రెయిన్పై యుద్ధంతో రష్యాకు పలు దేశాలు సహకరిస్తున్నాయి. ఆయా దేశాల నుంచి సైనికులు వస్తున్నారు. చైనా, తజికిస్థాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్తో సహా ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు మా దేశ దళాలు గుర్తించాయి. ఇందుకు ఉక్రెయిన్ సైన్యం నుంచి ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఇదే సమయంలో యుద్ధంలో పాల్గొని దేశానికి సేవ చేస్తున్న దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.అలాగే, వోవ్చాన్స్క్ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఫ్రంట్లైన్లోని కమాండర్ల గురించి, ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు. డ్రోన్ సరఫరాలు పెంచడం, దళాల నియామకం, బ్రిగేడ్లకు ప్రత్యక్ష నిధులపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.Today, I was with those defending our country in the Vovchansk direction – the warriors of the 17th Separate Motorized Infantry Battalion of the 57th Brigade named after Kish Otaman Kost Hordiienko.We spoke with commanders about the frontline situation, the defense of… pic.twitter.com/40XsGHZU0T— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2025మరోవైపు.. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలను పాక్ ఖండించింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పాక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జెలెన్స్కీ ఆరోపణలపై తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో వీటిపై తగిన ఆధారాలు చూపించేందుకు ఉక్రెయిన్ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపింది. ఇక, ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా తరఫున చైనా పౌరులు పాల్గొంటున్నారని గతంలో జెలెన్స్కీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, వీటిని బీజింగ్ అప్పుడే ఖండించింది. మరోవైపు.. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఉత్తరకొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. రష్యాకు ఆయుధాలను, సైనికులను పంపిస్తోంది. -
భారత్ హెచ్చరించినా పట్టించుకోని పాక్.. పీఓకేలో దాయాది దుశ్చర్య!
న్యూఢిల్లీ: ఓవైపు భారత దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తోంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంలో ప్రధాన ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ చురుకుగా సహాయం చేస్తోంది. గత 90 రోజుల్లోనే, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అంతటా 15కి పైగా ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ప్యాడ్లు ఏర్పాటయ్యాయి.పాకిస్తాన్ ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఇతర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఈ శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవి భారత దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపడమే కాకుండా, ఇప్పుడు వారి నెట్వర్క్లను పునరుద్ధరించేందుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. కెల్, షార్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా వ్యాలీ, తండపాణి, నయ్యాలి, జాంకోట్, చకోఠి వంటి కీలక ప్రదేశాలలో శిబిరాలను పునర్నిర్మిస్తున్నారు. అదనంగా, జమ్మూ ప్రాంతంలోని మస్రూర్, చాప్రార్ వెంట అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నాలుగు లాంచ్ప్యాడ్లు, షకర్గఢ్లోని డ్రోన్ సెంటర్ కూడా పునరుద్ధరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. చిన్న శిబిరాల ఏర్పాటు.. భారత దళాల దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఉగ్రవాదులు ఇప్పుడు నిఘా నుంచి తప్పించుకోవడానికి, ఉగ్రవాద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కొత్త పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత్ ప్రకటిస్తుండటంతో భద్రతా బలగాల నుంచి మరిన్ని దాడులు జరుగుతాయని ఉగ్రవాదులు భయపడుతున్నారు. భారీ ప్రాణనష్టాన్ని నివారించడానికి, ఉగ్రవాదులు ఇప్పుడు ఒక శిబిరంలో దాదాపు రెండు డజన్ల మంది ఉగ్రవాదులకు వసతి కల్పించే చిన్న శిబిరాలను నిర్మిస్తున్నారు. గతంలో ఒకే శిబిరంలో ఈ సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉండేది.అధునాతన సాధనాలతో పునరుద్ధరణ.. ఉగ్రవాదుల కదలికల సరళి కూడా మారిందని వర్గాలు చెబుతున్నాయి. వారు ఇప్పుడు కవచాలుగా ఉపయోగించుకునేందుకు తమ శిబిరాల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చేర్చుకుంటున్నారు. డ్రోన్లు, నిఘా పరికరాల వాడకంతో శిక్షణ సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందింది. ఈ శిబిరాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాడార్ను మభ్యపెట్టడం, ఉపగ్రహ మాస్కింగ్, ఇతర అధునాతన సాధనాలను ఆయా శిబిరాల్లో ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. నిఘా వర్గాల అంచనాల ప్రకారం, ఈ పునర్నిర్మాణానికి ఐఎస్ఐ 100 కోట్లకు పైగా పాకిస్తాన్ రూపాయలను కేటాయించింది. -
పొరుగు దేశం పాకిస్థాన్లో జల ప్రళయం.. 299 మంది మృతి
పాకిస్థాన్లో గత నెల రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కురిసిన ఈ భారీ వర్షాలకు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించినట్టు సమాచారం. ఈ వర్షాలకు 300 మంది పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా వందలాది మంది గాయపడ్డారు. భారీ వరదలకు రోడ్లు, వంతెనలు, భారీ చెట్లు సైతం కొట్టుకుపోయాయి. వందలాది మంది ఇల్లులు దెబ్బతిని నిరాశ్రయులుగా మిగిలారు. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. పాక్ విపత్తు నిర్వాహణ సంస్థ పంచుకున్న డేటా ప్రకారం పాకిస్తాన్ వరదల్లో 140 మంది చిన్న పిల్లలతో సహా కనీసం 299 మంది మరణించినట్టు తెలిపింది. దాంతో పాటు 428 మూగజీవాలు కూడా మరణించినట్టు తన డేటాలో పేర్కొంది. -
ఉగ్రవాది అంత్యక్రియల్లో స్థానికుల తిరుగుబాటు.. తోక ముడిచిన పాక్ పోలీసులు
న్యూఢ్లిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇటీవల జరిగిన ఒక ఉగ్రవాది అంత్యక్రియల్లో యూటర్న్ తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పలు ఆరోపణలు చేసిన పాకిస్తాన్ తన తీరు బయటకు పొక్కకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఒక ఉగ్రవాది అంత్యక్రియల సమయంలో చోటుచేసుకున్న పరిణామం ఇందుకు ఉదాహరణగా నిలిచింది.ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లో మరణించిన ఉగ్రవాది హబీబ్ తాహిర్ అంత్యక్రియలు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని కుయియాన్ గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఎల్ఈటీ కమాండర్ రిజ్వాన్ హనీఫ్ సాయుధ వ్యక్తులతో అంత్యక్రియలకు రావడంతో, తాహిర్ కుటుంబ సభ్యులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. అయితే ఇంతలో హనీఫ్ మేనల్లుడు అక్కడ దుఃఖిస్తున్న వారిని తుపాకీతో బెదిరించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఇది స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో హనీఫ్, అతని సహచరులు పోలీసుల జోక్యంతో అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.ఇటీవలి కాలంలో పాక్లో ఉగ్రవాదులు నిర్వహించే కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఉగ్రవాద గ్రూపులు చేపట్టే ప్రజా కార్యకలాపాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని చూస్తుంటే పాక్ ప్రభుత్వం బహిరంగంగా ఉగ్రవాదులను ప్రోత్సహించేందుకు వెనుకడుగు వేస్తున్నదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ సమయంలో హతమైన ఎల్ఈటీ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాకిస్తాన్ ఉన్నతాధికారుల పేర్లను భారతదేశం విడుదల చేసింది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఎల్ఈటీ కమాండర్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించారని భారత్ ఆరోపించింది. -
‘భారత్- పాక్ మధ్య..’ పాడిన పాటే పాడుతున్న ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్-పాక్ల మధ్య యుద్ధ విరమణకు సయోధ్య కుదిర్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు పాడినపాటే పాడారు. భారత్-పాకిస్తాన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలను ఆపానని ట్రంప్ మళ్లీ ప్రస్తావించారు.మే 10న వాషింగ్టన్ మధ్యవర్తిత్వంలో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత భారత్-పాక్లు సంపూర్ణ, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్రూత్లో ప్రకటించారు. ఆ తరువాత కూడా ట్రంప్ పలు సందర్భాల్లో తన వాదనను పునరావృతం చేస్తూ వస్తున్నారు. భారతదేశం- పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య వివాదాలను ముగించినందుకు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కోరిన దరిమిలా ట్రంప్ మళ్లీ ఇదే వాదన చేశారు.తాజాగా ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ముగింపజేయడం, ఇరాన్ అణు సామర్థ్యాలను తుడిచిపెట్టడం, గొప్ప ఆర్థిక వ్యవస్థను సృష్టించడం లాంటి ఘనమైన పనులను చేశానని పేర్కొన్నారు. న్యూస్మాక్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ తాను చాలా యుద్ధాలను పరిష్కరించానని అన్నారు. వాటిలో భారత్-పాక్ మధ్య జరగబోయే అణు యుద్ధం ఒకటని పేర్కొన్నారు. థాయిలాండ్- కంబోడియా, కాంగో -రువాండా మధ్య నెలకొన్న వివాదాలను కూడా తానే పరిష్కరించానని చెప్పుకొచ్చారు.ఈ యుద్ధాలను వాణిజ్యంతో పరిష్కరించానని, నెలకు సగటున ఒక యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధాలను ముగింపజేస్తూ, లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నానన్నారు. కాగా ఆగస్టు ఒకటి నుండి భారతదేశం నుండి వచ్చే అన్ని వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అలాగే రష్యన్ ముడి చమురు, సైనిక పరికరాలను భారత్ కొనుగోలు చేసినందుకు వెల్లడించని జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మందిని బలిగొన్న ఉగ్ర దాడి తర్వాత అందుకు ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను నిలిపివేయాలని ఏ దేశ నాయకుడూ భారతదేశాన్ని కోరలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంట్లో స్పష్టం చేశారు. అలాగే రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్పై జరిగిన ప్రత్యేక చర్చలో జోక్యం చేసుకున్న విదేశాంగ మంత్రి జైశంకర్.. ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22 మొదలు జూన్ 16 మధ్యకాలంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని పేర్కొన్నారు. -
చివరి బంతికి ఫోర్ కొట్టి...
ఫ్లోరిడా: చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో పాకిస్తాన్పై వెస్టిండీస్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి బంతికి మూడు పరుగులు చేస్తే విజయం సాధించాల్సిన తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల్లో పేస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ఫోర్ కొట్టి విండీస్ను గెలిపించాడు. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. హసన్ నవాజ్ (23 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్లు), కెప్టెన్ సల్మాన్ ఆఘా (33 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సయీమ్ అయూబ్ (7), సాహిబ్జాదా ఫర్హాన్ (3), మొహమ్మద్ హరీస్ (4), మొహమ్మద్ నవాజ్ (2), ఫహీమ్ అష్రఫ్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి విజయం సాధించింది. ఇటీవల సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో వరుసగా ఎనిమిది మ్యాచ్లు ఓడిన కరీబియన్లు... ఈ సిరీస్లో సైతం తొలి మ్యాచ్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. గుడకేశ్ మోతీ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్లు), కెప్టెన్ షై హోప్ (30 బంతుల్లో 21; 2 ఫోర్లు) కాస్త పోరాడారు. విండీస్ విజయానికి 18 బంతుల్లో 36 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెఫర్డ్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్ (10 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నవాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు విన్నింగ్ రన్స్ చేసిన హోల్డర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈరోజు తెల్లవారుజామున జరుగుతుంది. -
పాక్లో రైలు ప్రమాదం.. 30 మందికి గాయాలు
లాహోర్: పాకిస్తాన్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.పాకిస్తాన్ రైల్వేలు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం లాహోర్ నుండి రావల్పిండికి వెళ్తున్న ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్.. షేక్పురాలోని కాలా షా కాకు వద్ద పట్టాలు తప్పింది. రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. 🚨🇵🇰 Train Derailment in Pakistan⚠️ Islamabad Express derailed near Kala Shah Kaku (Muridke).🚑 Over 40 passengers injured, rescue teams on site.📍 Cause of derailment under investigation.#Pakistan #TrainAccident #Breaking pic.twitter.com/O6yhz5aBKR— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) August 1, 2025ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. లాహోర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన అరగంటకు రైలు బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసి వెంటనే రైల్వే సీఈఓ, డివిజనల్ సూపరింటెండెంట్ను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఏడు రోజుల్లోగా విచారణ ఫలితాలను సమర్పించాలని ఆదేశించారు. -
ఇమ్రాన్ పార్టీకి చెందిన 166 మందికి పదేళ్ల జైలు
లాహోర్: పదవీచ్యుత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే వివిధ ఆరోపణలపై జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఖాన్ నిర్బంధాన్ని నిరసిస్తూ 2023 మే 9వ తేదీన పీటీఐ శ్రేణులు దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు డజను వరకు సైనిక కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ చర్యలపై ఫైసలాబాద్లోని యాంటీ టెర్రరిజం కోర్టు(ఏటీసీ) ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఫైసలాబాద్లోని ఐఎస్ఐ కార్యాలయ భవనంపై జరిగిన దాడికి సంబంధించి 108 మందికి, పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడిన 58 మందికి పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష పడిన వారిలో నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఒమర్ అయూబ్, సెనేట్లో ప్రతిపక్ష నేత షిబ్లి ఫరాజ్, కీలక నేతలు జర్తాజ్ గుల్, సాహిబ్జాదా హమీద్ రజా ఉన్నారు. దోషులుగా ప్రకటించిన వారిలో ఆరుగురు నేషనల్ అసెంబ్లీ సభ్యులు కాగా ఒకరు పంజాబ్ అసెంబ్లీ సభ్యుడు, ఒక సెనేటర్ ఉన్నారు. ఇప్పటికే పీటీఐకి చెందిన 14 మందిని దోషులుగా ప్రకటిస్తూ మే 9వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొంది. తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని పీటీఐ తాత్కాలిక అధ్యక్షుడు గొహార్ అలీ చెప్పారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ‘ఫ్రీ ఇమ్రాన్ ఖాన్ మూవ్మెంట్’చేపట్టేందుకు పీటీఐ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
‘మా సాయంతో భారత్కు పాక్ చమురు’: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: పహల్గామ్ ఉగ్ర ఘటన తరువాత భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు వీటికి ఆజ్యం పోసేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు భారత్కు ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్నాయి. ఏదో ఒకరోజు భారత్కు పాకిస్తాన్ చమురు అమ్ముతుందని, అందుకు తాము పాక్కు సాయం చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.భారత్పై 25శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొన్ని గంటలకు ట్రంప్ మరోమారు భారత్- పాక్ మధ్య చిచ్పుపెట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ తాజాగా అమెరికాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుక్నునదని, అయితే ఈ భాగస్వామ్యానికి ఏ కంపెనీ సారధ్యం వహించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ట్రంప్ పేర్కొన్నారు. బహుశా పాకిస్తాన్ ఏదో ఒక రోజు భారతదేశానికి చమురు అమ్మే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. తాము పాకిస్తాన్తో ఒక ఒప్పందాన్ని ముగించామని, ఈ మేరకు పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయన్నారు. ఇదే పోస్ట్లో ట్రంప్.. అమెరికాను చాలా సంతోషపెట్టాలని కోరుకునే పలు దేశాల నేతలతో మాట్లాడానని పేర్కొన్నారు. కొన్ని దేశాలు సుంకాల తగ్గింపు కోసం అమెరికాకు ఆఫర్లు ఇస్తున్నాయని, ఇది దేశ వాణిజ్య లోటును భారీగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.తాము వైట్ హౌస్ లో వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తూ చాలా బిజీగా ఉన్నామని, ఈరోజు మధ్యాహ్నం దక్షిణ కొరియా వాణిజ్య ప్రతినిధి బృందాన్ని కలుస్తానన్నారు. దక్షిణ కొరియా ప్రస్తుతం 25శాతం సుంకాలను కలిగివుందని, అయితే వారు ఆ సుంకాలను తగ్గించే ప్రతిపాదనతో ఉన్నారని, అందుకు వారు ఇచ్చే ఆఫర్ ఏమిటో వినడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు విధించనున్నామని, అయితే ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయని, ఈ వారం చివరి నాటికి సుంకాల విషయంలో స్పష్టత వస్తుందని ట్రంప్ వివరించారు. -
కాంగ్రెస్ ధారాదత్తం చేసింది
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై రాజ్యసభలో 16 గంటల చర్చకు ప్రభుత్వం తరఫున సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పాపం కాంగ్రెస్దే అని ధ్వజమెత్తారు. ‘‘ దేశ భద్రత అనేది కాంగ్రెస్ ప్రాధాన్యతాంశాల్లో అస్సలు లేదు. ఓటు బ్యాంక్, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే కాంగ్రెస్ అజెండా. వీటిపై మాత్రమే కాంగ్రెస్ దృష్టిపెట్టి జాతీయభద్రత వంటి మిగతా కీలకాంశాలను గాలికొదిలేసింది. దీంతో ఉగ్రవాదం విపరీతంగా విస్తరించింది. దీనికి ఏకైక కారణం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, పేలవమైన రాజకీయ విధానాలు. కాంగ్రెస్ ఘోర తప్పిదాల కారణంగానే కశ్మీర్లో కొంతభాగం మన చేజారింది. అలా కాంగ్రెస్సే పాకిస్తాన్కు పీఓకేను అప్పగించింది. వాళ్లు ఇచి్చన పీఓకేను మేం తిరిగి తీసుకొస్తాం. ఘటన జరిగాక సమీక్ష జరపడం కాంగ్రెస్ విధానం. అసలు అలాంటివి సంభవించకుండా ముందే అప్రమత్తంగా ఉండటం మా నైజం’’ అని అమిత్ షా అన్నారు. ‘‘పహల్గాం పాశవిక హత్యాకాండలో అమాయకులు చనిపోయారు. వాళ్ల తలకు గురిపెట్టి మరీ ఉగ్రవాదులు తూటాలు పేల్చారు. అదే తీరులో ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం ఉగ్రవాదుల తలల్లోకి మేం కూడా తూటాలు దించాం. పహల్గాం బాధిత కుటుంబాలు కోరుకున్నది మేం నెరవేర్చాం. ఆపరేషన్ మహదేవ్లో అంతమైన ముగ్గురు ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు ఆర్మీ దర్యాప్తులో స్పష్టమైంది. మహిళలు, చిన్నారుల ఎదుట నీ మతమేంటి? అని అడిగిమరీ అమాయకుల ప్రాణాలు తీసిన పహల్గాం వంటి హేయమైన ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా వచ్చి మాట్లాడాలని విపక్షసభ్యులు పట్టుబట్టారు. ఆయన బదులు నేను మాట్లాడుతున్నానని అమిత్ షా సర్దిచెప్పే ప్రయత్నంచేసినా విపక్షసభ్యులు వినిపించుకోకుండా నిరససగా వాకౌట్ చేశారు. తర్వాత అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
పాకిస్తాన్తో సెమీస్ మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి వాకౌట్ చేసిన భారత్..?
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్ చేసినట్లు తెలుస్తుంది. టోర్నీలో భాగంగా రేపు (జులై 31) సాయంత్రం 5 గంటలకు భారత్, పాకిస్తాన్ మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లంతా మూకుమ్మడిగా ఈ మ్యాచ్ను బహిష్కరించారని సమాచారం. దీంతో పాకిస్తాన్ ఫైనల్కు క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో లీగ్ దశలోనూ భారత్ ఇదే కారణంగా పాక్తో మ్యాచ్ రద్దు చేసుకుంది. అప్పుడు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.భారత్ సెమీస్కు చేరిందిలా..!పాక్తో లీగ్ దశలో మ్యాచ్ను రద్దు చేసుకున్న భారత్.. ఆతర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొని సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్పై ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్లో తుది బెర్త్ దక్కించుకుంది.అయితే అప్పటికే పాకిస్తాన్ వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో సెమీస్లోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనివార్యమైంది. ఒకవేళ లీగ్ దశలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసినా ఫైనల్లో అయినా పాక్తో పోరు తప్పేది కాదు.మరోపక్క పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతుంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్లు బర్మింగ్హమ్లోని ఎడ్జ్బాస్టన్లో జరగాల్సి ఉంది.దేశమే ముఖ్యంపాక్తో సెమీస్ మ్యాచ్ రద్దు చేసుకోవాలని భారత ఆటగాళ్లు నిర్ణయించుకోకముందే టోర్నీ ప్రధాన స్పాన్సర్ 'ఈజ్మైట్రిప్' నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది. భారత్, పాక్ మ్యాచ్కు తాము స్పాన్సర్గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.‘డబ్ల్యూసీఎల్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది. అయితే, పాకిస్తాన్తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు అండగా ఉండలేము.కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లతో డబ్ల్యూసీఎల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
కాల్పుల విరమణకు పాక్ అడుక్కుంది: జై శంకర్
కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పార్లమెంట్ వేదికగా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్పై చర్చలో భాగంగా బుధవారం రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని వ్యాఖ్యానించారాయన. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి తెలియజేశాం. పాక్లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ‘సిందూర్’ పేరిట చేపట్టిన ఆపరేషన్తో ధ్వంసం చేసింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ అడుక్కుంది. అంతేగానీ కాల్పుల విరమణలో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు అని అన్నారాయన. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సంభాషణలు జరగలేదని జై శంకర్ వివరించారు. ఆ సమయంలో చాలా దేశాలు దౌత్యానికి ముందుకొచ్చాయి. కానీ, జోక్యం సరికాదని ఆయా దేశాలకు చెప్పాం అని జైశంకర్ అన్నారు. ‘‘వాళ్లకు(ప్రతిపక్షాలకు) ఒక్కటే చెప్పదల్చుకున్నా.. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 మధ్య ఆ ఇద్దరు నేతలకు ఒక్క ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు’’ అని స్పష్టం చేశారాయన. మే 9వ తేదీన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాక్ నుంచి దాడులు జరగవచ్చని హెచ్చరించారాయన. అయితే అలాంటి పరిస్థితి వస్తే భారత్ నుంచి ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని మోదీ వాన్స్తో చెప్పారు. ఆర్థికల్ 370, సింధూ జలాల ఒప్పందం.. నెహ్రూ పాలనలో జరిగిన ఈ తప్పిదాలను మోదీ సర్కార్ ఇప్పుడు సరిదిద్దుతోంది. ఉగ్రవాదాన్ని గ్లోబల్ ఎజెండాలో చేర్చడం ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది అని జైశంకర్ అన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని.. అందుకే పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేదాకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారారయన. -
పాకిస్తాన్ భార్యను తోడ్కొని రావాలి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో హాట్హాట్గా చర్చ జరిగింది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ హనుమాన్ బేణివాల్ సోమవారం రాత్రి సభలో వ్యాఖ్యలో పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కాసేపు హాయిగా నవ్వుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశానికి పాకిస్తాన్ భార్యగా మారిపోయిందని, ఆ భార్యను మన ఇంటికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘‘భీకర దాడులతో పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం. ఈ ఆపరేషన్కు సిందూర్ పేరుపెట్టారు. అంటే పాకిస్తాన్ నుదుటిపైనా సిందూరం అద్దినట్లే. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు పవిత్ర సిందూరాన్ని తమ భర్తగా భావిస్తారు. పాకిస్తాన్పై భారత్పై సిందూరం పెట్టింది కాబట్టి పాకిస్తాన్ ధర్మపత్నిగా మారిపోయినట్లే. ఇక వధువును తోడ్కొనిరావడం ఒక్కటే మిగిలి ఉంది. దయచేసి మీరు(ప్రభుత్వం) వెళ్లి, పాకిస్తాన్ను ఇంటికి తీసుకురండి’’అని కోరారు. ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్ సూచించగా, అర్ధరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఇచ్చారని, తన ప్రసంగం రేపు పత్రికలో ప్రచురితం కాదని, ఇక సోషల్ మీడియాను మేనేజ్ చేసుకోవాల్సిందే అని హనుమాన్ బేణివాల్ చెప్పగా సభలో మరోసారి నవ్వుల విరిశాయి. -
ఆసీస్ బౌలర్ చెత్త ప్రదర్శన.. ఓవర్లో ఏకంగా 18 బంతులు..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్తో ఇవాళ (జులై 29) జరిగిన మ్యాచ్లో ఓ ఓవర్లో ఏకంగా 18 బంతులు వేశాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ ఓ ఓవర్లో ఇన్ని బంతులు వేయలేదు. గతంలో ఈ రికార్డు విండీస్ లోకల్ ప్లేయర్ రోషన్ ప్రైమస్ పేరిట ఉండేది. ప్రైమస్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఓ మ్యాచ్లో ఓవర్లో 13 బంతులు వేశాడు. తాజాగా ప్రైమస్ రికార్డును హేస్టింగ్స్ బద్దలు కొట్టాడు.పాకిస్తాన్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హేస్టింగ్స్ 12 వైడ్లు, ఓ నో బాల్ వేశాడు. ఈ ఓవర్లో కేవలం ఐదు బంతులు మాత్రమే వేసిన అతను మొత్తంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఆసీస్ 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇది జరిగింది. హేస్టింగ్స్ గల్లీ బౌలర్ల కంటే అధ్వానంగా బౌలింగ్ చేసి అందరికీ విసుగు తెప్పించాడు. 39 ఏళ్ల హేస్టింగ్స్ ఆసీస్ తరఫున ఓ టెస్ట్, 29 వన్డేలు, 9 టీ20లు ఆడి ఉండటం కొసమెరుపు. ఇతగాడు ఐపీఎల్లోనూ 3 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడిని నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించింది కాదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ చేసింది. సయీద్ అజ్మల్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూల్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్ను గెలుపు తీరాలు దాటించారు.కాగా, ఈ టోర్నీలో పాక్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆరేసిన అజ్మల్.. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్లో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆ జట్టు.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి టేబుల్ టాపర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్తో పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్ను గెలుపు తీరాలు దాటించారు. ఆసీస్ కెప్టెన్ ఐదుగురు బౌలర్లను ప్రయోగించినా ఒక్క పాక్ వికెట్ను కూడా తీయలేకపోయారు.కాగా, ఈ టోర్నీలో పాక్తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
విజృంభించిన పాక్ బౌలర్.. 74 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో పాకిస్తాన్ లెజెండ్స్ టీమ్ అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్లో 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించి, ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న పాక్.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియా లెజెండ్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.ఆ జట్టు స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్తో (3.5-0-16-6) పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.కాగా, ఈ టోర్నీలో పాక్తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్తో ఆడాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆహ్వానం లేకుండా పాక్కు వెళ్లింది ఎవరు? సీజ్ ఫైర్ నిర్ణయం ఎవరిది?
