breaking news
Pakistan
-
పాక్పై అఫ్గాన్ భీకర దాడి.. 8 అవుట్పోస్టులు స్వాధీనం
ఇస్లామాబాద్: సరిహద్దు వివాదంతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్-పాకిస్తాన్ల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తారా స్థాయికి చేరాయి. తాలిబన్ దళాలు అంతర్జాతీయ సరిహద్దు అయిన ‘డ్యూరాండ్ లైన్’ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి, భీకర దాడులకు తెగబడ్డాయి. ఈ ఆకస్మిక దాడిలో పాకిస్తాన్కు చెందిన ఎనిమిది కీలక సైనిక అవుట్పోస్టులను అఫ్గాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. -
‘భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుంది’.. పాక్ అధ్యక్షుడు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులు చేస్తుంటే తనని బంకర్లో దాక్కోమని సలహా ఇచ్చారని, కానీ తాను అందుకు ఒప్పుకోలేదంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ ఆరోపించారు. పాకిస్థాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం ‘హైడ్రో టెరరిజా’నికి పాల్పడింది. రాజకీయానికి నీటి ప్రవాహాలను ఆయుధంగా ఉపయోగించడం సమజసం కాదు. భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మేము శాంతి, సంభాషణ ద్వారానే సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గలే భారత్తో చర్చలు జరిపేందుకు పాక్ సిద్ధంగా ఉంది’అని స్పష్టం చేశారు.జర్దారీ వ్యాఖ్యలు,ఇటీవల భారత్–పాకిస్థాన్ సంబంధాలు మరింత జఠిలమయ్యాయి. ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని నిలిపివేయడం, సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు రెండు దేశాల మధ్య పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇరు దేశాలు శాంతి మార్గంలో ముందుకు సాగుతాయా? లేక ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అని కాలమే నిర్ణయించాల్సి ఉంది. Pakistani President Asif Ali Zardari says they are ready for negotiations with India.Zardari says:My message to them (India) is to move away from the war theater to meaningful negotiation tables, because that is the only path for regional security. pic.twitter.com/Kfh0aDSCy7— OsintTV 📺 (@OsintTV) March 2, 2026 -
పాక్ ప్రపంచకప్ హీరోకు ఘోర అవమానం
పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ హీరో సాహిబ్జాదా ఫర్హాన్కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్ లీగ్ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు. ప్రపంచకప్ 2026లో రెండు సెంచరీలు సహా పలు భారీ రికార్డులు నెలకొల్పినా ఫర్హాన్ పేరు వేలం జాబితాలో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫర్హాన్ సహా 49 పాక్ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.కాగా, ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో లండన్ వేదికగా జరుగనుంది. ఈ వేలంలో తొలుత 710 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 63 మంది పాకిస్తానీ క్రికెటర్లు ఉన్నారు. అయితే ఫ్రాంచైజీలు 75–100 మంది ఆటగాళ్లను మాత్రమే షార్ట్లిస్ట్ చేయమని ఆదేశించడంతో, చివరికి 243 మంది ఆటగాళ్లు మాత్రమే తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో పాకిస్తాన్ నుంచి కేవలం 14 మంది (షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్) అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే సాహిబ్జాదా ఫర్హాన్ సహా 49 మంది పాక్ ఆటగాళ్ల పేర్లు గల్లంతయ్యాయి. ఫర్హన్.. టీ20 ప్రపంచకప్ 2026లో 76.60 సగటున 383 పరుగులు చేసి ప్రస్తుతానికి లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ సింగిల్ ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. ఫర్హాన్ నమీబియా, శ్రీలంకపై అద్భుత శతకాలు సాధించాడు. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరకపోయినా, ఫర్హాన్ వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయినా, హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజీలు అతన్ని పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. మరోవైపు, వరల్డ్ కప్ జట్టులో లేని పాక్ పేసర్ హారిస్ రౌఫ్ వేలంలో మార్కీ ఆటగాడిగా ఎంపిక కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రౌఫ్తో పాటు జో రూట్, జానీ బెయిర్స్టో వంటి ఇంగ్లండ్ స్టార్లు.. డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా మార్కీ జాబితాలో ఉన్నారు. కాగా, హండ్రెడ్ లీగ్ వేలం జాబితాలో పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ పేర్లు కూడా లేవు. ఈ ఇద్దరు విండీస్తో టెస్ట్ సిరీస్ కారణంగా తమ పేర్లు నమోదు చేసుకోలేదు. -
యుద్ధ ప్రభావం.. అక్కడే ఇరుక్కుపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో ఇరుక్కుపోయింది. సౌతాఫ్రికాలో వైట్ బాల్ సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ జట్టు ఇవాళ (మార్చి 2) రాత్రి డర్బన్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంది. అయితే, యుద్ధం కారణంగా దుబాయ్ విమానాశ్రయం మూసివేయడటంతో ఈ ప్రయాణం నిలిచిపోయింది. దీంతో పాక్ జట్టు డర్బన్లోనే ఆగిపోయింది. తిరుగు ప్రయాణంపై స్పష్టత లేకపోవడంతో పాక్ బృందం ఆందోళన చెందుతుంది. తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని పీసీబీకి విజ్ఞప్తులు చేస్తుంది.యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ వన్డే సిరీస్ కూడా రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. యుద్ద ప్రభావం యావత్ క్రికెట్ ప్రపంచంపై పడే అవకాశం ఉంది. త్వరలో దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సందిగ్దంలో పడింది.ఇదిలా ఉంటే, పాక్ మహిళల క్రికెట్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించింది. ఈ రెండు సిరీస్లను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే చివరిదైన మూడో టీ20లో గెలిచి పాక్ ఊరట పొందింది. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 119 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. -
సౌతాఫ్రికాపై పాకిస్తాన్.. వెస్టిండీస్పై శ్రీలంక..!
ఓ పక్క పురుషుల టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. మహిళల విభాగంలో వన్డే, టీ20 సిరీస్లు జరుగుతున్నాయి. మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్ సౌతాఫ్రికాలో.. శ్రీలంక విండీస్లో పర్యటిస్తున్నాయి.క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ఆసీస్ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. ఆతర్వాత వన్డే సిరీస్లో చిత్తుగా ఓడింది. వన్డే ప్రపంచ ఛాంపియన్ హోదాలో భారత జట్టు తమ తొలి సిరీస్లోనే ఆసీస్ చేతిలో 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.నామమాత్రపు విజయంసౌతాఫ్రికా పర్యటనలో తొలుత టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. వన్డే సిరీస్లోనూ అదే ఫలితాన్ని (1-2) పునరావృతం చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో పాక్ ఆతిథ్య జట్టుపై 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, కంటితుడుపు విజయాన్ని సాధించింది.చమారీ ఆల్రౌండ్ షోవిండీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. చివరి టీ20 మార్చి 3న జరుగనుంది. -
తాలిబన్ల దెబ్బ అదుర్స్.. దాడుల్లో పాకిస్తాన్కు కొత్త కష్టాలు!
ఇస్లామాబాద్: ప్రపంచమంతా ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అటు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. ఇరాన్ సైతం ఇజ్రాయెల్, దుబాయ్, బహ్రెయిన్ వంటి పలు దేశాలపై విరుచుకుపడుతోంది. మరోవైపు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. తాజాగా ఆప్ఘన్ సైన్యం.. పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్బేస్పై దాడి చేసింది. దాడి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేసింది.పాకిస్తాన్పై ఆప్ఘనిస్తాన్ సైన్యం విరుచుకుపడుతోంది. తాజాగా పాకిస్తాన్లోని రావల్పిండి, పాక్ కీలక ఎయిన్బేస్ నూర్ఖాన్ ఎయిర్బేస్పై డ్రోన్ దాడి చేసింది. ఈ మేరకు ఆప్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ట్విట్టర్ వేదికగా..‘ఆప్ఘనిస్తాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వైమానిక దళం పాకిస్తాన్లోని కీలకమైన సైనిక స్థావరాలపై ఖచ్చితమైన, సమన్వయంతో కూడిన వైమానిక దాడులను నిర్వహించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్, క్వెట్టా (బలూచిస్తాన్)లోని 12వ డివిజన్ ప్రధాన కార్యాలయం దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మొహమ్మద్ ఏజెన్సీలోని ఖ్వాజాయ్ క్యాంప్, అలాగే అనేక ఇతర ముఖ్యమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి’ అని తెలిపింది. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది.Afghanistan attacked Pakistan's Nur Khan Airbase in Rawalpindi. Local people are completely shocked by this attack.#nurkhanairbase pic.twitter.com/FzxI8BkjJu— PakTrolls (@PakTrolls_) March 2, 2026ఇదిలా ఉండగా.. రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున సరిహద్దు ఘర్షణల మధ్య ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు, తూర్పు ఆఫ్ఘన్ నగరమైన జలాలాబాద్లో పాకిస్తాన్ ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. విమానం నుండి పారాచూట్ చేసిన తర్వాత పైలట్ను సజీవంగా పట్టుకున్నట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. పైలట్ దిగిన కొద్దిసేపటికే అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక నివాసితులు AFPకి తెలిపారు.Good morning, Islamabad! While the city wakes up for Sehri, the map is being redrawn. 🌙☕️The Afghan Taliban aren't just holding their ground; they are taking the fight to those who challenged them. From striking Nur Khan Airbase to the Quetta HQs, Kabul is proving it can… pic.twitter.com/TlLTcqfpZA— Summitsoldier (@Summitsoldier) March 2, 2026ఇక, పాకిస్తాన్ శుక్రవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్, తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుండ్జాదా కేంద్రంగా ఉన్న దక్షిణ నగరం కాందహార్పై వైమానిక దాడులు ప్రారంభించింది. 133 మంది తాలిబాన్ యోధులు మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని, అనేక పోస్టులు ధ్వంసమయ్యాయని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, పాక్ దాడులకు ప్రతిస్పందనగా సరిహద్దు దాడులను తాము నిర్వహించామని తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. కనీసం 55 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు చెప్పుకొచ్చారు. -
టీమిండియా ‘ప్రపంచ’ రికార్డు.. పాకిస్తాన్తో సమంగా
వెస్టిండీస్తో సూపర్-8 మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిశ్రీలంకతో కలిసి వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్.. లీగ్ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్-8 దశలో తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.వరుస విజయాలతో సెమీస్కుఅయితే, తదుపరి మ్యాచ్లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్ రేసులో ముందుకు వచ్చిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్లో వెస్టిండీస్ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.విండీస్ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ (19 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్తో అలరించగా.. ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.సంజూ స్పెషల్ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్లో వెస్టిండీస్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026పాక్ ప్రపంచ రికార్డు సమంకాగా టీమిండియా టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్లో అందరి కంటే ముందే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్, భారత్ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్లో ఫైనల్ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్ మధ్యమ్యాచ్ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.టీ20 ప్రపంచకప్ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్ చేరిన జట్లు ఇవే👉పాకిస్తాన్- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)👉ఇంగ్లండ్- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026చదవండి: ఇది సరిపోతుందా బాస్!.. విమర్శలకు సంజూ ’స్టైల్’ కౌంటర్ -
అమెరికా-ఇరాన్ యుద్దం.. క్రికెట్ సిరీస్ రద్దు
అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్తాన్ షాహీన్స్తో (ఏ జట్టు) జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డేల సిరీస్ను ఇంగ్లండ్ లయన్స్ (ఏ జట్టు) రద్దు చేసుకుంది. ఈ సిరీస్ యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతుంది. అబుదాబీ నగరం ప్రస్తుతం ఇరాన్ దాడులతో అట్టుడికిపోతుంది.అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ అమెరికా ఎయిర్బేస్ల్లో ఒకటైన అబుదాబీని టార్గెట్ చేసింది. శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేస్తుంది. అక్కడే ఇంగ్లండ్ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ చిక్కుకుపోయారు. భారతకాలం ప్రకారం ఇవాళ (మార్చి 1) ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్-పాకిస్తాన్ షాహీన్స్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది.అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్తో పాటు మిగతా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.“జట్టు భద్రత మా ప్రాధాన్యత. పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం” ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్ కోచింగ్ బృందంలో ఆ దేశ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సహా విధ్వంసకర వికెట్కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఇంగ్లండ్ లయన్స్-పాకిస్తాన్ షాహీన్స్ మధ్య 3 టీ20లు, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అబుదాబీ వేదికగా షెడ్యూలైంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో తొలుత టీ20లు జరగగా.. ఇంగ్లండ్ 3-0 తేడాతో ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 27న జరిగిన తొలి వన్డేలోనూ ఇంగ్లండే విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లోని 3, 4, 5 వన్డేలు మార్చి 4, 6, 9 తేదీల్లో జరగాల్సి ఉంది. -
ఖమేనీ మృతితో కరాచీలో హై టెన్షన్.. US కాన్సులేట్ పై దాడి
-
T20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్
-
పాకిస్తాన్లో హై అలర్ట్.. యూఎస్ కాన్సులేట్కు నిప్పు..
ఇస్లామాబాద్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్ పాకిస్తాన్ను తాకింది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. పాకిస్తాన్ కరాచీలోని అమెరికా కాన్సులేట్పై పాకిస్తానీలు దాడి చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నిరసనగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నిరసనకారులు.. పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్పై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేశారు. కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టారు. దీంతో, రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం, పోలీసులు.. నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు.. అమెరికా సైన్యం కాల్పుల జరపడంతో ఎనిమిది పాకిస్తానీలు మృతి చెందినట్టు, పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 🚨🔴8 people were lost his life during a protest near the US Consulate in Karachi. pic.twitter.com/ynmgd3MWuP— THE UNKNOWN MAN (@Theunk5555) March 1, 2026 US embassy in Karachi under siege pic.twitter.com/Vu7e46gL9e— laulukaskas (@clockstiqqun) March 1, 2026Another videoUS Consulate in Karachi, Pakistan, is now under attack by protesters.🚨 pic.twitter.com/euIGG5IVNl— Fatiqmir (@fatiqmir) March 1, 2026 -
పాక్ డ్రోన్ కలకలం.. భారత సైన్యం కాల్పులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ మరోమారు తన కవ్వింపు చర్యలను ప్రదర్శించింది. ఆదివారం పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్లో పాకిస్తాన్కు చెందిన ఒక అనుమానాస్పద డ్రోన్ భారత గగనతలంలోకి చొరబడటంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్ట్ల వద్ద పహారా కాస్తున్న సైనికులు ఆకాశంలో డ్రోన్ అసాధారణ కదలికలను గుర్తించారు. అది పాక్ భూభాగం నుంచి వస్తున్న డ్రోన్గా నిర్ధారించుకున్న వెంటనే సైన్యం దాన్ని కూల్చివేసేందుకు పన్నెండు రౌండ్లకు పైగా కాల్పులు జరిపింది. భారత బలగాల కాల్పుల ధాటికి తాళలేక ఆ డ్రోన్ వెంటనే తిరిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) వైపు వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గత మూడు రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 27న కూడా పూంచ్ సెక్టార్లోనే సరిహద్దు రేఖ వెంబడి ఒక డ్రోన్ కనిపించగా, అప్పుడు కూడా భారత సైన్యం కాల్పులు జరిపి దాన్ని తరిమికొట్టింది.వరుసగా డ్రోన్లు చొరబడుతుండటంతో సరిహద్దు భద్రతా దళాలు అత్యున్నత స్థాయి అప్రమత్తతను ప్రకటించాయి. ఈ డ్రోన్ చొరబాటు వెనుక భారత భూభాగంలోకి ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మాదకద్రవ్యాలను చేరవేసే కుట్ర ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. కాగా తాజా ఘటనలో డ్రోన్ ద్వారా ఏవైనా అనుమానాస్పద వస్తువులను జారవిడిచారా అనే కోణంలో అణువణువూ గాలిస్తున్నారు. అంతర్జాతీయంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, సరిహద్దుల వెంబడి భారత్ తన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసింది. STORY | Pak drone enters Indian side along LoC in J-K's Poonch, Army opens fireArmy troops opened fire to bring down a Pakistani drone after it entered into the Indian side from across the Line of Control (LoC) in Poonch district of Jammu and Kashmir early Sunday, officials… pic.twitter.com/WwJfqzR2Tw— Press Trust of India (@PTI_News) March 1, 2026 -
చలో హైదరాబాద్
ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ను (ఏఆర్సీఎఫ్) ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్లో ఉంటూ ఇక్కడ కథ నడిపించాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎంలో రియాజ్ భత్కల్ కీలక పాత్ర పోషించాడు. ఇతడికి ఖయాముద్దీన్ కపాడియా కుడిభుజంగా వ్యవహరించాడు. 2008లో అహ్మదాబాద్ పేలుళ్లు తర్వాత ముంబైలో దొరికిన వాహన చోరుల తీగ లాగితే ఢిల్లీలో బాట్లాహౌస్ ఎన్కౌంటర్ డొంక కదిలింది. దీంతో ఐఎం ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభం కావడంతో రియాజ్, కపాడియాలతో పాటు అనేక మంది ఐఎం ఉగ్రవాదులు హైదరాబాద్కు క్యూ కట్టారు. ఎందుకు? ఇక్కడ ఎవరిని కలిశారు?...దేశవ్యాప్తంగా పేలుళ్ల కోసం ఐఎం ఉగ్రవాద సంస్థ చెక్క పెట్టెలతో పడవల మాదిరిగా తయారు చేసిన షేప్డ్ బాంబ్స్ వాడారు. టైమర్ ఆధారంగా పేలే సర్క్యూట్ ఉన్న వీటిలో ఓ ఎలక్ట్రానిక్ మైక్రోచిప్ అత్యంత కీలకంగా పని చేసింది. వీటిని కేరళలోని మలప్పురం నుంచి వచ్చి హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో స్థిరపడిన షయనుద్దీన్ అలియాస్ సత్తార్ తయారు చేశాడు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ఇతడికి కేరళలో ఉండగానే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1995లో కేరళ ముఖ్యమంత్రి ఈకే నయనార్ను హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో అరెస్టు అయ్యాడు. సిమీ ద్వారానే రియాజ్ భత్కల్తో ఇతడికి సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో 2005 నుంచి ఎలక్ట్రానిక్ మైక్రోచిప్స్ తయారీ బాధ్యతల్ని రియాజ్ భత్కల్ ఇతడికి అప్పగించాడు.సత్తార్ అందించిన మైక్రోచిప్స్ను రియాజ్ భత్కల్ గుజరాత్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లకు వినియోగిస్తాడు. 2008 జూలైలో అహ్మదాబాద్, సూరత్లను ఐఎం టార్గెట్ చేసింది. ‘ది పూల్ ఆఫ్ ఆల్ టెర్రరిస్టు’ పేరుతో పెద్ద సంఖ్యలో వరుస పేలుళ్లకు పథకం వేస్తుంది. దీనికోసం తయారు చేసే దాదాపు 70 బాంబుల్లో ఉంచాల్సిన మైక్రోచిప్స్ తయారు చేసి ఇవ్వాల్సిందిగా రియాజ్ నుంచి సత్తార్కు ఆదేశాలు అందాయి. అన్నింటినీ తక్కువ సమయంలో తానొక్కడే తయారు చేయలేనని భావించిన సత్తార్... తన భార్య, కుమారులకు విషయం చెప్పకుండా ఈ పని అప్పగించాడు. వారికీ ఈ రంగంలో ప్రవేశం ఉన్నా, పరిపక్వత లేదు. వీరు తయారు చేసిన మైక్రోచిప్స్ను రియాజ్ ఆదేశాల మేరకు మరో ఐఎం ఉగ్రవాది నౌషాద్ వచ్చి తీసుకువెళ్లాడు. అహ్మదాబాద్లో పెట్టిన బాంబుల్లో సత్తార్ తయారు చేసిన చిప్స్, సూరత్ బాంబుల్లో అతడి భార్య, కుమారుడు తయారు చేసిన చిప్స్ వాడారు. ఈ కారణంగానే సూరత్లో ఒక్క బాంబు కూడా పేలకుండా దొరికాయి. బాట్లా హౌస్లో సజీవంగా దొరికిన ఉగ్రవాది ఆరిజ్ ఖాన్ విచారణ తర్వాత వివిధ ఏజెన్సీలు వరుసపెట్టి ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. 2008 అక్టోబరు 3న ఒకేసారి అరెస్టయిన 15 మందిలో సయ్యద్ నౌషాద్ ఒకడు. ఇతడి విచారణలోనే మాస్టర్మైండ్ రియాజ్ భత్కల్, సత్తార్ మధ్య ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తాయి. అదే సమయంలో జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో సత్తార్ సమీప బంధువు రహీంతో పాటు ఫయాజ్, ఫయీజ్ అనే ఉగ్రవాదులు చనిపోయారు. వారిద్దరూ 2008 సెప్టెంబరులో ఉగ్రవాద శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చి, సత్తార్ వద్ద ఆశ్రయం పొందారనే ఆరోపణ ఉంది. నౌషాద్ విచారణలోనే చిప్స్ను రియాజ్ ఆదేశాల మేరకు సత్తార్ తయారు చేసి ఇచ్చినట్లు, తాను హైదరాబాద్ వెళ్లి వాటిని తీసుకువచ్చినట్లు అంగీకరించాడు.ఐఎం మిస్టరీని ఛేదించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు 2008 సెప్టెంబరు, అక్టోబరుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 20 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ మాడ్యుల్ మొత్తానికీ హైదరాబాద్లోని గోకుల్చాట్లో బాంబు పెట్టిన, జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ భత్కల్ కీలకమని గుర్తించి వేట ప్రారంభించి, 2008 అక్టోబరు 6న ఐఎం మీడియా సెల్ ఇన్చార్జ్ మహ్మద్ మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్ను పుణేలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. ఆ సమయంలో రియాజ్ భత్కల్ అక్కడి ఖాండ్వాలోని డాక్టర్ అన్వర్ అలీ భగ్వాన్ ఫ్లాట్లో ఉన్నాడు. పీర్భాయ్ అరెస్టు సమాచారం అందుకున్న భత్కల్ తన అనుచరుడు ఖయాముద్దీన్ కపాడియాతో కలిసి అక్కడ నుంచి పరారై హైదరాబాద్ వచ్చి సత్తార్ను కలిసి ఆశ్రయం ఇవ్వాలని కోరాడు. అయితే హైదరాబాద్ నగరంలో ఉండటం అంత మంచిది కాదని అతడు చెప్పడంతో కర్ణాటకలోని కర్వార్కు పారిపోయారు. 2009 జనవరిలో తెలంగాణ, కేరళ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో సత్తార్ చిక్కాడు. అక్కడ నుంచి తన సోదరుడు ఇక్బాల్తో పాటు మరికొందరితో కలిసి రియాజ్ భత్కల్ దేశం దాటేశాడు. పాకిస్తాన్ చేరిన వీళ్లు ఐఎస్ఐ రక్షణలో అక్కడి నుంచే అమీర్ రజా ఖాన్తో కలిసి ఇక్కడ మరికొన్ని విధ్వంసాలు చేయించారు. రియాజ్ సమీప బంధువైన యాసీన్ భత్కల్ ఐఎంకు కో–ఫౌండర్గా మారాడు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ వద్ద మరికొందరు ఉగ్రవాదులతో కలిసి ఇతడే చేయించాడు. అదే ఏడాది ఆగస్టులో నేపాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్లో యాసీన్ చిక్కాడు. ఈ కేసులో ఇతడితో పాటు మిగిలిన వారికీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది. దీన్ని తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. యాసీన్ సహా ఉగ్రవాదులపై ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసుల విచారణ పూర్తి కావడంతో పాటు ఇతర ఫార్మాలిటీస్ పూర్తి అయితే ఇది అమలయ్యే అవకాశం ఉంది. -
ఆఫ్ఘనిస్థాన్కు టెన్షన్.. పాక్ వద్ధ న్యూక్లియర్ వార్ హెడ్లు
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. ఇరు దేశాల మధ్య వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లోని ఆర్మీ పోస్ట్లు లక్ష్యంగా పరస్పరం దాడులు చేసుకున్నాయి. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీకి పెద్దగా యుద్ధ విమానాలు లేకపోవడం గమనార్హం. కానీ, పాక్ ఆర్మీ అమ్ముల పొదిలో వందలాది ఫైటర్ జెట్స్ ఉన్న కారణంగా బార్డర్లో సైనిక ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక బలం, ఆయుధ సంపత్తిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఆయుధాలు, అధునాతన సాంకేతిక విషయంలో ఆఫ్ఘనిస్థాన్ కంటే పాకిస్తాన్ చాలా బలంగా ఉంది. కాగా, 2021 నుంచి ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటివరకు తాలిబన్ ప్రభుత్వానికి చాలా దేశాల నుంచి గుర్తింపు లభించలేదు. ఆయుధాల సంగతిని అలా ఉంచితే, తాలిబన్లకు కనీసం అప్పులు ఇవ్వడానికీ ఏ దేశాలూ ముందుకు రావడం లేదు. గతంలో ఆఫ్ఘనిస్థాన్ గడ్డపై రష్యా సేనలు, అమెరికా సేనలు సైనిక స్థావరాలను నిర్వహించాయి. అవి అక్కడి నుంచి వెళ్లిపోయే క్రమంలో కొన్ని యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రైఫిల్స్, ఫిరంగులను వదిలి వెళ్లాయి. ఇప్పుడు వీటినే తాలిబన్ ఆర్మీ వినియోగిస్తోంది. ప్రస్తుతం అవన్నీ మరమ్మతు దశలో ఉన్నట్టు తెలిస్తోంది.మరోవైపు.. పాకిస్తాన్ మాత్రం ఆయుధాల విషయంలో బలంగానే కనిపిస్తోంది. చైనా నుంచి పాక్కు పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలు అందుతున్నాయి. అటు అమెరికా నుంచి ఆయుధాలు సేకరించినట్టు తెలుస్తోంది. అలాగే, పాక్ తన ఆయుధాలను పాక్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తోంది. ఈ మేరకు లండన్కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ డేటాను వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో పాక్ను తాలిబన్లు సైనికంగా దీర్ఘకాలం పాటు ఎదుర్కోవడం కష్టమేనని చెప్పుకొచ్చింది.ఇరు దేశాల సైనిక శక్తి ఇలా..పాకిస్తాన్..సైనిక శక్తిపరంగా ప్రపంచంలో పాకిస్థాన్కు 14 స్థానంలో(145 దేశాలకు గాను) ఉంది. పాక్కు 6.60 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. వీరిలో 5.60 లక్షల మంది ఆర్మీలో, మిగతావారు ఇతర సరిహద్దు భద్రతా విభాగాల్లో ఉన్నారు. పాక్ వద్ద 6వేలకుపైగా సాయుధ వాహనాలు, 4,600కుపైగా ఫిరంగి(ఆర్టిల్లరీ) యూనిట్లు ఉన్నాయి.పాక్ వద్ద 465 యుద్ధ విమానాలు ఉన్నాయి.పాక్ వద్ద 260కిపైగా సైనిక హెలికాప్టర్లు ఉన్నాయి.పాక్ వద్ద 170 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి.వందల సంఖ్యలో యుద్ధ విమానాలు (F-16s, JF-17s), హెలికాప్టర్లు. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి ఇలా..సైనిక శక్తిపరంగా ప్రపంచంలో ఆఫ్ఘనిస్థాన్ స్థానం 121వ స్థానం(145 దేశాల్లో)సైనికుల సంఖ్య ఆప్ఘనిస్తాన్కు దాదాపు 1.72 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారుగతంలో అమెరికా వదిలివెళ్లిన హై మొబిలిటీ మల్టీ పర్పస్ వీల్డ్ వెహికల్ (హమ్వీ) సాయుధ వాహనాలు, ఎం4 కార్బైన్లను తాలిబన్లు వినియోగిస్తున్నారు.తాలిబన్ల వద్ద అతికొద్ది సంఖ్యలో సాయుధ వాహనాలున్నాయి. యుద్ధ ట్యాంకులు, ఫిరంగి యూనిట్లు ఉన్నాయి. కచ్చితంగా వాటి సంఖ్య తెలియదుతాలిబన్ల వద్ద సోవియట్ కాలం నాటి 6 యుద్ధ విమానాలు ఉన్నాయి. అవి పనిచేయడం లేదని సమాచారం. ఈ లెక్కన వాళ్ల దగ్గర ఫైటర్ జెట్స్ లేనట్టే. అలాగే, సోవియట్ కాలం నాటి 23 హెలికాప్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో ఎన్ని ఎగిరే స్థితిలో ఉన్నాయో తెలియదుఆప్ఘనిస్తాన్ వద్ద అణ్వాయుధాలు లేవు.గెరిల్లా పోరాట వ్యూహం: గెరిల్లా పోరాట వ్యూహ రచనను పకడ్బందీగా అమలు చేసే విషయంలో తాలిబన్లు దిట్టలు. ఈ వ్యూహంతోనే వాళ్లు గతంలో 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీతో తలపడ్డారు. ఈ అంశం సరిహద్దుల్లో పాక్ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ తెలిపింది. పాక్కు చెందిన సరిహద్దు ఆర్మీ పోస్ట్లకు తాలిబన్లు భారీ నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇందుకోసం గెరిల్లా పోరాట వ్యూహాలను తాలిబన్లు అమలు చేస్తున్నారు. -
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం.. చైనా, రష్యా ఆందోళన
ఢిల్లీ: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాక్ సైన్యం ఆప్ఘన్ ప్రజలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’పేరిట కాబూల్, కాందహార్, పాక్తియా తదితర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించారు. ఈ నేపథ్యంలో దాడులపై పలు దేశాలు స్పందిస్తున్నాయి.ఉద్రిక్తతలపై చైనా, రష్యా ఆందోళన పాక్, అఫ్గాన్ మధ్య 2,611 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. దీన్ని డ్యురాండ్ లైన్ అని పిలుస్తుంటారు. అయితే, ఈ సరిహద్దును తాలిబన్లు గుర్తించడం లేదు. ఇటీవల డ్యురాండ్ లైన్ వద్ద అఫ్గాన్ దళాల కాల్పుల్లో 55 మంది తమ సైనికులు మృతి చెందినట్లు పాకిస్తాన్ రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. తాలిబన్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే దాడులకు దిగుతున్నారని, తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. తమ చెక్పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ తుర్కియే, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిణామాలను వారికి వివరించారు. పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని ఆయా మంత్రులు స్పష్టంచేశారు. మరోవైపు పాక్–అఫ్గాన్ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తంచేశాయి. వివాదాలను దౌత్య మార్గాల్లో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు సూచించాయి. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని చైనా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. పరిస్థితి మరింత విషమించకముందే సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని కోరింది. -
అఫ్గానిస్థాన్పై పాక్ దాడులు
-
అఫ్గానిస్తాన్పై పాక్ దాడులు
ఇస్లామాబాద్: ఒకప్పటి మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పాక్ సైన్యం గురువారం రాత్రి అఫ్గాన్పై వైమానిక దాడులు ప్రారంభించింది. ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’పేరిట కాబూల్, కాందహార్, పాక్తియా తదితర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 274 మంది తాలిబన్లు మరణించారు. మరో 400 మందికిపైగా గాయపడ్డారు. తాలిబన్లకు చెందిన 27 సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. తొమ్మిది సైనిక పోస్టులను పాక్ సైన్యం స్వా«దీనం చేసుకుంది. అలాగే అఫ్గాన్లో పలు యుద్ధ ట్యాంకులు సైతం ధ్వంసమైనట్లు సమాచారం. తాలిబన్ల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ వైమానిక దాడులు జరిగాయి. సరిహద్దుల్లో తాలిబన్ల దాడులను తిప్పికొట్టడానికే తాము రంగంలోకి దిగాల్సి వచ్చినట్లు పాక్ తేల్చిచెప్పింది. అఫ్గాన్పై బహిరంగ యుద్ధం ప్రారంభించామని పాకిస్తాన్ రక్షణ శాఖమంత్రి అసిఫ్ ఖవాజా ప్రకటించారు. తమ ఓపిక పూర్తిగా నశించిందని, రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధం సాగుతోందని పేర్కొన్నారు. పొరుగుదేశం గుట్టుమట్లు తమకు తెలుసంటూ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘దమా దమ్ మస్త్ ఖలందర్’అనే సూఫీ ఆధ్యాతి్మక గీతాన్ని సైతం ప్రస్తావించారు. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా తాము చేయాల్సింది చేసి చూపిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. పాక్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయిఅఫ్గాన్ తాలిబన్ల తీరుపై పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రిపూట పిరికిపందల్లా పాక్పై దాడులకు దిగారని మండిపడ్డారు. సాధారణ పౌరులపై కాల్పులు జరిపారని ఆరోపించారు. శత్రువులకు తగిన రీతిలో బుద్ధి చెప్పామని స్పష్టంచేశారు. తమ దేశభద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మరోసారి పాక్ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబన్లను హెచ్చరించారు. శాంతి పట్ల ఆకాంక్ష బలహీనత కాదు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం స్పందించారు. శాంతి, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకొనే విషయంలో రాజీ పడబోమని ప్రకటించారు. తాలిబన్ల దుశ్చర్య పట్ల తమ సైనిక దళాలు సమగ్రంగా, నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించాయని తెలిపారు. శాంతి పట్ల తమ ఆకాంక్షను బలహీనతగా భావించవద్దని అఫ్గాన్ పాలకులకు సూచించారు. తమ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ‘అందనంత దూరంలో ఎవరూ లేరు’అంటూ ఉద్ఘాటించారు. ఎలాంటి దాడులైనా ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్ సైన్యానికి ఉందని తేలి్చచెప్పారు. -
ఆహా..ఓహో.. ఆఫ్గాన్పై యుద్ధం వేళ పాకిస్థాన్పై ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహ్బాజ్ షరీఫ్, పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (cdf) ఆసిమ్ మునీర్లను డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ యుద్ధం పతాక స్థాయికి చేరుకున్న క్రమంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. పాకిస్థాన్-ఆఫ్గనిస్థాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వైట్ హౌస్లోని సౌత్లాన్లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ పాకిస్థాన్తో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇస్లామాబాద్తో నేను చాలా బాగా కలిసిపోతాను’అని వ్యాఖ్యానించారు. షెహ్బాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్పై ప్రశంసల వర్షం కురిపించారు. వారు గొప్ప నాయకులని అభివర్ణించారు.ఒకవైపు యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, ట్రంప్ పాకిస్థాన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం, అమెరికా ఇస్లామాబాద్ వైపు దౌత్యపరమైన మద్దతు చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఆఫ్గనిస్థాన్కి అమెరికా నుంచి ప్రత్యక్ష మద్దతు లభించకపోవచ్చనే సందేహాలను కూడా రేకెత్తిస్తోంది.ఓపెన్ వార్ పాక్-ఆఫ్గనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు ‘ఓపెన్ వార్’ స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించారు. ఆఫ్గనిస్థాన్ నుంచి జరిగిన సరిహద్దు దాడులకు ప్రతిగా, పాకిస్థాన్ ‘ఘజబ్ లిల్-హక్’ అనే ఆపరేషన్ ప్రారంభించి కాబూల్తో పాటు మరికొన్ని ప్రావిన్స్లపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో వందలాది తాలిబాన్ సైనికులు మృతి చెందారని పాకిస్థాన్ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు, ఆఫ్గనిస్థాన్ కూడా పాకిస్థాన్ సైన్యంపై గణనీయమైన నష్టం కలిగించామని చెప్పింది. ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.పాకిస్థాన్-ఆఫ్గనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఫిబ్రవరి 26న సరిహద్దు కాల్పుల తర్వాత వేగంగా ‘ఓపెన్ వార్’ స్థాయికి చేరుకున్నాయి. తాలిబాన్ అధికారులు నంగర్హార్, కునార్, ఖోస్ట్ వంటి తూర్పు ప్రావిన్స్లలో రాత్రి ఎనిమిది గంటల సమయంలో దాడులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇస్లామాబాద్ (పాక్ రాజధాని)మాత్రం ఆఫ్గన్ తాలిబాన్ అనవసరంగా కాల్పులు ప్రారంభించిందని ఆరోపించింది. అందుకు ప్రతిస్పందనగా కాల్పులకు దిగినట్లు తెలిపింది.కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ వైమానిక దాడులు,ఆర్టిలరీ దాడులు అంటే సరిహద్దు ప్రాంతాల్లో , యుద్ధరంగంలో శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులను కాబూల్తో పాటు సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. తాలిబాన్ కూడా ప్రతిదాడులు జరిపి పాకిస్థాన్ సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని తెలిపింది. ఇరువైపులా ప్రాణనష్టం గణనీయంగా జరిగిందని వర్గాలు చెబుతున్నప్పటికీ, మృతులు,గాయపడిన వారి సంఖ్యలపై స్పష్టత రావాల్సి ఉంది. -
"పంచ్" ఎమోషనల్ ట్రెండ్..దెబ్బకు అమాంతం ఆ బొమ్మకు డిమాండ్
ఇంటర్నెట్ యుగంలో వైరల్ అవుతున్న కంటెంట్లో చాలావరకు వినోదం, ట్రోల్స్ లేదా షాకింగ్ అంశాలే ఎక్కువ. కానీ కొన్నిసార్లు అత్యంత సాదాసీదా భావోద్వేగ క్షణం కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను కదిలిస్తుంది. అలాంటి అరుదైన కథే పంచ్ అనే 7 నెలల జపనీస్ మకాక్ది. జపాన్లోని ఇచికావా సిటీ జూలో ఉన్న ఈ చిన్న కోతి, తల్లి వదిలేయడంతో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ ఒంటరితనంలో, తనకు ఏకైక సాంత్వనగా మారింది ఒక ‘స్టఫ్డ్ ఒరంగుటాన్ బొమ్మ’. దాన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోతూ, భయపడినప్పుడు మరింత బలంగా ఆలింగనం చేసుకుంటూ ఉన్న దృశ్యాలు, వీడియోలుగా బయటకు రావడంతో, సోషల్ మీడియాలో తుఫానులా వ్యాపించాయి. ఈ ట్రెండ్ హైదరాబాద్లోనూ కనిపించింది. దీంతో ఈ బొమ్మకు నగరంలోనూ, ఆన్లైన్లోనూ ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. పంచ్ పట్టుకున్న ఆ ప్లష్ టాయ్ ప్రపంచ ప్రఖ్యాత ఫరి్నచర్ బ్రాండ్ ఐకియాకు చెందినది కాగా.. ఈ ప్రభావంతో పలు దేశాల్లోని తమ ఐకియా స్టోర్స్లో ఈ బొమ్మకు సోల్డ్ ఔట్ బోర్డుల పెట్టడం విశేషం. ఒక జూలో ఒరంగుటాన్ బొమ్మతో కోతి (మకాక్) వైరల్ పంచ్ వీడియోలు వైరల్ కావడానికి కారణం కేవలం ‘క్యూట్’ ఫ్యాక్టర్ మాత్రమే కాదు. ఈ తరం సోషల్ మీడియా వినియోగదారులు కూడా. ముఖ్యంగా హైదరాబద్ వంటి నగరాల్లో నివసించే యువత.. భావోద్వేగ అనుబంధం, మానసిక ఆరోగ్యం, ఒంటరితనం వంటి అంశాల పట్ల మరింత సున్నితంగా స్పందిస్తున్నారు. పంచ్ కథలో కనిపించింది అదే మానవీయ కోణం. ‘కంఫర్ట్’ అనేది మనుషులకు మాత్రమే కాదు, జంతువులకూ అవసరమనే భావన ఈ కథ ద్వారా బలంగా ముందుకొచి్చంది. ఈ ప్రభావంతో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ ప్లష్ బొమ్మకు ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడిందని ప్రముఖ ఈ–కార్ట్ సంస్థలు వెల్లడించాయి. ముఖ్యంగా యువత, పెట్ లవర్స్ ఈ బొమ్మలను పెద్ద సంఖ్యలో ఆర్డర్ చేస్తున్నారని చెబుతున్నాయి. కొందరు ఈ బొమ్మలతో దిగిన ఫొటోలు, రీల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత సందడి చేస్తున్నారు.‘జూ’కు వెళ్లోద్దామా.. హైదరాబాద్ యువతలో పెరుగుతున్న పెట్ కల్చర్, మెంటల్ హెల్త్ చర్చలు, ‘కంఫర్ట్ ఆబ్జెక్ట్స్’ పట్ల ఆసక్తి.. ఇవన్నీ పంచ్ కథను నగరానికి మరింత దగ్గర చేశాయి. రీల్స్, షార్ట్స్, స్టోరీల రూపంలో ఈ కథ స్థానిక సోషల్ మీడియా ఫీడ్స్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కారణంగా నగరంలోని జూలకు వెళ్లే వారి సంఖ్య పెరగనుందని పలువురి అభిప్రాయం. అసలు అలాంటి జంతువు నగరంలోని జూ పార్క్లో ఉందా అని పలువురు ఔత్సాహికులు గూగుల్ సెర్చ్లో అడగడం కొసమెరుపు. అయితే నగరంలోని జూలో ప్రస్తుతం విభిన్న రకాల కొండవానరాలు (మకాక్) కనిపిస్తాయి.. టఫ్టెడ్ మార్మోసెట్, స్క్విరెల్ మంకీ, క్యాపుచిన్ మంకీ, బోనెట్ మకాక్, లయన్–టెయిల్డ్ మకాక్, రేసస్ మకాక్ వంటి స్థానిక కోతులు ఉన్నాయి. కానీ జపనీస్ మకాక్ (పంచ్ మాదిరి) మాత్రం ఇందులో ఉండదు. ఇక ఒరంగుటాన్ వంటి ఏషియాటిక్ గొరిల్లా తరహా అడవిపిల్లి/ఏప్ జాతులు గురించి ప్రభుత్వ జూ వెబ్సైట్ ప్రకారం స్పష్టమైన ప్రస్తావన లేదు. పంచ్ కథ, ఈ డిజిటల్ యుగంలో మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తోంది. లైఫ్స్టైల్ మార్కెట్పై ప్రభావం.. పంచ్ పట్టుకున్న ఆ ప్లష్ టాయ్ సాఫ్ట్ ఒరంగుటాన్ బొమ్మ వీడియోలు వైరల్ అనంతరం జపాన్, అమెరికా, దక్షిణ కొరియాతో పాటు భారత్ వంటి దేశాల్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కొన్ని దేశాల్లో ఇది స్టాక్ అవుట్ అయినట్టు సోషల్ మీడియాలో వినియోగదారులు పేర్కొన్నారు. సోషల్ మీడియా వైరల్ ట్రెండ్లు ఎలా నేరుగా లైఫ్స్టైల్ కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయో చెప్పే తాజా ఉదాహరణ. ఒక భావోద్వేగ కథ, ఒక సాధారణ ఉత్పత్తిని గ్లోబల్ ట్రెండ్గా మార్చగలదన్న విషయం దీని ద్వారా మరోసారి స్పష్టమవుతోంది. -
టీ20 ప్రపంచకప్లో నేడు మరో కీలక సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో నేడు (ఫిబ్రవరి 27) కీలక సమరం జరుగనుంది. గ్రూప్-2 నుంచి ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్.. మరో బెర్త్ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. తద్వారా పాక్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ రెండో బెర్త్ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్, న్యూజిలాండ్ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్రేట్ కీలకమవుతుంది. ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్ రన్ రేట్ 3.050గా ఉంది. అదే పాక్ రన్రేట్ -0.461గా ఉంది. పాక్ మైనస్ నుంచి ప్లస్ రన్రేట్లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్ రన్రేట్ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి, నేటి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా, న్యూజిలాండ్కు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. వాస్తవానికి న్యూజిలాండ్ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్ జరిగి ఉంటే, న్యూజిలాండ్ సునాయాసంగా పాక్ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేది.బలాబలాల ప్రకారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ సమతూకంగా కనిపించినా ఎడ్జ్ న్యూజిలాండ్వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్లో ఉన్నారు. అదే ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఓపెనర్ జోస్ బట్లర్, జేకబ్ బేతెల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్లో ఆదిల్ రషీద్ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
ఆప్ఘన్, పాక్ యుద్ధం.. భారత్పై ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్, తాలిబన్ల ఆఫ్ఘనిస్థాన్ సైన్యం మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆప్ఘన్పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లు పాకిస్తాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఖవాజా.. భారత్పై మరోసారి అక్కసును వెళ్లగక్కారు.అయితే, ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ‘మా సహనం నశించింది. ఇప్పుడు మాకు.. మీకు మధ్య బహిరంగ యుద్ధమే’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్తో ప్రస్తుతం తాలిబన్లకు సంబంధాలు లేవన్నారు. మరోవైపు, ఖవాజా.. భారత్పై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్తాన్పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయని ఫ్రాన్స్ 24 ఇంటర్వ్యూలో అన్నారు. భారతే.. తమపై ఆప్ఘన్లు దాడులు చేసేలా ప్రేరేపించిందన్నారు. కానీ, భారత్ దానిని అంగీకరించరు. భారత్.. కాబూల్తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆప్ఘన్.. భారత్కు వలస రాజ్యంగా ఉందన్నారు. అయితే, దీనిపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా, భారత్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలను అనుమానాస్పదంగా పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి నుంచే ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’గా పేర్కొంది. కాబుల్, కాందహార్, పక్తియా ప్రావిన్స్లలో వైమానిక దాడులు జరిగాయని ఆప్ఘన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. పాక్పై చేపట్టిన దాడుల్లో 55 మంది ఆ దేశ సైనికులు చనిపోయారని ఆఫ్ఘనిస్థాన్ ప్రకటించింది. అయితే, ఇస్లామాబాద్ దీన్ని తోసిపుచ్చింది. ఘర్షణల్లో ఇద్దరు పాక్ సైనికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. ఇస్లామాబాద్ సైనికుల నిర్బంధంపై తాలిబన్లు చేసిన ప్రకటనను పాక్ ప్రభుత్వ ప్రతినిధి మోషరఫ్ అలీ జైదీ ఖండించారు. ఆప్ఘన్ సైనికులే 133 మంది మరణించారని.. 200 మందికి పైగా గాయపడ్డారన్నారు. తొమ్మిది మంది సైనికులను నిర్బంధించినట్లు తెలిపారు. ఇటీవల తమపై జరిగిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్పై అఫ్గాన్ విరుచుకుపడింది.డ్యూరాండ్ రేఖ వివాదం..ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య 2,611 కిలోమీటర్ల సరిహద్దు అయిన డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్థాన్ అధికారికంగా ఎప్పుడూ గుర్తించలేదు. పాకిస్తాన్ దీనిని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా ఉంది. ఈ క్రమంలో 2025 అక్టోబర్లో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు, మిలిటెంట్లు మరణించారు. -
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య బహిరంగ యుద్ధం
-
T20 WC 2026: సెమీస్లో భారత్ వర్సెస్ పాక్..?
టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్కు చేరబోయే జట్లపై ఓ అవగాహణ ఏర్పడింది. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇప్పటికే ఫైనల్-4కు అర్హత సాధించగా.. రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్పై కర్చీఫ్ వేసుకొని కూర్చోగా.. రెండో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాక్ పోటీపడనున్నాయి.సెమీస్ బెర్త్లపై ఓ క్లారిటీ రావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టంతా ఏ జట్టు ఎవరితో తలపడనుందనే అంశంపై కేంద్రీకృతమైంది. నిన్న (ఫిబ్రవరి 26) జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్ గ్రూప్-1 నుంచి విండీస్కు ప్రధాన పోటీదారుగా మారగా.. గ్రూప్-2లో రెండో బెర్త్ న్యూజిలాండ్కు దాదాపుగా ఫిక్స్ అయ్యింది. అలాగని పాక్ అవకాశాలను తీసిపారేయడానికి వీళ్లేదు.మిగతా జట్ల మాట ఎటున్నా, భారత క్రికెట్ అభిమానులు మాత్రం ప్రస్తుత ప్రపంచకప్లోనే మరోసారి భారత్, పాక్ మ్యాచ్ కోరుకుంటున్నారు. ఇరు జట్లు సెమీస్లో తలపడాలని వారు ఆకాక్షిస్తున్నారు. ఇది కష్టసాధ్యమైన ప్రక్రియే అయినప్పటికీ.. అసాధ్యం మాత్రం కాదు. కొన్ని అద్భుతాలు జరిగితే తప్పక సెమీస్లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది. అదెలా అంటే..ముందుగా భారత్ విషయానికి వద్దాం.. జింబాబ్వేపై గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్పై క్లియర్ పిక్చర్ ఏర్పడింది. తదుపరి మ్యాచ్లో విండీస్ గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఓడినా లేక మ్యాచ్ రద్దైనా మెరుగైన రన్రేట్ కలిగిన విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది.సెమీస్లో పాక్తో తలపడాలంటే భారత్ విండీస్పై నామమాత్రపు విజయం సాధిస్తే సరిపోదు. ఆ మ్యాచ్లో భారత్ మంచి రన్ రేట్తో భారీ విజయం సాధించాలి. అలాగే ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉన్న సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్లో జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడాలి. అప్పుడు భారత్, సౌతాఫ్రికా తలో 4 పాయింట్లతో ఉంటాయి. ఇక్కడ ప్లేసింగ్ విషయంలో రన్రేట్ కీలకమవుతుంది. విండీస్పై భారత్ భారీ తేడాతో గెలుస్తుంది కాబట్టి రన్రేట్ కూడా భారీగా పెరుగుతుంది. మరోవైపు సౌతాఫ్రికా జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడితే ఆ జట్టు రన్రేట్ భారత్ కంటే తక్కువై పోతుంది. అప్పుడు గ్రూప్ 1 టాపర్గా భారత్.. రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంటాయి.గ్రూప్-1లో అగ్రస్థానంలో నిలిచే జట్టు గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచే జట్టును సెమీస్లో ఢీకొంటుంది. సెమీస్లో భారత్-పాక్ మ్యాచ్ జరగాలి అంటే, పాక్ గ్రూప్-2 నుంచి రెండో స్థానంలో నిలివాలి. ఆ జట్టుకు ప్రస్తుతం అగ్రస్థానికి వెళ్లే ఛాన్స్లు లేవు. భారత్=పాక్ సెమీస్లో తలపడాలంటే టీమిండియానే గ్రూప్-1లో టాప్ ప్లేస్లో ఉండాలి.ఇక పాక్ గ్రూప్-2లో రెండో స్థానానికి ఎలా చేరుకునే అవకాశం ఉందంటే.. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారైపోయింది. పాక్కు సెమీస్ బెర్త్ దక్కాలంటే వారి చివరి మ్యాచ్లో శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్రేట్ కూడగట్టుకోవాలి. ఇలా జరిగితే పాక్ ఖాతాలో 3 పాయింట్లు చేరతాయి. సెమీస్ బెర్త్ కోసం పాక్కు పోటీదారుగా ఉన్న న్యూజిలాండ్ ఇప్పటికే 3 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, భారీ రన్రేట్ను కూడా సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తమి చివరి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, రెండో స్థానంలో సెమీస్కు చేరుకుంటుంది. కానీ, సెమీస్లో మనకు భారత్-పాక్ మ్యాచ్ కావాలంటే న్యూజిలాండ్పై ఇంగ్లండ్ అతి భారీ తేడాతో గెలవాలి. అప్పుడు న్యూజిలాండ్ నెట్ రన్రేట్ బాగా తగ్గిపోతుంది. అప్పటికే శ్రీలంకపై అతి భారీ తేడాతో గెలిచి మంచి రన్రేట్తో ఉన్న పాకిస్తాన్ గ్రూప్-2 నుంచి రెండో జట్టుగా సెమీస్కు చేరుతుంది.అప్పుడు గ్రూప్-1 టాపర్ భారత్.. గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచే పాకిస్తాన్ సెమీస్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లెక్కల వరకు ఇది బాగానే ఉంది కానీ, ఇలా జరగడం చాలా కష్టం. భారత్ అష్టకష్టాలు పడి గ్రూప్-1లో టాప్ ప్లేస్కు రాగలదేమో కానీ, ఏదైనా మహాద్భుతం జరిగితేనే పాక్కు సెమీస్ బెర్త్ దక్కుతుంది. -
అఫ్గాన్పై పాక్ యుద్దం.. 130 మంది మృతి?