పహల్గాం ఘటన.. పూర్తిగా భద్రతా వైఫల్యమేనని, పైగా అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మండిపడింది. ఆపరేషన్ సిందూర్పై చర్చలో భాగంగా.. ఇటు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, అటు రాజ్యసభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సిందూర్పై లోక్సభలో రెండో రోజు చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. పర్యాటక ప్రాంతంలో భద్రత లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి గంటసేపు మాట్లాడారు. అధికార కూటమి ఎంపీలు కూడా మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై పోరు, జాతీయ భద్రత, చరిత్ర.. ఇలా అంశాలన్నింటిపై మాట్లాడారు. కానీ, ఒక్క విషయాన్ని వదిలేశారు. అసలు ఆ దాడి ఎందుకు?.. ఎలా జరిగింది? అనేది.. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో కుటుంబ సభ్యుల కళ్లెదుటే 26 మంది చంపారు. అసలు ఆ ఉగ్రదాడి ఎందుకు.. ఎలా జరిగిందో మాత్రం కేంద్రం చెప్పడం లేదు. #WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, "... Yesterday, the Defence Minister spoke for an hour, during which he spoke about terrorism, protecting the country, and also gave a history lesson. But one thing was left out- How did this attack happen?..." pic.twitter.com/as9gAbNCjr— ANI (@ANI) July 29, 2025కశ్మీర్లో ఉగ్రవాదం ముగిసిన అంకమని, అక్కడ పర్యటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కానీ.. జరిగింది మరొకటి. శుభం ద్వివేదీకి వివాహమై ఆరు నెలలే అయ్యింది. ఏప్రిల్ 22వ తేదీన అందరు పర్యాటకుల్లాగే ఆ జంట విహారంలో మునిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో అడవుల్లో నుంచి వచ్చిన ఉగ్రవాదులు వాళ్లపై తెగబడ్డారు. భార్య కళ్ల ముందే శుభంను చంపేశారు. గంట వ్యవధిలో మరో 25 మందిని చంపేశారు. శుభం భార్య ఐశన్య ఓ మాట చెప్పింది.. నా కళ్ల ముందే నా ప్రపంచం చీకటి అయ్యింది. ఘటన సమయంలో అక్కడ ఒక్క భద్రతా సిబ్బంది లేరు. ఈ దేశం, ఈ ప్రభుత్వం మమ్మల్ని.. మా భద్రతను గాలికి వదిలేసింది అని. ఆమె అడిగిందే నేనూ అడుగుతున్నా.. ప్రతీరోజు 1,000 నుంచి 1,500 మంది పర్యటించే ఆ ప్రాంతంలో ఒక్క సైనికుడు కూడా కాపలాగా ఎందుకు లేడు?. వాళ్లు ప్రభుత్వాన్ని నమ్మి అక్కడికి వెళ్తే.. ఈ ప్రభుత్వం దేవుడ్ని మీద భారం వేసి వాళ్లను అలా వదిలేసిందా?. ఉగ్రదాడికి రక్షణమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యత వహించారా? రాజీనామా చేశారా?. అసలు పౌరుల ప్రాణాలకు బాధ్యత ఎవరిది?. ప్రధానిదా?, హోం మంత్రిదా?, రక్షణ మంత్రిదా? ఎవరిది??సెక్యూరిటీ మాట అటుంచి కనీసం ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు?. ఇది నిఘా సంస్థ వైఫల్యం కాదా?.. అంటూ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఆర్మీనో, కేంద్రమో ఈ నిర్ణయం తీసుకోలేదు. అసలు సీజ్ ఫైర్ ప్రకటన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా చేస్తారు?. పాక్ భారత్ కాల్పుల విరమణ ఒప్పందం అసలు ఎలా జరిగింది?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఇటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విరుచుకుపడ్డారు. ‘‘పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం చూసింది. తమ తండ్రి తమ కళ్ల ముందే చనిపోవడం చిన్న పిల్లలు చూశారు. అసలు పర్యాటక ప్రాంతంలోకి టెస్టులు ఎలా వచ్చారు?. పహల్గాం ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే. దాడి జరగకుండా కేంద్రం ఎందుకు ఆపలేకపోయింది?. ఇంటెలిజెన్స్ వైఫల్యానికి బాధ్యులెవరు?. .. పహల్గాం ఘటనలో సంబంధం లేని అంశాలను లేవనెత్తుతున్నారు. పాకిస్తాన్కు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్ దేశాన్ని నిర్మించిన పార్టీ. ఆ పార్టీకి చాలా చరిత్ర ఉంది. మేం ఎప్పుడూ పాక్కు సపోర్ట్ చేయలేదు. ఆహ్వానించకుండా పాక్కు వెళ్లడం సిగ్గుచేటు. మాపై నిందలు వేస్తూ.. పాక్ నేతలను కౌగిలించుకుంటారు. మీరు తప్పు చేసి మాపై అసత్య ప్రచారాలు చేస్తారా?. ఇదేనా మీ దేశ భక్తి. #WATCH | Discussion on Operation Sindoor | Rajya Sabha LoP Mallikarjun Kharge says, "...We attended the meeting (all-party), but you went to Bihar for election campaigning. Is that your patriotism?...He should have been in the House today and heard us. If you do not have the… pic.twitter.com/XrcPafJoNp— ANI (@ANI) July 29, 2025కాంగ్రెస్ను నిందిస్తూ ఎంత కాలం బతుకాలనుకుంటున్నారు?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువ అయ్యాయా? పహల్గాం ఘటన తర్వాత జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో ప్రధాని ఎందుకు లేరు?. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారు?. ప్రధానికి దేశ భద్రత కంటే ఎన్నికల ర్యాలీలే ఎక్కువయ్యాయా?. దేశ భద్రత కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయా?’’ అని ఖర్గే ధ్వజమెత్తారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్-భారత్ కాల్పుల విరమణను భారత విదేశాంగ శాఖ మంత్రో, ప్రధానినో, లేకుంటే రక్షణ మంత్రినో ప్రకటించలేదు. ఎక్కడో వాషింగ్టన్ నుంచి ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విమరణ తన విజయమేనని ట్రంప్ ఇప్పటిదాకా 29సార్లు ప్రకటించుకున్నారు. ఈ నా ప్రసంగం ముగిసేలోపు ఆయన మరోసారి ప్రకటించుకుంటే 30వ సారి అవుతుంది. అయినా ఆ నిజాన్ని కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ఖర్గే ఎద్దేవా చేశారు. -
ఆపరేషన్ సిందూర్ అద్భుతం : వైఎస్ అవినాష్
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు వైఎస్సార్సీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లోక్సభలో అపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ చర్యలకు జవాబు దారి చేయాలి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హకీమ్ స్వయంగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతిస్తున్నామని చెప్పాడు. వైఎస్సార్సీపీ జమ్మూ కాశ్మీర్ పౌరులకు సంఘీభావం ప్రకటిస్తోంది. అనేక సంవత్సరాల అస్థిర పరిస్థితుల మధ్య మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతోంది. పహల్గాం దాడితో ఈ ప్రయత్నాలకు కొంత దెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ అద్భుతంగా నిర్వహించిన భారత ఆర్మీని వైఎస్సార్సీపీ అభినందిస్తోంది. ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యానికి ఒక ప్రతీక. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. అత్యంత ఖచ్చితత్వంతో సైనిక బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రస్తావరాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి జరిగింది. అరగంటలోపే మొత్తం ఆపరేషన్ పూర్తి చేశారు. డ్రోన్ సిస్టంలతో వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయవంతంగా పూర్తి చేసింది. సంఖ్యాత్మక బలం కంటే సాంకేతికత ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పింది. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తతతో సన్నద్ధంగా ఉండడం కీలకం. జాతీయ సార్వభౌమత్వాన్ని రక్షించడానికి రక్షణ బడ్జెట్ను పెంచడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ చర్చలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్పహల్గాం దాడి జరిగిన రోజు, కాల్పుల విరమణ జరిగిన రోజు ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను తోసి పుచ్చారు.ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. స్వయంగా పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణ చేయాలని అడిగారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను సృష్టించినది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలోనే చైనాకు కాశ్మీర్ భూభాగం ధారా దత్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పాకిస్తాన్ చైనా కారిడార్ ఒప్పందాలు జరిగాయి.ఎంపీ గౌరవ్ గొగోయ్ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్పై భారత్ కాల్పుల విమరణకు ఎందుకు అంగీకరించిందో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాకుండా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్సభలో కాంగ్రెస్ లోక్సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా ఇరు దేశాలపై తాను ఒత్తిడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26సార్లు పాకిస్తాన్లను కాల్పుల విరమణకు బలవంతం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు మాట్లాడారు. దీని వెనుక ఉన్న నిజం మాకు తెలుసుకోవాని అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. పాక్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సహాయం అందించకుండా భారత్ ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. పహల్గాం ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టకపోవడం,పాక్కు బుద్ధి చెప్పామంటూనే ఆపరేషన్ సిందూర్ను ఆపేయడం వంటి అంశాలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధీటుగా బదులిచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం అంతే. పాక్, పాక్ ఆక్రమిత ఉగ్రవాదుల ఏరివేతే లక్క్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో దాయాది దేశం మన కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ సైనికులు సింహాలు. దేశ రక్షణ సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసే విషయంలో జాగ్రతగా ఉండాలి’ అంటూ ప్రతిపక్షాలకు రాజ్నాథ్ సూచించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ప్రభుత్వానికి అడగడం ప్రతిపక్షం పని. కొన్నిసార్లు, మన విమానాలను ఎన్ని కూల్చివేసారని మన ప్రతిపక్ష సభ్యులు అడుగుతూనే ఉంటారు. కానీ మన దళాలు ఎన్ని పాకిస్తాన్ విమానాలను కూల్చివేశామని వారు ఎప్పుడూ అడగరు. మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే, ఈ ఆపరేషన్లో మన సైనికుల్లో ఎవరికైనా హాని జరిగిందా అని అడగండి? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా? లేదు’ అని అన్నారు.సోమవారం (జులై 28)లోక్సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్పై రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య.ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం.ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చంపారు మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఊరుకునేది లేదు. పాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాం. భారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది. పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. 100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం.హిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాం.టెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాం.పాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం.పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసింది. పాక్లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాం.ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్.పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు.భారత నౌకా దళం కూడా పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది.పాక్ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరింది.మన దాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..గ్యాప్ ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.బాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు. -
అందుకు రెడీ అన్న పాక్.. భారత్ స్పందన కోసం ఎదురుచూపు
భారత్తో చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఆయా అంశాలపై చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధమంటూ పునరుద్ఘాటించారు. దీనిపై భారత్ తుది నిర్ణయం తీసుకోవాలన్న దార్.. ఆ దేశ అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి.. భారతదేశ కోర్టులో ఉందంటూ దార్ వ్యాఖ్యానించారు.వాణిజ్యం నుంచి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి వివిధ అంశాలపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అర్థవంతమైన చర్చలు’ అవసరమంటూ ఆయన నొక్కి చెప్పారు. కాశ్మీర్, భద్రత, ఆర్థిక సంబంధాలతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి చర్చలు తిరిగి ప్రారంభించాలని దార్ పిలుపునిచ్చారు.కాగా, పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ కఠిన వైఖరి అవలంబించిన సంగతి తెలిసిందే. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు ఆ దేశంతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను కట్ చేసింది. ఆపరేషన్ సిందూర్తో పాక్తో పాటు పీవోకేలో ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు మే 10వ తేదీన ఒక అంగీకారానికి రావడం తెలిసిందే. -
అఫ్రిది రీఎంట్రీ.. బాబర్ ఆజమ్కు మళ్లీ చుక్కెదురు
త్వరలో వెస్టిండీస్తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం పాకిస్తాన్ జట్లను ఇవాళ (జులై 25) ప్రకటించారు. టీ20 జట్టుకు సల్మాన్ అఘా, వన్డే జట్టుకు మహ్మద్ రిజ్వాన్ సారధులుగా ఎంపికయ్యారు. ఈ సిరీస్తో స్టార్ స్పీడ్స్టర్ షాహీన్ అఫ్రిది టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్కు మరోసారి చుక్కెదురైంది. సెలెక్టర్లు బాబర్కు వన్డేలకు మాత్రమే పరిమితం చేశారు.అఫ్రిది రాకతో పాక్ టీ20 జట్టు పేస్ బౌలింగ్ విభాగం మరింత బలపడింది. అఫ్రిదికి జతగా అనుభవజ్ఞులైన పేసర్లు హరీస్ రౌఫ్, హసన్ అలీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. మరో పేసర్ నసీం షా వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.బ్యాటింగ్ విభాగంలో సైమ్ అయూబ్, ఫకర్ జమాన్, హసన్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, మొహమ్మద్ నవాజ్ జట్టులో చోటు దక్కించుకోగా.. అబ్దుల్లా షఫీక్ వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్లో సత్తా చాటిన సల్మాన్ మీర్జా, అహ్మద్ దనియాల్కు జట్టులో చోటు దక్కలేదు.వెస్టిండీస్తో టీ20 సిరీస్కు పాక్ జట్టు..సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొఖిమ్వెస్టిండీస్తో వన్డే సిరీస్కు పాక్ జట్టు..మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, నసీం షా, సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొఖిమ్వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ షెడ్యూల్..జులై 31- తొలి టీ20 (ఫ్లోరిడా)ఆగస్ట్ 2- రెండో టీ20 (ఫ్లోరిడా)ఆగస్ట్ 3- మూడో టీ20 (ఫ్లోరిడా)ఆగస్ట్ 8- తొలి వన్డే (ట్రినిడాడ్)ఆగస్ట్ 10- రెండో వన్డే (ట్రినిడాడ్)ఆగస్ట్ 12- మూడో వన్డే (ట్రినిడాడ్) -
ఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉంది: సీడీఎస్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనేది ఇంకా ఆన్లోనే ఉందని సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్కు హాజరైన అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్ సిందూర్ను భారత్ చేపట్టింది.మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఈఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. భారత్ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్.. భారత్ ఆర్మీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్ సిందూర్ ఆన్లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్. -
ఎట్టకేలకు పాకిస్తాన్కు ఓ విజయం
బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై ఇదివరకే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు, ఇవాళ (జులై 24) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో కంటితుడుపు విజయం నమోదు చేసింది. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో హసన్ నవాజ్ (33), మొహమ్మద్ నవాజ్ (27), సైమ్ అయూబ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నసుమ్ అహ్మద్ 2, షొరిఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. తద్వారా సిరీస్లో తొలి పరాజయం ఎదుర్కొంది. టెయిలెండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ అజేయమైన 35 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. బంగ్లా ఇన్నింగ్స్లో సైఫుద్దీన్తో పాటు మొహమ్మద్ నైమ్ (10), మెహిది హసన్ మిరాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3, ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ నవాజ్ చెరో 2, అహ్మద్ దెనియాల్, సల్మాన్ అఘా, హుసేన్ తలాట్ తలో వికెట్ తీశారు. -
దూసుకొచ్చిన పాక్ డ్రోన్లు.. పేల్చిసిన భారత భద్రతా బలగాలు
అమృత్సర్: నార్కో-టెర్రర్ నెట్వర్క్లను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్కు భారత భద్రతా బలగాలు షాకిచ్చాయి. పంజాబ్ సరిహద్దుల్లో వరుస ఆపరేషన్లు చేపట్టిన బీఎస్ఎఫ్ పాక్ నుంచి భారత్ వైపు వచ్చిన ఆరు డ్రోన్లను కూల్చేసింది. ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు డ్రోన్లను అదుపులోకి తీసుకున్నారు. వాటిల్లో మూడు డ్రోన్లు ఏరియల్ ఫొటోగ్రఫీ,వీడియోల్ని తీసేందుకు ఉపయోగించే డీజీఐ మావిక్ డ్రోన్లు కాగా.. మరో మూడు డ్రోన్లలో మూడు పిస్టల్స్,వాటిల్లో బుల్లెట్లను నింపేందుకు వినియోగించే మ్యాగిజైన్ను,1.1 కేజీ హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ విభాగం అధికారికంగా ప్రకటించింది. అమృత్సర్ జిల్లాలోని మోధే గ్రామం వద్ద రాత్రి సమయంలో ఐదు డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు టెక్నాలజీ సాయంతో వాటిని కూల్చేశారు. అక్కడ మూడు తుపాకులు, మూడు మ్యాగజైన్లు,హెరాయిన్ ఉన్న నాలుగు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. టర్న్ టారన్ జిల్లాలోని డాల్ గ్రామం వద్ద పిస్టల్ భాగాలు, మ్యాగజైన్ను గుర్తించారు. అటారి గ్రామం వద్ద మరో డ్రోన్ను అడ్డుకుని రెండు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు. భారత భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్లు పాకిస్తాన్ ప్రేరిత నార్కో-టెర్రర్ నెట్వర్క్లపై గట్టి దెబ్బగా భావిస్తున్నారు. బీఎస్ఫ్, పంజాబ్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్లు జరిగాయి.కాగా, ఇలాంటి ఘటనలు సరిహద్దు భద్రతను మరింత కఠినంగా చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. -
మతోన్మాదం, ఉగ్రవాదంలో మునిగిన పాక్
ఐక్యరాజ్యసమితి: సమయం, సందర్భం కాకపోయినా కశ్మీర్ అంశాన్ని ప్రతిసారీ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావిస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి దీటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జూలై నెల సమావేశంలోభాగంగా మంగళవారం ‘‘బహుళత్వం ద్వారా అంతర్జాతీయ శాంతిభద్రత ప్రోత్సాహం, శాంతియుతంగా వివాదాల పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో పాకిస్తాన్ తొలుత ప్రసంగించింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ఉపప్రదాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రసంగించారు. ‘‘కశ్మీర్ను భారత్ ఆక్రమించింది. తాజా ఉద్రిక్తతలను అడ్డంపెట్టుకుని సిందూ నదీజలాల ఒప్పందం అమలును భారత్ రద్దుచేసింది. కశ్మీర్సహా భారత్తో నెలకొన్ని ప్రతిష్టంభనకు అంతర్జాతీయ జోక్యం తప్పనిసరి’’అని ఇషాక్ దార్ అన్నారు. ఈయన వ్యాఖ్యలపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దీటుగా బదులిచ్చారు. ‘‘బాధ్యతాయుతంగా ఉంటూ ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్కృషిచేస్తోంది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదనే అంతర్జాతీయ ప్రాథమిక సూత్రాన్ని భారత్ పాటిస్తోంది. ప్రజాస్వామ్య పథంలో పైపైకి దూసుకెళ్తూ, ఆర్థిక శక్తిగా అవతరిస్తూ, బహుళత్వానికి, సామాజిక సమ్మిళిత వృద్ధిని సాధిస్తూ భారత్ బిజీగా ఉంటే ఉగ్రవాదం, మతోన్మాదం, అంతర్జాతీయ ద్రవ్యనిది సంస్థ(ఐఎంఎఫ్) వంటి చోట్ల వేల కోట్ల రుణాలుచేస్తూ పాకిస్తాన్ బిజీగా ఉంది’’అని హరీశ్ దెబ్బిపొడిచారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ 2.1 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరుచేసిన విషయం తెల్సిందే. ‘‘పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ ఉగ్రవాదులే పహల్గాంలో పాశవిక హత్యాకాండకు తెరలేపారు’’అని హరీశ్ గుర్తుచేశారు. -
దర్యాప్తు ప్రశ్నార్థకం కారాదు!