అఫ్గానిస్థాన్- పాకిస్థాన్ మధ్య అధికారికంగా యుద్ధం మెుదలైంది. గజీబ్ లిల్ హాక్ పేరుతో మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజధాని కాబూల్పై వైమానిక దాడులతో పాక్ విరుచుకపడుతుంది. ఇప్పటివరకూ పాక్ జరిపిన దాడుల్లో 130 మంది తాలిబన్లు మృతిచెందినట్లు పాక్ ప్రకటించింది.కాగా నిన్న( గురువారం) రాత్రి పాకిస్థాన్పై అఫ్గానిస్థాన్ దాడులతో విరుచుకు పడింది. పాక్ సరిహద్దుల్లో జరిగిన దాడుల్లో 70 మందికి పైగా ఆ దేశ సైనికులు మృతిచెందినట్లు తాలిబన్లు ప్రకటించారు. పెద్దమెుత్తంలో సైనికస్థావరాలు ధ్వంసమైనట్లు తెలిపారు. పాక్ సైనిక స్థావరాలే లక్షంగా దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే దీనికి ప్రతీకారంగా అఫ్గాన్తో పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. కాబూల్తో పాటు, కాందహార్ పై ఎయిర్స్ట్రైక్స్ చేస్తున్నట్లు తెలిపిందికాగా పాక్ జరిపిన దాడిలో ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే కొద్దిరోజులుగా పాక్- అఫ్గాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాలలో పాకిస్థాన్ దాడులు జరుపగా దాదాపు 70 మంది దాకా అఫ్గాన్ పౌరులు మృతిచెందారు. దీనికి బదులుగా పాకిస్థాన్పై అప్గానిస్థాన్ అటాక్ చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర
వాషింగ్టన్: అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసిన ఈ కేసు ప్రస్తుతం న్యూయార్క్లో విచారణ దశలో ఉంది. పాకిస్తాన్కు చెందిన అసిఫ్ మర్చంట్ అనే వ్యక్తి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు తాజాగా కోర్టు విచారణ లో తేలింది. ఆసిఫ్ పాక్ జాతీయుడియే అయినా ఇరాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. 2024లో అమెరికాలోకి ప్రవేశించిన అసిఫ్, న్యూయార్క్ చేరిన కొద్ది రోజుల్లోనే కాంట్రాక్ట్ కిల్లర్లను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ అతను కలిసిన వారు వాస్తవానికి ఎఫ్బీఐ గూఢచారులు కావడంతో మొత్తం కుట్ర బయటపడింది. విచారణలో అసిఫ్ ఇద్దరికి 5వేల డాలర్ల అడ్వాన్స్ చెల్లించినట్లు రుజువైంది.ప్రస్తుతం బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. నిందితుడు దోషిగా తేలితే అతనికి జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. అమెరికా న్యాయ శాఖ ఈ కేసును ‘మర్డర్-ఫర్-హైర్ కుట్ర’గా పేర్కొంటూ, దేశ రాజకీయ నాయకులపై దాడి ప్రయత్నం అత్యంత తీవ్రమైన నేరమని స్పష్టం చేసింది. -
ఐరాసలో పాక్ ఆరోపణలు.. సాక్ష్యాలతో తిప్పికొట్టిన భారత్!
జెనీవా: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55వ సాధారణ సమావేశాల్లో పాకిస్తాన్కు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) భారత్పై చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఖండించింది. జమ్ముకశ్మీర్ అభివృద్ధిని చూసి పాక్ అసూయతో రగిలిపోతోందని, అందుకే అంతర్జాతీయ వేదికలపై విషం చిమ్ముతోందని భారత తొలి కార్యదర్శి అనుపమ సింగ్ ధ్వజమెత్తారు.జమ్ముకశ్మీర్ భూభాగం భారత్లో అంతర్భాగమని, అది ఎప్పటికీ విడదీయలేని అంశమని ఆమె స్పష్టం చేశారు. 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం జమ్ముకశ్మీర్ భారత్లో విలీనం కావడం చట్టబద్ధమని, ఇది ఎవరూ మార్చలేని సత్యమని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న ఆక్రమిత భూభాగాలను వెంటనే ఖాళీ చేయడమే ప్రస్తుతం ఉన్న ఏకైక అపరిష్కృత అంశమని ఆమె స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నమోదైన రికార్డు స్థాయి ఓటింగ్ శాతం.. అక్కడి ప్రజలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, హింసను తిరస్కరించారని చెప్పడానికి నిదర్శనమని అనుపమ సింగ్ పేర్కొన్నారు. VIDEO | Switzerland: At the High-Level Segment of the 55th Regular Session of the UN Human Rights Council, First Secretary, Anupama Singh in Geneva, says, “India is compelled to exercise its right of reply in response to the references made during the high-level segment by… pic.twitter.com/uHOrmIEf4g— Press Trust of India (@PTI_News) February 26, 2026కశ్మీరీ ప్రజలు అభివృద్ధి, ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగుతున్నారని ఆమె అన్నారు. గత ఏడాది ప్రారంభమైన 'చీనాబ్ రైల్వే బ్రిడ్జి'ని కూడా పాక్ నకిలీదని భావిస్తే.. ఆ దేశం ఖచ్చితంగా వాస్తవాలకు దూరంగా ‘లా-లా ల్యాండ్’ (కలల లోకం)లో బతుకుతున్నట్లేనని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం గురించి పాక్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, ఎన్నికైన పౌర ప్రభుత్వాలు కనీసం తమ పదవీకాలాన్ని కూడా పూర్తి చేసుకోలేని దేశం నుండి భారత్ ప్రజాస్వామ్య పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అనుపమ సింగ్ ఘాటుగా స్పందించారు. బుధవారం జరిగిన ఈ హై-లెవల్ సమావేశంలో పాకిస్తాన్ ప్రచారం వెనుక ఉన్న కుట్రలను సాక్ష్యాధారాలతో సహా భారత్ తిప్పికొట్టింది. ఫిబ్రవరి 23 నుండి 31 వరకు కొనసాగనున్న ఈ 61వ ఐరాస మానవ హక్కుల మండలి సమావేశాల్లో భారత్ తన గొంతును బలంగా వినిపిస్తూ, పాక్ కుట్రలను ప్రపంచ దేశాల ముందు ఉంచింది.ఇది కూడా చదవండి: అరుదైన నేతగా ప్రధాని మోదీ ఘనత -
పోరాడి ఓడిన పాక్
3 టీ20లు, 3 వన్డే మ్యాచ్ల సిరీస్ల కోసం పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జరిగిన టీ20 సిరీస్ను ఆతిథ్య జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతుంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకుంది (2-0). తొలి వన్డేలో 37 పరుగుల తేడాతో విజయం సాధించిన ప్రొటిస్ జట్టు.. సెంచూరియన్ వేదికగా నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన రెండో మ్యాచ్లో 16 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది.భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి ఏకంగా 361 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు 49.5 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌటై పరాజయంపాలైంది.సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో డెర్క్సన్ (90) సెంచరీ మిస్ చేసుకోగా.. తజ్మిన్ బ్రిట్స్ (77), సూన్ లస్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో క్లో ట్రయాన్ (37), డి క్లెర్క్ (49) బ్యాట్ ఝులిపించారు. ఫలితంగా సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్, సయ్యెదా అరూబ్ షా తలో 2 వికెట్లు పడగొట్టగా...డయానా బేగ్, నష్రా సంధు చెరో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో వికెట్లు కోల్పోయినప్పటికీ ఆతర్వాత కుదురుకుంది. షమాస్ (61), అయేషా జాఫర్ (75), ఫాతిమా సనా (52) అర్ద సెంచరీలు సాధించి పాక్ను విజయం దిశగా తీసుకెళ్లారు. ఆఖర్లో సయ్యేదా (40), డయానా బేగ్ (38 నాటౌట్) కూడా గెలుపు కోసం ప్రయత్నించినా కుదర్లేదు. ఫలితంగా పాక్ లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో డెర్క్సన్ 3, డి క్లెర్క్, మ్లాబా, షాంగేస్ తలో 2, సూన్ లస్ ఓ వికెట్ తీసి పాక్ను ఆలౌట్ చేశారు. నామమాత్రపు చివరి వన్డే మార్చి 1న కింగ్స్మీడ్ డర్బన్ వేదికగా జరుగుతుంది. -
నకిలీ డిగ్రీతో ఐదేళ్లు హైకోర్టు జడ్జిగా తీర్పులు!
ఆయనో హైకోర్టు న్యాయమూర్తి. ఉన్నత న్యాయస్థానం జడ్జిగా ఐదేళ్ల పాటు నిరాటంకంగా తీర్పులు కూడా ఇచ్చేశారు. తీరా చూస్తే ఆయన నకిలీ లా డిగ్రీతో పదవిలోకి వచ్చారని తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా.. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకున్నారు. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించి ఇంటికి పంపించారు. ఈ ఘటన పాకిస్థాన్లో వెలుగులోకి వచ్చింది.డాన్ పత్రిక కథనం ప్రకారం.. జస్టిస్ తారిఖ్ మహమూద్ జహంగిరి ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2020, డిసెంబర్లో ఆయన హైకోర్టు జడ్జి అయ్యారు. అయితే నకిలీ డిగ్రీ వ్యవహారం బయటపడడంతో ఆయనను గతేడాది సెప్టెంబర్లో న్యాయమూర్తి పదవి నుంచి తప్పించారు. జస్టిస్ జహంగిరిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం (ఫిబ్రవరి 23) ఆయనకు వ్యతిరేకంగా 16 పేజీల తీర్పు వెలువరించింది. నకిలీ డిగ్రీతో మోసానికి పాల్పడడమే కాకుండా, శిక్ష పడకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారని న్యాయస్థానం ధ్రువీకరించింది.కరాచీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అందించిన అసలు రికార్డుల ఆధారంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. జహంగిరి 1988లో నకిలీ నమోదు సంఖ్యను ఉపయోగించి లా పరీక్షకు హాజరైయ్యాడు. మరుసటి ఏడాది అంటే 1989లో పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడడంతో కరాచీ యూనివర్సిటీ ఆయనపై మూడేళ్ల నిషేధం విధించింది. అయినా అతడి బుద్ధి మారలేదు. ఇంతియాజ్ అహ్మద్ అనే విద్యార్థికి కేటాయించిన ఎన్రోల్మెంట్ నంబర్తో మళ్లీ పరీక్షకు హాజరయ్యాడు. మరోవైపు జహంగిరి తమ కాలేజీలో చదవలేదని ప్రభుత్వ ఇస్లామియా లా కాలేజీ ప్రిన్సిపాల్ కోర్టుకు తెలిపారు.కాగా, ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలని, రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఏవేవో సాకులు చెప్పి స్పందించలేదని హైకోర్టు తన తీర్పులో వెల్లడించింది. లా డిగ్రీకి సంబంధించిన అసలు ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. చదవండి: మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. అక్కసుతో పాకిస్థాన్ తీర్మానం -
మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. అక్కసుతో పాక్ తీర్మాణం
ఇస్లామాబాద్: ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ పాకిస్థాన్ తన అక్కసు వెళ్లగక్కింది. ఇజ్రాయెల్- భారత్ మైత్రికి వ్యతిరేకంగా ఆ దేశ చట్టసభలో తీర్మానం చేసింది. ఈ షడ్బుజ కూటమిని యాంటీ ముస్లిం- ఉమ్మాబ్లాక్ గా అభివర్ణించింది. ఆ దేశ మంత్రి పాల్వాశా మహ్మద్ జియా ఖాన్ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ఆ దేశ చట్టసభలు ఏకగ్రీవంగా మద్దతిచ్చాయి.నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మోదీకి సాధరంగా స్వాగతం పలికారు. అయితే ఇదిలా ఉండగా.. బెంజిమిన్ నెతన్యాహూ భారత్ మరియు ఇతర దేశాలతో కలిసి "హెక్సాగన్ అలయెన్స్" ( ఆరుభుజాల కూటమి) ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై పాకిస్థాన్ మండిపడింది. ఈ కూటమి ముస్లిం దేశాలకు వ్యతిరేక బ్లాక్గా పాక్ అభివర్ణించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ పల్వాషా మహమ్మద్ జై ఖాన్ ఈ కూటమికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశ పెట్టారు.ఈ తీర్మాణంలో "ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఈ కూటమి "యాంటీ- ముస్లిం ఉమ్మా (సమూహం)". ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న పాలస్తీనాలోని చారిత్రక ప్రాంతాలను మార్చే యత్నం చేస్తే సహిందేది లేదు. పాలస్తీనాకు స్వతంత్రంగా వ్వవహరించే అంశానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది". అని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల ఇజ్రాయెల్ సోమాలిలాండ్ను స్వతంత్ర్య దేశంగా గుర్తించడాన్ని పాకిస్థాన్ సెనేట్ తిరస్కరించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకమని తెలిపింది.మరోవైపు, నెతన్యాహూ ప్రతిపాదించిన “హెక్సాగన్ అలయన్స్”లో భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరియు సోమాలిలాండ్ (ఆఫ్రికా ప్రాంతం) ఉన్నాయి. ఈ కూటమి లక్ష్యం “రాడికల్ షియా” మరియు “రాడికల్ సున్నీ” భావజాలలకు వ్యతిరేకంగా వ్యవహరించేడమేనని తెలిపారు. -
T20 WC 2026: పాక్ జట్టులో కలకలం
పాక్ జట్టులో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కోచ్ మైక్ హెస్సన్ను బహిరంగంగా టార్గెట్ చేశాడు. సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెస్సన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు."అవును, నన్ను నమీబియా మ్యాచ్ నుంచి తప్పించారు. అయినా నా దృష్టి ఎప్పటికీ బౌలింగ్పైనే ఉంటుంది. నాకు అవకాశం వచ్చినప్పుడు జట్టుకు 100 శాతం ఇవ్వడమే నా పని. ఎవరి ముందు నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు" అని అన్నాడు. అలాగే హెస్సన్ నిర్ణయాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "ఆయనకు ఒక మైండ్సెట్ ఉంది. ఆయన హెడ్ కోచ్. జట్టును ఎలా నడిపించాలో ఆయనకే బాగా తెలుసు. దానికి ఆయనే బాధ్యత వహించాలి" అని వ్యాఖ్యానించారు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు హెస్సన్పై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.అఫ్రిది ఎందుకిలా..?అఫ్రిది-హెస్సన్ మధ్య విభేదాలు ప్రస్తుత టీ20 వరల్డ్కప్లో నమీబియా మ్యాచ్ నుంచి మొదలయ్యాయి. భారత్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని అఫ్రిదిని హెస్సన్ నమీబియా మ్యాచ్ నుంచి తప్పించాడు. ఈ నిర్ణయాన్ని హెస్సన్ వ్యూహాల్లో భాగంగా పేర్కొన్నప్పటికీ, హెస్సన్ తనను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టాడని అఫ్రిది భావిస్తున్నాడు. దీన్ని అవమానంగా భావించిన అఫ్రిది ఇంగ్లండ్ మ్యాచ్లో రాణించిన తర్వాత హెస్సన్పై పరోక్ష మాటల దాడికి దిగాడు.ఇంగ్లండ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడినా, అఫ్రిది అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి మ్యాచ్పై ఆశలు కలిగించాడు. అయితే బ్రూక్ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ను పాక్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అంతకుముందు న్యూజిలాండ్తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాక్ ఖాతాలో ప్రస్తుతం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. ఆ జట్టు తమ చివరి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచినా, సెమీస్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, ప్రస్తుతం గ్రూప్-1 నుంచి ఖాళీగా ఉంది ఒకే ఒక బెర్త్. ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచి దర్జాగా సెమీస్కు అర్హత సాధించగా.. న్యూజిలాండ్, పాక్, శ్రీలంక మిగిలిన బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. -
నేను యుద్ధం ఆపకుంటే పాక్ ప్రధాని చనిపోయేవారు: ట్రంప్
-
చావబోయే పాక్ ప్రధానిని కాపాడా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిర్వహించిన అత్యంత కీలక ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో .. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రాణాలను తానే కాపాడానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో షరీఫ్ ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లిందని, ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే ఆయన ఖచ్చితంగా మరణించి ఉండేవారని ట్రంప్ పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లోనూ, ఇటు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రసంగంలో భాగంగా ట్రంప్ విదేశీ సంబంధాలు, భద్రతాపరమైన అంశాలను ప్రస్తావిస్తూ, పాక్ ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాను రక్షకుడిగా నిలిచానని అన్నారు. రెండు అణు దేశాల మధ్య పెను విపత్తును తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. తన పదవీకాలంలోని మొదటి పది నెలల్లోనే థాయ్లాండ్-కాంబోడియా సహా ఎనిమిది యుద్ధాలను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్-పాక్ మధ్య తలెత్తిన అణు ముప్పును తప్పించడంలో తన పాత్ర నిర్ణాయకమని అన్నారు.ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ ఆపరేషన్ గనుక కొనసాగి ఉంటే పాకిస్తాన్లో దాదాపు 3.5 కోట్ల మంది మరణించే అవకాశం ఉండేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ భారీ మరణాల అంచనాకు గల ప్రాతిపదికను గానీ, ఆపరేషన్ సిందూర్ నేపధ్యాన్ని గానీ ఆయన వెల్లడించలేదు. చారిత్రక శతృత్వం ఉన్న రెండు అణుశక్తి దేశాల మధ్య ఉద్రిక్తతలు అదుపు తప్పి ఉంటే అవి పెను విధ్వంసానికి దారితీసేవని, కానీ తన దౌత్యపరమైన చొరవతో ఆ ప్రమాదాన్ని అడ్డుకున్నానని ఆయన పునరుద్ఘాటించారు.దక్షిణాసియాలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో తక్షణమే స్పందించడం ద్వారా పెను విషాదాన్ని ఆపగలిగానని ట్రంప్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అణు యుద్ధం అంచున ఉన్న ఇరు దేశాలను శాంతి వైపు మళ్లించడంలో అమెరికా అధ్యక్షుడిగా తాను పోషించిన పాత్ర అద్వితీయమని అన్నారు. పాకిస్తాన్ ప్రధాని ప్రాణాలు కాపాడటం వెనుక గల కారణాలను ఆయన ప్రస్తావించనప్పటికీ, అమెరికా జోక్యం వల్లే షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ పాకిస్తాన్ పట్ల భిన్నమైన వైఖరిని ప్రదర్శించిన ట్రంప్, ఇప్పుడు నేరుగా ఆ దేశ ప్రధాని ప్రాణాలను కాపాడానని ప్రకటించడం ద్వారా తన ప్రాధాన్యతను చాటుకున్నారు. ఈ పరిణామంపై అటు పాకిస్తాన్ ప్రభుత్వం గానీ, ఇటు షెహబాజ్ షరీఫ్ కార్యాలయం గానీ ఇప్పటివరకు స్పందించలేదు. -
పాక్పై మ్యాచ్ విన్నింగ్ శతకం.. రికార్డుల మోత మోగించిన బ్రూక్
టీ20 వరల్డ్కప్ 2026లో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 పోరులో పాకిస్తాన్పై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చిన వైనం ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కన్నుల పండుగలా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ మూడంకెల స్కోర్ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రెండంకెల స్కోర్ చేసింది జాక్స్, కర్రన్ మాత్రమే. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).ఈ మ్యాచ్ విన్నింగ్ శతకంతో బ్రూక్ రికార్డుల మోత మోగించాడు. తద్వారా తన జట్టును సెమీస్కు కూడా చేర్చాడు. బ్రూక్ సాధించిన ఆ రికార్డులు ఏంటంటే..?టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీహ్యారీ బ్రూక్- 50 బంతులు (తాజా మ్యాచ్లో)అలెక్స్ హేల్స్- 60జోస్ బట్లర్- 67టీ20 వరల్డ్కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్లుబ్రూక్- 100 (తాజా మ్యాచ్లో)క్రిస్ గేల్- 98 లోర్కాన్ టక్కర్- 94 నాటౌట్రోహిత్ శర్మ- 92ఈ సెంచరీతో బ్రూక్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ ఈ ఘనత సాధించారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జట్టు సూపర్-8లో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, దర్జాగా సెమీస్కు చేరింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఆ గ్రూప్లో భారత్ సెమీస్ బెర్త్ను సంక్లిష్టం చేసుకుంది. -
బ్రూక్ శతకంతో ఇంగ్లండ్ సెమీస్కు
టి20 వరల్డ్ కప్లో ‘సూపర్ ఎయిట్స్’లోకి అడుగు పెట్టినా ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్లో ఇంకా తడబాటు... వరుసగా నాలుగు మ్యాచ్లలో తానూ విఫలం కావడంతో విమర్శల ఒత్తిడి... ఇలాంటి స్థితిలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదనపు బాధ్యత తీసుకున్నాడు... 61 మ్యాచ్ల కెరీర్లో తొలిసారి మూడో స్థానంలోకి దిగి జట్టును గెలిపించే భారాన్ని భుజాన వేసుకున్నాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో తనొక్కడే 100 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్ను సెమీఫైనల్కు చేర్చాడు. బ్యాటింగ్లో సాధారణ స్కోరుకే పరిమితమైన పాకిస్తాన్... బౌలింగ్లో ఇతర బ్యాటర్లను నిలువరించగలిగింది గానీ బ్రూక్ను ఆపలేక మ్యాచ్ను అప్పగించింది. ఫలితంగా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి! పల్లెకెలె: టి20 ప్రపంచ కప్లో ఇంగ్లండ్ వరుసగా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ‘సూపర్–8’లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–2 మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై నెగ్గింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫర్హాన్ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో తొలి టి20 సెంచరీతో జట్టును గెలిపించాడు. మొదటి మ్యాచ్లో శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్ ఇప్పుడు పాక్పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు పాక్ సెమీస్ చేరే అవకాశాలకు గండిపడింది. చివరి మ్యాచ్లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర సమీకరణాలు, రన్రేట్లపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. దక్కని శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్కు శుభారంభం లభించలేదు. సయీమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆగా (5) తమ వైఫల్యాలను కొనసాగించారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్ప్లేలో ఒక్క సిక్సర్ కూడా లేకుండా పాక్ 46 పరుగులు చేసింది. ఆ తర్వాతా ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో జట్టు ఒకదశలో వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే కొట్టలేకపోయింది! ఈ క్రమంలో బాబర్ వెనుదిరగ్గా, ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రం కాస్త దూకుడుగా ఆడాడు. మరోవైపు 37 బంతుల్లో ఫర్హాన్ అర్ధసెంచరీ పూర్తయింది. 16 ఓవర్లలో స్కోరు 126/4. అయితే చివరి 4 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిన టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. షాదాబ్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాస్త ధాటిని ప్రదర్శించడంతో స్కోరు 160 పరుగులు దాటింది. హడలెత్తించిన అఫ్రిది ఛేదనలో ఇంగ్లండ్ను ఆరంభంలోనే షాహిన్ షా అఫ్రిది దెబ్బ తీశాడు. తన తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను... తన రెండో ఓవర్లో జోస్ బట్లర్ (2)ను, మూడో ఓవర్లో బెతెల్ (8)ను వెనక్కి పంపించాడు. అయితే ఈ స్థితిలో బ్రూక్ ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. నవాజ్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లేలో టీమ్ స్కోరు 53 పరుగులకు చేరింది. తక్కువ వ్యవధిలో బాంటన్ (2), స్యామ్ కరన్ (16) అవుటైనా... మరోవైపు బ్రూక్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతను అదే ధాటిని కొనసాగించగా, విల్ జాక్స్ (23 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అలవోకగా షాట్లు ఆడిన బ్రూక్... అఫ్రిది బౌలింగ్లో మిడాఫ్ మీదుగా భారీ సిక్స్తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత తడబడినా... చివరకు ఐదు బంతుల ముందే ఇంగ్లండ్ గట్టెక్కింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (ఎల్బీ) (బి) ఒవర్టన్ 63; అయూబ్ (సి) బెతెల్ (బి) ఆర్చర్ 7; సల్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 5; బాబర్ (బి) ఒవర్టన్ 25; ఫఖర్ (సి) డాసన్ (బి) రషీద్ 25; షాదాబ్ (రనౌట్) 23; ఉస్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 8; నవాజ్ (ఎల్బీ) (బి) డాసన్ 0; అఫ్రిది (సి) స్యామ్ కరన్ (బి) ఆర్చర్ 2; సల్మాన్ మీర్జా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–14, 2–27, 3–73, 4–122, 5–132, 6–146, 7–146, 8–149, 9–164. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2, ఒవర్టన్ 3–0–26–2, డాసన్ 4–0–24–3, స్యామ్ కరన్ 3–0–24–0, రషీద్ 4–0– 31–1, జాక్స్ 2–0–27–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 0; బట్లర్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 2; బ్రూక్ (బి) షాహిన్ అఫ్రిది 100; బెతెల్ (సి) ఫర్హాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; బాంటన్ (సి) ఉస్మాన్ (బి) తారిఖ్ 2; స్యామ్ కరన్ (సి) నవాజ్ (బి) తారిఖ్ 16; జాక్స్ (బి) నవాజ్ 28; ఒవర్టన్ (స్టంప్డ్) ఉస్మాన్ (బి) నవాజ్ 0; డాసన్ (నాటౌట్) 1; ఆర్చర్ (నాటౌట్) 5; మొత్తం (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–35, 4–58, 5–103, 6–155, 7–160, 8–161. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–30–4, సల్మాన్ మీర్జా 3.1–0–26–0, సయీమ్ అయూబ్ 2–0–21–0, నవాజ్ 3–0–26–2, షాదాబ్ ఖాన్ 3–0–31–0, ఉస్మాన్ తారిఖ్ 4–0–31–2. 3 ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా హ్యారీ బ్రూక్ నిలిచాడు. గతంలో జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ మాత్రమే ఈ ఘనత నమోదు చేశారు. ఓవరాల్గా ఏ జట్టు తరఫునైనా టి20 ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా కూడా బ్రూక్ గుర్తింపు పొందాడు. టి20 ప్రపంచకప్లో నేడుశ్రీలంక X న్యూజిలాండ్వేదిక: కొలంబో రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్పై ఇంగ్లండ్ విజయం
టీ 20 ప్రపంచకప్ సూపర్-8లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పాకిస్థాన్పై ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం, బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండు వికెట్ల తేడాతో పాక్పై విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విరవిహారం సృష్టించాడు. 51 బంతుల్లో సెంచరీ చేశాడు. వరుసగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో సూపర్ ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ ఫినిషర్ విల్ జాక్స్ దూకుడు ప్రదర్శించాడు. 28 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. ఇక పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ 4 వికెట్లు,మహ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ చెరో రెండు వికెట్లు తీశారు. -
ఆ దాడి చేసింది మేమే.. BLA ప్రకటన
బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 22న పాకిస్థాన్ సైనిక దళాలపై జరిగిన దాడికి BLA దే బాధ్యత అని ప్రకటించింది. బలూచిస్థాన్నికి స్వతంత్ర్యం కల్పించేంతవరకూ ఈ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది.ఫిబ్రవరి 22న అలహాబాద్ ప్రాంతంలోని మాచ్ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రత బలగాల కాన్వాయిపై మెరుపుదాడి జరిగింది. ఈ అటాక్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన నలుగురు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే ఈ దాడికి తమదే బాధ్యతని BLA ప్రకటించింది. పాక్ ఆక్రమణలో ఉన్న బలూచిస్థాన్కు స్వాతంత్ర్యం కల్పించే వరకూ పోరాటం ఆపేది లేదని BLA స్పోక్స్ పర్సన్ ఆజాద్ బలూచ్ తెలిపారు.అయితే అంతకుముందు బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడింది. ఇటీవల ఆ సైన్యం జరిపిన దాడుల్లో 177 మందికి పైగా మృతిచెందారు. BLA ఆర్మీకి వారికి ఎటువంటి సహాయక చర్యలు అందకుండా ఉండేందుకు రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్ను కట్ చేసింది. అయితే బలూచిస్తాన్లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్వర్క్ మెుత్తంగా 4 నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని పాక్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
టీ20 ప్రపంచకప్లో నేడు మరో ఆసక్తికర సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 24) మరో ఆసక్తికర సూపర్-8 సమరం జరుగనుంది. పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ పాకిస్తాన్కు డూ ఆర్ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. మరోపక్క ఇంగ్లండ్కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఏ తలనొప్పి లేకుండా సెమీస్కు చేరాలనుకుంటే ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. శ్రీలంకపై తొలి సూపర్-8 మ్యాచ్లో గెలిచిన ఇంగ్లండ్ గ్రూప్-2 టాపర్గా ఉంది. ఆ మ్యాచ్లో భారీ తేడాతో గెలవడంతో ఆ జట్టు నెట్ రన్రేట్ (2.550) కూడా మెరుగ్గానే ఉంది. ఈ గ్రూప్ నుంచి తొలి సెమీస్ బెర్త్ దక్కించుకునే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్కే అధికంగా ఉన్నాయి.పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్ పొందాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ చేతిలో ఓడిన శ్రీలంక -2.550 రన్రేట్తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.హెడ్ టు హెడ్ రికార్డులుపాకిస్తాన్-ఇంగ్లండ్ ఇప్పటివరకు 30 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్ 21, పాక్ కేవలం 9 మ్యాచ్ల్లో నెగ్గాయి. టీ20 ప్రపంచకప్లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్ల్లో కూడా ఇంగ్లండే పైచేయి సాధించింది. ఇందులో 2022 ఎడిషన్ ఫైనల్ కూడా ఉంది.పిచ్ కూడా వారికి అనుకూలమే..!ఈ మ్యాచ్ జరుగనున్న పల్లెకెలె పిచ్ కూడా ఇంగ్లండ్కు అనుకూలంగానే ఉంది. ఈ వేదికపై ఆ జట్టు తొలి సూపర్-8 మ్యాచ్లో ఆతిథ్య జట్టునే చిత్తు చేసింది. దీనికి ముందు ఇదే వేదికపై లంకతో ద్వైపాక్షిక సిరీస్లో టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది. ఇది ఇంగ్లీష్ ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. మరోపక్క పాక్ ఈ వేదికపై ఇటీవలికాలంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పిచ్ పరిస్థితులపై కూడా ఆ జట్టుకు అవగాహణ లేదు. ఎటు చూసినా నేటి మ్యాచ్లో ఇంగ్లండే హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది.. పాక్తో పోలిస్తే ఇంగ్లండ్ ప్రస్తుత టోర్నీలో మెరుగైన ఫామ్లో ఉంది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్పై విజయాలు సాధించి సూపర్-8లోకి అడుగుపెట్టింది. పాక్ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా గ్రూప్ దశలో 3 విజయాలు సాధించి, సూపర్-8లోకి ప్రవేశించినా.. తమకంటే చిన్న జట్లపై గెలిచేందుకు పాక్ ప్లేయర్లు ఆపసోపాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.తుది జట్లు (అంచనా)..ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వారం), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (సి), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్ -
ఢిల్లీ డిక్లరేషన్: బయటపడిన పాక్ కుళ్లు.. తైవాన్ భయం?