అంతా ఎప్పటిలాగే గడిచిపోతున్నదనుకునే వేళ హఠాత్తుగా సంభవించిన పేలుడు జనాన్ని భయకంపితుల్ని చేస్తుంది. తేరుకున్న వెంటనే అది మిగిల్చిన ప్రాణనష్టాన్నీ, విధ్వంసాన్నీ కళ్లారా చూశాక ఆ భయాందోళనలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. తీవ్ర గాయాలై కాళ్లూ చేతులూ తెగిపడినవారి ఆర్తనాదాలు మిన్నంటుతాయి. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. నేరగాళ్లను పట్టి బంధించాలన్న డిమాండు ఊపందుకుంటుంది. తీరా దీర్ఘకాలం గడిచాక నిందితులు నిర్దోషులనీ, దర్యాప్తు లోపభూయిష్టమనీ తేలితే ప్రజానీకంలో నిరాశా నిస్పృహలు ఆవరించవా? బాధిత కుటుంబాలు మరోసారి రోదించవా? 189 మంది మరణానికీ, 816 మంది క్షతగాత్రులు కావటానికీ కారణమైన 2006 నాటి పేలుళ్ల ఘటనల్లో బొంబాయి హైకోర్టు దాదాపు 20 యేళ్లు కావస్తుండగా వెలువరించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. పోలీసులు ఈ కేసులో వెనువెంటనే 13 మందిని అరెస్టు చేశారు. వారంతా ప్రధాన నిందితులని, మరో 15 మంది పరారీలో వున్నారని తేల్చారు. నిషేధిత ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఈ నిందితులకు పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాతో సంబంధ బాంధవ్యాలున్నాయని ఆరోపించారు. పేలుళ్ల ఘటనలు జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేయటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక కోర్టు 2015 సెప్టెంబర్లో ఒకరు మినహా మిగిలిన 12 మందినీ దోషులుగా నిర్ధారించింది. వారిలో అయిదుగురికి ఉరిశిక్ష, మిగిలినవారికి వేర్వేరు రకాల శిక్షలు పడ్డాయి. 2021లో ఒకరు కోవిడ్ వ్యాధితో మరణించారు. జనం కిక్కిరిసి ప్రయాణించే సాయంత్రం సమయాన్ని పేలుళ్లకు ఎంచుకుని ఏడు లోకల్ రైళ్లలో బాంబులుంచి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.తమ ముందు విచారణకొచ్చిన కేసుల్లో న్యాయస్థానాలు సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలిస్తాయి. నిందితులుగా చూపించిన వారికి ఆ ఘటనలతో వున్న సంబంధం ఏమిటో, ఏ ప్రాతిపదికన వారే కారకులని పోలీసులు నిర్ధారణకొచ్చారో తరచి చూస్తాయి. ఎంతమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ, ఒక్క నిరపరాధికి కూడా శిక్షపడరాదన్న సూత్రమే దానికి మూలం. ఉగ్రవాదం మన దేశానికి కొత్తగాదు. దశాబ్దాలుగా అడపా దడపా ఏదో ఒక మూల అది తలెత్తుతూనే వుంది. వివిధ సంఘటనల్లో పదులకొద్దీ మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికన్నట్టు కొత్త చట్టాలు వస్తున్నాయి. ఉన్న చట్టాలు మరింత కఠినతరమవుతున్నాయి. కానీ చాలా సందర్భాల్లో జరుగుతున్నదేమిటో 2006 నాటి ముంబై పేలుళ్ల ఉదంతమే తార్కాణం. 671 పేజీల తీర్పులో ముంబై హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించిన లోటుపాట్లు గమనిస్తే ఇంత నాసిరకంగా దర్యాప్తు జరిగిందా అనిపిస్తుంది. నిందితుల ప్రమేయాన్ని సందేహాతీతంగా నిరూపించాలన్న కర్తవ్యం కన్నా, ఏదో అయిందనిపిద్దామన్న ధోరణే ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) దర్యాప్తులో కనబడిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పేలుళ్ల ఉదంతాలప్పుడు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలుగుతాయి. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయ పక్షాల, ఇతర సంస్థల ఆరోపణలు సరేసరి. అందువల్ల దర్యాప్తు చేసేవారిపై ఒత్తిళ్లు పెరుగుతాయన్నది కూడా వాస్తవం. కానీ ఇవేవీ వారిని ప్రభావితం చేయకూడదు. ఘటనాస్థలిలో దొరికిన చిన్న చిన్న ఆధారాలతో అల్లుకుపోతూ ఒక పెద్ద కుట్రను ఛేదించినప్పుడే, నిజమైన నిందితులను పట్టుకున్నప్పుడే సమాజం సురక్షితంగా వుంటుంది. ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు నిందితులను పట్టుకున్నామని, అంతా పరిష్కరించామన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటం వల్ల సమాజానికి ఒరిగేదేమీ వుండదు. తప్పించుకున్న అసలు నిందితులు మరో దురంతానికి పథక రచన చేస్తారు. నిందితులుగా ముద్రపడినవారి కుటుంబాలు దిక్కుతోచక అల్లాడతాయి. జనానికి కావాల్సింది ఆ దారుణానికి పాల్పడ్డ నేరగాళ్లను పట్టుకోవటం తప్ప ఆ పేరిట ఎవరో కొందరిని నిందితులుగా చూపటం కాదు. దేశం మొత్తాన్ని పట్టికుదిపిన కేసులో సాదాసీదా దర్యాప్తు సరికాదని పోలీసు ఉన్నతాధికారులకు అనిపించకపోవటం ఆశ్చర్యం. ఎన్నో కేసుల దర్యాప్తులో పాలుపంచుకొని, ఎంతో అనుభవాన్ని గడించిన వారంతా తమ స్థాయిలోనే ఈ లోటుపాట్లను పట్టుకోవటం అసాధ్యం కాదు. కనీసం న్యాయస్థానం ముందుకెళ్తే ఎలాంటి సందేహాలు ఎదురవుతాయోనన్న బెరుకు ఎవరిలోనూ లేకపోవటం విస్మయం కలిగిస్తుంది. సాంకేతిక కారణాలతోనే ఈ కేసు కొట్టేశారని, సుప్రీంకోర్టుకు వెళ్లి దోషులకు శిక్షపడేలా చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక కారణాల సంగతలా వుంచి నిందితుల ఒప్పుకోలు పత్రాలన్నీ దాదాపు ఒకే మాదిరి వుండటం, పొంతన లేని సాక్ష్యాలు నిందితుల అపరాధత్వంపై సందేహాలు కలిగించాయి. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే వుండేలా చట్టాలు పదునెక్కాయి. కానీ పోలీసులు సక్రమంగా వ్యవహరించి నేరాంగీకారంతో సరిపోలే విధంగా తిరుగులేని సాక్ష్యాధారాలు చూపలేకపోతే ఆ నిబంధన కొరగానిదవుతుంది. దర్యాప్తు ప్రక్రియకు అవరోధంగా మారుతుంది. కనీసం పేలుళ్లలో వాడిన బాంబులేమిటో ఏటీఎస్ నికరంగా చెప్పలేకపోయింది. రేపు సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్ధారిస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే బాధిత కుటుంబాలకు ఖేదం మిగిలింది. ఈ తీర్పు దర్యాప్తు సంస్థల తీరుతెన్నులను మరింత పదునెక్కించగలగాలి. నిజమైన నేరగాళ్లను బోనెక్కించాలి. -
Pakistan: ఇమ్రాన్ ఖాన్కు కోలుకోలేని దెబ్బ.. ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాక్ న్యాయస్థానం నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్కు కోలుకోలేని దెబ్బ పడింది. దేశంలో గతంలో జరిగిన అల్లర్ల కేసుల్లో ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 2023, మే 9న పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దరిమిలా దేశంలోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాలపై పీటీఐ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలో పలువురు నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ అల్లర్ల కేసులో లాహోర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) తాజాగా పీటీఐకి చెందిన ఏడుగురు సీనియర్ నేతలకు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలు శిక్ష పడిన నేతలలో సెనేటర్ ఎజాజ్ చౌదరి (పార్టీ సీనియర్ మహిళా నేత) సర్పరాజ్ చీమా (పంజాబ్ మాజీ గవర్నర్), డాక్టర్ యాస్మిన్ రషీద్ (పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి) , మెహమూదూర్ రషీద్ (మాజీ మంత్రి) న్యాయవాది అజీమ్ పహత్ (పార్టీ న్యాయ సలహాదారు) ఉన్నారు. మరో ఇద్దరు నేతలు కూడా శిక్ష పడినవారిలో ఉన్నారు. అయితే పలు మీడియా నివేదికలు ఐదుగురి పేర్లను హైలైట్ చేశాయి. ఈ కేసులో పీటీఐ వైస్ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.మరో కేసులో పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత మాలిక్ అహ్మద్ ఖాన్ భచర్, పీటీఐ పార్లమెంటేరియన్ అహ్మద్ చట్టా, మాజీ శాసనసభ్యుడు బిలాల్ ఎజాజ్లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. నాడు జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ఖాన్ 2023, ఆగస్టు నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పీటీఐ నేతలకు విధించిన శిక్షను ఫెడరల్ ప్రభుత్వం స్వాగతించింది. దీనిని సానుకూల చర్యగా అభివర్ణించింది. కాగా పీటీఐ పంజాబ్ చాప్టర్ హెడ్ అలియా హంజా, సీనియర్ నేత బాబర్ అవాన్, శాసనసభ్యుడు అసద్ కైసర్ ఈ శిక్షలను ఖండించారు. ఈ కేసులలో చట్టపరమైన విధానాలను అనుసరించలేదని, విశ్వసనీయ సాక్షులను హాజరుపరచలేదని వారు ఆరోపించారు. -
‘సమితి’లో పాక్ బండారం బయటపెట్టిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తీరుతెన్నులను భారత్ ఎండగట్టింది. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుండగా, పాకిస్తాన్ ఒకవైపు మతతత్వం, మరోవైపు ఉగ్రవాదంలో మునిగిపోయి, భారీ రుణగ్రహీతగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ శాంతి- భద్రతను ప్రోత్సహించడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలలో ఎదుగుతున్నదని పేర్కొన్నారు. పొరుగుదేశం ఇందుకు భిన్నంగా ఉన్నదని ఆరోపించారు. భారత్ ఐక్యరాజ్యసమితి లక్ష్యంలో భాగస్వామ్యం వహిస్తూ, మరింత శాంతియుత, సంపన్నమైన,ప్రపంచం కోసం సమిష్టిగా కృషి చేయడంలో చురుకుగా, నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నదని అన్నారు.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతుండగా, అదే సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల నుండి రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, ఈ ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్ పేర్కొన్నారు. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిందన్నారు. -
పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగరగొట్టిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం
బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకొని ఫ్యూజులు ఎగురగొట్టింది. ఇవాళ (జులై 22) ఢాకాలో జరిగిన రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా బౌలర్లు చెలరేగిపోయారు. 134 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ను పాకిస్తాన్ బౌలర్లు సైతం అద్భుతంగా కట్టడి చేశారు. సల్మాన్ మీర్జా (4-1-17-2), అబ్బాస్ అఫ్రిది (4-0-37-2), అహ్మద్ దనియాల్ (4-0-23-2), ఫహీమ్ అష్రాఫ్ (3-0-20-1), మొహమ్మద్ నవాజ్ (3-0-19-1) చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్ 133 పరుగులకే ఆలౌటైంది. జాకెర్ అలీ (55), మెహిది హసన్ (33) అద్బుతంగా పోరాడి బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్కు బంగ్లా బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి ధాటికి పాకిస్తాన్ 47 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగింది. ఈ దశలో ఫహీమ్ అష్రాఫ్ (51) వీరోచితంగా పోరాడి పాక్ను గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే బంగ్లా బౌలర్లు మరోసారి చెలరేగి పాక్ను 125 పరుగులకే పరిమితం చేశారు. మెహిది హసన్ (4-0-25-2), షొరిఫుల్ ఇస్లాం (4-0-17-3), తంజిమ్ హసన్ సకీబ్ (4-0-23-2), ముస్తాఫిజుర్ (3.2-0-15-1), రిషద్ హొసేన్ (4-0-42-1) పాక్ బ్యాటర్ల భరతం పట్టారు.ఈ సిరీస్లో నామమాత్రపు మూడో టీ20 జులై 24న జరుగనుంది. -
చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్తాన్.. జింబాబ్వే కంటే హీనంగా..!
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. గత రెండు, మూడేళ్లుగా ఆ జట్టు ఏ ఫార్మాట్లోనూ సత్తా చాటలేకపోతుంది. సీనియర్ల ఫామ్ లేమి.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య సత్సంబంధాలు లేకపోవడం వంటి అనేక కారణాల చేత పాక్ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం పసికూనలపై కూడా ఆ జట్టు విజయాలు నమోదు చేయలేకపోతుంది.తాజాగా వారి కంటే చాలా రెట్లు బలహీనమైన బంగ్లాదేశ్ వారికి షాకిచ్చింది. ఆదివారం (జులై 20) ఢాకాలో జరిగిన టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పాక్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సంచలన విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాక్ ఓ ఘోర అప్రతిష్ఠను మూటగట్టుకుంది.2024 నుంచి ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ చెత్త రికార్డును పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచే లాగేసుకోవడం విశేషం. ప్రస్తుత క్రికెట్ పసికూనలుగా పిలువబడే జింబాబ్వే, వెస్టిండీస్ కూడా గతేడాది కాలంలో పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నాయి.2024 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) పాకిస్తాన్ 63 మ్యాచ్లు ఆడగా.. అందులో ఏకంగా 38 మ్యాచ్ల్లో ఓడింది. పాకిస్తాన్ తర్వాత అత్యధికంగా బంగ్లాదేశ్ 37 మ్యాచ్ల్లో (62లో) పరాజయాలు చవిచూసింది. వెస్టిండీస్ (65 మ్యాచ్ల్లో 35లో ఓటమి), జింబాబ్వే (61 మ్యాచ్ల్లో 31లో ఓటమి) లాంటి దేశాలు 2024 నుంచి పాకిస్తాన్ కంటే తక్కువ మ్యాచ్ల్లో ఓడాయి. ఈ గణాంకాలు చూస్తే పాక్ క్రికెట్ జట్టు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.పాక్ను షాకిచ్చిన బంగ్లాదేశ్మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూల్చింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (4-0-6-2), తస్కిన్ అహ్మద్ (3.3-0-22-3) చెలరేగి బౌలింగ్ చేశారు. తంజిమ్ హసన్ సకీబ్ (4-0-20-1), మెహిది హసన్ (4-0-37-1) కూడా పర్వాలేదనిపించారు. పాక్ బ్యాటర్లలో ఫకర్ జమాన్ (44) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించగా.. ఆఖర్లో అబ్బాస్ అఫ్రిది (22), ఖుష్దిల్ షా (17) రెండంకెల స్కోర్లు చేయడంతో పాకిస్తాన్ అతి కష్టం మీద మూడంకెల స్కోర్ దాటగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయం సాధించింది (3 వికెట్లు కోల్పోయి). పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (56 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో రాణించి బంగ్లాను గెలిపించాడు. అతనికి తౌహిద్ హృదోయ్ (36), జాకిర్ అలీ (15 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఢాకా వేదికగానే ఇవాళ (జులై 22) సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
‘భారత్-పాక్ మధ్యవర్తిత్వంలో ట్రంప్ కీలకం’: వైట్ హౌస్ వంతపాట..
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న అశాంతిని చల్లార్చడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని యూఎస్ఏ అధికార కార్యాలయం వైట్హౌస్ పునరుద్ఘాటించింది. ట్రంప్ అధికార యంత్రాంగంలోని పలువురు అధికారులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారని, అలాగే రష్యా- ఉక్రెయిన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం వహించారని వైట్హైస్ మరోమారు వాదనకు దిగింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్.. గాజాలో శాంతి ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అతని ప్రయత్నాల కారణంగా పలువురు బందీలు విడుదలయ్యారని అన్నారు. ట్రంప్ ఆదేశాల దరిమిలా ఇరాన్లోని అణు సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.‘మేము చాలా యుద్ధాలను ఆపాం. భారత్- పాకిస్తాన్లు అణ్వాయుధ దేశాలు. ఇవి పరస్పరం ఘర్షణపడుతున్నాయి. ఈ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని నిలువరించాం. ఇటీవల ఇరాన్లో మేము ఏమి చేసామో అందరూ చూశారు. ఆ దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని ధ్వంసం చేశాం. భారత్- పాక్ మధ్య జరిగే యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా పరిష్కరించామని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. అయితే భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది. -
పాక్తో మ్యాచ్ బహిష్కరణ
బర్మింగ్హామ్: ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ను భారత స్టార్లు బహిష్కరించారు. జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోమని శిఖర్ ధావన్ సహా భారత ఆటగాళ్లు వెల్లడించడంతో దాయాదుల పోరును రద్దు చేయక తప్పలేదు. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో సీజన్ పోటీలు గత నెల 18న ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 2న జరగనున్న ఫైనల్తో టోర్నమెంట్ ముగియనుంది. ఇందులో భారత చాంపియన్స్ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు. జట్టులో హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, వరుణ్ అరోన్ వంటి పలువురు భారత మాజీ ప్లేయర్లు ఉన్నారు. బరి్మంగ్హామ్ వేదికగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయినట్లు డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ‘పాకిస్తాన్ హాకీ జట్టు భారత్లో ఆడనుందనే వార్తలతో పాటు మరి కొన్ని క్రీడల్లో ఇరు దేశాల మధ్య పోటీలు జరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూసీఎల్లో దాయాదుల మ్యాచ్ ద్వారా కొన్ని ఆనంద క్షణాలు పంచుకోవచ్చని అనుకున్నాం. అయితే మా నిర్ణయం చాలా మందికి నచ్చలేదని అర్థమైంది. వారి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో మ్యాచ్ను రద్దు చేశాం. ఎవరికైన ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించమని కోరుతున్నాం’అని డబ్ల్యూసీఎల్ పేర్కొంది. పాకిస్తాన్ లెజెండ్స్ జట్టుకు షాహిద్ అఫ్రిది కెపె్టన్గా వ్యవహరిస్తుండగా... షోయబ్ మాలిక్, హఫీజ్, యూనిస్ ఖాన్, తన్వీర్, వహాబ్ రియాజ్, కమ్రాన్ అక్మల్ జట్టులో ఉన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ ఆడకూడదని ధావన్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. టోర్నీ ఆరంభం కావడానికి ముందే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడబోనని ధావన్ స్పష్టం చేశాడు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు... పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఎంపీలు యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్తో పాటు ఇర్ఫాన్ పఠాన్ కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్కు సుముఖత వ్యక్తం చేయలేదని డబ్ల్యూసీఎల్ తెలిపింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన గత ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్ లెజెండ్స్పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన భారత చాంపియన్స్ జట్టు తొలి టైటిల్ కైవసం చేసుకుంది. -
సిందూర్పై చర్చకు సై
ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలకాంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. విపక్షాల ప్రశ్నలన్నింటికీ మేం సమాధానం ఇస్తాం. అయితే పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న రోజుల్లో మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు. – కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్లో ఓటర్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ స్పందించాలి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించాలి. – గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ లేవనెత్తాల్సిన కీలక అంశాలపై విపక్షాలు కసరత్తు పూర్తిచేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మాణాత్మక చర్చలకు సహకరించాలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్రామ్ మేఘ్వాల్, మురుగన్తోపాటు కాంగ్రెస్ ఆర్జేడీ, జేడీ(యూ), సమాజ్వాదీ పార్టీ, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, బీఆర్ఎస్, శివసేన(షిండే), ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు. విపక్షాలు తమ ఎజెండాను ప్రస్తావించాయి. బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పహల్గాం ఉగ్రవాద దాడి, భారత్–పాక్ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను లేవనెత్తాయి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, తాజా పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కోరాయి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. అఖిలపక్ష భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్లో ఓట్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.అఖిలపక్ష భేటీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, ఎంపీలు జైరాం రమేశ్ తదితరులు కొత్త బిల్లులు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు, జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు, పన్నుల చట్టాలు(సవరణ) బిల్లులతో పాటు జియోహెరిటేజ్ సైట్స్, జియో–రెలిక్స్(సంరక్షణ), జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక(సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం కోరనుంది. వీటితోపాటు పెండింగ్లో ఉన్న సముద్ర వస్తువుల రవాణా బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, ఓడరేవుల బిల్లులపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. చర్చకు వెనుకాడం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికార, విపక్ష సభ్యులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉందన్నారు. ఉభయ సభల్లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని చిన్న పార్టీల ఎంపీలు కోరారని, అందుకోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిన్న ఎంపీలకు తగినంత సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కిరణ్ రిజిజు వెల్లడించారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై సంబంధిత కేబినెట్ మంత్రులు సమాధానం ఇస్తారని స్పష్టంచేశారు. 17 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. -
పాక్లో వర్ష బీభత్సం.. 200 మంది మృతి
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో పాక్లో భారీ వరదలు సంభవిస్తుంటాయి. ఫలితంగా కొండచరియలు విరిగిపడుతూ, అపారనష్టం వాటిల్లుతుంటుంది.ఇటువంటి విపత్తుల కారణంగా ఇటీవలి కాలంలో 100 మంది పిల్లలతో సహా 200 మందికి పైగా జనం ప్రాణాలను కోల్పోయారని, 500 మందికి పైగా జనం గాయపడ్డారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ఎండీఏ) తెలిపింది.అధికారిక డేటా ప్రకారం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అత్యధికంగా 123 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40, సింధ్లో 21, బలూచిస్తాన్లో 16,ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫైసలాబాద్లో వర్షాల కారణంగా గణనీయమైన నష్టం వాటిల్లింది. రెండు రోజుల్లో చోటుచేసుకున్న 33 ఘటనలలో 11 మంది మృతి చెందారు. 450 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదైన చక్వాల్లో 32 రోడ్లు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాల నష్టంతో పాటు, కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. -
WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో నేడు జరగాల్సిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ రద్దైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ మైదానం వేదికగా షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 9గం. భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సి ఉంది. అయితే పాక్తో మ్యాచ్ను భారత ప్లేయర్లు బాయ్కాట్ చేసిన నేపథ్యం, ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న నేపథయంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పాయింట్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.పాకిస్థాన్తో ఎలాంటి క్రికెట్ ఆడకూడదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు డబ్ల్యూసీఎల్లో ఇరు జట్లూ తలపడనున్న నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు.. పాక్తో మ్యాచ్ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ? ప్రశ్నలు తలెత్తాయి. Dear all , pic.twitter.com/ViIlA3ZrLl— World Championship Of Legends (@WclLeague) July 19, 2025ఈ నేఫథ్యంలో.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్రౌండర్ సురేష్ రైనా, మాజీ ఆల్రౌండర్లు ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్లు డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. పహల్గామ్ దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారి నిర్ణయంకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్పై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నారని స్పష్టమైంది.ఈ మ్యాచ్లో తాను ఆడేది లేదని.. సదరు విషయాన్ని డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్లకు ఇప్పటికే చెప్పినట్లు శిఖర్ ధావన్ వెల్లడించాడు. మే 11నే లీగ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్ స్క్రీన్షాట్లను ధావన్ పంచుకున్నాడు. ‘‘ఈ లీగ్లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్’’ అని మెయిల్ స్క్రీన్షాట్ను ధావన్ పోస్టు చేశాడు.ఇంకోవైపు.. పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత్పై, భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయగా దుమారం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్రిదీపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు వేటు వేసినట్లు తెలుస్తోంది. డబ్ల్యూసీఎల్ పోస్టర్ నుంచి అఫ్రిదీ ఫొటోను నిర్వాహకులు తొలగించారు. మిగతా మ్యాచ్లకూ అతన్ని దూరం పెట్టే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. -
అన్నా.. నీవు ఇప్పటికి మారలేదా? పాక్ ఆటగాడిపై సెటైర్లు
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్ను పాకిస్తాన్ ఛాంపియన్స్ విజయంతో ఆరంభించింది. శుక్రవారం ఇంగ్లండ్ ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించినప్పటికి.. ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు.తొలుత బ్యాటింగ్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన ఆక్మల్.. అనంతరం ఫీల్డింగ్లో గల్లీ స్ధాయి వికెట్ కీపర్ను తలపించాడు. షోయబ్ మాలిక్ బౌలింగ్లో ఆక్మల్ ఈజీ స్టంపింగ్ను మిస్ చేసి నవ్వులు పాలయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షోయబ్ మాలిక్.. ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ మస్టర్డ్కు ఫుల్ ఔట్సైడ్ ఆఫ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని మస్టర్డ్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే షర్ఫ్గా టర్న్ అవుతూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. నేరుగా చేతి లోకి వెళ్లిన బంతిని అందుకోలేక స్టంప్ ఔట్ చేసే అవకాశాన్ని కమ్రాన్ కోల్పోయాడు.దీంతో 23 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మస్టర్డ్ ఏకంగా హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్లు నీవు అన్నా.. నీవు ఇప్పటికి ఇంకా మారలేదా? అంటూ ట్రోలు చేస్తున్నారు. కాగా ఆక్మల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే సమయంలో కూడా ఇటువంటి వికెట్ కీపింగ్తో చాలా మ్యాచ్ల్లో పాక్ కొంపముంచాడు. 2011 వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ ఇచ్చిన ఈజీక్యాచ్ను జారవిడిచిన ఆక్మల్.. పాక్ ఓటమికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్లో ఆరంభంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న టేలర్.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుత మ్యాచ్లో పాక్ గెలవకపోయింటే అందుకు ఆక్మల్ కారణమయ్యేవాడు.చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్ చేద్దామా?.. ధోని నిర్ణయం మాత్రం అదే!Kamran Akmal Wicket keeping -Then, Now & Forever.....His wicket keeping costs Shoaib Akhter career - Ross Taylor assault in 2011 WC.#WCL2025 pic.twitter.com/HNcMCLRXUE— alekhaNikun (@nikun28) July 19, 2025 -
పీకల లోతు వరద నీటిలో రిపోర్టింగ్, చివరకు..