న్యూఢిల్లీ: ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ నేపధ్యంలో భారత్ నేతృత్వంలో ‘ఢిల్లీ డిక్లరేషన్’ రూపొందింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. అమెరికా, చైనా తదితర అగ్రరాజ్యాలు సహా 88 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు తెలపడం గమనార్హం. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంలో పాకిస్తాన్, తైవాన్ దేశాలు భాగస్వాములుగా చేరకపోవడం చర్చనీయాశంగా నిలిచిందిదౌత్యపరమైన విబేధాలతో..భారత్ ప్రతిపాదించిన ఈ అంతర్జాతీయ ఏఐ ఫ్రేమ్వర్క్కు పాకిస్తాన్ దూరంగా ఉండటం వెనుక ప్రధానంగా దౌత్యపరమైన విబేధాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న దౌత్య విజయాలను గుర్తించడానికి పాక్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ సదస్సులో భారత్ పోషించిన పాత్రపై పాకిస్తాన్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇదే ఈ ఒప్పందానికి పాక్ను దూరం చేసింది. సాంకేతిక పురోగతి కంటే రాజకీయ ప్రాధాన్యతలే గొప్ప అనే ధోరణితో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది.తైవాన్కు ‘వన్ చైనా’ అడ్డంకిమరోవైపు సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచానికే తలమానికంగా నిలిచిన తైవాన్ ఈ సదస్సుకు హాజరుకాకపోవడం వెనుక ‘వన్ చైనా’ (One China) విధానం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ఢిల్లీ డిక్లేరేషన్పై సంతకం చేసిన దేశాలలో చైనా ఒకటి. అంతర్జాతీయ వేదికలపై తైవాన్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించే ఏ ప్రయత్నాన్నైనా చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తైవాన్ గైర్హాజరుకు సాంకేతిక కారణాల కంటే చైనా ఒత్తిడి, అంతర్జాతీయ గుర్తింపు సమస్యలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్ల సరఫరాలో 90 శాతానికి పైగా వాటా కలిగిన తైవాన్ ఈ ఒప్పందంలో లేకపోవడం సాంకేతికంగా పెద్ద లోటుగా మిగిలింది. భారత్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సు 88 దేశాల అఖండ మద్దతుతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి వరకు సాంకేతికతను తీసుకెళ్లాలనే సంకల్పాన్ని చాటిచెప్పింది. -
ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి
-
ఆఫ్ఘనిస్థాన్పై విరుచుకుపడిన పాకిస్తాన్.. ఆకస్మిక దాడులు
కాబూల్: దాయాది దేశం పాకిస్తాన్, తాలిబన్ల ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్ బోర్డర్లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్.. ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిగింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది వరకు మరణించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.అయితే, పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఆప్ఘన్ ఉగ్రవాదుల స్థావరాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఆప్ఘన్ సరిహద్దు సమీపంలోని పలు ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. తెహ్రిక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు శిబిరాలపై సైన్యం ఇంటలిజెన్స్ బేస్డ్ సెలెక్టివ్ ఆపరేషన్లను నిర్వహించిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఆదివారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. BREAKING : At least 24 Afghan civilians killed including 8 kids and 6 women after Pakistan Airforce bombed Mosque, Dairy Farm and Civilian House in Paktika, Ningarhar & khost provinces of Afghanistan. Reportedly attack was focused on Pashtuns dominated areas. pic.twitter.com/LUuMlv54gD— Baba Banaras™ (@RealBababanaras) February 21, 2026కాగా, ఆప్ఘనిస్తాన్లోని నంగర్హార్, పాక్టికా, ఖోస్ట్ ప్రావిన్సులలో ఈ దాడులు జరిగాయని ఆఫ్ఘన్ మీడియా తెలిపింది. ఆప్ఘనిస్తాన్లోని మదర్సా, డెయిరీ ఫామ్, ప్రజల ఇళ్లలో బాంబు దాడుల కారణంగా దాదాపు 30 మంది వరకు మరణించినట్టు సమాచారం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. ఇక, పాకిస్తాన్ దాడులు జరిగిన ఖచ్చితమైన స్థానాన్ని పేర్కొనలేదు. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘనిస్థాన్ హెచ్చరికలు జారీ చేసింది. 🚨 SHOCKING ESCALATION!Pakistan Air Force just UNLEASHED precision airstrikes deep inside Afghanistan – smashing 7 TTP terror camps in retaliation for suicide bombings! 💥No more safe havens! 🔥#PakistanStrikesBack #Afghanistan #TTP #BreakingNews #Asia pic.twitter.com/OpCM9llg0z— Pramod Kumar Saxena (Astrologer & Bloger) (@PramodKuma79446) February 22, 2026 మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ నేతృత్వంలోని ప్రభుత్వం సరిహద్దు దాడులను నిరోధించడంలో విఫలమైందని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, పాకిస్తాన్ ఆరోపణను కాబూల్ ఖండించింది. ఇటీవలి కాలంలో పదేపదే ఘర్షణలు, సరిహద్దు మూసివేతల కారణంగా ఇప్పటికే రెండు దేశాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా.. పాక్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పాకిస్థాన్ సైనికులు, ఐదుగురు ఉగ్రవాదులతో సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారితో పాటు పౌరులు ఉన్నట్లు సమాచారం. చాలామంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. పాక్లో 15 రోజుల్లోనే ఇది మూడో ఆత్మాహుతి దాడి. ఐదు రోజుల్లో రెండోది. -
పాకిస్తాన్, న్యూజిలాండ్ ‘సూపర్–8’ మ్యాచ్ రద్దు
టి20 వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’ దశ పోటీలు వర్షం ప్రభావంతో మొదలయ్యాయి. గ్రూప్–2లో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. టాస్ నెగ్గిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత సమయానికే మ్యాచ్ ఆరంభమవుతున్నట్లు కనిపించిన దశలో ఒక్కసారిగా వాన ముంచెత్తింది. స్వల్పంగా చినుకులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది.ప్రేమదాస స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా వాన తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సూపర్–8లో పాక్ తమ తర్వాతి మ్యాచ్లో మంగళవారం ఇంగ్లండ్తో... న్యూజిలాండ్ బుధవారం శ్రీలంకతో తలపడతాయి. నేటి సూపర్ – 8 మ్యాచ్లుశ్రీలంక X ఇంగ్లండ్వేదిక: పల్లెకెలె ; మ.3.00 గంటల నుంచి భారత్ X దక్షిణాఫ్రికావేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
-
‘సూపర్–8’ సమయం
టి20 ప్రపంచ కప్లో మరింత వినోదానికి నేటితో తెర లేవనుంది. పసికూనలు, పస లేని జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా టాప్–8 టీమ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో మాజీ చాంపియన్ పాకిస్తాన్ తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో మూడు మ్యాచ్లు గెలిచి పాక్ ముందంజ వేయగా, గ్రూప్ ‘డి’ నుంచి కూడా మూడు విజయాలతో కివీస్ తర్వాతి దశకు అర్హత సాధించింది. కొలంబో: పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఇటీవల వన్డేలు, టి20 ఫార్మాట్లలో తరచుగా తలపడ్డాయి. రెండున్నరేళ్ల వ్యవధిలో ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్లు జరగ్గా... ఇందులో 17 వన్డేలు, 24 టి20లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి బలాబలాల గురించి ఇరు జట్లకు మంచి అవగాహన ఉంది. ద్వైపాక్షిక సిరీస్లను మినహాయిస్తే... 2022 టి20 ప్రపంచ కప్లో సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత రెండు జట్లు ఒక పెద్ద టోర్నీలో పోటీకి దిగడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ జట్టు లీగ్ దశను దాటినా... అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతోంది. సీఫెర్ట్, అలెన్ మాత్రమే బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించగా... రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, డరైల్ మిచెల్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బౌలింగ్లో కూడా డఫీ, సోధి భారీగా పరుగులిస్తున్నారు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వైఫల్యం కూడా వరల్డ్ కప్లో జట్టును ఇబ్బంది పెట్టింది. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్ ఆశలు మిగలాలంటే కివీస్ బృందం సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్కు తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఆడటం కాస్త కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ప్రేమదాస స్టేడియంలో భారత్తో మ్యాచ్ ఆడిన ఆ జట్టుకు పిచ్ పరిస్థితిపై మంచి అవగాహన ఉంది. అందుకే తమ స్పిన్ బలగాన్ని జట్టు నమ్ముకుంది. ప్రధాన పేసర్ షాహిన్ అఫ్రిది ఘోరంగా విఫలం కాగా... మరో పేసర్ ఫహీమ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగే చేయలేదు. స్పిన్నర్లు ఉస్మాన్ తారిఖ్, అబ్రార్, షాదాబ్, నవాజ్లపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే బ్యాటింగ్లో ఫర్హాన్ మినహా సయీమ్ అయూబ్, సల్మాన్, బాబర్ ఆజమ్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఇరు జట్లు ఫామ్లో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఆసక్తికర పోరు ఖాయం. మ్యాచ్ రోజున వర్షసూచన ఉంది. -
పంజాబ్లో ఎన్కౌంటర్ల పరంపర.. 8 నెలల్లో 924 మంది మృతి!
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో నేరాలను అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ (CCD)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రైమ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఎన్కౌంటర్లపై మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బూటకపు ఎన్కౌంటర్ల పేరిట అమాయకులను బలితీసుకుంటున్నారని ప్రజా సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. వ్యవస్థీకృత, హింసాత్మక నేరాలను ఎదుర్కోవడానికి ఈ ఎలైట్ ఫోర్స్ను పంజాబ్ సర్కార్ గతేడాది ఏర్పాటు చేసింది. అయితే ఈ స్పెషల్ ఫోర్స్ కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో 670 ఎన్కౌంటర్లు చేసింది. మొత్తంగా 924 మంది మరణించారు. కేవలం ఇద్దరు పోలీసులు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.అత్యధికంగా లాహోర్లో 139 ఎన్కౌంటర్ల ఘటనలు చోటు చేసుకున్నాయి. మరణించిన వారిలో ఎక్కువ మంది దొంగతనాలు, హత్యలు, ఇతర తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే చట్టబద్ధంగా విచారణ జరపకుండానే నిందితులను చంపేయడం రాజ్యాంగ విరుద్ధమని మానవ హక్కుల సంఘం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. చనిపోయిన వారి కుటుంబాలను పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హెచ్ఆర్సీపీ ఆరోపించింది. కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలు తోసి పుచ్చాయి. ఈ ప్రత్యేక విభాగం వల్ల రాష్ట్రంలో దొంగతనాలు 60శాతం తగ్గాయని చెప్పుకొచ్చారు. -
బలూచ్ నుంచి మమ్మల్ని కాపాడండి: పాక్ సైన్యం గగ్గోలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్థాన్ సైనికుల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కిడ్మాప్ చేసింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో పాక్ సైనికులు బీఎల్ఏ నుంచి తమని సురక్షితంగా కాపాడమని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ అంశం దాయాది దేశంలో చర్చకు దారి తీసింది. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో.. పలువురు పాక్ సైనికులు తమ సైనిక గుర్తింపు కార్డులను చూపిస్తూ.. ‘‘మమ్మల్ని రక్షించండి’’ అని కన్నీళ్లు పెట్టుకుని, పాక్ సర్కారును వేడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయితే,‘మీ సైనికుల్ని మేం కిడ్నాప్ చేశాం’ అంటూ బీఎల్ఏ విడుదల చేసిన వీడియోల్ని పాక్ సైన్యం ఖండించింది. మా సైనికులు సురక్షితంగా ఉన్నారు. మీరు మా సైనికుల్ని కిడ్నాప్ చేయలేదు’అని ఖండించింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసిన ఎనిమిది మంది పాక్ సైనికుల కిడ్నాప్ అనంతరం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు అల్టిమేటం జారీ చేసింది. పాక్ కిడ్నాప్ చేసిన బీఎల్ఏ ప్రతినిధుల్ని వారంలో విడుదల చేయాలని ఆదేశించింది. ఆ గడువు ముగిసేలోపు చర్యలు తీసుకోకపోతే తాము కిడ్నాప్ చేసిన సైనికులను హత మారుస్తామని హెచ్చరించింది.అయితే,ఆ హెచ్చరికల్ని పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు కిడ్నాప్ చేసింది మా సైనికుల్ని కాదని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం తీరుపై కిడ్నాప్కు గురైన పాక్ సైనికుల అసహనం వ్యక్తం చేశారు.బలోచ్ మమ్మల్ని కిడ్నాప్ చేసింది. అయినా మీరు మమ్మల్ని పాక్ ఆర్మీకి చెందిన వారు కాదని ఎలా చెబుతారని పాక్ సైనికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బలోచ్ మీడియా ప్రతినిధి హక్కాల్ విడుదల చేసిన ఆ వీడియోలో ఆర్మీ దుస్తులు ధరించిన ఎనిమిది మంది ఆర్మీ సైనికులు ఉన్నారు.ఆ వీడియోలో ఓ పాక్ ఆర్మీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాక్ ఆర్మీ ఐడీ కార్డు కెమెరాకు చూపిస్తూ .. ఇదిగో చూడండి. ఇది దేశ ఆర్మీ నాకు జారీ చేసింది. నా తండ్రి వికలాంగుడు. నేనే మా ఇంట్లో పెద్దవాడిని. మేము మీ సిబ్బంది కాదని చెప్పి అన్యాయం చేయోద్దు. మేం మీ సిబ్బంది కాదని మీరు చెప్పినట్లయితే.. మీరు నన్ను ఎందుకు నియమించారు? వీడియో నకిలీదని మీరు ఎందుకు చెబుతున్నారు?’అని ప్రశ్నించాడు. పాక్ సైనికులు ఇలా ప్రశ్నించడంతో షరీఫ్ ప్రభుత్వం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. పాక్ సైన్యం ఇచ్చిన వివరణపై బలోచ్ ప్రతినిధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సైనికులు సురక్షితంగా ఉంటే.. మేం ఎవరిని కిడ్నాప్ చేశాం?. వీడియోల్లో ఉన్నది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. The Pakistan Army generals save themselves and leave their soldiers behind to di€.. pic.twitter.com/Oe9y1OXSgQ— THE UNKNOWN MAN (@Theunk5555) February 20, 2026 -
గ్రూప్ దశలోనే ఆసీస్ ఔట్.. పాక్కు మంచి జరుగబోతుందా..?
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు. సోషల్మీడియా వేదికగా ఓ రేంజ్లో బీరాలు పలుకుతున్నారు. ఆసీస్ వైదొలిగితే పాక్కు కలిగే లాభమేమిటి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.పేరుకు జెంటిల్మెన్ క్రీడనే అయినా, క్రికెట్ లాంటి రియలిస్టిక్ గేమ్లోనూ సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. తాజాగా పాక్ అభిమానులు హడావుడి చేయడానికి ఈ సెంటిమెంటే కారణం. ఏంటా సెంటిమెంట్ అంటే..?ఐసీసీ మెగా టోర్నీల్లో, మరి ముఖ్యంగా ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సందర్భాల్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 1992 వన్డే వరల్డ్కప్లో ఆసీస్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలో పాక్ విజేతగా నిలిచి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2009 టీ20 ప్రపంచకప్లోనూ ఆసీస్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలోనూ పాకే విజేతగా నిలిచి, తొలిసారి పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్గా ఆవిర్భవించింది.2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆసీస్ గ్రూప్ దశలోనే వైదొలగగా.. ఆ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్గా నిలిచింది.తాజాగా ఆసీస్ టీ20 ప్రపంచకప్ 2026లోనూ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో పాక్ అభిమానులు సెంటిమెంట్ రిపీట్ అవుతుందని తెగ సంబరపడిపోతున్నారు. ఈ సెంటిమెంట్ను ఆసరాగా చేసుకొని సంకలు గుద్దుకుంటున్నారు. వాస్తవానికి పాక్ సూపర్-8కు చేరడమే అతికష్టం మీద జరిగింది. ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోనూ పాక్ అభిమానులు తాము ప్రపంచకప్ గెలుస్తామని బీరాలు పలకడం హాస్యాస్పదంగా ఉంది. ఏ జట్టైనా ఛాంపియన్గా నిలవాలంటే కనీస అర్హతలు ఉండాలి.ప్రస్తుత పాక్ జట్టుకు ఆ అర్హతలు లేవనే విషయం అందరికీ తెలుసు. గ్రూప్ దశలో నెదర్లాండ్స్, యూఎస్ఏ లాంటి చిన్న జట్లపై అతికష్టం మీద గెలిచిన పాక్.. సూపర్-8లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లను దాటుకొని ముందుకెళ్లాలి. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ఇది ముమ్మాటికి అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే పాక్ జట్టు ప్రపంచకప్ గెలిచేంత గొప్పగా ఏమీ లేదు. ఆ జట్టులో మ్యాచ్ విన్నర్ వెతికితే కూడా కనపడడు. పైగా ఆ జట్టు స్టార్లుగా చెప్పుకేనే వారంతా ఫామ్లో లేక మడతమంచం ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ప్రపంచకప్ గెలవడం జరిగే పని కాదు. పాక్ అభిమానులు సెంటిమెంట్లను నమ్ముకొని గాల్లో మేడలు కడుతుంటే, జింబాబ్వే లాంటి చిన్న జట్టు టాలెంట్ను నమ్ముకొని ముందుకు సాగుతుంది. -
పాక్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఫైనల్లో భారత్తో అమీతుమీ
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్-ఏ జట్టు ఫైనల్కు చేరింది. పాకిస్తాన్-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో గెలుపొంది, తుది పోరుకు అర్హత సాధించింది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో భారత-ఏ జట్టు శ్రీలంక-ఏపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు ఫిబ్రవరి 22న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్ ఫహీమా ఖాతూన్ 40 పరుగులతో రాణించి, బంగ్లాదేశ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. బంగ్లా ఇన్నింగ్స్లో ఫహీమాతో పాటు ఇష్మా తంజిమ్ (12), షమీమా సుల్తానా (13), సర్మిన్ సుల్తానా (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ హఫ్సా ఖలీద్ 2, వహీదా అక్తర్, మొమినా రియాసత్, అనోషా నాసిర్, ఒమైమా సొహైల్ తలో వికెట్ తీశారు.అనంతరం 111 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి ఘోరంగా పతనమైంది. 16.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. సంజిద (3.4-0-6-3), ఫహీమా (3-0-6-2), ఫాతిమా (4-0-11-1), ఫరీహా (3-0-14-1), ఫర్జానా (1-0-6-1) పాక్ పతనాన్ని శాశించారు. పాక్ ఇన్నింగ్స్లో షావాల్ జుల్ఫికర్ (14), యుస్రా ఆమిర్ (11), హఫ్సా ఖలీద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, పురుషుల టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లా-పాక్ మధ్య చిగురించిన స్నేహం తర్వాత వచ్చిన ఫలితం కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఖరాన్లో కలకలం.. డిప్యూటీ కమిషనర్ లక్ష్యంగా బీఎల్ఏ దాడి
పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ వేర్పాటువాద సెగలతో అట్టుడుకుతోంది. గురువారం బలోచిస్థాన్లోని ఖరాన్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక డిప్యూటీ కమిషనర్ లక్ష్యంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దళాలు మెరుపు దాడి చేశాయి. అతడిని అదుపులోకి తీసుకునేందుకు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నించింది.కానీ డిప్యూటీ కమిషనర్ మాత్రం వారికి చిక్కలేదు. కానీ అక్కడే విధుల్లో ఉన్న ఒక లేవీస్ (స్థానిక భద్రతా దళం) అధికారిని తొలుత అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ తర్వాత అతడు స్థానిక బలోచ్ వ్యక్తి అని తెలియడంతో బీఎల్ఏ విడిచిపెట్టింది. కాగా ఈ ఆపరేషన్ సమయంలో డిప్యూటీ కమిషనర్కు చెందిన రెండు అధికారిక వాహనాలను బీఎల్ఏ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని బీఎల్ఏ అధికార ప్రతినిధి ఆజాద్ బలోచ్ ధ్రువీకరించారు. ప్రస్తుత ఖరాన్ డిప్యూటీ కమిషనర్ కేవలం తన పరిపాలనా విధులకు మాత్రమే పరిమితం కావాలని, బలోచ్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బలోచ్ ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ప్రస్తుత ఖరన్ డిప్యూటీ కమిషనర్గా మునీర్ అహ్మద్ సూమ్రో ఉన్నారు. -
T20 WC 2026: సూపర్-8లోకి పాకిస్తాన్
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ ఎట్టకేలకు సూపర్-8కు అర్హత సాధించింది. పసికూన నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన మ్యాచ్లో 102 పరుగుల భారీ తేడాతో గెలిచి చివరి సూపర్-8 బెర్త్ దక్కించుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు పసికూనలపై ప్రతాపం చూపించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెలరేగి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పాక్ సూపర్-8కు అర్హత సాధించడంతో అప్పటిదాకా పోటీలో ఉన్న యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), కెప్టెన్ సల్మాన్ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్లతో రాణించగా.. సైమ్ అయూబ్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), ఖ్వాజా నఫాయ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్ స్కోల్జ్ (4-0-33-0), రూబెన్ ట్రంపల్మెన్ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్ చేయగా.. జాక్ బ్రస్సెల్ (4-0-48-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా, వికెట్లు తీశాడు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (3-0-25-1), జేజే స్మిట్ (3-0-28-0) పర్వాలేదనిపించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా పాక్ స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసింది. ఉస్మాన్ తారిఖ్ (3.3-1-16-4), షాదాబ్ ఖాన్ (4-0-19-3), మొహమ్మద్ నవాజ్ (4-0-22-1) దెబ్బకు 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సల్మాన్ మీర్జా కూడా ఓ వికెట్ తీశాడు. నమీబియా ఇన్నింగ్స్లో ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ (23), మిడిలార్డర్ బ్యాటర్ అలెగ్జాండర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ ఓటమితో నమీబియా ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
T20 WC 2026: పసికూనపై పాక్ బ్యాటర్ల ప్రతాపం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 18) జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు చెలరేగిపోయారు. సూపర్-8కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో పాక్ బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముఖ్యంగా ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. మధ్యలో కెప్టెన్ సల్మాన్ అఘా (23 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ సైమ్ అయూబ్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు)కు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో ఖ్వాజా నఫాయ్ (5) తొందరగా ఔటయ్యాడు. మొత్తంగా పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో నమీబియా బౌలర్లు తమ సామర్థ్యానికి మించి రాణించారు. వికెట్లు తీయలేకపోయినా, జోరుమీదున్న పాక్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. బెర్నాల్డ్ స్కోల్జ్ 4 ఓవర్లలో 33 పరుగులు, రూబెన్ ట్రంపల్మెన్ 4 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చి పా్ బ్యాటర్లను కట్టడి చేశారు. జాక్ బ్రస్సెల్ (4-0-48-2) పరుగులు కాస్త ఎక్కువగానే సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (3-0-25-1), జేజే స్మిట్ (3-0-28-0) పర్వాలేదనిపించారు. మైబుర్గ్ (2-0-27-0) ఒక్కడే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో నమీబియా బౌలర్లు కేవలం 6 ఎక్స్ట్రాలు మాత్రమే ఇవ్వడం విశేషం. -
T20 WC 2026: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్లో భారత్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న పాక్ జట్టుపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మొహమ్మద్ యూసఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2021 టీ20 వరల్డ్కప్లో భారత్ను తొలిసారి ఓడించిన తర్వాత స్టార్లుగా చెప్పుకునే కొందరు పాక్ ఆటగాళ్లకు అహంకారం పెరిగిందని ఆయన అన్నాడు. వారి అతి విశ్వాసమే పాక్ పతనానికి దారి తీసిందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయంతోనే కళ్లు నెత్తికెక్కితే పరిస్థితి ఇలానే ఉంటుందంటూ పరోక్షంగా బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిని ఉద్దేశిస్తూ చురకలంటించాడు.ప్రస్తుత పాక్ జట్టు దుస్థితిపై యూసఫ్ స్పందిస్తూ.. 2021లో భారత్పై గెలిచిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు మేము ఎవరికీ తగ్గం అనే భావనలో మునిగిపోయారు. కోచ్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో గేమ్స్ ఆడటం వంటి నిర్లక్ష్యపు ప్రవర్తన అప్పటి నుంచి మొదలైంది. స్టార్లుగా చెప్పుకునే కొందరి అహంకారం వల్లే పాక్ క్రికెట్ నష్టపోతుందని అన్నాడు.యూసుఫ్ రాజీనామా వెనుక కారణం ఇదేనేమో..!యూసఫ్ 2025లో కేవలం మూడు నెలల పాటు పాక్ బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించాడు. ఆతర్వాత అనూహ్యంగా ఆ పదవి నుంచి వైదొలిగాడు. అప్పట్లో యూసఫ్ తన అనూహ్య రాజీనామాకు గల కారణాలు వెల్లడించలేదు. తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే, జట్టులో స్టార్లుగా చెప్పుకునే కొందరి ప్రవర్తన అతనికి నచ్చలేదన్న విషయం బయటపడింది. ఇదే అతని ఆకస్మిక రాజీనామాకు కారణమై ఉండొచ్చనే భావన కలుగుతోంది.కాగా, టీమిండియా చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్ జట్టుపై ఆ దేశానికి చెందిన చాలామంది మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది వంటి వారైతే కొందరు పాక్ ఆటగాళ్లపై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పాక్ జట్టు దుస్థితికి స్టార్లుగా చెప్పుకునే ఒకరిద్దరు ఆటగాళ్లే కారణమన్నది వారి అభిప్రాయం కూడా. భారత్ చేతిలో వరుస పరాభవాల నేపథ్యంలో పాక్ అభిమానులు కూడా పాక్ జట్టుపై విసుగెత్తిపోయారు. ఇన్నాళ్లు వెనకేసుకొచ్చిన నోళ్లతో దుర్భాషలాడుతున్నారు. భారత్ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్ జట్టుకు ఇంట కూడా మర్యాద లేకుండా పోయింది. పాక్ దుస్థితికి స్టార్ ఆటగాళ్లు కారణమని కొందరంటుంటే, మరికొందరేమో పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నఖ్వీ కారణమని ఆరోపిస్తున్నారు. నఖ్వీ పాక్ క్రికెట్ను సర్వనాశనం చేశాడన్న అభిప్రాయం చాలామంది పాక్ జాతీయుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. -
‘ఇమ్రాన్ హత్యకు ఆర్మీచీఫ్తో కలిసి పీసీబీ ఛైర్మన్ కుట్ర’
ఇమ్రాన్ హత్యకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కుట్రలు చేస్తున్నారంటూ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇమ్రాన్ను హత్య చేసేందుకు ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి కుట్రపన్నినట్లు డాక్టర్ ఉజ్మా ఖాన్, అలీమాఖాన్ ఆరోపించారు. తమకు కూడా ప్రాణ హానీ ఉందని.. హత్య చేసేందుకు కుట్రలు పన్నినట్లు వారు వెల్లడించారు. ఇటీవల జైలులో ఇమ్రాన్ను కలిసినప్పుడు, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయనే స్వయంగా తమకు చెప్పారని వారు పేర్కొన్నారు."వీరు నన్ను చంపేస్తారు.. నన్ను అంతమొందించేందుకు వారు పక్కా ప్లాన్ వేశారు" అని ఇమ్రాన్ తనతో అన్నారని ఉజ్మా ఖాన్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అలీమా ఖాన్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ కంటి చూపు మందగిస్తోందని, అయినప్పటికీ ఆయనకు సరైన చికిత్స చేయనీయడం లేదని విమర్శించారు. "మొహ్సిన్ నఖ్వీ మమ్మల్ని బెదిరిస్తున్నారు. వారికి రక్తం రుచి మరిగింది. ఇమ్రాన్ ఖాన్కు గానీ, మాకు గానీ ఏమైనా జరిగితే.. ఎవరి భవిష్యత్తు తరాలను కూడా మేము వదిలిపెట్టం’’ అలీమా ఖాన్ హెచ్చరించారు.తమ వ్యక్తిగత వైద్యులైన డాక్టర్ ఆసిమ్, డాక్టర్ ఫైసల్తో పరీక్షలు చేయించాలని కోరగా ప్రభుత్వం తిరస్కరించిందని వారు తెలిపారు. కుటుంబం తరపున తమ బంధువు నౌషెర్వాన్ బుర్కీ పేరును సూచించినా అధికారులు అంగీకరించలేదంటూ వారు మండిపడ్డారు. కాగా, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్కు టీమిండియా దిగ్గజాలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్ పట్ల పాక్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఇటీవల విజ్ఞప్తి చేశారు. అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్ఖాన్ కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85 శాతం చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు వెల్లడించిన విషయాన్ని సదరు లాయర్ పేర్కొన్నారు. -
పాక్కు భారత్ భారీ షాక్.. ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!
సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు మరో గట్టి షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్దమైంది. రావి నది నుండి పాక్కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా అడ్డుకోవాలని భారత్ నిర్ణయించింది. రావి నదిపై నిర్మిస్తున్న షాపుర్ కండి బ్యారేజీ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.దీంతో ఏప్రిల్ 1 నుండి ఈ బ్యారేజీ ద్వారా పాక్కు వెళ్లే మిగులు జలాలను నిలిపివేయనున్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలగా సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల రావి నదిలోని అదనపు నీరు పాక్కు ప్రవహిస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఆ నీటిని ఇకపై పాక్ వెళ్లనివ్వకుండా భారత్ తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకోనుంది. ఇదే విషయంపై జమ్మూ కాశ్మీర్ మంత్రి జావేద్ అహ్మద్ రానా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. కతువా, సాంబ వంటి కరువు ప్రాంతాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. "పాకిస్తాన్కు వెళ్లే అదనపు నీటిని కచ్చితంగా ఆపేయాల్సిందే. ఇకపై అక్కడకు ఒక్క చుక్క నీరు కూడా పోదు"అని జావేద్ పేర్కొన్నారు. కాగా 1960లో జరిగిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు తమ పూర్తి హక్కులను వినియోగించుకునేందుకు భారత్ సిద్దమైంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, నీటి కొరతతో ఉన్న దాయాది దేశంకు ఇది గట్టి ఎదురు దెబ్బే. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన పాక్ పంజాబ్ ప్రావిన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. -
భారత స్టార్ను కిందకి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన పాక్ ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో భారత్ ప్లేయర్లకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. బౌలింగ్ ర్యాంకింగ్స్లో స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. టాప్ ప్లేస్కు పాక్ స్పిన్నర్ సదియా ఇక్బాల్ ఎగబాకింది. గత వారం ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉండిన సదియా రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సదియా (743), దీప్తి శర్మ (729) మధ్య పాయింట్ల వ్యత్యాసం 14 పాయింట్లు మాత్రమే. ఆసీస్ పర్యటన తొలి టీ20లో పెద్దగా ప్రభావం (2-0-19-1) చూపకపోవడంతో దీప్తి టాప్ ర్యాంక్ను కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు సదియా సౌతాఫ్రికాతో తాజాగా జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 5.82 ఎకానమీతో 5 వికెట్లు తీసి టాప్ ర్యాంక్కు చేరుకుంది.టాప్-10లోకి దూసుకొచ్చిన రేణుకా సింగ్తాజా ర్యాంకింగ్స్లో భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ టాప్-10లోకి దూసుకొచ్చింది. ఆసీస్పై తొలి టీ20లో అద్భుత ప్రదర్శన (4-1-14-2) కనబర్చడంతో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి ఎగబాకింది.అరుంధతి అదుర్స్ఇదే మ్యాచ్లో ఆకాశమే హద్దుగా (4-0-22-4) చెలరేగిన మరో భారత పేసర్ అరుంధతి రెడ్డి ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకొని 17వ స్థానానికి ఎగబాకింది. ఇదే మ్యాచ్లో రాణించిన స్పిన్నర్ శ్రీచరణి (3-0-14-2) ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానానికి ఎగబాకింది.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం పెద్దగా మార్పుల్లేవు. బెత్ మూనీ, హేలీ మాథ్యూస్, స్మృతి మంధన టాప్-3లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఏకంగా 31 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి ఎగబాకింది. మిగతా చెప్పుకోదగ్గ మార్పుల్లో సౌతాఫ్రికా బ్యాటర్ అనెరీ డెర్క్సన్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 76కు.. ఆసీస్ బ్యాటర్ జార్జియా వేర్హమ్ 9 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకారు.ఆల్రౌండర్ల విభాగంలోనూ పెద్దగా మార్పుల్లేవు. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో కొనసాగుతుండగా.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మాత్రం 5 స్థానాలు మెరుగుపర్చుకొని ఆరో స్థానానికి చేరింది. -
సెమీస్లో భారత్, పాక్
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరాయి. ఇవాళ (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్ల్లో భారత-ఏ జట్టు నేపాల్పై.. పాకిస్తాన్-ఏ జట్టు యూఏఈపై ఘన విజయాలు సాధించి, ఫైనల్ ఫోర్లోకి ప్రవేశించాయి. సెమీస్లో భారత్, పాక్ ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరో రేపు జరుగబోయే బంగ్లాదేశ్-ఏ, మలేషియా.. శ్రీలంక-ఏ, థాయ్లాండ్ మ్యాచ్లతో తెలుస్తుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్లో (ఏ) ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాక్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. ఈ గ్రూప్లో యూఏఈ.. భారత్, పాక్కు గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టు కూడా భారత్, పాక్తో సమానంగా మూడింట రెండు మ్యాచ్లు గెలిచింది. ఇవాల్టి మ్యాచ్లో పాక్ చేతిలో ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో మరో జట్టు నేపాల్, ఆడిన 3 మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్-బిలో బంగ్లాదేశ్-ఏ సెమీస్ బెర్త్ ఇదివరకే ఖరారైనప్పటికీ.. సెమీస్లో వారు ఎదుర్కోబోయే ప్రత్యర్ది ఎవరో మలేషియా మ్యాచ్ ఫలితంతో తెలుస్తుంది. ఎందుకంటే గ్రూప్-బిలో ఆ జట్టు స్థానాన్ని (1,2) మలేషియా మ్యాచ్ ఫలితం డిసైడ్ చేస్తుంది. గ్రూప్-బిలో మరో సెమీస్ బెర్త్ కోసం శ్రీలంక-ఏ, థాయ్లాండ్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టుకే సెమీస్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంక-ఏ, థాయ్లాండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో మ్యాచ్ గెలిచి బంగ్లాదేశ్-ఏ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్లో మలేషియా ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడి నాలుగో స్థానంలో ఉంది.ఫిబ్రవరి 20న జరిగే వేర్వేరు సెమీఫైనల్స్లో భారత్, పాక్ పోటీపడతాయి. సెమీస్లో ఈ రెండు జట్లు గెలిస్తే.. ఫైనల్లో ఎదురెదురుపడతాయి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 22న జరుగనుంది.నేపాల్ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తనూజా కన్వర్ 4, మిన్నూ మణి 3, కెప్టెన్ రాధా యాదవ్ 2 వికెట్లతో సత్తా చాటడంతో నేపాల్ 18 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ ఇన్నింగ్స్లో సమ్జానా ఖడ్కా (22) టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వ్రిందా దినేశ్ 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ను విజయతీరాలకు చేర్చింది.మరో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈని పాక్ 17.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 11 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. -
మా వాళ్ల దగ్గర కండోమ్లు కొనడానికి డబ్బుల్లేవు: పాక్ ఆర్థిక మంత్రి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఈ దేశం పేరు వింటే చాలు సీమాంతర ఉగ్రవాదం, హింస, మతతత్వవాదం ఇవే గుర్తుకొస్తాయి. భారత్తో సమకాలీకంగా స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఆ దేశం హింసనే నమ్ముకుంది. పక్క దేశాలపైకి ఉగ్రవాదాన్ని ఉసిగొలుపుతూ హింసతో ఇతర దేశాలను ఇబ్బందులకు గురి చేసే యత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక అభివృద్ధిని మరచిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలోని ప్రజలు కండోమ్లు కొనడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.పాకిస్థాన్కు దెబ్బమీద దెబ్బపడుతోంది. ఇటీవల భారత్, ఈయూతో చేసుకున్న ఒప్పందం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అక్కడి ఎగుమతులు తగ్గి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో వార్త ఆ దేశాన్ని కలవర పెడుతోంది. పాకిస్థాన్లో జనాభా నియంత్రణ లేక విపరీతంగా జననాలు పెరుగుతున్నాయని.. తద్వారా పేదరికం సంభవిస్తుందని.. అందుకే పేదరికాన్ని నియంత్రించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.అందుకోసమే గర్భనిరోధాకాలైన కండోమ్ల ధర తగ్గించాలని భావించింది. అయితే ప్రస్తుతం పాక్కు ఐఎంఎఫ్ ఆర్థిక సాయం అందిస్తుండడంతో విధాన పరమైన నిర్ణయాల్లో దాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో ధరలు తగ్గించాలని ఐఎంఎఫ్ను కోరగా ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పుడు పాకిస్థాన్ ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా పన్నులు తగ్గించడం సాధ్యం కాదని అవసరమైతే వచ్చే ఏడాది బడ్జెట్లో కోతలు విధించాలని తెలిపింది. దీంతో కండోమ్ల ధర తగ్గించలేకపోయింది. ఈ వివరాలను పాకిస్థాన్ ఆర్థిక మంత్రి జౌరంగజేబు మీడియాకు తెలిపారు. దీంతో.. ‘పాక్లో ప్రజల వద్ద కండోమ్లు కొనేంత డబ్బు కూడా లేదు’ అంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ అవుతోంది.ఇటీవల ఒక సంస్థ జరిపిన సర్వేలో పాకిస్థాన్ అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యాన్ని తగ్గించాలని సర్వే తెలిపింది. పాక్ జనాభా త్వరలో 40 కోట్లకు చేరుకుంటుంది. అయితే అభివృద్ధిలో ఆ దేశం వెనుకబాటులో ఉంది. ఆ దేశ మెుత్తం ఐటీ ఎగుమతులు మన కేరళతో పోలిస్తే తక్కువ ఉన్నాయంటే టెక్నాలజీలో పాక్ ఏ స్థానంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
Pakistan: ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని వాయువ్య ప్రావిన్స్ అయిన ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. బజౌర్ జిల్లా మామండ్ తహసీల్లోని మలంగి ప్రాంతంలోని భద్రతా దళాల చెక్పోస్టును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్ధాలతో నిండిన ఒక వాహనాన్ని ఆత్మాహుతి బాంబర్ నేరుగా చెక్పోస్టులోనికి పోనివ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందితో సహా కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో మిలిటెంట్ కార్యకలాపాలు విపరీతంగా పెరగడం స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది.స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆత్మాహుతి దాడి పేలుడుతోనే ముగిసిపోలేదు. బాంబు దాడి జరిగిన వెంటనే సాయుధ ఉగ్రవాదులు భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ముందస్తు ప్రణాళికతో చేసిన భారీ ఆపరేషన్గా దీనిని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు తొమ్మిది మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సామాన్య పౌరులు కూడా ఉన్నారు. మొత్తం మరణాల సంఖ్య 16కు చేరింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మలంగిలోని ఒక మదర్సా భవనం సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమై నేలమట్టమైంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, కార్యాలయాల కిటికీలు పగిలిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని చ్టుటుముట్టిన సమయంలో కాల్పుల శబ్దాలు మిన్నంటాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న బజౌర్ జిల్లాలో ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)లాంటి సాయుధ గ్రూపులు ఖైబర్ పఖ్తున్ఖ్వా అంతటా భద్రతా బలగాలపై దాడులను తీవ్రతరం చేశాయి. గతంలో కూడా ఉత్తర వజీరిస్తాన్, పెషావర్ తదితర ప్రాంతాల్లో సైనిక కాన్వాయ్లు, పోలీసు స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులే జరిగాయి. ఇది కూడా చదవండి: కమల్ హాసన్కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్ఎం’లో ఉత్సాహం ఉరకలు -
పాక్లో భారీ దొంగతనం.. 700 తులాల బంగారం హాంఫట్
పాకిస్తాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీలో భారీ దోపిడీ జరిగింది. మలీర్లో ఉన్న 'ఇక్బాల్ జ్యువెలరీ' షాపులో సుమారు 300 మిలియన్ పాకిస్తానీ రూపాయల (పీకేఆర్ 30 కోట్లు) విలువైన బంగారం, వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీకెండ్ సెలవులను ఆసరాగా చేసుకుని దుండగలు ఈ చోరికి పాల్పడ్డారు.దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా నగలు భద్రపరిచే వాల్ట్ ఉన్న చోట రంధ్రం చేయడం గమనార్హం. ఈ దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే తెలిసినవారే పని అన్నట్లు అన్పిస్తోంది. కాగా ఫిబ్రవరి 12న షాపు మూసివేసిన తర్వాత వరుసగా శుక్రవారం, శనివారం సెలవలు వచ్చాయి. ఈ రెండు రోజుల్లోనే చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం షాపు తెరిచేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం షాపు తెరిచేసరికి చోరి జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు షాపు యాజమాని ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో 700 తులాల స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లు చోరీకి గురైనట్లు అతడు తెలిపాడు.మేము ఫిబ్రవరి 12న యథావిధిగా షాపు మూసివేసాము. రెండు రోజుల తర్వాత తిరిగి తెరిచి చూడగా, బాక్సులన్నీ ఖాళీగా ఉన్నాయి. అందులోని బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, వజ్రాలన్నీ మాయమయ్యాయి" అని షాపు యజమాని అయూబ్ ఖాన్ పేర్కొన్నాడు. ఓ సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కరాచీ నగర చరిత్రలోనే భారీ దోపిడీలో ఇది ఒకటిగా నిలిచింది. -
భారత్ చేతిలో ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్ కీలక నిర్ణయాలు
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో ఘోర ఓటమి ఎదురైన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న (ఫిబ్రవరి 15) మ్యాచ్ ముగిసిన వెంటనే పీసీబీ అర్దరాత్రి వేల అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇద్దరు స్టార్ ఆటగాళ్లపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్టార్ ఆటగాళ్ల పేర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది అని తెలుస్తుంది.వీరిద్దరిని తక్షణమే జట్టు నుంచి తప్పించాలని కొలొంబోలో ఉన్న దేశ ప్రతినిధులకు పీసీబీ అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. పాక్ తదుపరి ఆడబోయే నమీబియా మ్యాచ్లో బాబర్, అఫ్రిది స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీం షా, ఫకర్ జమాన్, ఖ్వాజా నఫాయ్ పేర్లు పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.భారత్ మ్యాచ్లో జట్టు ప్రదర్శనపై పాక్ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. స్టార్ ఆటగాళ్లను తప్పించే విషయంలో పీసీబీ కంటే పాక్ ప్రభుత్వ జోక్యమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్ ప్రభుత్వంపై కూడా ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా భారత్తో మ్యాచ్ ఆడమని ప్రకటించడమెందుకు, ఆతర్వాత తిరిగి ఆడటమెందుకని దుమ్మెత్తిపోస్తున్నారట. దేశ ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో బాబర్, అఫ్రిది సహా మరికొంత మంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్ ప్రభుత్వం పీసీబీకి సిఫార్సు చేసినట్లు వినికిడి.పాక్ ప్రజలు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుంచి ఓవరాక్షన్ చేస్తున్నాడని మెజార్జీ పాక్ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. నఖ్వీని పీసీబీ అధ్యక్ష హోదాతో పాటు మంతివర్గం నుంచి కూడా బహిష్కరించాలని పాక్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. నఖ్వీ భారత్ చేతిలో ఓటమి తర్వాత తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు పలువురు పాక్ ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ను కూడా పరుష పదజాలంతో మందలించాడని తెలుస్తుంది.కాగా, భారత్తో మ్యాచ్లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్, యూఎస్ఏపై అతికష్టం మీద గెలిచిన పాక్.. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో యూఎస్ఏ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్ ఆటుఇటైతే పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే భారత్తో పాటు యూఎస్ఏ సూపర్-8కు చేరుకుంటుంది. -
లేడీ వేషంలో ఉగ్రవాది.. అయినా వదిలేదిలే..!