పనిలో డెడికేషన్ అనాలో.. టీఆర్పీ కోసం పాకులాట అనాలో.. వ్యూస్ కోసం స్టంట్లు అనాలో.. ఈ ఘటన గురించి చదివాక మీ స్పందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ చేస్తూ నీటిలో కొట్టుకుపోయాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన రావల్పిండిలోని చాహన్ డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రిపోర్టర్ పీకల లోతు వరద నీటిలో నిలబడి అక్కడి పరిస్థితి వివరిస్తున్నాడు. ఆ సమయంలో వరద ఉధృతికి ఆకస్మికంగా ప్రవాహం అతన్ని లోపలికి లాక్కెళ్లిపోయింది.A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025అయితే ఈ వీడియో అక్కడికి మాత్రమే కట్ అయ్యింది. అతను కొట్టుకుపోయాడని, ఇప్పటిదాకా అతని ఆచూకీ తెలీయకుండా పోయిందనేది సదరు వార్త కథనాల సారాంశం. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతనిది మూర్ఖపు చర్య అని కొందరు, విధి నిర్వహణలో తప్పేం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరామ్యాన్నెవర్డైస్ అంటూ మరికొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అతను అసలు రిపోర్టర్ కాదని, టిక్టాక్ లాంటి షార్ట్వీడియోస్ యాప్లలో వ్యూస్ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తుంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అతను సురక్షితంగానే ఉండి ఉంటాడన్నది ఆ కామెంట్ల సారాంశం. అయితే.. ఫ్యాక్ట్ చెక్లో అతని పేరు అలీ ముసా రాజా(Ali Musa Raza)గా తేలింది. రూహీ అనే చానెల్లో అతను చాలా కాలంగా రిపోర్టర్గా పని చేస్తున్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడా? అనే దానిపై ఆ చానెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఘటన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు సైతం అతనికి సంఘీభావం తెలుపుతున్నారు. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. చీప్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే ఇలాంటి ధైర్యమైన రిపోర్టర్లు సమాజానికి అవసరమని, అదే సమయంలో ఇలాంటివాళ్లు సురక్షితంగా కూడా ఉంటాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రిపోర్టర్ అలీ ముసా రాజాకు ఇలాంటి స్టంట్లు కొత్తేం కాదు. కిందటి ఏడాది.. పంజాబ్ ప్రావిన్స్ సఖి సర్వర్ ఏరియాలో వరదలను నడుం లోతు నీళ్లలో కవర్ చేస్తూ వైరల్ అయ్యాడు కూడా. View this post on Instagram A post shared by NDTV WORLD (@ndtvworld)పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 124% ఎక్కువ వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. తాజా వరదల ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 180 మంది మరణించారు. అయితే.. ఒక్క పంజాబ్ ప్రావిన్స్లో 54 మంది ఒకే రోజులో మరణించడం గమనార్హం. -
మసూద్ అజహర్ ఆచూకీ పసిగట్టిన నిఘావర్గాలు
-
‘తన బిడ్డకు హాని జరిగితేనే అసీం మునీర్కు మా బాధ అర్థమవుతుంది’
సాక్షి,న్యూఢిల్లీ: మేం పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఆసిమ్ మునీర్కు ఇప్పుడు అర్ధం కాదు. తన బిడ్డలకు ఏదైనా హాని జరిగితే అప్పుడు అర్ధమవుతుంది. ఈ మాటలన్నది మరెవరో కాదు. పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదంలో కోల్పోయిన తొలి ప్రాణం లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ (26)తండ్రి రాజేష్ఈ ఏడాది ఏప్రిల్ 22న ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో 26మంది టూరిస్టులు మరణించగా.. వారిలో లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ ఒకరు.ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్..కేవలం ఆరు రోజుల్లోనే జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య హిమాన్షీ నర్వాల్. భర్త పార్థివ దేహం పక్కన కూర్చుని రోదిస్తున్న దశ్యాలు దేశ ప్రజల్ని కంటతడి పెట్టించాయి.ఈ దారుణ ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది.అయితే,పహల్గాంలో మారణ హోమం సృష్టించిన టీఆర్ఎఫ్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.అమెరికా ప్రకటనపై లెఫ్టినెంట్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ మీడియాతో మాట్లాడారు.ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు వినయ్ నార్వాల్ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరమయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుమారుడు,కుమార్తెకు ఏదైనా హాని జరిగితే.. మేం పడుతున్న బాధ అర్థమవుతుంది.నా కొడుకు మరణంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయింది. నిద్రలేని రాత్రులు, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. మానసికంగా అలసిపోయాం. రెండు మూడు గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం లేదన్నారు..ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం’ అంటూ నిట్టూర్చారు. కాగా,పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై భారత్ ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫ్ఫరాబాద్, కోట్లి,బహావల్పూర్,రావలకోట్,చక్స్వారీ, భింబర్,నీలం వ్యాలీ,జెహ్లం చక్వాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులతో పాక్ ఆర్ధికంగా,భారీ సంఖ్యలో ఉగ్రవాదులను కోల్పోయింది. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ‘జాడ’ కనిపెట్టేశారు..!
కరాచీ: గ్లోబల్ టెర్రరిస్టు, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజార్ తమ దేశంలో లేడని బుకాయిస్తు వస్తున్న పాకిస్తాన్ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. పాక్ చెబుతున్నది ఎంతమాత్రం నిజం కాదనే విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తేటతెల్లం చేశాయి. మసూద్ అజార్ పాక్లో ఉన్న విషయాన్ని భారత్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టేశాయి. పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మర్) పరిధిలో గిల్జిట్ బాలిస్తాన్ ప్రాంతంలో మసూద్ సంచరించిన విషయాన్ని తాజాగా వెల్లడించాయి. మసూద్ అజార్ కదలికల్ని అత్యంత దగ్గరగా నిశితంగా పరిశీలిస్తున్న భారత్ ఇంటెలిజెన్స్.. బహవల్పూర్కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో మసూద్ నివాస జాడలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల మసూజ్ అజాయర్ స్కర్దూ, సద్పారా ఏరియాల్లో కనిపించిన విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. అక్కడ ప్రధానంగా పలు ప్రైవేటు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ల్లో మసూద్ కనిపించాడు. కాగా, ఇటీవల ఆల్ అజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. మసూద్ అజార్ తమ దేశంలో లేడంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ పాకిస్తాన్లో ఉన్నాడని భారత్ సమాచారం ఇస్తే తాము సంతోషంగా అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా బుకాయించే యత్నం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్లోనే అజార్ ఉన్నాడని భారత ఇంటెలిజెన్స్ స్పష్టం చేసిన తరుణంలో బిల్వాల భుట్టో ఏమంటాడో చూడాలిభారత్లో ఉగ్రదాడులకు సూత్రధారిభారత్లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్ది కీలక పాత్ర. 2016లో పఠాన్కోట్లో ఎయిర్బేస్పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు. -
16 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ, సప్త సముద్రాలు దాటి పెళ్లి : వైరల్ లవ్ స్టోరీ
"మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అంటే ఇదేనేమో. ఒక అమెరికా మహిళ వేల మైళ్ల దూరంలో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సప్తసముద్రాలు దాటి అదీ తన కన్నా చిన్నవాడైన వ్యక్తిని మనువాడింది. ప్రేమకు సరిహద్దులు..అవధులు లేవు అని నిరూపించిన ఆ ప్రేమ జంట గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన మిండీ రాస్ముస్సేన్ (Mindy Rasmussen, 47) , అప్పర్ దిర్ జిల్లా నివాసి 31 ఏళ్ల ఫేస్బుక్ ప్రేమికుడు సాజిద్ జెబ్ ఖాన్ను ప్రేమించింది. ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఏకంగా అమెరికా నుంచి పాకిస్తాన్కు వెళ్లింది. అంతేకాదు ఇస్లాంలోకి మతం మారింది. మధ్య 16 సంవత్సరాల వయస్సు తేడా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో సాంప్రదాయ నిఖా వేడుకలో వివాహం చేసుకున్నారు. సామాజిక విమర్శలను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ జంట ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది.ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!ఫేస్ బుక్ పరిచయంస్థానిక మీడియా కథనాల ప్రకారం దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్లో పాకిస్తాన్కు చెందిన సాజిద్ జెబ్ ఖాన్ పరిచయం ఏర్పడింది. మొదట్లో అందరిలాగానే మామూలుగా మాట్లాడుకునే వారు. అది కాస్తా సుదీర్ఘ వీడియో కాల్స్గా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ముందుగా రాస్ముస్సేన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అటు వీరి ప్రేమకు ఇరు కుటుంబాలూ అంగీకారం తెలిపాయి. ఈ నెల ప్రారంభంలోనే 90 రోజుల వీసా గడువుతో రాస్ముస్సేన్ అమెరికా నుంచి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Islamabad International Airport) వచ్చింది. ఆమెకు ప్రేమగా స్వాగతం తెలిపిన సాజిద్ జెబ్ ఖాన్ స్వగ్రామానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘జులేఖ’గా పేరు మార్చుకుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిఖా చేసుకున్నారు. తమ నిఖా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాస్ముస్సేన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. దీంతో ఈ లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. -
మా దేశానికి ట్రంప్.. పాక్ మీడియా కలరింగ్.. వైట్హౌస్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నారని పాక్ మీడియా ది డాన్ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై అమెరికాలోని వైట్ హౌస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్.. పాక్ పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ లేదని.. ఆయన పాకిస్తాన్కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చింది.అయితే, ఇస్లామాబాద్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారని పాక్ మీడియా కథనాలపై తాజాగా వైట్హౌస్ అధికారులు స్పందించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్కు వెళ్లడం లేదు. పాక్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఏమీ లేదు. జూలై 18వ తేదీన ట్రంప్.. పాకిస్తాన్లో పర్యటించడం లేదు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని కొట్టిపారేసింది. ఇదే సమయంలో పాక్ మీడియా తప్పుడు కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది.ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో ట్రంప్.. పాక్ పర్యటిస్తున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. పాక్ మీడియా అత్యుత్సాహంతో ట్రంప్.. పర్యటనకు వస్తున్నట్టు కలరింగ్ ఇచ్చింది. ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తొలుత పాక్ను సందర్శించే అవకాశం ఉందని ది డాన్ వెల్లడించింది. ఆ తరువాతే భారత పర్యటన ఉంటుందని అంచనావేసింది. సెప్టెంబర్లో భారత్ క్వాడ్ సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి భారత్కు ట్రంప్ వస్తారని పేర్కొంది.#Newsfatafat | Pakistani media reported that U.S. President Donald #Trump would visit #Pakistan in September, marking the first visit by a U.S. president in two decades. However, the White House has denied the claim, stating that no such trip is scheduled. The reports have since… pic.twitter.com/I6JjWaTq38— ET NOW (@ETNOWlive) July 18, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లో అమెరికా అధ్యక్షుడు పర్యటించడం చాలా అరుదు. 2006లో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్.. పాకిస్తాన్లో పర్యటించారు. అప్పటి నుంచి అమెరికా అధ్యక్షులు ఎవరూ పాక్ పర్యటనకు వెళ్లలేదు. ఇదిలా ఉండగా.. ట్రంప్ విదేశీ పర్యటనలపై యుఎస్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 25-జూలై 29 వరకు ట్రంప్.. స్కాట్లాండ్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17-19 మధ్య ట్రంప్ యూకే పర్యటన ఉందని ఆమె స్పష్టం చేశారు. -
టీఆర్ఎఫ్ ఓ ఉగ్ర సంస్థ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన లష్కరే తొయిబా జేబు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది. పహల్గాంలో 26 మందిని విచక్షణారహిత కాల్పులతో బలిగొన్న ఉగ్రవాద దాడికి స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఇది జమ్మూకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పుట్టుకొచ్చిన లష్కరే జేబు సంస్థ. కశ్మీర్లో భద్రతా బలగాలపై, పౌరులపై పలు దాడులకు పాల్పడింది. లౌకిక సంస్థ ముసుగులో మతపరమైన దాడులను కొనసాగించింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సంస్థకు పాకిస్తాన్ నుంచి నిధులు, మద్దతు అందుతున్నాయి. పహల్గాం మారణకాండను 2008లో ముంబైలో లష్కరే జరిపిన దాడుల తర్వాత భారత్పై జరిగిన అత్యంత ప్రాణాంతక ఉగ్ర దాడిగా అమెరికా అభివర్ణించింది. కశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలిచే టీఆర్ఎఫ్ పహల్గాం ఉగ్ర దాడి తన పనేనని తొలుత ప్రకటించింది. తర్వాత ఈ దాడి కారణంగా భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంతో ప్రకటనను వెనక్కు తీసుకుంది. స్వాగతించిన భారత్టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా మధ్య సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టీఆర్ఎఫ్ కార్యకలాపాలను, దానికి నిధులను అంతర్జాతీయ స్థాయిలో అడ్డుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అస్సలు ఉపేక్షించకూడదన్న నినాదానికి భారత్ కట్టుబడి ఉందని, ఉగ్రవాద సంస్థలు, వారి ముసుగు సంస్థలు జవాబుదారీగా ఉండేలా చేయడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిపి పని చేయడాన్ని కొనసాగిస్తామని తెలిపింది. ‘టీఆర్ఎఫ్ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా గుర్తించినందుకు అమెరికా విదేశాంగ శాఖను, మంత్రి రూబియోకు మా అభినందనలు. ఉగ్రవాదంపై పోరులో భారత్–అమెరికా సహకారానికి ఇది తాజా నిదర్శనం’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. గత ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పీఓకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇది ఇరు దేశాల నడుమ సాయుధ ఘర్షణకు దారితీయడం, పాక్ విజ్ఞప్తి మేరకు చివరికి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం తెలిసిందే. -
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. బీఎల్ఏ దాడిలో సైనికులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీకి మరో బిగ్ షాక్ తగిలింది. పాక్ ఆర్మీ బస్సుపై బలోచ్ లిబరేషన్ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక, బలోచ్ లిబరేషన్(బీఎల్ఏ).. గత ఆరు నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని హతమార్చడం గమనార్హం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీపై మరోసారి బీఎల్ఏ దాడులపర్వం కొనసాగుతోంది. తాజాగా క్వెట్టా, కలాట్, జహు ప్రాంతాల్లో తాము దాడి చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాక్ ఆర్మీ ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడీ బాంబులతో దాడి చేసింది. దాడి సమయంలో పాక్ సైనికులు సహా 48 మంది బస్సులో ప్రయాణిస్తున్నారని ప్రకటించింది. దాడి సందర్భంగా 29 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టు బీఎల్ఏ పేర్కొంది. పదులు సంఖ్యలో సైనికులు గాయపడినట్టు బీఎల్ఏ తెలిపింది. అయితే, ఆరు నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని బీఎల్ఏ హత మార్చింది. According to a statement by the #Baloch Liberation Army (#BLA), 29 #PakistanArmy personnel were killed in two coordinated attacks in #Balochistan - one near #Quetta and another near #Kalat. pic.twitter.com/VwjzDIMb9s— IDU (@defencealerts) July 17, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేర్వేరు ఆపరేషన్లలో పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే దాడులు చేస్తోంది. #IndiaTodayExclusive: The Baloch Liberation Army (BLA) has launched one of its deadliest offensives yet, killing 29 in a bus attack targeting Pakistani soldiers in Quetta and Kalat. This marks the highest death toll for Pakistan’s forces in six months.In the first half of 2025… pic.twitter.com/tLyLhXHBKM— India Today Global (@ITGGlobal) July 17, 2025 -
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలో నరమేధంలోనూ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదానికి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో పురోగతి లభించింది. కేంద్రం భద్రతా సంస్థల దర్యాప్తులో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు కెమెరాలు అమర్చిన హెల్మెట్లు ధరించి 26మంది అమాయాకుల ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ప్రాణాలు తీసే సమయంలో దాడిని వీడియో రికార్డు చేసుకున్నారు.అనంతరం, హింసాత్మక చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ.. టూరిస్టుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు రక్షణగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు తుపాకుల్ని తెచ్చి వారికి ఇచ్చారు. ఆ తుపాకుల్ని గాల్లోకి ఎక్కుపెట్టి కాల్పులు జరిపి రాక్షసానందం పొందినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు ఎన్ఐఏకి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో మరణించిన 26మంది టూరిస్టులు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్కు చెందిన ఓ పర్యాటకుడు, పహల్గాంకు చెందిన స్థానికుడు ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలు సుశీల్ నాథ్యాల్ – ఇండోర్సయ్యద్ ఆదిల్ హుస్సైన్ షా – హపత్నార్, తహసిల్ పహల్గాంహేమంత్ సుహాస్ జోషి – ముంబైవినయ్ నార్వాల్ – హర్యానాఅతుల్ శ్రీకాంత్ మోని –మహారాష్ట్రనీరజ్ ఉదావాని – ఉత్తరాఖండ్బిటన్ అధికారి – కోల్కతాసుదీప్ నియుపానే – నేపాల్శుభం ద్వివేది – ఉత్తరప్రదేశ్ప్రశాంత్ కుమార్ సత్పతి – ఒడిశామనీష్ రంజన్ – బీహార్ఎన్. రామచంద్ర – కేరళసంజయ్ లక్ష్మణ్ లల్లీ – ముంబైదినేష్ అగర్వాల్ – చండీగఢ్సమీర్ గుహార్ – కోల్కతాదిలీప్ దసాలీ – ముంబైజే. సచంద్ర మోలీ – విశాఖపట్నంమధుసూదన్ సోమిశెట్టి – బెంగళూరుసంతోష్ జాఘ్డా – మహారాష్ట్రమంజు నాథ్ రావు – కర్ణాటకకస్తుబ గంటోవత్య – మహారాష్ట్రభరత్ భూషణ్ – బెంగళూరుసుమిత్ పరమార్ – గుజరాత్యతేష్ పరమార్ – గుజరాత్టగెహాల్యిగ్ – అరుణాచలప్రదేశ్శైలేష్భాయ్ హెచ్. హిమత్భాయ్ కళాథియా – గుజరాత్ఆపరేషన్ సిందూర్తో చావు దెబ్బ కొట్టిన భారత్పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మే7న (మంగళవారం) అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ప్రపంచ దేశాల ముందు పాక్ను భారత్ను దోషిగా నిలబెట్టింది. -
ఇకనైనా చైనా మారేనా?