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ తన సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసింది. ఉగ్రవాదులు స్థావరాలను నిర్వీర్యం చేస్తూ వారికి ఎటువంటి సహాయం అందకుండా అష్ట దిగ్భందనం చేస్తుంది. ఈ నేపథ్యంలో జైషే-ఏ- మహ్మద్ తీవ్రవాది సైపుల్లా ఖాన్ భద్రతా బలగాల కళ్లుగప్పుతూ మారు వేశంలో తిరుగుతున్నట్లు సమాచారం అందుతోంది.జైష్-ఏ-మహమ్మద్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖాన్ ప్రస్తుతం భద్రతా బలగాల కంటపడకుండా ఉండడానికి నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ గుర్తించకుండా ఉండడానికి గడ్డం తీసి ఆడవారిలా బుర్ఖాలు ధరించి తిరుగుతున్నట్లు దోడా సూపరిండెంట్ సందీప్ మెహతా అన్నారు. అంతే కాకుంగా కొన్నికొన్ని సార్లు ఎవరికి అనుమానం రాకుండా స్థానికుల మద్ధతు పొందేందుకు ఆద్యాత్మిక గురువు వేశం వేసి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.గత రెండు నెలలుగా అతని కోసం కిష్వారా, దోడా ప్రాంతాలలో గాలింపులు చేపడుతున్నామని ఈ నేపథ్యంలోనే జనవరి 19న అతని రహస్య స్థావరాన్ని కనుగొని దానిని ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ స్థావరం 12 వేల అడుగుల ఎత్తులో బంకర్ల మాదిరిగా నిర్మించారని తెలిపారు. ఈ స్థావరం ధ్వంసం అయిన తర్వాత అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అతని ఉనికిని గుర్తించకుండా ఉండడానికి పలుమార్లు తన వేశాలు మారుస్తున్నాడని తెలిపారు. భద్రతా బలగాలు అతని సహచరుడు ఆదిల్ను హత్య చేశాయన్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీకి చిక్కకుండా ఉండేందుకు అతను మరింత జాగ్రత్త పడుతున్నట్లు సూపరిండెంట్ సందీప్ మెహతా పేర్కొన్నారు. -
పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరిక
భారతీయ పోలీసులపై పాకిస్తాన్ హనీ ట్రాప్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. పాక్ నిఘా వర్గాలు సోషల్ మీడియా వేదికగా భారత పోలీసులను లక్ష్యంగా చేసుకుని 'హనీ-ట్రాప్' (అందమైన యువతుల ఫోటోలతో బురిడీ కొట్టించడం)కు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) పోలీసు సిబ్బందికి తాజాగా కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.పాకిస్తాన్ నిఘా సంస్థల "హనీ-ట్రాపింగ్" ప్రయత్నాలు పెరుగుతున్నట్టు గమనించిన, MHA ఈ ముప్పును ఎదుర్కోవడానికి, సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై మంత్రిత్వ శాఖ వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) విడుదల చేసింది.ఈ మార్గదర్శకాలను గత ఏడాది నవంబరు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్మెంట్ జారీ చేసింది. పోలీసు అధికారులతో స్నేహం చేసి, సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా సేకరించడానికి Facebook, X, Instagram, WhatsApp, Telegram, LinkedIn వంటి ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను వాడుకుంటాయి.ముఖ్యమైన మార్గదర్శకాలు (SOP):సోషల్ మీడియా ప్రొఫైల్స్లో తాము పోలీసు అధికారులమని బహిర్గతం చేయకూడదు.అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనామకుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించ వద్దు. ముఖ్యంగా యువతుల ఫోటోలతో ఆకర్షించే ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.ఆన్లైన్ పోస్ట్లు కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో (WhatsApp, Telegram, etc.) అధికారిక పత్రాలను లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదు.ఉద్యోగాలు, ఉచిత పర్యటనలు లేదా ప్రభుత్వ ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దు. ధృవీకరించని యాప్లను డౌన్లోడ్ చేయడం, తెలియని లింక్స్ క్లిక్ చేయడం, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో పత్రాలను పంచుకోవడం చేయకూడదు.ఇదీ చదవండి: అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు : ఫ్యాన్స్కు వాలెంటైన్స్ డే సర్ప్రైజ్ఒకవేళ హనీ-ట్రాప్కు గురైతే ఏం చేయాలి?ఒకవేళ హనీ-ట్రాప్కు గురైతే ఏం చేయాలనేదానిపై కూడా సూచనలు అందించింది. ఒకవేళ ఎవరైనా అధికారి హనీ ట్రాప్ ఉచ్చులో పడినట్లు అనుమానం వస్తే, తక్షణమే సదరు అధికారికి చెందిన డిజిటల్ పరికరాలను (ఫోన్లు, ల్యాప్టాప్స్) వెంటనే స్వాధీనం చేసుకోవాలి.ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. స్టేట్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఈ నిబంధనల అమలును పర్యవేక్షిస్తుంది. దృఢమైన పాస్వర్డ్లు, రెండు-కారకాల ప్రామాణీకరణ, పరిమిత యాప్ అనుమతులు, సాధారణ గోప్యతా తనిఖీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. సోషల్ మీడియాలో చేసే పోస్ట్లకు ఆయా పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రహస్య సమాచారాన్ని లీక్ చేస్తే క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్ -
‘పాకిస్తాన్ మనకు శత్రువే.. అది క్రికెటైనా, ఇంకేదైనా..’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ అనేది మనకు శత్రు దేశమేనని, వారిని ఏ వేదికలోనైనా శత్రువుగానే చూడాలని ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ సుఖిందర్ సింగ్ రంధావా. పాకిస్తాన్తో టీ20 వరల్డ్కప్లో భారత్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది జై షా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ అభివర్ణించారు. ఇది భారత్-పాకిస్తాన్ల మ్యాచ్ కాదని, కేవలం జై షా-పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్ మాత్రమేనన్నారు. యావత్ భారతావని.. పాకిస్తాన్తో సంబంధాలను వద్దనుకుంటుంటే, వారితో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. ‘ పాకిస్తాన్ అనేది మనకు దాయాది దేశం. వారిని శత్రువులుగానే చూడాలి. వారితో ఎటువంటి సంబంధాలు ఉండొద్దు. సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు పాకిస్తాన్ దుశ్చర్యలు బాగా తెలుసని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది భారతావని కోరుకునే మ్యాచ్ మాత్రం కాదు. జై షా-పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ మాత్రమే. భారతీయులు ఎవరూ పాక్తో మ్యాచ్ను కోరుకోవడం లేదు. ఐసీసీ చీఫ్గా ఉన్న జై షా ప్రోద్బలంతోనే ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత్కు రెండో నరేంద్ర మోదీగా పేర్కొంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షానే.. పాకిస్తాన్తో మ్యాచ్ జరగడానికి కారణమయ్యాడు’ అంటూ విమర్శించారు.#WATCH | Jaipur, Rajasthan: On India vs Pakistan #ICCT20WorldCup, Congress MP Sukhjinder Singh Randhawa says, "... Pakistan is the enemy of our country, and it should be treated like that only. We have no dealings with them. Those who are on the border know how Pakistan is… pic.twitter.com/3FlPP06UIX— ANI (@ANI) February 15, 2026 -
భారత్-పాక్ హైవోల్టేజీ మ్యాచ్.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడూ మహాసంగ్రామాలను తలపిస్తాయి. ప్రత్యేకించి ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోరాటాలు అంతకుమించిన అనుభూతిని కలిగిస్తాయి. మరీ ప్రత్యేకించి, టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోటీ ప్రళయ వాతావరణాన్ని సూచిస్తుంది.గెలుపోటములు ఎలా ఉన్నా, మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే ఇరు దేశాల అభిమానుల మధ్య వార్ మొదలవుతుంది. ఈ పరిస్థితి దాయాదుల సమరానికి మరింత హైప్ తెచ్చిపెడుతుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, అభిమానుల భావోద్వేగాలు ఈ మ్యాచ్లను మరింత ప్రత్యేకం చేస్తాయి. ఈ హైప్ భారత్, పాక్ అభిమానులనే కాక, విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.భారీ అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను పీక్స్కు చేర్చింది. ఈ భారీ అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో భారత్కు పాక్పై స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ ఏకంగా ఏడు సార్లు జయకేతనం ఎగురవేసింది. పాక్ ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే గెలుపొందింది. టీమిండియా ఇవాళ జరుగబోయే మ్యాచ్లోనూ గెలిచి పొట్టి ప్రపంచకప్లో తమ రికార్డును (8-1 మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.భారత జట్టు ప్రస్తుతమున్న ఫామ్ను బట్టి చూస్తే, ఇది అంత కష్టమేమీ కాకపోవచ్చు. గత కొంతకాలంగా టీమిండియా పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నంబర్ వన్ స్థానంలో ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్లో ఉన్నారు. ప్రస్తుత పాక్ జట్టును టీమిండియా ఆడుతూపాడుతూ చిత్తు చేయవచ్చు. అలాగని ఉదాసీనంగా వ్యవహరిస్తే, 2021 ఎడిషన్లో ఎదురైన పరాభవం పునరావృతమయేక్య ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి టీమిండియా చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే లాజిక్ను అమలు చేస్తే బాగుంటుంది. మరో గంటలో (రాత్రి 7 గంటలకు) ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే టీవీలకు అతుక్కుపోయారు.వరుణుడి భయంఓ పక్క అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్ని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు.ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన భారత్-పాక్ సమరాలు..తొలి ఘట్టం – 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ టై అయ్యింది, కానీ బౌలౌట్లో భారత్ గెలిచింది. అదే టోర్నమెంట్ ఫైనల్లో మళ్లీ తలపడగా, ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఇది భారత్-పాక్ టీ20 వరల్డ్కప్ పోరాటాలకు ఆరంభం. భారత్ ఆధిపత్యం అనంతరం 2012, 2014, 2016 వరల్డ్కప్లలో భారత్ వరుస విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత్ పాక్పై ఆధిపత్యం కొనసాగించింది. పాక్ చరిత్రాత్మక విజయం – 2021 దుబాయ్లో జరిగిన 2021 వరల్డ్కప్లో పాక్ భారత్ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది పాక్కి వరల్డ్కప్ చరిత్రలో భారత్పై తొలి విజయం. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత బ్యాటింగ్తో ఆ మ్యాచ్ పాక్ అభిమానులకు మరపురాని జ్ఞాపకం అయ్యింది. తిరిగి భారత్ ఆధిపత్యం 2022, 2024 వరల్డ్కప్లలో భారత్ మళ్లీ పాక్ను ఓడించింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఈ గెలుపుల్లో కీలక పాత్ర పోషించారు. -
T20 WC 2026: పాక్తో మ్యాచ్.. టీమిండియాలో రెండు మార్పులు..?
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరుగనుంది. కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొని ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను మరింత పెంచింది. ఓ పక్క క్రికెట్ అభిమానులు ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ను సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు (8-1).ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. కడుపు నొప్పితో బాధపడుతూ, నమీబియాతో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉన్న అభిషేక్ శర్మ జట్టులో తిరిగి రానున్నాడని సమాచారం. అభిషేక్ రాకతో సంజూ శాంసన్ తిరిగి బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందన్న సమాచారం ఉండటంతో ఈ మ్యాచ్లో భారత్ అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్పుడు అర్షదీప్ సింగ్పై వేటు పడవచ్చు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడు. ఈ రెండు మార్పులు మినహా మిగతా జట్టు యధాతథంగా కొనసాగుతుంది.అభిషేక్, ఇషాన్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. వన్డౌన్లో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్, ఐదో ప్లేస్లో హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో ప్లేస్లో రింకూ సింగ్, స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, ఏకైక స్పెషలిస్ట్ పేసర్గా బుమ్రా బరిలోకి దిగవచ్చు. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
-
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టీ20 టోర్నీలో భారత్ పాక్పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్లో టీమిండియా పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.తాజా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. సైమా ఠాకోర్ (4-0-14-2), కెప్టెన్ రాధా యాదవ్ (3-0-11-2), ప్రేమా రావత్ (3-0-16-2), జింటిమణి కలిట (3-0-18-1), మిన్నూ మణి (2.5-0-10-1), తనూజా కన్వర్ (3-0-19-0) పాక్ ప్లేయర్ల భరతం పట్టారు. పాక్ ఇన్నింగ్స్లో షావల్ జుల్ఫికర్ (23), గుల్ రుఖ్ (21), అనోశా నాసిర్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ తొలి బంతికే వికెట్ (హుమైరా ఖాజీ డకౌట్) కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ వ్రింద దినేశ్ (55) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి భారత్ను విజయతీరాలకు చేరింది. వ్రిందకు అనుష్క శర్మ (24), తేజల్ హసబ్నిస్ (12 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో వహీదా అక్తర్, మొమినా రియాసత్కు తలో వికెట్ దక్కింది. భారత్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్లో నేపాల్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 17న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్ గ్రూప్-ఏలో ఉండగా.. థాయ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్-బిలో ఉన్నాయి. -
వీడియో వైరల్: జర్మనీలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు అవమానం
జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు చేదు అనుభవం ఎదురైంది. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ గుర్తింపు కార్డు విషయంలో ఆయన్ని దాదాపుగా అడ్డుకున్నంత పని చేశారు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కు హాజరైన అసిమ్ మునీర్ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు.తన బృందంతో కలిసి జర్మనీ నగరానికి అసిమ్ మునీర్ చేరుకున్నారు. కాన్ఫరెన్స్ ప్రవేశ ద్వారానికి కొద్ది అడుగుల దూరంలో ఉండగా, సెక్యూరిటీ సిబ్బంది.. ఆయన మెడలో వేలాడుతున్న ఐడీ కార్డును చూపించాలని కోరింది. ‘‘మీ ఐడీ కార్డును తిప్పి చూపగలరా?(ముందుకి కనిపించేలా)’’ అంటూ సెక్యూరిటీ కోరడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు, జర్మనీలోని సింధీ రాజకీయ సంస్థ జై సింధ్ ముత్తాహిదా మహాజ్(JSMM) అసిమ్ మునీర్ను ఆహ్వానించడంపై తీవ్రంగా వ్యతిరేకించింది. కార్యక్రమ వేదిక వద్ద జెఎస్ఎంఎం సభ్యులు నిరసన చేపట్టారు. పాకిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఈ సమావేశంలో మునీర్ పాల్గొనడం పట్ల అభ్యంతరం తెలిపారు.UPDATE!!Field Marshal Army Chief Asim Munir arrives for Munich Security Conference in Germany pic.twitter.com/v4PQpW4z77— HTN World (@htnworld) February 14, 2026 -
సరిహద్దుల్లో పాక్ డ్రోన్.. పార్సిల్ జారవిడిచి..
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దుల వెంట పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను దేశంలోకి దొంగచాటుగా తరలించేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్మీ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఆర్ఎస్పురా సెక్టార్లో శనివారం రూ.40 కోట్లకు పైగా విలువ చేసే 6.5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 13వ తేదీ రాత్రి వేళ అనుమానాస్పద డ్రోన్ కదలికలపై ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందింది.అదేవిధంగా, పాక్ భూభాగం వైపు నుంచి వచ్చిన డ్రోన్ ఒకటి ఏదో వస్తువును జార విడిచిపెట్టిందంటూ అందిన సమాచారంతో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అప్రమత్తమైంది. ఈ మేరకు బస్పూర్ ప్రాంతంలోని నయీ బస్తీ కరోతానా గ్రామం వద్ద పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలోని పంట పొలాల్లో 6.582 కిలోల బరువున్న హెరాయిన్ ప్యాకెట్లను జవాన్లు కనుగొన్నారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. సరిహద్దులకు సమీపంలోని కథువా జిల్లాలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా హెరాయిన్ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన రెండు రోజుల్లోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. -
అసలు సమరానికి సమయం
ఫిబ్రవరి 1...టి20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్... ఫిబ్రవరి 5...మాకు అవన్నీ తెలీదు...మా కొలంబో ఫ్లయిట్ బుక్ అయిపోయిందన్న సూర్యకుమార్... ఫిబ్రవరి 9...భారత్తో మ్యాచ్ ఆడేందుకు మేం సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన... ఫిబ్రవరి 15...భారత్, పాక్ మధ్య కొలంబోలో మ్యాచ్కు రంగం సిద్ధం...ప్రపంచకప్లో దాయాది జట్ల మధ్య సమరం అంటే ఏ ఫార్మాట్లో అయినా కనిపించే ఆసక్తి, ఉత్సాహమే వేరు...1992 నుంచి అభిమానులు ఇది చూస్తూనే వచ్చారు...ఫలితం ఎలా ఉన్నా, ఏకపక్షంగా సాగినా ఈ మ్యాచ్కు ఉండే ఆకర్షణ ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై సాగే సుదీర్ఘ వ్యాఖ్యలు, విశ్లేషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్థితిలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లేదంటే సహజంగానే పెద్ద చర్చే జరిగింది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది...కొలంబో వెళ్లే ఫ్లయిట్ టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటే హోటళ్లలో ఎంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధమైనా ఖాళీ లేదనే సమాధానం వచ్చేస్తోంది. మైదానంలోనే ఉండి జట్టుకు మద్దతుగా నిలవాలనుకునే వేలాది మంది మాత్రమే కాదు...తమ ఇళ్లనుంచి కన్నార్పకుండా ప్రతీ బంతిని చూసే ఫ్యాన్స్ సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మరో వరల్డ్ కప్ పోరుకు ఇరు జట్లు సై అంటున్నాయి. ఇటీవల ఆసియా కప్లో 3–0తో పాక్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శనతో చెలరేగుతుందో చూడాలి. కొలంబో: టి20 వరల్డ్ కప్లో మరోసారి తాడోపేడో తేల్చుకునేందుకు భారత్, పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. 2012 నుంచి వరుసగా ప్రతీ టి20 వరల్డ్ కప్లో తలపడుతున్న ఇరు జట్లు ఈ సారి కూడా తటస్థ వేదికపై తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. ప్రేమదాస స్టేడియంలో నేడు (ఆదివారం) జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పాకిస్తాన్ను భారత్ ఎదుర్కొంటుంది. రెండు జట్లూ తమ తొలి రెండు మ్యాచ్లు గెలిచి జోరు మీదున్నాయి. దాయాదిపై తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని అస్త్రాలతో టీమిండియా బరిలోకి దిగుతుండగా...ఇటీవలి వరుస ఓటముల తర్వాత ఈ సారైనా గెలిచి బదులు తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. కుల్దీప్కు అవకాశం... భారత బ్యాటింగ్ లైనప్కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్, పాండ్యా, దూబే తమ దూకుడైన బ్యాటింగ్ను ఇప్పటికే ప్రదర్శించారు. రింకూ సింగ్కు తగిన అవకాశం రాకపోగా, తిలక్ వర్మ కూడా రెండు సార్లు 25 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా గత మ్యాచ్ తరహాలో భారీ స్కోరు ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత తన తొలి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న సామ్సన్ మాత్రం విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ అనారోగ్యంనుంచి పూర్తిగా కోలుకుంటే సామ్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చేస్తాడు. అమెరికాపై డకౌట్ అయిన అభిషేక్ తన స్థాయికి తగినట్లు విజృంభిస్తే పాక్ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో అతను అందించే ఆరంభం భారత్ భారీ స్కోరుకు పునాది అవుతుంది. బౌలింగ్కు సంబంధించి తుది జట్టులో కచ్చితంగా మార్పు ఉండవచ్చు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే భారత్ మూడో రెగ్యులర్ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాటర్లకు ‘మిస్టరీ’గానే ఉన్న వరుణ్ చక్రవర్తి, అక్షర్లతో పాటు కుల్దీప్ను కూడా ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అర్ష్ దీప్ స్థానంలో అతను ఆడతాడు. పాండ్యా, దూబే కూడా బౌలింగ్ భారం పంచుకుంటారు కాబట్టి రెగ్యులర్ పేసర్గా బుమ్రాకు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవలి ఫామ్, బలాబలాలను చూస్తే పాక్కంటే టీమిండియా ఎంతో ముందుంది. బాబర్ ఆజమ్ రాణించేనా... అమెరికాపై భారీ విజయం సాధించిన పాకిస్తాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. పాక్ ఇప్పటికే ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లు అబ్రార్, తారిఖ్లతో పాటు స్పిన్ ఆల్రౌండర్లు నవాజ్, షాదాబ్లతో ఆడుతోంది. అవసరమైతే అయూబ్ కూడా స్పిన్ బౌలింగ్ చేయగలడు. వీరిలో తారిఖ్ మినహా మిగతా బౌలర్లందరిపై భారత్ గతంలోనే తమ ప్రతాపం చూపించింది. కొత్త తరహా, చర్చనీయాంశమైన యాక్షన్తో ఆడే ఆఫ్స్పిన్నర్ తారిఖ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది ఆసక్తికరం. భారత్ తమ సన్నాహకాల్లో దీనిపై కూడా దృష్టి పెట్టి ఉండవచ్చు. పేసర్ షాహిన్ అఫ్రిది చాలా కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సారి కూడా భారత బ్యాటర్లను నిలువరించడం అతనికి కష్టం కావచ్చు. లైనప్లో టాప్–4 మాత్రమే రెగ్యులర్ బ్యాటర్లు ఉన్నారు. అయూబ్, కెప్టెన్ ఆగా ఆసియా కప్లో భారత్పై వరుసగా విఫలమవగా, ఫర్హాన్ ఒక్కడే రాణించాడు. కెప్టెన్ అయిన తర్వాత సల్మాన్ ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తమ జట్టుకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా స్టార్ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న బాబర్ ఆజమ్ ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. అతను తన సత్తాను ప్రదర్శించేందుకు ఇంతకంటే సమయం, వేదిక ఉండవని పాక్ అభిమానులు భావిస్తున్నారు. 13 భారత్, పాక్ మధ్య ఓవరాల్గా 16 మ్యాచ్లు జరగ్గా...13 గెలిచిన భారత్ 3 ఓడింది.7-1 టి20 ప్రపంచ కప్లో భారత్, పాక్ మధ్య 8 మ్యాచ్లు జరగ్గా... భారత్ 7 గెలిచి ఒకటే ఓడింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. అయితే బౌలర్లూ ప్రభావం చూపించగలరు. మ్యాచ్కు ముందు రోజు మాత్రమే భారత్ ఇక్కడ సాధన చేసింది. పాక్ జట్టు కొలంబోలోనే ఉన్నా... తమ రెండు మ్యాచ్లను ఎస్ఎస్సీ మైదానంలో ఆడింది కాబట్టి తేడా ఉండకపోవచ్చు. అయితే మ్యాచ్ను వాన గండం వెంటాడుతోంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా, దూబే, రింకూ, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా పాకిస్తాన్: సల్మాన్ ఆగా (కెప్టెన్ ), ఫర్హాన్, అయూబ్, బాబర్ ఆజమ్, షాదాబ్, ఉస్మాన్, నవాజ్, ఫహీమ్, షాహిన్ అఫ్రిది, తారిఖ్, అబ్రార్ టి20 ప్రపంచకప్లో నేడువెస్టిండీస్ X నేపాల్వేదిక: ముంబై; ఉదయం 11 గంటల నుంచిఅమెరికా X నమీబియావేదిక: చెన్నై; మధ్యాహ్నం 3 గంటల నుంచి -
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హతం?.. వీడియో వైరల్
భారత మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మహ్మద్ ఖాసీం గుజ్జర్/ సల్మాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బైక్పై వెళుతున్న గుజ్జర్ను వెనుకనుంచి పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశారు. అయితే మరణించిన వ్యక్తి ఆయన కాదా అని స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.2024లో భారత ఉగ్రవాద నియంత్రణ చట్టం (UAPA) కింద మహ్మద్ ఖాసీం గుజ్జర్ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఈయనకు నిషేదిత ఉగ్రసంస్థ LETతో సంబంధాలున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పీవోకేలో ఆయన టెర్రరస్టు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.భారత్ ప్రస్తుతం టెర్రరిస్టులను ఊక్కుపాదంతో అణిచివేస్తోంది. పాక్తో సరిహాద్దు పంచుకుంటున్న ప్రాంతాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. ఆధునాతన కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. పహల్గామ్ అటాక్ అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్లోని టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.BREAKING: India-wanted terrorist Mohammad Qasim Gujjar alias Salman/Suleman has reportedly been shot dead by unknown gunman in Peshawar, Pakistan. The Reasi (J&K) native was linked to LeT and based in PoK. After Op Sindoor ,he was tasked to set up a terror camp in KPK. (Sources) pic.twitter.com/IcfwhlXS25— Baba Banaras™ (@RealBababanaras) February 14, 2026 -
స్పందించిన పాక్.. ఇమ్రాన్ ఖాన్ తరలింపు?
ఇటీవల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వైద్యవసతి సరిగ్గా లేక ఆయన 85శాతం చూపు కోల్పోయారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్ని సరైన వైద్యవసతులు కల మరో కొత్త జైలుకు తరలించనున్నట్లు పేర్కొందిప్రస్తుతం ఆడియాలో జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకర వార్తలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్ఖాన్ ప్రస్తుతం కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85% చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15% మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో ఇమ్రాన్ పట్ల ఉద్దేశపూర్వకంగా అత్యంత అమానుషంగా అడియాలా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారని పాక్లో ఆరోపణలు వెల్లడయ్యాయి.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇమ్రాన్ ఖాన్ను త్వరలోనే ఇస్లామాబాద్లోని జైలుకు తరలిస్తామని ఆ దేశ మంత్రి మోసిన్ నఖ్వీ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు, కంటిచూపు కోల్పోవడం దృష్ట్యా ప్రత్యేక వసతులతో ఆయన సెల్ నిర్మిస్తామని తెలిపారు. అయితే గతేడాది అక్టోబర్ వరకు ఆయనకు సాధారణ చూపు ఉన్నప్పటికీ, తరువాత రక్తం గడ్డకట్టడం (blood clot) వల్ల తీవ్రమైన నష్టం జరిగినట్లు వైద్యులు తెలిపారు.ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్లో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చూపు కోల్పోవడం వైద్యపరమైన సమస్య మాత్రమే కాకుండా, జైలు పరిస్థితులు మరియు ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది దీంతో ప్రభుత్వం స్పందించినట్లు తెలుస్తోంది. -
T20 WC 2026: యూఏఈ తరఫున ఇరగదీసిన పాక్ జాతీయుడు
టీ20 ప్రపంచకప్ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్ జాతీయుడు జునైద్ సిద్దిఖీ చెలరేగిపోయాడు. 33 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్.. ఇవాళ (ఫిబ్రవరి 13) కెనడాతో జరుగుతున్న మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది.సిద్దిఖీ తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ యూఏఈ బౌలర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీ20 వరల్డ్కప్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి యూఏఈ బౌలర్ కూడా సిద్దిఖీనే. చాలామంది పాక్ క్రికెటర్లలాగే సిద్దిఖీ కూడా క్రికెట్ కెరీర్ కోసం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొంది 2019 నుంచి యూఏఈ జట్టుకు ఆడుతున్నాడు.యూఏఈ తరఫున ఇప్పటివరకు 88 టీ20లతో పాటు 63 వన్డేలు ఆడిన సిద్దిఖీ మొత్తంగా 208 వికెట్లు తీశాడు. యూఏఈ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, అత్యంత విజయవంతమైన బౌలర్ సిద్దిఖీనే.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈ, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కెనడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనుకున్నట్లుగా వారికి మంచి ఆరంభం లభించలేదు. సిద్దిఖీ ఇద్దరు కెనడా ఓపెనర్లను (యువరాజ్ సమ్రా (5), దిల్ప్రీత్ బజ్వా (11)) 5 పరుగుల తేడాతో పెవిలియన్కు పంపాడు.ఆతర్వాత వచ్చిన నవ్నీత్ ధలివాల్ (34), హర్ష్ ఠాకూర్ (50) బాధ్యతాయుతంగా ఆడి కెనడాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 58 పరుగులు జోడించడంతో కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. చివర్లో శ్రేయస్ మొవ్వ (21) ఉపయోగకరమైన పరుగులు చేశాడు. కెనడా ఇన్నింగ్స్లో హర్ష్, ధలివాల్, శ్రేయస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూఏఈ బౌలర్లలో సిద్దికీతో పాటు ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సత్తా చాటాడు.అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కూడా తడబడుతుంది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో యూఏఈ గెలవాలంటే 30 బంతుల్లో మరో 62 పరుగులు చేయాలి. -
‘బంగ్లా’లో తారిఖ్ ప్రభుత్వం.. పాక్లో ఏం జరగనుంది?
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత, ఆ దేశ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ ఎన్నికల్లో విజయం సాధించి, తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ పరిణామం కేవలం బంగ్లాదేశ్లోనే కాకుండా దక్షిణాసియా రాజకీయాల్లో, ముఖ్యంగా పాకిస్తాన్తో ఉన్న సంబంధాలలో సరికొత్త చర్చకు దారితీసింది.బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు చేపట్టాక అది పాకిస్తాన్కు సానుకూల అంశంగా పరిణమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో అవామీ లీగ్ హయాంలో షేక్ హసీనా ప్రభుత్వం భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ, పాకిస్తాన్కు దూరం పాటిస్తూ వచ్చింది. అయితే బీఎన్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపడతాయని ఇస్లామాబాద్ ఆశిస్తోంది. చారిత్రక నేపథ్యం, గత అనుభవాల దృష్ట్యా తారిఖ్ రెహ్మాన్నాయకత్వం తమకు వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూరుస్తుందని పాక్ అంచనా వేస్తోంది.తారిఖ్ రెహ్మాన్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు భారత్పై వ్యతిరేక ధోరణిని ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన హయాంలో ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటువాద గ్రూపులకు మద్దతు లభించిందనే మాట కూడా వినిపించింది. ఇప్పుడు ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాక భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్య, భద్రతా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే తరుణంలో పాకిస్తాన్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.బంగ్లాదేశ్ను తన వైపు తిప్పుకోవడం ద్వారా భారత్ను దౌత్యపరంగా ఇబ్బందులకు గురిచేయవచ్చని పాక్ యోచిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. తారిఖ్ రెహ్మాన్ ప్రధానమంత్రిగా అయ్యాక పాకిస్తాన్, చైనాల ప్రభావం బంగ్లాదేశ్పై పెరుగుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది భారత్కు వ్యూహాత్మక సవాలుగా మారే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరత నేపథ్యంలో తారిఖ్ రెహ్మాన్ ఏ దేశానికి ప్రాధాన్యత ఇస్తారు? పాకిస్థాన్తో ఎంతవరకు సన్నిహితంగా ఉంటారనేది వేచి చూడాల్సిందే. ఇది కూడా చదవండి: మాజీ ప్రధాని హసీనా మరణ శిక్షపై ఉత్కంఠ -
ట్రంప్ "బోర్డ్ ఆఫ్ పీస్" మీటింగ్ ఆహ్వానం
గాజాలో శాంతి స్థాపనకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే "బోర్డ్ ఆఫ్ పీస్"ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన తొలి సమావేశం ఈ నెల 19న నిర్వహించనున్నారు. అయితే ఆ మీటింగ్ కు హాజరుకానున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో భారత్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుఎస్ఏ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్థాన్ని టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందని ఆరోపించారు. 1999 కార్గిల్ యుద్దం, 9/11 దాడుల తర్వాత ఆ దేశంతో జతకట్టడం తమ దేశానికి దీర్ఘకాలిక నష్టం కలిగించిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లో ఉగ్రవాదం.... ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్, నెట్వర్క్ల ద్వారా పెరుగుతుందని అంగీకరించారు. దీంతో అమెరికాతో పాక్ డిస్టెన్స్ పెంచుతుందేమోనని అంతా భావించారు.అయితే తాజాగా పాకిస్తాన్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో పాల్గొననున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఆ సమావేశానికి హాజరుకానున్నట్లు ఆదేశ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా అదేరోజు ప్రధాని షెహబాజ్ వాషింగ్టన్లో జరిగే మరో సమావేశానికి వెళతారని పేర్కొంది. అయితే భారత్ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. బోర్డు ఆప్ పీస్ మిషన్లో పాల్గొనాలని ఆహ్వానం అందిందని ఆ అంశంపై ఆలోచనలు జరుపుతున్నామని భారత అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. ఇటీవల భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి మెరుగుపడిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధిక పన్నులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ సైతం దానికి కృతజ్ఞత తెలిపింది. కాగా గత నెలలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ "బోర్డ్ ఆప్ పీస్" ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటి్ంచారు. ఇందులో ఇప్పటి వరకూ 26 దేశాలు చేరాయి. భారత్ ఇందులో చేరే అంశం ఇంకా ప్రకటించలేదు. -
ఇమ్రాన్ఖాన్ 85 శాతం కంటి చూపు కోల్పోయారు..!
కరాచీ: ప్రస్తుతం ఆడియాలో జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కల్గిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్ఖాన్ యొక్క కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85% చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15% మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు వెల్లడించిన విషయాన్ని సదరు లాయర్ పేర్కొన్నారు. ఇమ్రాన్ పట్ల ఉద్దేశపూర్వకంగా అత్యంత అమానుషంగా అడియాలా జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతోనే కంటి చూపు సన్నగిల్లినట్లు ఆరోపిస్తున్నారు ఆయన సన్నిహితులు. గతేడాది అక్టోబర్ వరకు ఆయనకు సాధారణ చూపు ఉన్నప్పటికీ, తరువాత రక్త గడ్డకట్టడం (blood clot) వల్ల తీవ్రమైన నష్టం జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.కొన్ని నివేదికలు ఆయనకు సరైన వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొంటున్నాయి.ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్లో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చూపు కోల్పోవడం వైద్యపరమైన సమస్య మాత్రమే కాకుండా, జైలు పరిస్థితులు మరియు ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..? -
నిందలతో సవాళ్లు సమసిపోవు!
పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ యోధులు జన వరి 31న బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 37 మంది పౌరులతో పాటు, భద్రతా దళాలకు చెందిన 17 మంది హతులయ్యారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచ్ యోధులు కనీసం 12 చోట్ల ఒకే సమయంలో దాడులు చేశారు. పోలీసు స్టేషన్లు, సైనిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యోధుల్లో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని ఆసిఫా మెంగల్ (24)గా బీఎల్ఏ ప్రకటించింది. ప్రతి దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగానే మిలిటెంట్లు చని పోయారని సైన్యం వెల్లడించింది.‘‘వీరు మామూలు టెర్రరిస్టులు కారు’’ అని పాక్ దేశీయాంగ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్య దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. వీటిలో ‘ఇండియా హస్తం’ ఉందని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపకుండా, గత రెండు దశాబ్దాలుగా పాక్ ఈ రకమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.బుగతీ హత్యతో మరో తిరుగుబాటునఖ్వీ చెప్పినదాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు ‘మామూలు టెర్రరిస్టులు’ కారు. దేశ విభజన సమయంలో కలాత్ ప్రాంతం పాక్లో విలీనమైన అంశం వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 2000 ప్రారంభం వరకు బలూచ్ తిరుగుబాటు గెరిల్లా పోరాట పంథానే అనుసరిస్తూ వచ్చింది. గ్యాస్ పైపులైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని ధ్వంసం చేసిన మిలిటెంట్లు పర్వత ప్రాంతాల్లోకి పరారయ్యేవారు. సాధారణంగా వారు బుగతీ లేదా మర్రీ అనే రెండు పెద్ద బలూచ్ తెగలలో ఒక వర్గానికి చెందినవారై ఉండేవారు. పాక్ పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న గిరిజన సర్దార్లు వాటికి నేతృత్వం వహించేవారు. రాజకీయ నాయకుని నుంచి తిరుగుబాటుదారుగా మారిన బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ ఖాన్ బుగతీని అప్పటి పాక్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆదేశాల మేరకు 2006లో వేటాడి చంపారు. పాక్ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1970లలో వామపక్ష విప్లవంలో మర్రీ తెగ సర్దార్ ఖేర్ బకష్ మర్రీ నాయకత్వ పాత్ర వహించారు. పాక్ ప్రభుత్వం ముందు బుగతీ 14 డిమాండ్లు పెట్టారు. బలూచిస్తాన్కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ, ఆ ప్రాంతంలోని వనరులపై అక్కడి ప్రభుత్వానికే నియంత్రణ ఉండా లన్నది వాటిలో ఒకటి. వాటిపై కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముషారఫ్ తిరస్కరించడం పెద్ద తప్పిదం. బుగతీ హత్యతో ఐదవ తిరుగుబాటు మొదలై ఈనాటికీ కొనసాగుతోంది. వనరులు బలూచిస్తాన్వి అయినా...అక్బర్ ఖాన్ బుగతీ లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కావు. వాటిని కోరినవారిలో ఇతరులూ ఉన్నారు. బలూచిస్తాన్లో వన రులు పుష్కలం. అది చమురు, ఇంధన వాయువు, ఖనిజాలు, రాగి, బంగారంతోపాటు ఇతర లోహాల నిక్షేపాలకు పేరెన్నికగన్నప్రాంతం. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వాటి నమూనాలనే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కు చూపించారు. ఆ ప్రాంతంలో లభ్య మయ్యేవాటిని తవ్వి తీసుకుపోవడమేగానీ, బలూచీ ప్రజానీకానికి అవి అందినది స్వల్పం. సుయీ చమురు క్షేత్రాల నుంచి గ్యాస్ ఇతర రాష్ట్రాలకు పైపుల ద్వారా వెళ్ళేది. కానీ, బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాలకు అది అందని మావిపండుగానే ఉండేది. పాక్ 1993 నుంచి గనుల లీజులను విదేశీ కంపెనీలకు కట్టబెడుతూ వస్తోంది. చగాయీ జిల్లాలో రేకో డిగ్ వద్ద స్వర్ణ, తామ్ర గనుల తవ్వకాలు సాగుతున్నాయి. గ్వాదర్ పోర్టును నిర్మించే కాంట్రాక్టును ప్రభుత్వం చైనాకు అప్పగించింది. చగాయీలోనే సైండక్ ప్రాంతం వద్ద తామ్ర, స్వర్ణ గనుల తవ్వకాలను కూడా చైనాకు మంజూరు చేశారు. మునీర్ ఇపుడు ట్రంప్కు వాటినే ఆశ చూపుతున్నారు. ఇటీవలి దాడులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చే అంతర్జాతీయ సంస్థ లను పునరాలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. మారిన పోరాట పంథాబలూచ్ తిరుగుబాటు తీరుతెన్నులు కూడా మారాయి. ఇప్పటి నేతలకు గిరిజన సర్దార్లకు రాజకీయంగా, లేదా సామాజికంగా ఎక్కడా పోలిక లేదు. గిరిజన నాయకులు కంటకప్రాయమైన పర్వత ప్రాంత శిబిరాల్లో రోజులు గడిపి ఉండవచ్చు. కానీ, వారి రాజకీ యాలు పాక్కు వ్యతిరేకమైనవి కావు. సమాఖ్య వ్యవస్థ లోపలే తమకు సముచిత స్థానం కల్పించాలనీ, తమను ప్రధాన లబ్ధిదా రులు కానివ్వాలనీ వారు కోరుకున్నారు.బీఎల్ఏకు 2018 నుంచి బషీర్ జెబ్ నేతృత్వం వహిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కు అల్లా నాజర్ నాయకత్వం వహిస్తు న్నారు. మెకానికల్ ఇంజనీరింగ్లో జెబ్ డిప్లొమా చేయగా, నాజర్ వృత్తి రీత్యా డాక్టర్. వీరి నేతృత్వంలో బలూచ్ తిరుగుబాటు మరింత హింసాయుతంగా మారింది. ఆత్మాహుతి దాడులకు శ్రీకారం చుట్టింది. చైనా వర్కర్లను, వారి ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని 2018 నుంచి వివిధ దాడులు చేసింది. సంచలనం సృష్టించిన 2025 నాటి రైలు హైజాక్ ఉదంతం కూడా తమ పనేనని బీఎల్ఏ చెప్పుకొంది. నేటి సోషల్ మీడియా యుగంలో జెబ్, నాజర్ ప్రసంగాలు విస్తృతంగా పరివ్యాప్తి చెందుతున్నాయి. తమ తల్లితండ్రుల కన్నా ఎక్కువ విద్యావంతులైన నవతరం తాము చిన్నచూపునకు గురి కావడం పట్ల ఆగ్రహంతో ఉంది. మితిమీరిన సైన్యం ఆగడాలను వ్యతిరేకిస్తోంది. భద్రతా దళాల ప్రమేయంతో తమ తండ్రులు, సోదరులు, భర్తలు, కుమారులు అదృశ్యమవుతున్న ఘటనలకు వ్యతిరేకంగా గతంలోనూ బలూచ్ మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగేవారు. కానీ, తిరుగుబాటులో మహిళలు స్వయంగా పాలుపంచు కోవడం కొత్త ధోరణి.దాడులతో భంగపడిన సైన్యం బలూచ్ ప్రజానీకంపై మరింతగా విరుచుకుపడుతుంది. గత చరిత్ర దానినే సూచిస్తోంది. హింస చక్రభ్రమణంలా కొనసాగుతుంది. ఈ రక్తసిక్త ఘటనలు శ్రీలంక నుంచి భారతదేశపు కశ్మీర్, ఈశాన్య ప్రాంతం, బలూచిస్తాన్ వరకు మొత్తం ప్రాంతానికి ఒక పాఠం నేర్పుతున్నాయి. తమ దేశంలోని ఘటనలకు పొరుగు దేశాలను నిందించడం వల్ల దేశంలో కొందరిని రంజింపజేసినట్లు అవుతుందేమో; కానీ, సమస్యకు మూల కారణాలు ఆ యా దేశాలలోనే ఉన్నందు వల్ల వాటికి పరిష్కారాలు అవే కనుగొనాలి. ఇతరులను నిందించడం వల్ల సవాళ్లు సమసిపోవు. నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
బంగ్లాదేశ్ కెప్టెన్కు పాకిస్తాన్లో ఘోర అవమానం
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్కు వంత పాడిన పాకిస్తాన్, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్ బంగ్లాదేశ్ను ఫూల్ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచకప్ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.ఈ ఎడిసోడ్ నడుస్తుండగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాక్లో జరిగే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్ ప్రైజ్ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. బంగ్లాదేశ్ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్.. పీఎస్ఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్ ఆటగాళ్లవైపు పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ను కనీసం బేస్ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్ పాక్ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. లిట్టన్ దాస్కు గతంలో పీఎస్ఎల్లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్ హొసేన్. ఈ బంగ్లా ఆల్రౌండర్ను రావల్పిండి బేస్ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎల్ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్ రహ్మాన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్ సైనింగ్ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది. మొత్తంగా చూస్తే పీఎస్ఎల్ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది. -
అమెరికాపై పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను ఉపయోగించుకుందని ఆరోపించారు. పాకిస్తాన్ను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. ఉగ్రవాదంపై ఖవాజా చేసిన వ్యాఖ్యలు.. భారత్ తరచూ చేసే ఆరోపణలకు బలం చేకూర్చాయి. భారత్కు మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. ఇటీవల పార్లమెంట్లో ప్రసంగిస్తూ అమెరికా–పాకిస్తాన్ సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్ను వాడుకుందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం, 9/11 దాడుల తర్వాత పాకిస్తాన్ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం మాకు దీర్ఘకాలిక నష్టం కలిగించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో “జిహాద్” పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన విమర్శించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్ నెట్వర్క్లు, పాలనా వైఫల్యాలు వల్ల పెరుగుతోందని ఆయన అంగీకరించారు. అమెరికా మద్దతును అనుసరించడం ఒక తీవ్రమైన నష్టంగా ఆయన అభివర్ణించారు. దీని పరిణామాలు పాకిస్తాన్కు దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.జిహాద్ యుద్ధాలను చట్టబద్ధం చేయడానికి పాకిస్తాన్ విద్యా వ్యవస్థను కూడా మార్చారని, ఆ సైద్ధాంతిక మార్పులు చాలా వరకు నేటికీ ఉన్నాయని ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980లలో ఆఫ్ఘనిస్థాన్లో జరిగిన సోవియట్ వ్యతిరేక యుద్ధం మతపరమైన ఆవశ్యకత కంటే అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడింది. పాకిస్తాన్ తనది కాని సంఘర్షణలలో పాల్గొనడం దీర్ఘకాలిక అస్థిరతను సామాజిక నష్టాన్ని కలిగించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేము అంటూ వ్యాఖ్యానించారు.కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్–అమెరికా సంబంధాలు1999 కార్గిల్ యుద్ధం తర్వాత అమెరికా–దక్షిణాసియా సంబంధాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. కార్గిల్ యుద్ధం సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్కు మద్దతు ఇచ్చారు. ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ను వాషింగ్టన్కు పిలిచి, సైన్యం వెనక్కి తగ్గాలని ఒత్తిడి చేశారు. ఈ సంఘటన తర్వాత అమెరికా–భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. 2000లో క్లింటన్ భారతదేశాన్ని సందర్శించడం దీనికి సంకేతం. అయితే, కార్గిల్ యుద్ధం పాకిస్తాన్కు రాజకీయంగా, వ్యూహాత్మకంగా నష్టం కలిగించింది. -
పాకిస్తాన్దే పైచేయి
కొలంబో: గత టి20 ప్రపంచకప్లో అమెరికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. టోర్నీలో శనివారం నెదర్లాండ్స్తో జరిగిన తొలి పోరులో కష్టమ్మీద గట్టెక్కిన పాక్... అమెరికాపై మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్ను ముగించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో పాక్ 32 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ (41 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా... బాబర్ ఆజమ్ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (12 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సయీమ్ అయూబ్ (19)తో తొలి వికెట్కు 54 పరుగులు (31 బంతుల్లో) జోడించిన ఫర్హాన్... మూడో వికెట్కు బాబర్ ఆజమ్తో 53 బంతుల్లో 81 పరుగులు జత చేశాడు. అమెరికా బౌలర్ షాల్విక్ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. శుభమ్ రంజనే (51; 3 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో పాటు జహంగీర్ (49; 5 ఫోర్లు, 2 సిక్స్లు), మిలింద్ కుమార్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శన జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. ఆఫ్ స్పిన్నర్ తారిఖ్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, షాదాబ్ ఖాన్కు 2 వికెట్లు దక్కాయి. 1982లో తొలి అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇ చ్చిన సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఫ్లడ్లైట్లతో ఇదే తొలి డే అండ్ నైట్ మ్యాచ్ కావడం విశేషం. టి20 ప్రపంచకప్లో నేడుదక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్వేదిక: అహ్మదాబాద్; ఉదయం 11 గం‘‘ నుంచిఆ్రస్టేలియా X ఐర్లాండ్వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గం‘‘ నుంచిఇంగ్లండ్ X వెస్టిండీస్ వేదిక: ముంబై; రాత్రి 7 గంటల నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
టీ20 ప్రపంచకప్: అమెరికాపై గెలిచిన పాకిస్తాన్
కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. అమెరికాపై 32 పరుగుల తేడాతో గెలిచింది. కొన్నిరోజుల క్రితం టీమిండియాపై అద్బుతంగా ఆడిన అమెరికా జట్టు.. ఇప్పుడు పాక్పై కూడా అదే జోరు ప్రదర్శించింది. కానీ గెలుపు రుచిచూడలేకపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన పాక్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోరు చేసింది. ఫర్హాన్ 73 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. బాబల్ ఆజమ్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అమెరికా బౌలర్లలో షాడ్లీ 4 వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు.అనంతరం అమెరికా జట్టు.. దూకుడుతో ఛేదన మొదలుపెట్టింది. కానీ వరస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లన్నీ పూర్తి చేసినప్పటికీ.. 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభం రంజనే 51, షయన్ జహంగీర్ 49 పరుగులతో మెప్పించారు. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారీఖ్ 3, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు తీశారు. -
T20 WC 2026: పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించిన అమెరికా పేసర్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 10) పాకిస్తాన్, యూఎస్ఏ మధ్య ఆసక్తికర సమరం జరుగుతోంది. గత ఎడిషన్లో యూఎస్ఏ పాక్పై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్ఏ ప్రస్తుత ఎడిషన్ తొలి మ్యాచ్లో భారత జట్టుకు కూడా పోటీనివ్వడం ఈ ప్రాధాన్యతను రెట్టింపు చేసింది. యూఎస్ఏ ఆటగాళ్లు టోర్నీ ప్రారంభం నుంచే పాక్ను మరోసారి చిత్తు చేస్తామని సవాళ్లు చేశారు. ఇది కూడా ఓరకంగా ఈ మ్యాచ్కు హైప్ తెచ్చిపెట్టింది. యూఎస్ఏ జట్టులో భారత మూలాలున్న ఆటగాళ్లతో పాటు పాక్ మూలాలున్న ఆటగాళ్లు (ఎహసాన్ ఆదిల్, మొహమ్మద్ మొహిసిన్) కూడా ఉన్నారు. వీరు కూడా పాక్ ఓడిస్తామని ఛాలెంజ్ చేయడం ఈ మ్యాచ్పై ఆసక్తిని మరింత పెంచింది.కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో యూఎస్ఏ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్ ప్రారంభంలో పాక్ తడబడింది. అయితే పాక్ను తొలుత ఇబ్బంది పెట్టింది మాత్రం పాక్ మూలాలున్న ఆటగాళ్లు కాని, భారత మూలాలున్న ఆటగాళ్లు కానీ కాదు. షాడ్లే వాన్ ష్కాల్విక్ అనే సౌతాఫ్రికా మూలాలున్న ఆటగాడు. ఈ షాల్విక్ తొలి మ్యాచ్లో భారత్ను కూడా ఇబ్బంది పెట్టాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ టీమిండియాపై 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.ఇప్పుడు ఇదే బౌలర్ పాక్ను చెడుగుడు ఆడుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కీలకమైన సైమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా (1) వికెట్లు తీసిన షాల్విక్.. ఇన్నింగ్స్ చివర్లో బ్యాట్ ఝులిపిస్తున్న షాదాబ్ ఖాన్ (30), ఫహీమ్ అష్రాఫ్ (1) వికెట్లు తీశాడు. మొత్తంగా షాల్విక్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో పాక్ మూలాలున్న బౌలర్ మొహమ్మద్ మొహిసిన్ కూడా పాక్ను ఇబ్బంది పెట్టాడు. మొహిసిన్ పెద్దగా వికెట్లు తీయకపోయినా (4-0-27-1) పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో పాక్ మూలాలున్న పాక్ బౌలర్ ఎహసాన్ ఆదిల్ మాత్రం ధారాళంగా (3-0-29-0) పరుగులు సమర్పించుకున్నారు. భారత మూలాలున్న బౌలర్లు సౌరభ్ నేత్రావల్కర్ (4-0-40-1), హర్మీత్ సింగ్ (4-0-41-1) కూడా బాగానే పరుగులు ఇచ్చారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల స్కోర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజమ్ (30) పర్వాలేదనిపించాడు. -
పాక్లో తక్షశిలకు ఎందుకెళ్లారు?