గల్వాన్ లోయలో భారత, చైనాల మధ్య ఘర్షణలు జరిగిన అయిదేళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ఇతర దేశాల విదేశాంగమంత్రులతోపాటు కలవటమేకాక, చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో ముందు రోజు భేటీ అయ్యారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఇరుగుపొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందునా చైనా వంటి దేశం పొరుగున వుంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకూ వుందన్న అంశంలో మాత్రమే కాదు... పాకిస్తాన్తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవటం చైనాకు అలవాటైంది. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా మోకాలడ్డుతోంది. ఇలాంటి సమస్యలెన్ని వున్నా సామర స్య వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవటమే విజ్ఞత. అందుకే అయిదేళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటుచేసుకోవటం హర్షించదగ్గది. నిరుడు అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కలుసుకున్నారు. ఉభయ దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అటు తర్వాత మధ్య మధ్యలో చైనా వ్యవహార శైలివల్ల ఇబ్బందులేర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలూ ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. సరిహద్దుల్లోని డెమ్చోక్,డెస్పాంగ్ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలూ నిరుడు అక్టోబర్లో నిర్ణయించ టంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. కానీ మొన్న ఏప్రిల్లో హఠాత్తుగా విద్యుత్ వాహనాల తయారీలో, ఏఐ సహా అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధ కమవుతాయి. ఈ సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్య పడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరుచుకోవాల్సిన అవసరం వున్నదని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ అన్నట్టు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై వున్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో రెండూ అతి పెద్ద మార్కెట్లు. కానీ వృథా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత రెండు దేశాలనూ ఆవరిస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎస్సీఓ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనాలో జరగబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. కనుక ఈలోగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచు కోవటానికి కృషి చేయాల్సి వుంది. కశ్మీర్లోని పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడిచేయటం, అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’తో మన దేశం గట్టిగా జవాబీయటం వంటి పరిణామాల్లో చైనా, పాకిస్తాన్ వైపే నిలబడింది. ఇక దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించటాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించటానికి వీల్లేదు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతేమీ లేదని బంగ్లాదేశ్ చెప్పినా, పాకిస్తాన్ మాత్రం భవిష్యత్తు త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది. ఇదిగాక అమెరికాలో ట్రంప్ ఆగమనం తర్వాత ఆ దేశం బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా అస్పష్టంగా వుంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మనతో కలిసి కూటమి కట్టిన అమెరికా, దానిపై కూడా తన వైఖరేమిటని చెప్పటం లేదు. తన మనసులోని మాట చెప్పకుండా ఈ మధ్య జపాన్, ఆస్ట్రేలియాలతో జరిపిన సమావేశంలో తైవాన్ విషయంలో చైనా దూకుడు నిర్ణయం తీసుకుంటే మీ చర్యలెలావుంటాయంటూ ట్రంప్ ఆరా తీశారు. అమెరికా ఏం చేస్తుందో, ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియకుండా హామీ ఇవ్వటానికి రెండు దేశాలూ నిరాకరించాయి. ఆస్ట్రేలియా అయితే నేరుగానే అది తన సమస్య కాదన్నట్టు మాట్లాడింది. కనుక స్వీయ ప్రయోజనాల రీత్యా చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు.అయితే మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్సీఓలో మంగళవారం మాట్లాడిన జైశంకర్ నిర్మొహమాటంగానే మన వైఖరేమిటో చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులతో పోరాడాల్సి వుంటుందని ఆయన ప్రకటించారు. పెహల్గాం దాడి జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రని చెప్పటంతోపాటు ఎస్సీఓ తన ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్కు మద్దతీయటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతేతప్ప పాక్ తప్పులన్నిటినీ భుజాన మోసుకెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు తెస్తుందని చైనా గుర్తించాలి. -
వారి ఆదేశాలతోనే ఉగ్రదాడి.. ‘పహల్గామ్’పై సంచలన నివేదిక
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్కు చెందిన రాజకీయ నేతలు, సైనిక అధికారుల ఆదేశాల మేరకే జరిగిందని, ఇది పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)చేసిన కుట్ర అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఉగ్రదాడి అనంతరం మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది.పహల్గామ్ దాడికి విదేశీ ఉగ్రవాదులను మాత్రమే మోహరించాలని, పూర్తి గోప్యతను పాటించాలని, కశ్మీరీ ఉగ్రవాదులను తీసుకోవద్దని ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ .. లష్కర్ కమాండర్ సాజిద్ జట్కు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చిందని భద్రతా వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా జమ్ముకశ్మీర్ ఉంటున్న విదేశీ ఉగ్రవాదుల ప్రమేయంతో ఈ దాడులకు పాల్పడాలని కూడా వారు సూచించారని సమాచారం. స్థానిక ఉగ్రవాదులు ఈ ఘటనలో పాల్గొనలేదని ఒక సీనియర్ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు ప్రాక్సీ గ్రూప్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. దాడి చేసిన ఇద్దరూ పాకిస్తాన్ జాతీయులుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో ఇద్దరు స్థానికులను అరెస్ట్ చేశారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ ఈ ఉగ్ర దాడికి ప్రతిస్పందించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బాంబు దాడులు చేసి, వందమంది ఉగ్రవాదులను అంతమొందించింది. -
పాకిస్థాన్లో 'రామాయణం' నాటకం.. ఫొటోలు వైరల్
అవును మీరు విన్నది నిజమే. దాయాది దేశం పాకిస్థాన్లోని కరాచీలో 'రామాయణ' గాథని నాటకంగా ప్రదర్శించారు. ఈ స్టేజీ షోకు అద్భుతమైన ఆదరణ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి జనాలు కూడా బాగానే వచ్చారండోయ్. ఇంతకీ అసలెలా ఇది సాధ్యమైంది? నాటకం వేసింది ఎవరు?పాకిస్థాన్ పేరు చెప్పగానే ఉగ్రదాడులు, మత కల్లోలాలు లాంటివే గుర్తొస్తాయి. కానీ ఆ దేశంలోనూ ఇప్పుడు రామాయణ గాథని నాటకం వేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కరాచీ నగరానికి చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాలతో పాటు మరికొందరు నాటక రంగంపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్తో పాటు వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. వీళ్లంతా తన బృందానికి 'మౌజ్' అని పేరు పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)గతేడాది నవంబరులో తొలిసారి ఓ ఆర్ట్ గ్యాలరీలో రామాయణ నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని హంగులు జోడించి, ఏఐ టెక్నాలజీని కూడా కాస్త ఉపయోగించి తాజాగా మూడు రోజుల పాటు నాటకాన్ని కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్లో మరోసారి ప్రదర్శించారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది.రామాయణ నాటకాన్ని ప్రదర్శించినందుకు తమకు ఎలాంటి విమర్శలు, బెదిరింపులు రాలేదని దర్శకుడు యోగేశ్వర్ కరేరా చెప్పుకొచ్చారు. ఈ పురాణ గాథకు విశేషాదరణ దక్కిందని అన్నారు. ఏదైతేనేం పాక్ దేశంలో రామాయణ నాటకం ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత) -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఝలక్.. ప్రధాని కీలక ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని గద్దె దింపేసి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆ పదవిని చేపట్టాలని భావిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం వదంతులేనంటూ కొట్టిపారేశారు. జర్దారీ ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగుతారన్నారు.‘ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ దేశాధ్యక్ష పదవిపై ఎన్నడూ ఆసక్తి వ్యక్తం చేయలేదు. ప్రస్తుతానికి అటువంటి ప్రణాళిక కూడా ఏదీ లేదు’అని ఆయన స్పష్టం చేశారు. మునీర్, జర్దారీ మధ్య సానుకూల సంబంధాలున్నాయి. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవముంది. పాకిస్తాన్ అభివృద్ధి, పురోగమనమే వీరిద్దరి లక్ష్యం కూడా’అని ప్రధాని వివరించారు.‘జర్దారీ, మునీర్, షరీఫ్లే లక్ష్యంగా తప్పుడు జరుగుతోంది. దీని వెనుక విదేశీ శక్తులున్న సంగతి మాకు తెలుసు. జర్దారీ స్థానంలో ఆర్మీ చీఫ్ మునీర్ రానున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తి అసత్యాలు. దీనిపై ఎలాంటి చర్చలు జరగలేదు. అటువంటి యోచన కూడా లేదు’ అంటూ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్ నక్వీ ఎక్స్లో చేసిన ప్రకటన అనంతరం ప్రధాని ఈ మేరకు వివరణ ఇవ్వడం విశేషం. ప్రధాని పదవిని షహబాజ్కు, అధ్యక్ష బాధ్యతలను జర్దారీకి అప్పగించేందుకు అధికార కూటమిలో గతేడాది ఒప్పందం కుదిరింది. ఆ మేరకు జర్దారీ ఐదేళ్ల కాలానికి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అణు కార్యక్రమంపై ప్రకటన..ఇదే సమయంలో.. భారత్తో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతలు అణు ఘర్షణలకు దారితీయొచ్చనే ఆందోళనలను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోసిపుచ్చారు. ఇస్లామాబాద్లోని విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ.. అణు కార్యక్రమం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసమే వాటిని వినియోగిస్తామని వెల్లడించారు. భారత్- పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో 55 మంది తమ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై పాశవిక ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఆ తర్వాత ఇస్లామాబాద్ ఎదురుదాడికి దిగగా.. భారత్ వాటిని సమర్థంగా అడ్డుకుంది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. -
పాక్ యువ నటి మృతి.. పోస్ట్మార్టం రిపోర్టులో సంచలన విషయాలు!
పాక్ నటి హుమైరా అస్గర్ మృతి కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. కరాచీలోని తన నివాసంలో హుమైరా విగతజీవిగా కనిపించింది. ఈ నెల 9న ఆమె మృతదేహన్ని ఫ్లాట్లో గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే హుమైరా పోస్టుమార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయం బయటపడింది. ఆమె మరణించి దాదాపు తొమ్మిది నెలలు అయిందని అక్కడి స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆమె నివసిస్తోన్న అపార్ట్మెంట్లోని ఫ్లోర్లో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం బయటికి రాలేదని తెలుస్తోంది.కాగా.. నటి చివరిసారిగా ఫోన్ కాల్ అక్టోబర్ 2024లో చేసిందని పోలీసులు గుర్తించారు. అదే ఆపార్ట్మెంట్లో నివసించేవారు కూడా ఆమెను చివరిసారిగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో చూశామని పోలీసులకు తెలిపారు. అంతేకాకుండా హుమైరా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదు.. చివరిసారి సెప్టెంబర్ 2024లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఈ లెక్కన ఆమె గతేడాదిలోనే మరణించినట్లు తెలుస్తోంది.మరోవైపు నటి భౌతికకాయాన్ని తీసుకునేందుకు ఆమె కుటుంబసభ్యులు నిరాకరించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని తండ్రి, రిటైర్డ్ ఆర్మీ వైద్యుడు డాక్టర్ అస్గర్ అలీ పోలీసులకు తెలిపారు. చాలా రోజుల క్రితమే తనతో సంబంధాలు తెంచుకున్నామని ఆయన అన్నారు. పోలీసులు మొదట హుమైరా సోదరుడిని ఆమె ఫోన్ ద్వారా సంప్రదించగా.. తన తండ్రితోనే మాట్లాడాలని చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీంతో సింధ్ సంస్కృతి విభాగం హుమైరా అంత్యక్రియల ఏర్పాట్లు చేసేందుకు ముందుకొచ్చింది.హుమైరా రియాలిటీ షో తమషా ఘర్లో నటించింది. ఆ తర్వాత 2015 యాక్షన్-థ్రిల్లర్ చిత్రం జలైబీలో కూడా కనిపించింది. ఆమె పాకిస్తానీ చిత్రంలో మోడల్గా కనిపించింది. హుమైరా జస్ట్ మ్యారీడ్, చల్ దిల్ మేరే, ఎహ్సాన్ ఫరామోష్, గురు వంటి పాకిస్తాన్ సీరియల్స్లో నటించింది. హుమైరా చివరిసారిగా ఫర్హాన్ సయీద్, సోన్యా హుస్సిన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ వ్యాక్సిన్ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ 2021లో విడుదలైంది. -
ఒక్క సాక్ష్యమైనా ఉందా?
చెన్నై: ఆపరేషన్ సిందూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ మండిపడ్డారు. ఈ ఆపరేషన్లో భారత్కు నష్టం వాటిల్లినట్లు కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా? కనీసం ఒక గాజు ముక్క అయినా పగిలినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్కు గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు. ఈ ఆపరేషన్లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడి యాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటీ–మద్రాసు 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టంచేశారు. ఎవరు(ఉగ్రవాదులు) దాక్కున్నారో తమకు తెలుసని, మే 7వ తేదీన కేవలం 23 నిమిషాల్లో తొమ్మిది శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దుకు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని తెలిపారు. అవన్నీ పాకిస్తాన్ ఫొటోలే.. ‘‘పాకిస్తాన్లో 13 ఎయిర్బేస్లు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందురోజు, తర్వాతి రోజు ఫొటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్లోని సర్గోధా, రహీంయార్ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్కు సంబంధించిన ఫొటో ఒక్కటైనా ఉందా? అలాంటప్పుడు భారత్కు నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా అది చేసింది, ఇది చేసింది అంటూ అంతర్జాతీయ మీడియా చెబుతున్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలి. పాకిస్తాన్పై దాడులు చేసి వెనక్కి వస్తుండగా ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది’’ అని అజిత్ దోవల్ వివరించారు. ఏఐ ఒక గేమ్ చేంజర్ యుద్ధ తంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకమని అజిత్ దోవల్ చెప్పారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ క్షిపణులు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్, కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నవేనని గుర్తుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఒక గేమ్చేంజర్ అని తెలియజేశారు. దానిని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు. -
బలూచిస్తాన్: ఐడీ కార్డు చూసి ప్రయాణికుల్ని కాల్చేశారు!
బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘోరం జరిగింది. బస్సుల్లో వెళ్తున్న కొందరిని తుపాకులతో వచ్చిన దుండగులు అపహరించారు. ఆపై సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు తనిఖీలు చేసి మరీ కిరాతకంగా కాల్చి చంపారు.బలూచిస్తాన్ ప్రావిన్స్లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పలు బస్సుల నుంచి ప్రయాణికులను తుపాకులు చూపించి బెదిరించి ఎత్తుకెళ్లారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు పరిశీలించి కాల్చి చంపారు. శరీరం నిండా తుట్లతో 9 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారి ఒకరు ప్రకటించారు. ఘటనకు కారకులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పాక్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. దుండగుల కోసం భద్రతాల బలగాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉంటే.. బలూచ్ వేర్పాటువాద మిలిటెంట్ గ్రూపులు గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాయి. ఇందులో బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) అత్యంత బలమైంది. అఫ్గనిస్తాన్-ఇరాన్ సరిహద్దుల గుండా ఇది స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే పాక్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. Pakistan Bus Attack: Gunmen Kill 9 Punjabi Passengers in Balochistan After Checking ID Cards#Balochistan #Pakistan https://t.co/seQhPWzqLJTo get epaper daily on your whatsapp click here: https://t.co/Y9UVm2LHAx— Free Press Journal (@fpjindia) July 11, 2025బలూచిస్తాన్ అత్యంత అరుదైన ఖనిజాలకు మూలం. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వనరులను పంజాబ్ ప్రావిన్స్కు దోచిపెడుతోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్ నుంచి వాహనాలను, ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తూ వస్తోంది.గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్లో వరుస హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ గురైంది. బొలాన్ జిల్లాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్ చేసింది. అందులో 30 మందిని కాల్చి చంపింది. మరో 215 మందిని బందీలుగా తీసుకుంది. బందీలలో ఎక్కువ మంది సైనికులు, పోలీసు, ISI, యాంటీ టెర్రరిజం ఫోర్స్ సభ్యులుగా ఉండడం గమనార్హం. పాక్ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి.. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దాడులు జరిపింది. అంతకు ముందు.. 2024 ఆగస్టులో ముసాఖేల్ జిల్లాలో 23 మంది ప్రయాణికులను ఐడెంటిటీ కార్డులు అడిగి కాల్చి చంపింది బీఎల్ఏ. -
ముంబై ఉగ్ర దాడులను ప్రత్యక్షంగా పర్యవేక్షించా
ముంబై: పదహారేళ్ల క్రితం ముంబైలో పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం వెనక తన పాత్ర ఉందని ఆ దేశానికి చెందిన ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా అంగీకరించాడు. ఆ క్రమంలో పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ‘‘ముంబై దాడుల వెనక పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తముంది. నేను ముంబైలోనే ఉండి దాడులను పర్యవేక్షించా. పథకం ప్రకారమే ఆనాడు ముంబైలో ఉన్నా. భారత్లో ఉంటూ పాక్కు, ఆ దేశ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్గా పనిచేశా’’అని విచారణలో వెల్లడించాడు. కెనడా పౌరసత్వం, పాక్ మూలాలున్న రాణాను అమెరికా అరెస్టు చేసి విచారణ నిమిత్తం భారత్కు అప్పగించడం తెలిసిందే. తిహార్ జైలులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ దర్యాప్తు నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈ క్రమంలో అతను పలు సంచలన విషయాలను వెల్లడించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. పక్కాగా లక్ష్యాల ఎంపిక తన చిన్ననాటి స్నేహితుడు, ముంబై ఉగ్ర దాడి సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి పాక్లో లష్కరే ఉగ్ర శిక్షణ శిబిరాలకు పలుమార్లు హాజరైనట్టు రాణా వెల్లడించాడు. ‘‘మేమిద్దరం అక్కడ శిక్షణ తీసుకున్నాం. ముంబైలో పాగా వేసేందుకు అక్కడ ఇమిగ్రేషన్ కార్యాలయం పెట్టే ఆలోచన నాదే. దాని ముసుగులో పలు ఆర్థిక లావాదేవీలు జరిపా. 2008 నవంబర్ 26న మొదలైన ముంబై దాడుల వేళ నగరంలోనే ఉండి, మా ప్లాన్ సక్రమంగా అమలవుతోందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించా. ఎక్కడెక్కడ దాడులు చేయాలి, అందుకు ఏ ప్రాంతాలు అనువైనవి, ఎక్కడైతే ప్రాణనష్టం భారీగా ఉంటుందని అన్నీ బేరీజు వేసుకున్నా. ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వేస్టేషన్ తదితరాలను దాడులకు ఎంపిక చేసుకున్నాం. అందుకు ఐఎస్ఐ సాయపడింది. పాక్ సైన్యానికి నమ్మినబంటును గనకే ఖలీజ్ యుద్ధం వేళ నన్ను సౌదీ అరేబియాకు పంపారు’’అని చెప్పాడు.హెడ్లీతో సహవాసం ‘‘హెడ్లీ, నేను 1974–79 మధ్య హసన్ అబ్దల్ క్యాడెట్ కాలేజీలో కలిసి చదువుకున్నాం. హెడ్లీ తండ్రి పాకిస్తానీ, తల్లి అమెరికన్. సవతి తల్లి పోరు పడలేక తను అమెరికా పారిపోయి కన్నతల్లితో ఉండేవాడు. 2003–04 మధ్య హెడ్లీ, నేను లష్కరే ఉగ్రశిక్షణ తీసుకున్నాం. ఉగ్ర దాడుల కంటే నిఘా కార్యకలాపాల్లో లష్కరేది క్రియాశీల పాత్ర అని హెడ్లీ చెప్పాడు. ముంబైలో నేను తెరిచిన ఇమిగ్రేషన్ ఆఫీసు మా ఉగ్ర నిఘా కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. దాన్ని ఓ మహిళ నడిపేది. 2008లో దాడులకు వారం ముందు భారత్ వచ్చా. నవంబర్ 20, 21 తేదీల్లో ముంబైలోని పోవాయ్ ప్రాంతంలో హోటల్లో దిగా. దాడులకు ముందే ముంబై వీడా. దుబాయ్ మీదుగా బీజింగ్ చేరుకున్నా. పాకిస్తాన్ అధికారులు సాజిద్ మిర్, అబ్దుల్ రహా్మన్ పాషా, మేజర్ ఇక్బాల్ నాకు తెలుసు’’అని రాణా చెప్పాడు. హెడ్లీ తప్పుడు డాక్యుమెంట్ల సాయంతో భారత్ రావడానికి రాణా సాయపడ్డట్టు దర్యాప్తులో తేలింది. -
భారత్-పాక్లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, దానిని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని.. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని ప్రధాని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తున్నదో స్పష్టమైన ఆధారాలతో భారత్ పదేళ్లుగా చూపిస్తున్నదన్నారు. కాగా ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో బ్రిక్స్ గ్రూపు నేతలు ఉగ్రవాద చర్యలను నేరపూరితమైనంటూ తీవ్రంగా ఖండించారు. జమ్ముకశ్మీర్లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు.ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని రియో డి జనీరో డిక్లరేషన్ పేర్కొంది. కాగా పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించి, పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. -
ఉగ్రవాదుల్ని భారత్కు అప్పగిస్తావా?.. నువ్వెలా ప్రకటిస్తావ్?
కరాచీ: ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్లను భారత్కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం ఖతార్కు చెందిన ఆల్ జజీర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భారత్ ఆ ఉగ్రవాదుల్ని అప్పగించాలని కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బిలావాల్.లష్కరే తోయిబా (ఎల్ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్తో నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎటువంటి అభ్యంతరం చెప్పదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు భారత్లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్ సహకరించాలన్నారు. ఇందుకు భారత్ ప్రభుత్వం సహకరిస్తే, పాకిస్తాన్ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. భారత్ ఆందోళన చెందుతున్న సంబంధిత వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలు చేశారని ప్రకటనగా మాత్రమే ఉందని, ఈ క్రమంలో భారత్ సహకరించి న్యాయపరంగా ముందుకు వెళతామంటే వారిని(సంబంధిత ఉగ్రవాదుల్ని) భారత్కు అప్పగిస్తామన్నారు.నున్వెలా ప్రకటిస్తావ్!బిలావల్ భుట్టో ప్రకటనపై ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్రంగా మండిపడ్డారు. బిలావాల్ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసినట్లేనని తల్హా విమర్శించారు. ఈ విషయంలో బిలావాలో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్లు కలిసి..!
తమ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా దుష్ర్పచారాం చేస్తోందని ప్రాన్స్ సంచలన ఆరోపణలు చేసింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్ యుద్ధ విమానాల అమ్మకాలను చైనా దెబ్బతీస్తోందని ఫ్రాన్స్ ఆరోపించింది. పలు దేశాల్లో చైనా రాయబార కార్యాలయాల్లో పని నేసే దౌత్య, రక్షణ ప్రతినిధులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని ఫ్రాన్స్ మండిపడుతోంది. ఫేల్ విమానాలను కొనుగోలు చేయవద్దని, వాటి స్థానంలో చైనా తయారీ జెట్లను తీసుకుంటే మంచిదని వివిధ దేశాలను ఒప్పించే యత్నాలు జరగుఉతున్నాయని ఫ్రెంచ్ వర్గాల వెల్లడించాయి. తమ దేశం అధికంగా విమానాల అమ్మకాలనై అత్యధికంగా ఆధారపడిన దేశమని, దాన్ని చైనా దెబ్బ కొట్టడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు ప్రాన్స్ చెబుతోంది. చైనా తన అధికారిక బలంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫ్రాన్స్ అంటోంది. పాకిస్తాన్, చైనా కలిసి ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఫ్రాన్స్ విమర్శించింది. ఈ దుష్ప్రచారంలో భాగంగా, గత మే నెలలో భారత్తో జరిగిన ఘర్షణలో మూడు రఫేల్ విమానాలతో సహా ఐదు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చేసిన వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని తెలిపింది. ఏఐతో మార్ఫింగ్ చేసిన యుద్ధ విమానాల శిథిలాలను చూపిస్తూ చైనా టెక్నాలజీ అమోఘమనే భావనను వారు కల్గిస్తున్నారని తెలిపింది. రఫెల్ అనేది యుద్ధ విమానం మాత్రమే కాదని, అది ఫ్రాన్స్ వ్యూహాత్మక సామర్థ్యానికి, నమ్మకానికి ప్రతీక ఫ్రాన్స్ పేర్కొంది. ఇప్పుడే దాన్నే చైనా తన అధికారిక బలాన్న ఉపయోగించి దుష్ప్రచారానికి దిగినట్లు ఫ్రాన్స్ ధ్వజమెత్తింది.రఫెల్ యుద్ధ విమానాలకు తయారు చేసే డసెల్ట్ ఏవియేషన్ 533 జెట్స్ను వివిద దేశాలకు అమ్మింది. ఈజిప్ట్, భారత్, ఖతర్, గ్రీస్, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా, ఇండోనేషియా తదితర దేశాలకు ఫ్రాన్స్ తమ యుద్ధ విమానాలను విక్రయించింద. ఇప్పటివరకూ ఇండోనేషియా 42 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయగా, మరిన్ని రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది. -
పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం మూసివేత
ప్రపంచ టాప్ టెక్ కంపెనీలో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ కార్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లో తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో 25 సంవత్సరాలుగా సర్వీసులు అందిస్తున్న కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా తన సర్వీసులను ముగించినట్లయింది. కంపెనీ గ్లోబల్ వర్క్ఫోర్స్ తగ్గింపు వ్యూహంలో భాగంగా పాకిస్థాన్లో ఈమేరకు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఇప్పటికే స్థానికంగా ఉన్న క్లయింట్లకు క్షేత్రస్థాయిలో సర్వీసులు అందించేందుకు కంపెనీ ప్రాంతీయ కేంద్రాలు, అధీకృత రీసెల్లర్ల ద్వారా రిమోట్ సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుత కస్టమర్ ఒప్పందాలు, సేవలు ప్రభావితం కాకుండా కొనసాగుతాయని తెలిపింది. ఆయా కంపెనీలకు నిత్యం మద్దతుగా నిలుస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. పాకిస్థాన్లో కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల స్థానికంగా కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే ప్రభావితం చెందినప్పటికీ అక్కడి వ్యాపార, సాంకేతిక వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.భారతదేశంలో మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్లో అభివృద్ధి లేదా ఇంజినీరింగ్ సర్వీసులు స్థాపించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. కేవలం అక్కడి యూనిట్ ద్వారా తన ప్రోడక్ట్లను ఇతర కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, అమ్మకాల కార్యకలాపాలకే పరిమితం చేసింది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఉద్యోగాల కోతకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవల మొత్తంగా కంపెనీలో పని చేస్తున్న 9,000 పైగా ఉద్యోగాలను తగ్గించింది. ఈ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణమే సంస్థ పాకిస్థాన్ నుంచి నిష్క్రమించేందుకు కారణమని ఆ దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పాక్ లైసెన్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ వంటి ప్రధాన విధులను కొన్ని సంవత్సరాలుగా ఐర్లాండ్లోని తన యూరోపియన్ హబ్కు మారుస్తోంది.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురుఅంతర్జాతీయంగా చాలాదేశాల్లో పాకిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధించి వ్యతిరేకత ఉంది. స్థానికంగా పేదరికం పెరుగుతోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఏటా దారుణంగా క్షీణిస్తోంది. దాంతో చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను పరిమితం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీ ఇలా మొత్తంగా తన కార్యాలయాన్ని షట్డౌన్ చేయడం అక్కడి టెక్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. -
సైఫ్ అలీ ఖాన్కు చుక్కెదురు.. చేజారిన రూ.15 వేల కోట్లు
భోపాల్లోని పూర్వీకుల ఆస్తులకు సంబంధించి సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. తన ముత్తాత పాకిస్తాన్కు వలస వెళ్లిన కారణంగా రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను "శత్రువుల ఆస్తి"గా న్యాయస్థానం గుర్తించింది. సైఫ్ అలీ ఖాన్, ఆయన సోదరీమణులు సోహా, సబా, తల్లి షర్మిలా ఠాగూర్ తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో వారు రూ. 15 వేల కోట్ల ఆస్తులపై హక్కులను కోల్పోయారు.సైఫ్ అలీ ఖాన్ ఆస్తి వారసత్వ వివాదాన్ని కొత్తగా విచారించాలని, ఒక సంవత్సరం కాలపరిమితిని నిర్ణయించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 1947లో విభజన తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్లిన వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవడానికి 1968 నాటి శత్రు ఆస్తి చట్టం అనుమతిస్తుందని హైకోర్టు గుర్తుచేసింది.రూ. 15 వేల కోట్ల ఆస్తి స్టోరీ ఎంటి..?బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది.స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది.ప్రభుత్వ వాదనను సైఫ్కు సంబంధించిన లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు.తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చిందని న్యాయస్థానం తెలిపింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. అయితే, తాజాగా పూర్తి విచారణ తర్వాత ఆ రూ. 15 వేల కోట్ల ఆస్తలు 'శత్రువుల ఆస్తి'గానే గుర్తించాలని కోర్టు పేర్కొంది. కానీ, ఒక సంవత్సరంలోపు మళ్లీ పూర్తి విచారణ జరపాలని న్యాయస్థానం సూచించింది. -
ఉగ్రవాదులకు హర్రర్ పిక్చర్.. పాక్ పై భారత్ మరో ఆపరేషన్
-
మళ్లీ పాక్ అబద్ధం.. అజార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నడంటూ..
న్యూఢిల్లీ: భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడైన మసూద్ అజార్ ఎక్కడున్నాడనే విషయంపై పాక్ మరోమారు కల్లబొల్లి కబుర్లు చెప్పింది. అజార్ గురించి తమకేమీ తెలియదని వివరించే ప్రయత్నం చేసింది. కాగా భారత్.. ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్న సమయంలో అజార్తో పాటు అతని సంస్థ జైష్-ఎ-ముహమ్మద్ ప్రధాన కార్యాయాన్ని టార్గెట్ చేసింది. తాజాగా పాక్ సంకీర్ణ నేత బిలావల్ భుట్టో జర్దారీ ఉగ్రవాది మసూద్ అజార్కు సంబంధించిన సమాచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మసూద్ అజార్ 2001లో భారత పార్లమెంటుపై దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019లో జరిగిన పుల్వామా దాడిలో పాల్గొన్నాడు. 2019లో ఐక్యరాజ్యసమితి.. అజార్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో కాందహార్ హైజాక్ తర్వాత ప్రయాణీకులకు బదులుగా అతన్ని విడుదల చేశారు. కాగా అజార్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను అప్పగించాలని భారతదేశం ఎప్పటినుంచో పాకిస్తాన్ను డిమాండ్ చేస్తూ వస్తోంది. పాక్లో మసూద్ అజార్ తలదాచుకుంటున్నాడనే ఆధారాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ తనకేమీ తెలియదంటూ కల్లబొల్లి మాటలు చెబుతోంది.తాజాగా అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో పాకిస్తాన్కు తెలియదని, అతను ఇక్కడే ఉన్నాడని భావిస్తున్న భారత్.. అతనిని అరెస్టు చేయాలని అనుకుంటోందని అన్నారు. సయీద్ స్వేచ్ఛగా ఉన్నాడా? అని ఆయనను మీడియా అడగగా.. దీనికి ఖచ్చితంగా అవునని సమాధానం చెప్పలేమని, అతను పాకిస్తాన్ అదుపులో లేడని, తాము అతనిని అరెస్టు చేయలేకపోయామని, ఎక్కడున్నాడో కూడా గుర్తించలేకపోయామని కూడా భుట్టో అన్నారు. అయితే అతని గత చరిత్రను అనుసరించి చూస్తే, ప్రస్తుతం మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నడని భావిస్తున్నామని అన్నారు.పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ల అనంతరం భుట్టో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వాటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని జైషే-ఏ-మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్నాయి. కాగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పీపీపీ చీఫ్ స్పందిస్తూ, పాకిస్తాన్కు సింధు నీటిని నిరాకరిస్తే యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. సింధు నది తమదేనని ఆయన అన్నారు. -
పాకిస్తాన్పై యుద్ధం ఎందుకు ఆపేశారో మోదీ ప్రభుత్వం చెప్పాలి... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్
-
Video: తప్పించుకుని వచ్చిన పెంపుడు సింహం.. జనాలపై దాడి
లాహోర్: పెంపుడు జంతువుల్లో మనం ఎక్కువగా చూసేది కుక్క. ఈ మధ్య క్రూర మృగాలను కూడా పెంచుకుంటున్న వారు కూడా లేకపోలేదు. క్రూర మృగాలను పెంచుకుంటే ఏమౌతుందో తాజా ఘటనతో అద్దం పడుతోంది,. పాకిస్తాన్లో ఓ కుటుంబం సింహాన్ని పెంచుకుంటుంది. ఇది వారి రాయల్టీకీ సింబాలిక్ ఏమిటో గానీ, ఇప్పుడు అదే సింహం ఇద్దరు చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది. సదరు ఇంటి నుంచి తప్పించుకుని వచ్చిన సింహం.. వీధుల్లో పడింది. తొలుత తప్పించుకున్న సింహం ఓ గొడపై మాటువేసి మరీ జనాలపై దాడి చేసింది. ఈ ఘటన పాకిస్తాన్లో లాహోర్లోని షా దీ కోయి ఏరియాలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి తప్పించుకున్న సింహం.. షాపింగ్ వెళుతున్న మహిళపై ముందుగా దాడికి దిగింది. మహిళను వెంబడించి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాము పెంచుకుంటున్న సింహం.. జనావాసాలపై దాడి చేసిందనే వార్త తెలియగానే ఆ ఇంటి యజమానులు అది చూసి ఆనందించినట్లు పిల్లల్ని కోల్పోయిన తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగితే, శుక్రవారం సింహాన్ని పెంచుకుంటున్న యజమానులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వారు ఇంటి నుంచి పారిపోయారని, కానీ 12 గంటల్లో వారిని అరెస్ట్ చేసినట్లు లాహోర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆపరేషన్స్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆ సింహం 11 నెలల మగ సింహమని, దాన్ని పట్టుకుని వైల్డ్ లైఫ్ పార్క్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.A pet lion, illegally kept in Lahore's Shah Di Khoi area, mauled two children and a woman after escaping. The 5-year-old and 7-year-old are in critical condition at Jinnah Hospital. For more details: https://t.co/UwQpv7eXuA#Lahore pic.twitter.com/h2xI9RhSn5— Daily Pakistan English (@endailypakistan) July 4, 2025 -
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్కు చైనా, తుర్కియే సాయం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్కు దాని మిత్రదేశం చైనా సహకరించిందా? ఇండియాకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసిందా? అంటే అవుననే చెబుతున్నారు భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్.సింగ్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. మే 7 నుంచి 10వ తేదీ దాకా నాలుగు రోజులపాటు ఆ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యం దాడిలో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, లాండ్ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో పాకిస్తాన్కు చైనా సహకరించిందని, ఇండియన్ ఆర్మీ కదలికలకు సంబంధించి రియల్ టైమ్ సమాచారం చేరవేసిందని రాహుల్ ఆర్.సింగ్ తెలియజేశారు. తుర్కియే సైతం పాక్కు అండదండలు అందించిందని, కొన్ని రకాల ఆయుధాలు సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ‘నూతన తరంలో సైనిక సాంకేతికతలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భా రత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకి స్తాన్కు చైనా, తుర్కియేలు చేతనైనంత సాయం చేశాయని పేర్కొన్నారు. ఆ మూడు దేశాల కుట్రను తాము ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. తెరపైన కనిపించింది పాకిస్తాన్ కాగా, తెరవెనుక చైనా, తుర్కియే ఉన్నాయని వెల్లడించారు. #WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm— ANI (@ANI) July 4, 2025అరువు తెచ్చుకున్న కత్తి చైనా తన ఆయుధాల సామర్థ్యం పరీక్షించుకోవడానికి పాకిస్తాన్ను ప్రయోగశాలగా వాడుకుంటోందని రాహుల్ ఆర్.సింగ్ స్పష్టంచేశారు. ఆ ఆయుధాలను చైనా గడ్డపై నుంచి ఇతర దేశాలపైకి ప్రయోగిస్తోందన్నారు. పాక్కు చైనా సహకరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే పాకిస్తాన్కు 81 శాతం మిలటరీ హార్డ్వేర్ చైనా నుంచే వచ్చినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. పాక్ భూభాగం చైనాకు లైవ్ ల్యాబ్గా మారినట్లు తేల్చిచెప్పారు. యుద్ధక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టకుండా ఇండియాపైకి పాకిస్తాన్ను ఉసిగొల్పడమే డ్రాగన్ వ్యూహమని రాహుల్ ఆర్.సింగ్ తెలిపారు. ‘అరువు తెచ్చుకున్న శక్తితో శత్రువును చంపడం’ చైనా ప్రాచీన యుద్ధతంత్రంలో భాగమని గుర్తుచేశారు. సరిహద్దుల్లో ఘర్షణ పడడం కంటే పాకిస్తాన్ను ముందుపెట్టి భారత్కు ఇబ్బందులు సృష్టించడం చైనా ధ్యేయంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చిన కొద్దిరోజులకే తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అప్పట్లో వారు నిర్ణయించుకున్నారు. తుర్కియే అందిస్తున్న సహకారానికి షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెరికా–పాక్ రక్షణ బంధం బలోపేతం!
వాషింగ్టన్: అమెరికా–పాకిస్తాన్ మధ్య రక్షణ బంధం క్రమంగా బలోపేతం అవుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన అపరేషన్ సిందూర్లో భారీగా నష్టపోయిన పాక్ సైన్యం అమెరికాకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్(పీఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇదొక ఉన్నత స్థాయి పర్యటన. పాకిస్తాన్ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో ఇటీవల ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటనలో భాగంగా జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా అత్యున్నత సైనికాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. యూఎస్ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ అల్విన్ను కలుసుకున్నారు. విస్తృతంగా చర్చలు జరిపారు. అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయడం, టెక్నాలజీ ఆధారిత సైనిక మారి్పడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పర్యటనతో అమెరికా–పాక్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివరి్ణంచింది. తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్ నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అమెరికా సాయాన్ని అర్థిస్తోంది. అమెరికా నుంచి 70 ఎఫ్–16 బ్లాక్ ఫైటర్జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఏఐఎం–7 స్పారో ఎయిర్–టు–ఎయిర్ మిస్సైళ్లు, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడడం క్షేమంకాదని ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా సైతం సానుకూలంగా స్పందిస్తుండడం చర్చనీయాంశంగా మారతోంది. -
నీళ్లు నమిలిన క్వాడ్!
అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్లోని పెహల్గామ్లో మొన్న ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది. ‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్గామ్ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్కు జీవం పోసింది అప్పటి ట్రంప్ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది. ఇది జపాన్తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్గామ్ రుజువు చేసింది. మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నట్టు పాకిస్తాన్తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్కూ వున్న వైషమ్యాలపై క్వాడ్ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్గామ్ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు. ‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది. దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ తీర్మానించటం హర్షించదగ్గదే. ఈ ఏడాది చివరిలో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది. -
Pakistan: ‘ఆ 30-45 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు’
ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమ దేశంపైకి దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో హడలిపోయామని పాక్ ప్రధాని షెహబాజ్ సలహాదారు రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో భారత్ ఏమైనా అణు యుద్ధాన్ని ఆరంభించిందా అనే ఆలోచనలో పడ్డామన్నారు. రావల్పిడింలోని తమ ప్రధాన ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్బేస్పై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిన క్రమంలో కాసేపు తాము అలా చూస్తూ ఉండిపోయామన్నారు. ప్రధానంగా 30 నుంచి 45 సెకన్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తమ సైన్యంలో ఏర్పడిందన్నారు. తొలుత అణు యుద్ధంగా భావించామని, తర్వాత తేరుకుని మిసైల్తో దాడి చేశారనే విషయాన్ని గ్రహించామన్నారు.‘ భారత్ న్యూక్లియర్ వార్హెడ్ను భారత్ ఉపయోగించకపోవడంతో వారు మంచి చేశారని నేను చెప్పడం లేదు. మా దేశ ప్రజలు మాత్రం దీనిపై కచ్చితంగా తప్పుగా అర్ధం చేసుకుని ఉంటారు. అది అణు యుద్ధమేనని మా ప్రజలు అనుకుని ఉంటారు. ఒకవేళ అదే జరిగితే తొలి ప్రపంచ న్యూక్లియర్ వార్ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉండేది’ అని రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు.పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఆ బ్రహ్మోస్ క్షిపణి మెరుపుదాడిలో పాకిస్తాన్లో పలు ప్రాంతాలు అతలాకులమయ్యాయి. నూర్ ఖాన్ ఎయిర్బేస్ పరిధిలోని పాకిస్తాన్ శాటిలైట్ వ్యవస్థ నాశనమైంది. పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్బేస్ ప్రాంతంలో భారత్ దాడి చేయడం ఇది తొలిసారి కాదు. 1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సైతం నూర్ ఖాన్ ప్రాంతాన్ని భారత్ టార్గెట్ చేసి పాక్ను కోలునీయకుండా చేసింది. -
భారత్కు రానున్న పాకిస్తాన్ జట్టు..!
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్స్స్టార్కు చెప్పాడు. జూనియర్ హాకీ వరల్డ్కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్ల మధ్య అసలేం జరుగుతోంది?
అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డిన్నర్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్సింధూర్ తర్వాత పాక్ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్(ఫైల్ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్కు భారత్ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యూఎస్కు ట్రంప్ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్ ప్రధానిని పక్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్కు అమెరికా ఎంత సపోర్ట్గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్తో జరిగిన యుద్ధంలో కూడా పాక్కే సపోర్ట్ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్ మ్యాన్కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్లో పాక్ ఆర్మీ అధికారుల దర్శనం ఏమిటి?, అమెరికా-పాక్ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. -
పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం
-
పాకిస్తాన్ సెలబ్రిటీలకు బిగ్ షాకిచ్చిన భారత్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్కు చెందిన సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పాక్ సెలబ్రిటీలు, క్రికెటర్లు సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం మళ్లీ నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్కు చెందిన పలు ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, బుధవారం వారి అకౌంట్లు ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అప్రమత్తమైన కేంద్రం.. వారి ఖాతాలపై మళ్లీ నిషేధం విధించినట్లు సమాచారం.ఇక, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, పాకిస్తానీ క్రికెటర్ల ట్విట్టర్ అకౌంట్స్ అన్నింటినీ భారత్లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్ను కూడా భారత్ బ్యాన్ చేసింది. అయితే బుధవారం నాడు ఈ ఛానెల్స్ అన్నీ భారత్లో ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి.An Indian soldier takes a bullet on the border.A Pakistani influencer takes creator payouts from Indian views.The government banned their content… then quietly unbanned it.This isn't soft diplomacy.This is soft headed.#BanPakContent pic.twitter.com/HlOZNvE2AX— SambhavāmiYugeYuge (Ministry of Aesthetics) (@Windsofchange72) July 2, 2025హనియా అమీర్, మహీరా ఖాన్, క్రికెటర్ షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, సాబా కమర్, అహద్ రజా మిర్ వంటి పాక్ సెలెబ్రిటీల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలు భారత్లో అన్బ్లాక్ అయ్యాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్లో దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ చూసిన భారత నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భారత్లో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై బ్యాన్ తొలగించారా? అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నెటిజన్ల విమర్శల నేపథ్యంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి నిషేధం విధించినట్టు తెలుస్తోంది. -
కఠినంగా ఉన్నా నమ్మాల్సిందే..! ఈ దశాబ్దంలో బాబర్ ఆజమే టాప్ బ్యాటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. అతను అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి దాదాపుగా రెండేళ్లవుతుంది. అతని చివరి సెంచరీ కూడా పసికూన నేపాల్పై (వన్డేలో) సాధించాడు.బాబర్ తన చివరి 10 టెస్ట్ల్లో, 10 వన్డేల్లో, 10 టీ20ల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేదు. హాఫ్ సెంచరీలు కూడా ఎనిమిదే చేశాడు (40 ఇన్నింగ్స్ల్లో). వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన బాబర్.. ప్రస్తుతం జట్టులో చోటును కూడా ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు.కెరీర్లో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా, బాబర్ ఇప్పటికీ టాప్ బ్యాటర్గా ఉండటం నమ్మశక్యంగా లేదు. ఈ దశాబ్దంలో (2020-2025 జూన్ 30 వరకు) అత్యధిక పరుగులు చేసిన అంతర్జాతీయ బ్యాటర్ల జాబితాలో బాబర్ టాప్ ప్లేస్లో ఉన్నాడు.Babar Azam is currently the leading run-scorer of this decade among all international batters.#ViratKohli #RohitSharma #BabarAzam #CricTracker pic.twitter.com/WfD2qA4Y6H— CricTracker (@Cricketracker) July 1, 20252020-2025 మధ్యకాలంలో బాబర్ 202 ఇన్నింగ్స్లు ఆడి 8222 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్లో ఈ దశాబ్దంలో ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 14600 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు, 102 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానంలో కూడా పాక్ ఆటగాడే ఉండటం విశేషం. ఆ జట్టు వన్డే సారధి మహ్మద్ రిజ్వాన్ ఈ దశాబ్దంలో 191 ఇన్నింగ్స్ల్లో 7231 పరుగులు చేశాడు.బాబర్, రిజ్వాన్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ ఉన్నాడు. బ్రూక్ 2020 నుంచి 2025 జూన్ 30 వరకు 151 ఇన్నింగ్స్లు ఆడి 6998 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నారు. ఈ దశాబ్ద ఆరంభంలో పెద్దగా ఫామ్లో లేని కోహ్లి.. ఇప్పటివరకు 173 ఇన్నింగ్స్లు ఆడి 6155 పరుగులు చేయగా.. రోహిత్ 169 ఇన్నింగ్స్ల్లో 5982 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి, రోహిత్ టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. -
పాకిస్తాన్ హెడ్ కోచ్గా కేకేఆర్ మాజీ ప్లేయర్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా ఐపీఎల్ ఆడిన ఓ పాక్ మాజీ ఆటగాడు ఎంపికయ్యాడు. 50 ఏళ్ల అజహార్ మహమూద్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక ప్రాతిపదికన హెడ్ కోచ్గా ఎంపిక చేసింది. ఈ పదవిలో అజహార్ 2026 ఏప్రిల్ వరకు కొనసాగుతాడు. గతేడాది అక్టోబర్లో అజహార్ తొలుత పాక్ ఆల్ ఫార్మాట్ అసిస్టెంట్ కోచ్గా ఎంపికయ్యాడు. తాజాగా ప్రమోషన్ పొంది టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు. ఆకిబ్ జావిద్ నుంచి అజహార్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా అజహార్ ప్రయాణం త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్తో మొదలవుతుంది. అజహార్ పాక్ తరఫున 21 టెస్ట్లు, 143 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీల సాయంతో 2400 పైచిలుకు పరుగులు చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఇతను.. టెస్ట్ల్లో 39, వన్డేల్లో 123 వికెట్లు తీశాడు. అజహార్కు కౌంటీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతను రెండు సార్లు కౌంటీ ఛాంపియన్షిప్ నెగ్గిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. అజహార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన అతి కొద్ది మంది పాక్ ఆటగాళ్లలో ఒకడు. 2012లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఇతను.. నాలుగు సీజన్ల పాటు క్యాష్ రిచ్ లీగ్లో పాల్గొని 23 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 388 పరుగులు చేశాడు. బౌలింగ్లో 29 వికెట్లు పడగొట్టాడు. 2015 సీజన్లో అజహార్ న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ నీషమ్కు ప్రత్యామ్నాయంగా కేకేఆర్ జట్టులో చేరాడు. ఐపీఎల్లో ఇదే అతనికి చివరి సీజన్. అప్పటికే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడనివ్వలేదు. అయితే అజహార్కు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో ఐపీఎల్లో ఆడగలిగాడు. -
భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ మరోసారి భారత్పై నోరుపారేసుకున్నారు. భారత్ ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతోంది అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్ గనుక మరోసారి పాకిస్తాన్పై దాడి చేస్తే.. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ కరాచీలోని నేవల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా మున్నీర్.. భారత్కు వ్యూహాత్మక ముందుచూపు కొరవడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్తాన్ కాపాడుతోంది. భారత్ దూకుడు వేళ పాక్ బలంగా స్పందించింది. ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ పరిపక్వంగా ఆలోచన చేసింది. పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే.. భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. మరోసారి పాకిస్తాన్పై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’ అంటూ హెచ్చరించారు.మరోవైపు.. అంతకుముందు కూడా మునీర్.. భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ నెట్వర్క్కు ఆప్ఘనిస్థాన్ వేదికగా మారిందన్నారు. అక్కడి వారితో పాకిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే, పాక్.. ఆప్ఘనిస్తాన్తో స్నేహ సంబంధాలను కోరుకుంటోంది. కానీ, ఆ దేశం భారత్ పోషిస్తున్న ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడులు పాకిస్తాన్కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్కు కీలకమైన ఎయిర్బేస్లపై భారత్ విరుచుకుపడింది. దీంతో, ఎయిర్బేస్లు ధ్వంసమయ్యాయి. వీటిల్లో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాదాపు 8 కీలక మిలిటరీ స్థావరాలు దెబ్బతిన్నాయి.Pakistan Failed Marshal Asim Munir once again rants & pokes India, reaffirms his support for the continued terrorism against India in Jammu and Kashmir.Also vowed continued political, moral, & diplomatic backing for proxy insurgency.#PakistanIsATerrorState #AsimMunir #Pakistan pic.twitter.com/6zHSA6gk8o— TIger NS (@TIgerNS3) June 29, 2025 -
భారత్పై పాక్ దుష్ప్రచారం.. ‘ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి మీ పనే’..
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి 13మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనను పాకిస్తాన్ భారత్ పైకి నెట్టేసింది. తమ దేశ సైనికుల మరణానికి భారత్ కారణమని ప్రచారం చేస్తోంది. అయితే, పాక్ ప్రచారాన్ని భారత్ ఖండించింది. పాక్ చేస్తున్న ప్రచారం ఆమోదయోగ్యం కాదంటూ ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 28న పాక్ ఉత్తర వజీరిస్తాన్ జిల్లా ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆర్మీ సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ని ఓ అగంతకుడు పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో 13మంది ఆర్మీ సైనికులు మరణించగా..10 మంది గాయాలయ్యాయి. 13 మంది సాధారణ పౌరులు గాయపడినట్లు ప్రముఖ పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. Statement regarding Pakistan 🔗 : https://t.co/oQyfQiDYpr pic.twitter.com/cZkiqY1ePu— Randhir Jaiswal (@MEAIndia) June 28, 2025 ఈ దాడి వెనక భారత్ ఉందంటూ పాకిస్తాన్ అధికారంగా చేసిన ప్రకటనను ఖండించింది. వజీరిస్తాన్లో పాక్ ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రమేయం ఉందని పాక్ అధికారికంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటనను మేం ఖండిస్తున్నాం. ఆమోదయోగ్యం కాదని..విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాక్ మీడియా ఏమంటోంది దక్షిణ వజీరిస్తాన్లో నిఘా ఆధారిత ఆపరేషన్ (IBO)లో ఇద్దరు సైనికులు మరణించి, 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగిందని డాన్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం, 2021లో కాబూల్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది. తమ దేశంలో తమ గడ్డను ఉపయోగించుకొని దాడులకు తెగబడుతోందని తాలిబాన్ల ప్రభుత్వంపై పాక్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ ఆరోపణల్ని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు. కాగా,ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఒకే గ్రూపులో భారత్, పాక్
లుసానే (స్విట్జర్లాండ్): ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోయే జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీలో చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూపులో తలపడనున్నారు. ఇక్కడ ఉన్న అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) హెడ్క్వార్టర్స్లో శనివారం ఈ యువ మెగా టోర్నీకి సంబంధించిన డ్రాను తీశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్, హాకీ ఇండియా కార్యదర్శి భోలానాథ్ సింగ్, డైరెక్టర్ ఆర్.కె.శ్రీవాస్తవ పాల్గొన్నారు. పూల్ ‘బి’లో ఆతిథ్య భారత్తో పాటు పాకిస్తాన్, చిలీ, స్విట్జర్లాండ్ జట్లున్నాయి. ముందెన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 24 జట్లు ప్రపంచకప్ బరిలో ఉన్నాయి. ఈ జట్లను ఆరు పూల్స్గా విభజించారు. ఒక్కో పూల్లో నాలుగు జట్లున్నాయి. భారత్లోని చెన్నై, మదురై వేదికల్లో ఈ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జూనియర్ ప్రపంచకప్ మ్యాచ్లు జరుగుతాయి. జర్మనీ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ పూల్ ‘ఎ’లో ఉంది. గత 2023 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ 2–1తో ఫ్రాన్స్ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది. అయితే ఆ టోర్నీలో 16 జట్లే పోటీపడ్డాయి. కానీ ఈ సారి మరో 8 జట్లు కప్ కోసం పోటీపడతాయి. హాకీ ఇండియా కార్యదర్శి భోళనాథ్ మాట్లాడుతూ ‘ఈ ప్రపంచకప్తో భారత్లో హాకీ శోభ మరింత పెరగనుంది. మౌలిక వసతుల ఆధునీకరణ, మదురైలోని అధునాతన స్టేడియంలో మ్యాచ్లు విజయవంతగా నిర్వహిస్తాం’ అని అన్నారు. ఏ పూల్లో ఏ ఏ జట్లు... పూల్ ‘ఎ’: జర్మనీ, దక్షిణాఫ్రికా, కెనడా, ఐర్లాండ్; పూల్ ‘బి’: భారత్, పాకిస్తాన్, చిలి, స్విట్జర్లాండ్; పూల్ ‘సి’: అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్, చైనా; పూల్ ‘డి’: స్పెయిన్, బెల్జియం, ఈజిప్టు, నబీబియా; పూల్ ‘ఇ’: మలేసియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్; పూల్ ‘ఎఫ్’: ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, కొరియా, బంగ్లాదేశ్. -
పాక్ మళ్లీ మొదలుపెట్టేసింది.,.!
కరాచీ: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. మళ్లీ భారత్పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరికల నేపథ్యంలో వారు కాల్పుల విరమణకు వచ్చారు. ఈ తరహా దాడుల్ని ఊహించని పాక్.. ప్రస్తుతం మళ్లీ తిరిగి భారత్ నేలకూల్చిన నిర్మాణాలను పునః నిర్మించుకునే పనిలో పడింది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలుగా భావిస్తున్న వాటిని తిరిగి నిర్మిస్తోంది. ఇటీవల పాక్కు విదేశీ ఫండింగ్ బాగానే అందడంతో దానిని ధ్వంసమైన ఉగ్రస్థావరాల కోసం కూడా ఖర్చు చేస్తోంది. దాంతో పాటు పాక్ ఆర్మీ క్యాంప్లకు సంబంధించి శాటిలైట్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో దానిని కూడా పునరుద్దరించే పనిలో పడింది. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్ మరియు జంగ్లోరా వంటి ప్రాంతాలలో ఈ మేరక పాకిస్తాన్ పునర్నిర్మాణాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ సహకారంతో, నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలోని దట్టమైన అడవులలో హైటెక్ టెక్నాలజీతో చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి యత్సిస్తున్నట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. అసలు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఉగ్రవాద శిబిరాల పునః నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను అప్పులు చేసి మరీ తిప్పలు తెచ్చకోవడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
పాక్లో ఆత్మాహుతి దాడి.. 13 మంది సైనికులు మృతి
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికుల మృతిచెందారు. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా దూసుకొచ్చిన ఆత్మాహుతి దళంలోని సభ్యుడు.. ఆర్మీ వాహనంపైకి దూసుకొచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది పాక్ సైనికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 19 మంది స్థానికులు, మరో 10 మంది ఆర్మీలోని సైనికులు గాయాలపాలయ్యారు.మిలటరీ కాన్వాయ్ వెళుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ ఒక్కసారిగా ఆ కాన్వాయ్పై దూకాడు. ఆపై వెంటనే తన వెంట తెచ్చుకున్న బాంబును పేల్చేసుకున్నట్లు పాక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో దగ్గర్లో ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలిపారు. అయితే ఇది ఎవరు చేశారు అనే దానిపై ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ తెహ్రిక్-ఈ-తాలిబన్ గ్రూప్ అనేది తరుచుగా పాక్లోని సైనికులే లక్ష్యంగా దాడులు చేయడంతో ఇది కూడా వారే చేసే ఉంటారని అనుమానిస్తున్నారు. ఇది బలూచిస్తాన్ ప్రాంతంలో జరగ్గా, ఇటీవల కాలంలో పాకిస్తాన్లోని పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాన్డోలా చెక్పోస్ట్ పరిధిలో సూసైడ్ బాంబింగ్ జరిగింది. ఇక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపే లక్ష్యంగా దాడి జరిగింది. బలోచ్ మిలిటెంట్లు జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ను అటాక్ చేసిన ఘటనలో 21 మంది ప్రయాణికులు అసువులు బాశారు. ఇక గ్లోబెల్ టెర్రర్ ఇండెక్స్ లో పాకిస్తాన్లోనే అత్యధికంగా ఉంది. పాక్లో ఉగ్రవాదం అనేది 45 శాతంగా నమోదు కాగా, అంతకంతకు పెరుగుతూ ఉంది. మరణాల పరంగా చూస్తే 2023లో ఉగ్రవాద చర్యలతో 748 ప్రాణాలు కోల్పోగా, 2024 నాటికి అది 1, 081గా పెరిగింది. -
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025 -
భారత్ దెబ్బకు.. కాళ్లబేరానికి పాక్
-
పాక్లో బాలలపై అఘాయిత్యాలు
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్లో బాలలపై పెద్ద ఎత్తున అఘాయిత్యాలు, నేరాలు జరుగుతున్నా యని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి పి. హరీశ్ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. పాక్ ప్రోద్బలంతో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రపంచం మర్చిపోలేదని అన్నారు. వీటన్నింటిని నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి పాక్ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. బాలలపై నేరాలను అరికట్టడానికి అ నుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి.హరీశ్ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. పాకిస్తాన్లో పాఠశాలలపై, ప్రధానంగా బాలికల పాఠశాలలపై, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని, పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఆరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ సైతం ఈ విషయం వెల్లడించినట్లు గుర్తుచేశారు. పాక్ ప్రభుత్వం ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, సొంత దేశాన్ని చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉగ్రవాదులను ఎగదోయడం మానుకోకపోతే పాకిస్తాన్ మరింత నష్టపోవడం ఖాయమని తేలి్చచెప్పారు. -
దారి మరిచిన ఎస్సీవో!
ఆర్భాటంగా ఏర్పడటం, ఘనంగా లక్ష్యాలు చాటుకోవటం, కీలక సమయాల్లో మొహం చాటేయటం ప్రాంతీయ సహకార సంస్థలకు అలవాటుగా మారింది. సంక్షుభిత ప్రపంచంలో సమస్యలు రావటం సహజమే అయినా, దేశాల మధ్య తలెత్తే విభేదాలు అలాంటి సంస్థల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ సంస్థల వల్ల ఉద్రిక్తతలు ఉపశమిస్తాయనుకోవటం అమాయకత్వమని రుజువు చేస్తున్నాయి. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) అవస్థ అలాగే ఉంది. ఆ సంస్థ రక్షణ మంత్రుల స్థాయి శిఖరాగ్ర సదస్సు రెండు రోజులు జరిగి గురువారం చైనాలోని చింగ్దావ్లో ముగిశాక విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన భారత్ కారణంగా మూలన పడింది. ఆ ప్రకటనపై సంతకం చేసేందుకు మన రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించటంతో చేసేదేమీ లేక ఉమ్మడి ప్రకటన ఆలోచనే విరమించుకున్నారు. ఈ సదస్సుకు మన దేశంతోపాటు చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, కజఖ్స్తాన్ తదితర దేశాల రక్షణమంత్రులు హాజర య్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం ఎలా అనే అంశంపై సదస్సు జరిగింది. ఎస్సీవో 2001లో షాంఘైలో ఏర్పడినప్పుడు అది అందరిలో ఆశలు రేకెత్తించింది. ఎందుకంటే మధ్య ఆసియా దేశాల భద్రత, అభివృద్ధిపైనే ప్రధానంగా కేంద్రీకరిస్తామని సంస్థ తెలిపింది. భారత్, చైనాల మధ్య ఏనాటి నుంచో సరిహద్దు వివాదాలున్నాయి. ఇక పాకిస్తాన్ నాలుగు దశా బ్దాలుగా సరిహద్దు చొరబాట్లను ప్రేరేపిస్తూ ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీవో వల్ల చైనా, పాక్లతో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశ ఉండేది. 2005 నుంచి మన దేశం పరిశీలక హోదాలో సదస్సులకు హాజరవుతూ వచ్చింది. 2017లో రష్యా అధినేత పుతిన్ చొరవతో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశమైంది. కానీ, సభ్య దేశాల వ్యవహార శైలి దేని దారి దానిదే! ఎస్సీవో స్థాపనలో కీలక పాత్ర పోషించిన చైనాయే 2020 జూన్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)వద్ద చొరబాటు యత్నం చేసింది. చైనా సైన్యం రాళ్లతో, కర్రలతో, రాడ్లతో దాడి చేసి 21 మంది మన జవాన్ల ప్రాణాలు తీసింది. అంతకుముందూ, ఆ తర్వాతా చైనా తీరు అదే.తాజా శిఖరాగ్ర సదస్సులో విభేదాలకు దారితీసిన అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొన్న మార్చిలో పాకిస్తాన్లోని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి పలువురు పాక్ సైనికులను హతమార్చారు. పాక్ సైన్యం కూడా ప్రతీకార దాడికి దిగి ఆ ఘటనలో పాల్గొన్న మిలిటెంట్లలో అత్యధికుల్ని కాల్చిచంపింది. ఆ మరుసటి నెలలో కశ్మీర్లోని పెహల్గామ్లో పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు నిరాయుధులైన పర్యాటకులపై దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ రెండు దాడుల్లో కేవలం బలూచిస్తాన్ ఘటనను ఉమ్మడి ముసాయిదా ప్రకటన ప్రస్తావించి పెహల్గామ్ను మినహాయించింది. ఆ ఉదంతం తర్వాత మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయటం, పాక్ సైన్యం దాడుల్ని తిప్పికొట్టడానికి వారి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయటం పతాక శీర్షికలకెక్కాయి. ఆ ఘటనల పరంపర జరిగి నిండా నెల్లాళ్లు కాకుండానే ఎస్సీవో ఎలా మరిచి పోతుంది? చైనా, పాక్ల మధ్య సాన్నిహిత్యం ఉంది గనుక ఆ దేశం చెప్పి నట్టల్లా ఆడి ఉమ్మడి ప్రకటన రూపొందించటం, దానిపై మన దేశం సంతకం చేయాలని కోరుకోవటం తెలివితక్కువతనం కాదా? అసలు ఇలాంటి తీరుతెన్నులు సమష్టి తత్వాన్ని దెబ్బ తీస్తాయన్న స్పృహ ఉండొద్దా?ఎస్సీవో స్థాపించిన కాలంకన్నా ఇప్పుడు ప్రాంతీయంగా సవాళ్లు ఎన్నో రెట్లు పెరిగాయి. ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంత శాంతికీ, భద్రతకూ ముప్పు ఏర్పడుతోంది. దేశాల మధ్య పరస్పరం అవిశ్వాసం కూడా గతంతో పోలిస్తే ఎంతగానో పెరిగింది. ఈ సమయంలో ఎస్సీవో వంటి సంస్థ ఈ సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం ఆలోచించాలి. కానీ జరిగిందంతా వేరు. ఈ సదస్సులో ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ అన్నట్టు రాజ్యేతర శక్తుల వల్లా, ఉగ్రవాద ముఠాల వల్లా ప్రమాద కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి వెనకున్న దేశాలు ఆ పరిస్థితుల పర్యవసానాలను ఎదుర్కొని తీరాలని కూడా ఆయన అన్నారు. రాజ్నాథ్ ప్రసంగంలో పెహల్గామ్, ‘ఆపరేషన్ సిందూర్’ ప్రస్తావనకొచ్చాయి. అయినా ముసాయిదా ప్రకటన వాటిని మరిచినట్టు నటించింది.ఎస్సీవోను సభ్యదేశాలు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప సమష్టిగా అడుగులేయాలన్న సంకల్పం ప్రదర్శించటం లేదు. ఈ సంస్థ చాటున తన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)నూ, పలుకుబడినీ పెంచుకోవటమే చైనా ఎజెండా. సంస్థను మధ్య ఆసియా దేశాలకు మించి విస్తరింప జేయాలన్న ఉద్దేశంలోని ఆంతర్యం కూడా అదే. ఇక రష్యాకు ప్రధానంగా పాశ్చాత్య దేశాలతో లడాయి ఉంది. వాటిని ఎదుర్కొనటానికి సంస్థ ఎంతో కొంత తోడ్పడుతుందన్న ఆశ ఉంది. ఎస్సీవోను చిత్తశుద్ధితో నిర్వహిస్తే ఈ ప్రాంత దేశాలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్సీవో వాటా 23 శాతం. ప్రపంచ జనాభాలో వాటా 42 శాతం. సంస్థ పెట్టినప్పుడు సభ్య దేశాలమధ్య సైనిక సహకారం, నిఘా నివేదికల్ని పంచుకోవటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం, విద్య, ఇంధనం, రవాణా రంగాల్లో సహకరించుకోవటం వంటి ఉద్దేశాలున్నాయి. కానీ ఇవన్నీ మరిచి ముఠాలు కట్టి నచ్చినవారికి అనుకూలంగా వ్యవహరించదల్చుకుంటే ఇలాంటి సంస్థలెందుకు? ఈ గంభీరమైన లక్ష్య ప్రకటనలెందుకు? అందుకే ఎస్సీవో తీరు మారాలి. -
SCO సదస్సులో పాకిస్థాన్ పై రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం
-
పాక్కు రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకు చైనా సైలెంట్!
బీజింగ్: చైనా గడ్డపై దాయాది దేశం పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చుక్కలు చూపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్టు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ భారత్ హక్కు అని కుండబద్దలు కొట్టారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు అని చెప్పుకొచ్చారు.చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(SCO) రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ మాట్లాడుతూ..‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పలు దేశాలు (పరోక్షంగా పాకిస్తాన్) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఎస్సీఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. అలాంటి వారి చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరం. సామూహిక భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అని పిలుపునిచ్చారు.#WATCH | Qingdao, China | At the SCO Defence Ministers' meeting, Defence Minister Rajnath Singh says, "It is my pleasure to be here in Qingdao to participate in the SCO Defence Ministers meeting. I would like to thank our hosts for their warm hospitality. I would also like to… pic.twitter.com/c9SyHOaZDp— ANI (@ANI) June 26, 2025ఇదే సమయంలో రాజ్నాథ్.. ఇటీవల జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదులకు దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా వివరించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికే భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మా దేశంపై ఉగ్రదాడులు జరిగిన కారణంగా.. ఆపరేషన్ చేపట్టాం. ఆపరేషన్ సిందూర్ భారత్ హక్కు. ఉగ్రవాదుల విషయంలో మేము సహనంతో ఉండే అవకాశమే లేదు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోం. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తిని నిరోధించడానికి కూడా మనం సరైన చర్యలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు.Defence Minister @rajnathsingh attends the SCO Defence Ministers’ Meeting in Qingdao, China.Mr Singh says India’s zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. We have shown that epicentres of… pic.twitter.com/Hy2W98l7uT— All India Radio News (@airnewsalerts) June 26, 2025ఇదిలా ఉండగా.. ఎస్ఈవో రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రాజ్నాథ్ సింగ్ చైనా వెళ్లారు. 2020లో గల్వాన్ లోయ వివాదం తర్వాత నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి చేసిన మొదటిసారిగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని రాజ్నాథ్ చెప్పుకొచ్చారు. ఇక, గురువారం సమావేశం ప్రారంభమయ్యే ముందు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో కోసం సమావేశమయ్యారు. -
శాంతి నోబెల్కు ట్రంప్
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ ఆశలు మళ్లీ చిగురించాయి. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం నార్వేకు సిఫార్సుచేసింది. ఈ మేరకు నామినేట్ చేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తమ నాయకుడు నోబెల్ అవార్డ్కు తగిన వ్యక్తి అని అమెరికా కాంగ్రెస్లో ప్రతినిధుల సభ సభ్యుడు, జార్జియా నుంచి రిపబ్లికన్ పార్టీ నేత బడ్డీ కార్టర్ వ్యాఖ్యానించారు. ఈయన సైతం ట్రంప్ పేరును నామినేట్ చేస్తూ నార్వేలోని శాంతి బహుమతి కమిటీకి లేఖ రాశారు. ‘‘ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఒంటిచేత్తో ఆపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇరాన్ అణుబాంబును సాధించకుండా ట్రంప్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అసాధ్యమని అంతా భావించిన వేళ ట్రంప్ దానిని సాధించి చూపించారు. సమర సంక్షోభం సమసిపోయేలా ఎంతో సమర్థవంతంగా వ్యవహరించిన ట్రంప్ ఈసారి నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు. శాంతిస్థాపన, యుద్ధ విరమణ, అంతర్జాతీయ సామరస్యాల సాధనకు కృషిచేసినందుకు ట్రంప్ నోబెల్ ఇవ్వాల్సిందే’’అని బడ్డీ కార్టర్ తన లేఖలో రాశారు. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య పరస్పర సైనిక చర్యలు ఆపడంలో ట్రంప్ సఫలీకృతులయ్యారు. దౌత్య జోక్యం ద్వారా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారు. ఈ విషయంలో ట్రంప్ నిజంగా శాంతికాముకుడు’’అని పాకిస్తాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అయితే గతంలో ట్రంప్ను నామినేట్ చేస్తూ లేఖ రాసిన ఉక్రెయిన్ విదేశీవ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఒలెగ్జాండర్ మరెజ్కో తన ట్రంప్ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. -
ఖండాంతర క్షిపణి అభివృద్ధి కోసం పాక్ యత్నాలు
వాషింగ్టన్: పాకిస్తాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ‘విదేశీ వ్యవహారాల’ నిఘా నివేదిక వెల్లడించింది. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) తయారీ యత్నాలను ముమ్మరం చేస్తోందని పేర్కొంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. చైనా సహకారంతో పాక్ ఇందుకు పూనుకున్నట్టు సమాచారం. ఐసీబీఎంలు తయారుచేస్తే పాక్ను అమెరికా తన అణ్వస్త్ర శత్రువుగా ప్రకటించడం ఖాయమని ఆ దేశ ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా భూభాగాన్ని తాకగలిగే స్థాయిలో సుదూరం నుంచి క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న రష్యా, చైనా, ఉత్తర కొరియాను అమెరికా ‘అణ్వస్త్ర విరోధులు’గా ప్రకటించింది. ‘‘ఖండాంతర క్షిపణితో అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఏ దేశాన్నీ అమెరికా తన మిత్రుడిగా భావించదు’’ అని ఆ దేశ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఐసీబీఎంలు లేని పాక్పాక్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత లేదు. ఐసీబీఎం క్షిపణులు లేవు. 2022లో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్–3ను ప్రయోగించింది. ఇది 2,700 కి.మీ.కు పైగా ప్రయాణించగలదు. భారత్లోని ఎన్నో నగరాలు దాని పరిధిలోకి వచ్చాయి. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు పాక్పై అమెరికా పలు ఆంక్షలు విధించింది. క్షిపణులను రూపొందించే ‘నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్’, మరో మూడు సంస్థలపై నిషేధం విధించింది. వీటితో వ్యాపారంచేసే తమ దేశీయ సంస్థల ఆస్తులను స్తంభింపజేస్తామని గతంలోనే అల్టిమేటమిచ్చింది. ఈ చర్యలను పాక్ తప్పుబట్టింది. అమెరికా స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపించింది. ఎన్పీటీపై సంతకం చేయని పాక్ వద్ద 170 అణువార్హెడ్లు పోగుబడినట్లు పాత నివేదికలు వెల్లడిస్తున్నాయి. -
శశి థరూర్... ఈసారి ఫ్రెంచ్లో!
కీవ్: తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు కానీ.. ఆయన ఫ్రెంచ్లోనూ అదరగొట్టగలరని మాత్రం తాజాగా స్పష్టమైంది. అది కూడా రష్యా దౌత్యవేత్తతో మాట్లాడుతూ! విషయం ఏమిటంటే...పహల్గామ్ దాడి తరువాత దాయాది దేశం పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రపంచదేశాలకు వివరించే పార్లమెంటరీ బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందం ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా రష్యాలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు లియోనిడ్ స్లట్స్కీతో థరూర్ బృందం సమావేశమైంది. భారత్ హస్తకళల వైభవాన్ని చాటే ఒక జ్ఞాపికను రష్యా దౌత్యవేత్తకు అందించిన థరూర్.. ప్రతిగా ఆయన అందించిన అరుదైన పెన్నును స్వీకరించారు.‘‘రాతగాడికి పెన్ను బహుమానంగా ఇవ్వడం సంతోషాన్నిచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత ఇరువురి మధ్య చర్చలు ఉగ్రవాదం.. నివారణ చర్యలు.. రషా ఏం చేస్తోందన్న అంశాలపైకి మళ్లింది.. ఈ సందర్భంగా లియోనిడ్ స్లట్స్కీ మాట్లాడుతూ.. ‘‘రష్యా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో బహుముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఏటా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఆరుసార్లు ఈ సమావేశాలు జరిగాయి. వచ్చే ఏడాది ఏడో సమావేశం నిర్వహిస్తున్నాం. పాకిస్థాన్తోపాటు ఇతర దేశాలను ఆహ్వానిస్తున్నాం’’ అని అన్నారు.పాకిస్థాన్ పేరు వినపడగానే స్పందించిన శశిథరూర్ భారత దౌత్యవేత్తల అంతర్జాతీయతను గుర్తు చేసేలా ఫ్రెంచ్లో స్లట్స్కీకి సమాధానమిచ్చారు. ‘‘పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిచ్చే దేశం’’ అని గుర్తు చేశారు. తద్వారా రష్యాతోపాటు యూరోపియన్ దేశాల దౌత్యవేత్తలకు భారత్ ఉద్దేశాలను స్పష్టం చేసినట్టు అయ్యింది. అయితే థరూర్ వ్యాఖ్యలను విన్న స్లట్స్కీ పాకిస్థాన్ను ఆహ్వానించడాన్ని సమర్థించుకున్నారు.అది వేరే విషయం!Shashi Tharoor takes on Pakistan in fluent French pic.twitter.com/2H7lbg1pxE— Shashank Mattoo (@MattooShashank) June 25, 2025 -
పాక్ టార్గెట్ అమెరికా??.. ఇది జోక్ కాదు బాస్!
ఎవ్వడ్రా వీడు.. ఘోల్లుమనే జోక్ వేశాడు అనుకుంటున్నారా?. కానీ ఇదే నిజం. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రపంచమంతా దృష్టిసారించిన వేళ..పాక్ రహస్యంగా శక్తివంతమైన.. అదీ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టింది!. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినట్లు ఫారిన్ ఎఫైర్స్ అనే పత్రిక కథనం ప్రచురించింది. దీర్ఘ శ్రేణి నూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల(ICBM) తయారీని పాకిస్థాన్ రహస్యంగా చేపడుతోంది. వీటి సామర్థ్యం ఏకంగా.. అమెరికాకు చేరుకోగలదని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా సాయంతో పాక్ వీటిని అభివృద్ధి చేస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ అలాంటి క్షిపణులను సమకూర్చుకుంటే.. ఆ దేశాన్ని అణ్వస్త్ర శత్రువుగా అమెరికా గుర్తించడం ఖాయమని వాషింగ్టన్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయని సదరు కథనం పేర్కొంది.అమెరికాను తాకగలిగే అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం ఏదైనా సరే.. అమెరికాకు శత్రువుగానే చూడాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యలను సదరు నివేదిక ప్రముఖంగా పేర్కొంది. ఈ కథనాన్ని వైట్హౌజ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. ఐసీబీఎం అంటే.. ఖండాలను దాటగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు. ఇందులో అణ్వాయుధాలతో పాటు సాధారణ యుద్ధ క్షిపణులు కూడా ఉంటాయి. వీటి లక్ష్యం.. 5,500 కిలోమీటర్లు దాకా ఉండొచ్చు. అయితే ప్రస్తుతానికి పాక్ దగ్గర అలాంటి క్షిపణలేం లేవు. ప్రస్తుతం అమెరికా జాబితాలో రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టిందని ఆ దేశ మీడియా నుంచే కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది. అలాగే చైనా నుంచి భారీగా ఆయుధ సంపత్తిని పాక్ దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఆ దేశ విధానంలో.. షార్ట్, మీడియం రేంజ్ మిస్సైల్స్ మాత్రమే ఉన్నాయి. చివరగా.. 2022లో పాక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ షాహీన్-3ను ప్రయోగించింది. దీని పరిధి.. 2,700 కిలోమీటర్లు. ఇదిలా ఉంటే.. తమ దేశం చేపట్టే అణు పరీక్షలు భారత్ ముప్పును ఎదుర్కొనేందుకేనని పాక్ పలుమార్లు బాహాటంగానే ప్రకటించుకుంది. కిందటి ఏడాది.. పాక్ మీద లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కార్యక్రమంపై అమెరికా ఆంక్షలు విధించగా.. పాక్ వాటిని పక్షపాత ధోరణిగా ప్రకటించింది.ప్రస్తుతం పాక్ దగ్గర 170 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. తద్వారా న్యూక్లియర్ నాన్ ప్రొలైఫ్రేషన్ ట్రీటీ(NPT)కి పరిధిని ఉల్లంఘించింది. న్యూక్లియర్ వెపన్స్ను కట్టడి చేయడం, తద్వారా అణు శక్తిని పరిమితంగా(శాంతి పరిధికి లోబడి) ఉపయోగించుకోవాలని చెప్పడం ఈ ఒప్పంద ఉద్దేశం.ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం.. మే నెలలో పాక్ ఉగ్రశిబిరాలపై, ఆ దేశ ప్రధాన ఎయిర్బేస్లపై దాడులు జరిపింది. ఆ సమయంలో పాక్ తన హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిందని.. అయితే భారత రోబస్ట్ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ దానిని అడ్డుకుందనే ప్రచారం జోరుగా నడిచింది. అటుపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు పాక్ న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కోరారు. పాక్ అలాంటి ఆయుధాల విషయంలో హద్దులు మీరి ప్రవర్తించదనే ఆశిస్తున్నట్లు రాజ్నాథ్ కూడా వేరుగా ఓ ప్రకటన చేశారు. -
అభినందన్ను బంధించానన్న.. పాక్ ఆర్మీ అధికారి మృతి
న్యూఢిల్లీ: నాటి పుల్వామా ఉగ్రవాద దాడి(2019) తదనంతర పరిణామాలలో అప్పటి భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ నేషనల్ హీరోగా అందరి అభినందనలు అందుకున్నారు. అప్పట్లో ఆయనను బంధించానని చెప్పుకున్న పాకిస్తాన్ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ తాజాగా పాక్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు.పాకిస్తాన్ సైన్యంలో మేజర్గా పనిచేస్తున్న మోయిజ్ అబ్బాస్ షా(37)దక్షిణ వజీరిస్తాన్లో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో జరిగిన కాల్పుల్లో మృతిచెందాడు. ఈయన ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జీ)లో పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం లాన్స్ నాయక్ జిబ్రానుల్లాతో కలిసి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్న అబ్బాస్ షా కాల్పుల్లో మృతిచెందాడు.ఒకప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అండగా నిలిచిన టీటీపీ ఇప్పుడు పాక్ భద్రతా సిబ్బంది, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతూ ప్రభుత్వానికే ముప్పుగా పరిణమించింది. 2019లో బాలకోట్ వైమానిక దాడుల తర్వాత ప్రతీకార వైమానిక ఆపరేషన్లో పాల్గొన్న అభినందన్ మిగ్ 21 బైసన్ జెట్ను నడుపుతూ, పాకిస్తాన్ వైమానిక దళ జెట్లతో తలపడ్డాడు. అయితే అభినందన్ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అభినందన్ను పాకిస్తాన్ సైన్యం పట్టుకుంది.ఇది కూడా చదవండి: అగ్నిపర్వతంలో అదృశ్యం.. విగతజీవిగా పర్యాటకురాలు -
ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. ? వైరలవుతున్న సోనీ స్పోర్ట్స్ పోస్టర్
ఈ ఏడాది చివర్లో భారత్లో జరగాల్సిన ఆసియా కప్-2025 కోసం టోర్నీ అధికారిక ప్రసారదారు సోనీ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక టీ20 జట్లకు చెందిన కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ శాంటో, చరిత్ అసలంక మాత్రమే ఉన్నారు. ఈ పోస్టర్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం లేకపోవడం సోషల్మీడియాలో చర్చలకు తావిచ్చింది. ఆసియా కప్ నుంచి పాక్ వైదొలిగిందని ప్రచారం మొదలైంది.పహల్గాం ఉదంతం, తదనంతర పరిణామాల్లో (ఆపరేషన్ సిందూర్) భారత్, పాక్ మధ్య అప్పటివరకు ఉన్న తేలికపాటి సంబంధాలు కూడా తెగిపోయిన విషయం తెలిసిందే. క్రీడలు సహా అన్ని అంశాల్లో భారత్ పాక్తో సంబంధాలు తెంచుకుంది. క్రికెట్కు సంబంధించి ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో, అదీ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్ పాక్తో మ్యాచ్లు ఆడే విషయం పరిశీలనలో ఉంది. వాస్తవానికి క్రికెట్లో కూడా భారత్ పాక్తో పూర్తి స్థాయి సంబంధాలు తెంచుకోవాలని భారతీయుల నుంచి ఒత్తిడి ఉంది.ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్కు చెందిన మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఉండటంతో భారత్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలుగుతుందని పలు నివేదికలు తెలిపాయి.మరికొన్ని నివేదికలేమో భారత్ తమ దేశ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరపతిని ఉపయోగించి పాకిస్తాన్నే ఆసియా కప్ నుంచి వైదొలిగేలా చేస్తుందని చెప్పాయి. తాజాగా సోనీ స్పోర్ట్స్ పాక్ ప్రాతినిథ్యం లేని పోస్టర్ను విడుదల చేయడంతో ఇదే నిజమైదేంమోనని అనిపిస్తుంది. మొత్తానికి సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్ భారత్, పాక్ల మధ్య మరోసారి అగ్గి రాజేసేలా ఉంది.కాగా, ఆసియా కప్ 2025పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ టోర్నీ యొక్క ఖచ్చితమైన వివరాలు, వేదికలు, షెడ్యూల్ గురించి ఏసీసీ ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాక్కు చెందిన వ్యక్తి ఉన్నా, తమ దేశ భాగస్వామ్యంపై ఇప్పటివరకు స్పందించలేదు. కొద్ది రోజుల కిందట టోర్నీని భారత్లో కాకుండా యూఏఈలో నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది.2031 వరకు ఏసీసీ ఈవెంట్స్ హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) 2024 నుండి 2031 వరకు అన్ని ఏసీసీ టోర్నమెంట్ల మీడియా హక్కులను $170 మిలియన్ల బేస్ ధరకు దక్కించుకుంది. ఇది మునుపటి సైకిల్ కంటే 70% ఎక్కువ. ఆశ్చర్యకరంగా మీడియా హక్కుల కోసం పోటీ బిడ్డింగ్ జరగలేదు. జియోస్టార్ మధ్యలో వైదొలిగింది. -
ఇండియా బయటపెట్టిన సంచలన నిజం
-
ఇది దుస్సాహసాల యుగం
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగింది. కానీ అదంత తేలిక కాలేదు. ఇప్పటికీ తన లక్ష్యం సాధించలేక పోయింది. చైనాపై ఆధారపడటం అనివార్యమైంది. ఇటీవలి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు దాన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే రష్యా ఏం ఓడలేదు. పైగా, 2022 ఫిబ్రవరి తర్వాత ఎన్నడూ లేనంత బలీయంగా ఇప్పుడు రూపొందింది. అంతర్జాతీయంగా రష్యాను ఏకాకి చేయాలన్న పథకం నీరుగారి పోయింది. ఈ పథక రచనలో ప్రధాన సూత్రధారి అమెరికా భంగపడింది. ఎలాగోలా రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఈ అగ్రరాజ్యం ఇప్పుడు అంగలారుస్తోంది. యూరోపియన్ యూనియన్ భద్రత మీద, ఉక్రెయిన్ సార్వభౌమికత మీద చేస్తున్న వ్యయం తగ్గించుకోవాలని భావిస్తోంది. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతోనే ఈ ఊబి నుంచి బయటపడాలనుకుంటోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందుకు ససేమిరా అన్నా ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. ‘దుస్సాహసం ఫలిస్తుంది’ అన్నది పుతిన్ తన అనుభవాల నుంచి నేర్చుకున్నపాఠం. ఒక దేశం మీద దండెత్తాడు. ఇప్పటిదాకా నెగ్గుకొచ్చాడు. మరింత ఉక్రెయిన్ భూభాగంపై పట్టు సాధించగలనన్న, తద్వారా తన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి రష్యాకు సమకూరుతుందన్న, తూర్పు మధ్య యూరప్ ప్రాంతాల భద్రతకు ఢోకా ఉండదన్న ఆలోచన ఇలాగే కొనసాగవల్సిందిగా పుతిన్ను పురిగొల్పి ఉంటుంది. దుస్సాహసం ఫలిస్తుంది!గాజా మీద ఇజ్రాయెల్ దురాక్రమణకు దిగింది. హమాస్ టెర్రరిజం ప్రస్తుత సంక్షోభానికి పురిగొల్పింది అనడంలో సందేహం లేదు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మితిమీరి ప్రతిస్పందించింది. అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. ఇజ్రాయెల్ అంటే అదో జాతి నిర్మూలన శక్తి అని ప్రపంచవ్యాప్తంగా ఒక తరం మనస్సులో శాశ్వతంగా ముద్ర పడింది. ఈ దాడి ఆ దేశ వనరులను హరించివేసింది. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో సాధారణ సంబంధాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక భద్రత కూడా ప్రమాదంలో పడినట్లే!అయితే ఇజ్రాయెల్ ఏం ఓడలేదు. ఆ దేశపు దూరదృష్టి లేని వ్యూహకర్తలు కోణం నుంచి చూస్తే, హమాస్ నాయకత్వాన్ని తుదముట్టించడంతో పాటు వారి సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఈ పోరులో విజయం సాధించింది. హెజ్బొల్లా నాయకత్వాన్ని, సైనిక సదుపాయాలను నిర్మూలించి, లెబనాన్ పాలనలో మార్పు తెచ్చింది. సిరియా ప్రభుత్వ మార్పుకు పరోక్షంగా దోహదపడింది. నెతన్యాహూ ఇలాగే ముందుకు సాగి ఇరాన్ మీద దాడి చేశాడంటే అందులో ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు తీర్చిదిద్దుతాయి. పుతిన్ అనుకున్నట్లే, నెతన్యాహూకు కూడా అతడి అనుభవం పాఠం నేర్పింది. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను అన్నింటినీ ఉల్లంఘించాడు. యుద్ధఖైదీ అభియోగం మోపి అరెస్టు చేయాలన్న ఇంటర్నేషనల్ వారెంటును పట్టించుకోలేదు. పాలస్తీనా కలలను చిదిమివేసిన అనుభవమే మరో దేశంపై దండెత్తడానికి, ఆ దేశ అణుశక్తి కార్యక్రమాలను వమ్ము చేయడానికి, అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెతన్యాహూను పురిగొల్పి ఉంటుంది.ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోయినా...వీగర్ల స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్ను చైనా జైలుగా మార్చేసింది. టిబెట్లో జనాభా స్వరూప స్వభావాలను మార్చింది. హాంకాంగ్ను హస్తగతం చేసుకుని రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించింది. సౌత్ చైనా సముద్రంలోని ద్వీపాలను సైనిక స్థావరాలుగా చేసుకుంది. తన సరిహద్దుల వెలుపల తైవాన్తోపాటు, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో పరోక్ష అధికారం చలాయిస్తోంది. ఇవేవీ కూడా ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే, తన ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి చివరకు పూర్తిగా కబళించివేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ చర్యలతో చైనా ప్రతిష్ఠ మసకబారింది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు దేశాలు కూటములుగా జట్టు కట్టేందుకు, చైనా వస్తు సరఫరాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితికి దారితీసింది. అయినా చైనా ఏం ఓడలేదు. వాస్తవానికి, తన ఆక్రమణలు అన్నిటినీ ‘న్యూ నార్మల్’గా మార్చేయగలిగింది. సాగర జలాల్లో తన అధికార ప్రదర్శనను కొనసాగించగలనని, లేదా తైవాన్ను ఆక్రమించుకోగలనని జిన్పింగ్ అనుకుంటే అందులో ఆశ్యర్యపడేదేం లేదు. ఒక మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే జిన్పింగ్ కూడా అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను హస్తగతం చేసుకున్నాడు. దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రత్యర్థులను అణచివేయడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాలను ఉపయోగించుకున్నాడు. హిమాలయాల్లో కానీ, సాగరాల్లో కానీ, పసిఫిక్ లేదా యూరేషియాలో కానీ ఇలాగే ముందుకు సాగాలని ఈ అనుభవమే జిన్పింగ్ను పురిగొల్పి ఉంటుంది. ఉగ్రవాద దుస్సాహసంఏప్రిల్ 22న పాకిస్తాన్ తైనాతీలు మరోసారి ఇండియాపై పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడ్డారు. అలాంటి ఘటన, దాని పర్యవసానాలు... టెర్రరిజం ఎగుమతుల కేంద్రంగా పాకిస్తాన్ పొందిన గుర్తింపును ఇంకా బలపరిచాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని మరింత కుంగదీశాయి. సైనిక పరంగా పాకిస్తాన్ బలహీనతలను బహిర్గత పరచాయి. దేశ సౌభాగ్యానికి అవసరమైన ప్రాదేశిక సమగ్రతను మరింత దూరం చేశాయి.అయితే తాను ఓడిపోయానని పాకిస్తాన్ అనుకోవడం లేదు. పైగా, రావల్పిండిలోని మిలిటరీ జనరళ్ల దృష్టిలో పాకిస్తాన్ గెలిచింది. తామే తప్పూ చేయడం లేదన్న యుద్ధోన్మాద ధోరణి ఇకమీదటా చెల్లిపోతుందని ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అనుకుంటే అందులో ఆశ్చర్యపడేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. జిన్పింగ్, పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే, తన అనుభవాలు అతడికి పాఠం నేర్పాయి. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. మునీర్ ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేశాడు. ఉగ్రవాద తైనాతీలను ప్రోత్సహించాడు. ప్రత్యర్థిని సైనిక ఘర్షణలోకి దించాడు. అంతర్జాతీయ పాత్ర కోసం అభ్యర్థన చేశాడు. కాల్పుల విరమణను విజయంగా ప్రకటించుకున్నాడు. కొన్ని తరాల ప్రజలను శోకంతో తపించేలా చేసినా, పాకిస్తాన్కు కావల్సిన ప్రచారాన్ని, ప్రజల్లో చీలికను సాధించిపెట్టిన ఇలాంటి ఉగ్రదాడులతోనే ముందుకుసాగేందుకు మునీర్ను అతడి అనుభవం పురిగొల్పవచ్చు. మరో దేశం మీద దండెత్తడం, ప్రజలను ఆకలితో అలమటింపజేయడం దుస్సాహసం (అడ్వెంచరిజమ్) అవుతుంది. టెర్రరిజానికి ఆశ్రయం ఇవ్వడం లేదా మరొకరి భూభాగాన్ని కైవసం చేసుకోవడం దుస్సాహసం అవుతుంది. అన్ని అంతర్జాతీయ నియమాలనూ, చట్టాలనూ ఉల్లంఘించడం, ట్రైబ్యునల్ ఉత్తర్వులను తిరస్కరించడం దుస్సాహసం అవుతుంది. మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుంచీ దుస్సాహసం ఉంది. దీన్ని అడ్డుకునేది చట్టం, ఆచారం, స్వీయ నిగ్రహం... ఇవేవీ కావు. విఫలమవుతామన్న భయం, అందుకు చెల్లించాల్సిన మూల్యం మాత్రమే దుస్సాహసాన్ని అడ్డుకోగలవు. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఈ వైఫల్యభీతి అంతరించింది. అడ్వెంచరిజం ఫలించే యుగం ఇది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పాక్కు సమాచారం చేరవేత.. పంజాబ్లో ఇద్దరు గూఢచారులు అరెస్ట్
చంఢీగఢ్: పాకిస్తాన్కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అభియోగాలపై ఇద్దరు గూఢచారులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్కు కీలక సమాచారం చేరవేసిసట్లు గుర్తించిన పంజాబ్ పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి గుర్ప్రీత్ సింగ్ సాహిల్ మాసిహ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఐఎస్ఐ ఏజెంట్ జావెద్తో సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రధానంగా జావెద్తో గుర్ప్రీత్కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారలో వెల్లడైంది. పంజాబ్లోని ధరివాల్కు చెందిన గుర్ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. సాహిల్కు అదే ప్రాంతానికి చెందినవాడు కావడంతో పాటు ఇండియన్ ఆర్మీలోనే ఉన్నాడు. వీరిద్దరూ కలిసి నేరుగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరుచుకుని కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనేది ప్రధాన అభియోగం.