గువాహటి: అస్సాం బీజేపీ అగ్రనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మధ్య పరస్పర ఆరోపణల అగ్ని మరింత రాజుకుంది. ‘‘భార్య ఉద్యోగ పనుల నిమిత్తం 2013 డిసెంబర్లో పాకిస్తాన్కు వెళ్లానని గోగోయ్ చెప్తున్నారు. అయితే వీసా అనుమతుల ప్రకారం లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్లకు మాత్రమే పర్యటించే వీలుంది. కానీ రావల్పిండి జిల్లాలోని తక్షశిలకు గోగోయ్ దంపతులు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?. వీసా పరిధిలోని నగరాలకు వెళ్లేందుకు పాకిస్తాన్లో స్థానికంగా గొగోయ్కు ఎవరు అనుమతి ఇచ్చారు?. రావల్పిండి జిల్లాల పర్యటన ఏర్పాట్లు స్థానికంగా చేసిందెవరు?. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ప్రధాన కార్యాలయం సైతం రావల్పిండిలోనే ఉంది. పాక్ నిఘా వర్గాలతో గొగోయ్కు సంబంధం ఉందనడానికి ఇంతకంటే రుజువులు కావాలా?. గొగోయ్ తన పాక్ అనధికర, దేశవ్యతిరేక పర్యటనపై వివరణ ఇవ్వాల్సిందే’’అని సీఎం హిమంత డిమాండ్చేశారు. హిమంత మాటల్లో నిజం లేదు: గొగోయ్హిమంత ఆరోపణలపై గొగోయ్ సోమవారం దీటుగా ప్రతిదాడిచేశారు. ‘‘నా కుటుంబానికి పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు. భార్య పనినిమిత్తం పది రోజులు మాత్రమే పాక్కు వెళ్లివచ్చాం. అక్కడ ఎవరినీ కలవలేదు. ఈ విషయం అస్సాం పోలీస్ రిపోర్ట్లోనూ స్పష్టంగా ఉంది. నివేదిక వచ్చి ఆరు నెలలవుతుంటే ఇన్నాళ్లూ హిమంత ఏం చేస్తున్నట్లు?. హిమంత తన కుటుంబం ఆక్రమించిన వేల ఎకరాల భూముల అంశం నుంచి అస్సామీల దృష్టి మరల్చేందుకే నాపై అభాండాలు వేస్తున్నారు. రాష్ట్రంలో ఆరు కులాలకు ఎస్టీ హోదా, మాదకద్రవ్యాలు హోరెత్తడం వంటి సమస్యలపై దృష్టిపెడితే బాగుంటుంది. అవి వదిలేసి బంగ్లాదేశీ ముస్లిం వలసదారు(మియా)లను లక్ష్యంగా చేసుకుంటూ వాళ్లను రైఫిల్తో గురిపెట్టి కాల్చుతున్నట్లు ఉన్న వీడియోను ఆన్లైన్లో విస్తృత ప్రచారంచేశారు. ఇలాంటి మతవిద్వేష వీడియోలను బీజేపీ అస్సాం విభాగం సోమవారం ‘ఎక్స్’లో పోస్ట్చేసి తీవ్ర విమర్శలు రాగానే తొలగించారు. ఈ వివాదంలో పోలీసులు సూమోటోగా కేసు నమోదుచేసి సీఎంపై నేరం మోపాలి’’అని గొగోయ్ డిమాండ్చేశారు. -
టీ20 వరల్డ్కప్ నుంచి పాక్ మూలాలున్న ఆటగాడి తొలగింపు
టీ20 వరల్డ్ కప్-2026 పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టులో కలకలం రేగింది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు ప్రకటన ప్రకారం.. జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జోహెబ్ ఏ నియమాలు ఉల్లంఘించాడోనని క్రికెట్ ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ఇంత సడెన్గా ఓ ఆటగాడిని స్వదేశానికి పంపారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, జోహెబ్ మాత్రం తనపై తీసుకున్న చర్యను జాతి వివక్షగా అభివర్ణించాడు. మేనేజ్మెంట్ మొత్తం భారతీయ మూలాలున్నవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినైనందు వల్ల జట్టు నుంచి ఆకస్మికంగా తొలగించారని ఆరోపించాడు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.ఈ విషయంలో జోహెబ్ భారత్ను నిందించడాన్ని భారతీయులు తప్పుబడుతున్నారు. ఏదైనా ఉంటే యూఏఈతో బోర్డుతో చూసుకోవాలి కాని, భారత మూలలున్న వారిని అడ్డం పెట్టుకొని భారత్ను నిందించడం సరికాదని వార్నింగ్ ఇస్తున్నారు.కాగా, జోహెబ్ తొలగింపుతో యూఏఈ జట్టులో కలకలం రేగినా, టోర్నమెంట్లో వారి ప్రయాణం కొనసాగుతుంది. రేపు (ఫిబ్రవరి 10) జరిగే మొదటి మ్యాచ్లో వారు న్యూజిలాండ్ను ఎదుర్కొంటారు. ఆ తర్వాతి మ్యాచ్లు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. ప్రీ-టోర్నమెంట్లో ఇటలీతో జరిగిన వార్మప్ మ్యాచ్లో యూఏఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక, కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. జోహెబ్ లేకుండా యూఏఈ జట్టు మరింత బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కెనడా, ఆఫ్ఘనిస్తాన్పై గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచకప్లో యూఏఈ స్క్వాడ్: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మయాంక్ కుమార్, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ జవాదుల్లా, రోహిద్ ఖాన్, సోహెబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్ -
డాలస్లో కాదు.. పాక్లో ఉన్నట్లుంది!.. అమెరికా నేత ఆవేదన
న్యూయార్క్: అమెరికాలో ముస్లిం వలసల పెరుగుదలపై రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యుడు బ్రాండెన్ గిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంలో పలు ప్రాంతాలు భారీగా ‘ఇస్లామీకరణ’కు గురవుతున్నాయన్నారు. డాలస్ నగరంలో ఇస్లామీకరణ స్థానికులను ఆందోళనకు గురి చేస్తోందని తెలిపారు.‘‘డాలస్లోని కొన్ని మాల్స్ను సందర్శించండి.. మీరు డాలస్లో కాదు, పాకిస్తాన్లో ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని శుక్రవారం రియల్ అమెరికాస్ వాయిస్ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. ‘‘తరాలుగా ముస్లింల యాజమాన్యంలో ఉన్న భూముల దగ్గర మసీదులు పుట్టుకొస్తున్నాయి. అవి అసలైన అమెరికాను చంపుతున్నాయి. స్థానిక సంస్కృతిని మార్చేస్తున్నాయి’’ అన్నారు. ముస్లిం ప్రముఖులతోపాటు పలువురు జర్నలిస్టులు, హక్కుల సంఘాల నేతలు గిల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన విద్వేషాలను రెచ్చగొడుతూ ముస్లిం సమాజంపై అపోహలు పెంచుతున్నారని మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్లో అతి పిన్నవయస్కుడైన గిల్ గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీపై, భారతీయుల వలసపై నోరుపారేసుకున్నారు. -
మెగా చినాబ్ డ్యామ్ ప్రాజెక్ట్ వేగవంతం
న్యూఢిల్లీ: ముష్కర మూకల దాడులతో పేట్రేగిపోతున్న పాకిస్తాన్కు బుద్ధిచెప్పే లక్ష్యంతో పాకిస్తాన్ జల జీవనాడిని దెబ్బకొట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఇందులోభాగంగా సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా చినాబ్ డ్యామ్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. రామ్బాన్ జిల్లాలో రూ.5,129 కోట్లతో నిర్మించతలపెట్టిన సావల్కోట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కోసం తాజాగా టెండర్లు పిలిచింది. ప్రభుత్వ రంగ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఈ టెండర్లను ఆహ్వానించింది. పాకిస్తాన్కు నీటి అవసరాలు తీర్చే చినాబ్ నదిపై ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నారు. 1,856 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించబోయే ఈ ప్రాజెక్ట్పూర్తయితే ఈ ప్రాంతంలోనే అతిభారీ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్గా ఇది నిలిచిపోనుంది. సిందూ నదీజలాల ఒప్పందాన్ని స్తంభింపజేసిన నేపథ్యంలో పాకిస్తాన్కు బుద్ధిచెప్పడంతోపాటు సరిహద్దు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కొత్త ప్రాజెక్ట్ బాటలుపరుస్తుందని ఎన్డీఏ సర్కార్ తాజాగా పునరుద్ఘాటించింది. కొత్త ప్రాజెక్ట్కు సంబంధించి డ్యామ్, సొరంగాలు, అనుబంధ పనులకు సంబంధించిన టెండర్లు వచ్చే నెల 12వ తేదీతో మొదలై 20వ తేదీతో ముగుస్తాయి. టెండర్లలోని నిబంధనలు బిడ్ అనేది గరిష్టంగా 180 రోజులపాటు మనుగడలో ఉంటుంది. గరిష్టంగా 3,285 రోజుల్లోపు ప్రాజెక్ట్ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏకబిగిన దాదాపు పదిసంవత్సరాలపాటు డ్యామ్ నిర్మాణపనులు జరగనున్నాయి. దశాబ్దాల కల...: ఈ ప్రాంతంలో సావల్కోట్ హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ కట్టాలని భారత్ దశాబ్దాల క్రితమే భావించింది. అయితే గతంలో పాక్తో సింధూ నదీజలాల ఒప్పందం అమల్లో ఉండటం, సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఈ ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితమైంది. అయితే గత ఏడాది పహల్గామ్ పచ్చికమైదానాల్లో 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు పాయింట్ బ్లాంక్లో కాల్చి హేయమైన చర్యలకు దిగడంతో భారత్ ఉగ్రరూపం దాల్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరుల శిక్షణ శిబిరాలతోపాటు పాక్ వైమానిక స్థావరాలపై ముప్పేట దాడులు చేసింది. ఆ తర్వాత సిందూ నదీజలాల ఒప్పందం నుంచి గత ఏడాది ఏప్రిల్ నెలలో తప్పుకుంది. పాకిస్తాన్కు నీటికష్టాలు పెంచాలనే ఉద్దేశంతో వెంటనే పాత సావల్కోట్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జమ్మూకశీ్మర్ విద్యుత్ కష్టాలు తీరడంతోపాటు జాతీయ పవర్గ్రిడ్ సామర్థ్యం సైతం పెరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఈ ప్రాంతంలో మౌలికసదుపాయాలు మెరుగవనున్నాయి. -
పాక్కు పుతిన్ మెసేజ్..భారత్కు దూరం కానున్న రష్యా?
భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ రష్యాకు కోపం తెచ్చిందా?. భారత్కు ఎల్లవేళలా అపన్న హస్తం అందించే చిరకాల మిత్రుడు ఇప్పుడు ఇండియాకి దూరం కానున్నారా? ఈ రెండు దేశాల మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మాస్కోని పాకిస్థాన్కు చేరువచేస్తుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ని ఇంతకాలం పక్కకు పెట్టిన వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఆ దేశంలో బాంబు దాడి జరిగితే స్వయంగా స్పందించారు.రష్యా- భారత్ మైత్రి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. "రష్యా సుఖ-దుఃఖ కాలంలో భారత్కు సహాయకారిగా ఉండే గొప్ప మిత్రుడు" అని భారత ప్రధాని మోదీ అన్నారంటే ఇరుదేశాల మధ్య మైత్రి ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారత్ సైతం రష్యాకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించింది. ఈయూతో పాటు ఇతర దేశాలు రష్యాతో ఆర్థిక బంధాలు తెంచుకున్న సమయంలో అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇంతకాలం చిరకాల మిత్రులుగా ఉన్న దేశాలను దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్పై అధిక పన్నులు తగ్గించారు. ఫలితంగా భారత్ రష్యానుంచి చమురు కొనుగోలు చేయదని మాటిచ్చిందన్నారు. అయితే ఇక్కడ తుంటరి ట్రంప్ మాటలను నమ్మేవారు అధికంగా లేకున్నా.. ఇండియా ఈ వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా ట్రంప్ని ప్రశంసిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై రష్యా సైతం సానుకూలంగా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేయచ్చని దానిలో పెద్ద ఆశ్చర్యమేమి లేదని తెలిపింది.ఇదిలా ఉండగా రష్యా పాక్తో దగ్గరయ్యే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం రష్యా పాకిస్థాన్ను పెద్దగా పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశంలో సైతం పాక్ ప్రధాని షెహబాజ్, పుతిన్ కోసం 40 నిమిషాలు ఎదురుచూసి అసహనానికి గురయ్యారు. కాగా ఇప్పుడు రష్యా పాక్తో మైత్రికి చేయి చాపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్లో బాంబుదాడి జరిగి 36 మంది మృతిచెందారు. దాని పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానికి మెసేజ్ పెట్టారు.పుతిన్ మెసేజ్లో.. మతపరమైన వేడుకల్లో ప్రజలను చంపడం ఉగ్రవాదుల క్రూరమైన, అమానవీయమైన మనస్థత్వాన్ని తెలియజేస్తుందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహాబాజ్ షరీప్లకు సంతాప సందేశం పంపారు. అంతే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాక్తో కలిసి పనిచేయడానికి రష్యా సిద్ధంగా ఉంది అని తెలిపారు. దీంతో పాకిస్తాన్తో కలిసి పుతిన్ కొత్త కూటమి ఏర్పాటు చేసే అవకాశాలున్నాయా అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రష్యానుంచి చమురు కొనుగోలు భారత్ ఆపేసిందని ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ నిజంగా అలా చేస్తే మాత్రం ఎల్లవేళలా అండగా ఉన్న గొప్పమిత్రున్ని భారత్ దూరం చేసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కాశ్మీర్ విషయంలో పాక్ కు షాక్ ఇచ్చిన అమెరికా
-
పాకిస్తాన్ ఇమ్రాన్ఖాన్కు మరో బిగ్ షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్లో తీవ్ర సంచలనం సృష్టించిన తోషఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి న్యాయస్థానంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు వారికి.. 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో, ఇమ్రాన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సౌదీ ప్రభుత్వం నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయి. అయితే, వాటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు. అనంతరం, బహుమతులను తక్కువ ధరకు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమేనని రుజువైంది. దీంతో, తోషఖానా-2 అవినీతి కేసులో ఇమ్రాన్ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ తీర్పును వెలువరించారు.ఈ సందర్బంగా నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడినందుకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. దీంతో పాటు ఇద్దరికీ చెరో రూ. 1.64 కోట్ల జరిమానా కూడా విధించారు. ఇమ్రాన్ ఖాన్ వయసు, బుష్రా బీబీ మహిళ కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాస్త తక్కువ శిక్ష విధించినట్లు తీర్పులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయిన తర్వాత వరుస కేసులతో సతమతమవుతున్నారు. 2023 ఆగస్టు నుంచి ఆయన అడియాలా జైలులోనే ఉంటున్నారు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ డజన్ల కొద్దీ కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యమేనని పాక్ చర్చ నడుస్తోంది. -
కశ్మీర్పై పాక్ పన్నాగం.. జైషే ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో నాటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. భారత్పై ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో తాజాగా బయటకు వచ్చింది. మునీర్ భారత్పై ఎలాంటి వ్యతిరేకతను ప్రదర్శించాడో కశ్మీర్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాది చెప్పడం సంచలనంగా మారింది. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఫిబ్రవరి 5న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జైష్ ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జైషే ఉగ్రవాది మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్కు ప్రతిగా పాక్ ప్రారంభించిన దాడుల్ని ఆసిమ్ మునీర్ ‘ఘజ్వా-ఎ-హింద్’గా అభివర్ణించాడని అన్నాడు. యుద్ధం మొదలైనప్పుడు, ఆయుధాలు బయటకు వచ్చాయి, యుద్ధ విమానాలు దాడి చేసుకున్నాయి. ట్యాంకులు ముఖాముఖిగా నిలబడ్డాయి. మన ఆర్మీ చీఫ్ దీనిని ఘజ్వా ఎ హింద్, అని, బున్యాన్ అల్ మర్సూస్ అని ప్రకటించాడు. ఉగ్రవాదుల గుర్తింపు జిహాద్ అని, ప్రభుత్వం తమతో ఉన్నా లేకపోయినా మన లక్ష్యం జిహాద్ అని, కాశ్మీర్ను విముక్తి చేస్తామని చెప్పాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.అయితే, భారత్పై మతపరమైన యుద్ధం చేసి, ఇస్లామిక్ పాలన స్థాపించాలనే సిద్ధాంతాన్ని ‘ఘజ్వా ఎ హింద్’ సూచిస్తుంది. మరోవైపు.. జైషే ఉగ్రవాది ప్రకటనతో మరోసారి పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదుల సంబంధాలు బయటపడ్డాయి. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వారి మధ్య సంబంధాలు మాత్రం ఇలా బయటకు వస్తున్నాయి. ఈ సమావేశంలో కొత్తగా చేరిన మిలిటెంట్లు కూడా పాల్గొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పాకిస్తాన్లోని బహిరంగ వేదికలను పదేపదే ఉపయోగించుకుని జిహాద్ను కీర్తిస్తున్నారు. భారత్లో ఘర్షణను మతపరమైన కోణంలో చిత్రీకరిస్తున్నారు. తరచుగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు ఉన్న సమక్షంలోనే ఇది జరుగుతోంది.ఇక, గత సంవత్సరం ఏప్రిల్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం దాడి తరువాత భారత్.. ఉగ్రవాదంపై కఠినమైన దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్, ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ ఎయిర్బేస్లపై దాడి చేసి దాయాదిని కోలుకోలేని దెబ్బకొట్టింది. అలాగే, పాకిస్తాన్పై భారత్ పలు ఆంక్షలు సైతం విధించింది. -
పాకిస్తాన్లో దాడి.. ఐఎస్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో షియాలకు చెందిన మసీదులో శుక్రవారం జరిగిన భారీ ఆత్మాహుడి దాడికి తామే కారణమని ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)శనివారం ప్రకటించుకుంది. ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోగా, 169 మంది గాయపడటం తెల్సిందే. తమ బాంబర్ను మసీదు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో, వారిపైకి కాల్పులు జరిపి లోపలున్న వారికి సమీపంలోకి వెళ్లి పేల్చేసుకున్నాడని తెలిపింది.ఇదే సమయంలో సిరియాలో షియా సాయుధ గ్రూపులకు పాకిస్తాన్ మానవ వనరుగా మారిందని, ఇక్కడి నుంచే రిక్రూట్లు జరుగుతున్నాయని ఆరోపించింది. అందుకే తాము పాకిస్తాన్లోని షియాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని తెలిపింది. ఇలా ఉండగా, శుక్రవారం నాటి ఆత్మాహుతి దాడికి కీలక సూత్రధారి సహా నలుగురిని ఖైబర్ ప్రావిన్స్లోని పెషావర్, నౌషేరాల్లో అరెస్ట్ చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా ఆత్మాహుతి బాంబర్ను పెషావర్కు చెందిన యాసిర్గా గుర్తించామన్నారు. ఇతడు ఐదు నెలలపాటు అఫ్గానిస్తాన్లో ఉండి ఆయుధాల వినియోగంతోపాటు ఆత్మాహుతి దాడులకు శిక్షణ తీసుకున్నాడన్నారు. -
‘గత్యంతరం లేక’ ఆడటం లేదు! ఐసీసీకి పీసీబీ వివరణ
దుబాయ్: టి20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్తో మ్యాచ్ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి! -
భారత్ దెబ్బతో అన్నీ నష్టాలే.. పాక్ మంత్రి ఆవేదన
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్తో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న పాక్కు ఫార్మా రూపంలో మరో షాక్ తగిలింది. భారత వ్యాక్సిన్లు పాకిస్తాన్లో అందుబాటులో లేకపోవడంతో వ్యాక్సిన్ల దిగుమతికి 400 మిలియన్ డాలర్లు అవుతోందని పాక్ ఆరోగ్య మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం, భారత్పై ఆగ్రహంతో పాక్ ఆంక్షలు విధించడంతో ఇటు ఇండియా కూడా ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే ఫార్మా ఉత్పత్తులు(మెడిసిన్) కేంద్రం నిలిపివేసింది. దీంతో, పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. మందుల కొరత ఏర్పడింది. ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి ముస్తాఫా కమాల్ స్పందిస్తూ.. భారత వ్యాక్సిన్లు లేకపోవడంతో మా దేశంపై మరింత భారం పడుతోంది. ప్రస్తుతం ఏటా దాదాపు 400 మిలియన్ డాలర్లతో వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో 49 శాతం ఖర్చులను గావీ(గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (GAVI)) ద్వారా పనిచేసే అంతర్జాతీయ సంస్థలు, మిగతా 51శాతం వాటా ప్రభుత్వం భరిస్తోంది. స్థానికంగా టీకా ఉత్పత్తి ప్రారంభించకపోతే.. 2031 నాటికి దిగుమతి కోసం దాదాపు రూ.10వేల కోట్లు (1.2 బిలియన్) ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీంతో మా దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందన్నారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ల సరఫరాకు అంతర్జాతీయ మద్దతు 2031 నాటికి ముగుస్తుందని కూడా ఆయన చెప్పారు. కరోనా సమయంలో లక్షలాది కొవిడ్ టీకాలను భారత్ నుంచి సేకరించడంలో గావీ సహాయం చేసిందన్నారు. దాతల మద్దతుపై ఆధారపడకుండా స్థానికంగా టీకాల తయారీకి సన్నాహాలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.అయితే, పాక్ ప్రభుత్వం ప్రస్తుతం పౌరులకు 13 రకాల వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తుంది. అయినప్పటికీ ఏదీ స్థానికంగా ఉత్పత్తి చేయడం లేదు. వ్యాక్సిన్లు అన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. పాకిస్తాన్లో దాదాపు 24కోట్ల జనాభా ఉండగా.. ఏటా 62 లక్షల జననాలు నమోదువుతున్నాయి. దీంతో అక్కడ వ్యాక్సిన్ల డిమాండ్ భారీగా ఉంది. ఈ క్రమంలో వ్యాక్సిన్లు, ఇతర మందులు పలు దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ (GAVI).. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లోని పిల్లలకు టీకాలు అందించేందుకు పనిచేస్తుంది. -
పాకిస్తాన్కు అమెరికా బిగ్ షాక్ POK భారత్లో అంతర్భాగమే..
-
మసీదులో ఆత్మాహుతి దాడి.. భారీగా పెరుగుతున్న మరణాలు
-
పాక్కు షాకిచ్చిన అమెరికా..!
దాయాది పాకిస్తాన్.. గత కొన్ని రోజులుగా అమెరికా అండ చూసుకుని తెగ వయ్యారాలు పోయింది. కొన్ని నెలలుగా భారత్-అమెరికాల మధ్య నెలకొన్న అనిశ్చిత కారణంగా పాకిస్తాన్ బిల్డప్లు మీద బిల్డప్లు ఇచ్చేసింది. ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్తో పాటు ప్రధాని షహబాజ్ షరీఫ్లకు ఒకటి రెండు సందర్భాల్లో అమెరికా ఆహ్వానం పలకడంతో వారి వేషాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తమతో అమెరికా బంధం శాశ్వతమైనది అన్నంతగా ఓవరాక్షన్ చేసింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే అమెరికా చెప్పిన ప్రతీ విషయానికి ఊ కొట్టింది పాక్. అయితే పాకిస్తాన్ను మింగుడు పడని విషయం తాజాగా చోటు చేసుకుంది. ఒకటి భారత్తో అమెరికా డీల్ ఒకటైతే, మరొకటి జమ్మూ-కశ్మీర్ మొత్తం భాగం అనేది ఎప్పటికీ భారత్దే అని ప్రపంచానికి తెలిసేలా అమెరికా ట్వీట్ చేసింది. భారత్-అమెరికాల ట్రేడ్ డీల్ కుదిరిన గంటల వ్యవధిలోనే భారత్ మ్యాప్ను అమెరికా పోస్ట్ చేసింది. ఇందులో కశ్మీర్ను భారత్ మ్యాప్లోనే ఉంచి మరీ పోస్ట్ పెట్టింది. యూఎస్ అధికారిక ‘X ’ హ్యాండిల్లో భారత్ మ్యాప్ పోస్ట్ పెట్టింది. ఆ మ్యాప్లో జమ్మూ & కశ్మీర్, లడఖ్, అలాగే పీఓకే(POK) భారత్లో భాగంగా చూపబడింది. ఫలితంగా భారత్ యొక్క మ్యాప్ను అమెరికా అంగీకరిస్తుందనే సంకేతాలిచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ చేస్తున్న ‘కశ్మీర్పై హక్కు’ అనే వాదనను తిరస్కరిస్తోందని స్పష్టమైన సందేశం ఇచ్చింది. దాంతో పాకిస్తాన్ గట్టి షాక్ తగిలింది,. From tree nuts and dried distillers’ grains to red sorghum and fresh and processed fruit, the U.S.-India Agreement will provide new market access for American products. pic.twitter.com/mqpP10LJp1— United States Trade Representative (@USTradeRep) February 6, 2026 ఇవీ చదవండి:ఇది భారత్ వ్యూహాత్మక ముందడుగేనా?ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట -
పాక్లో ఆరని చిచ్చు.. బలూచ్ విముక్తి సాధ్యమయ్యేనా?
బలూచిస్తాన్.. పాక్లోని ఈ రాష్ట్రం అపార సహజ సంపదకు నిలయం. అయినా దారిద్య్రం నీడలో మగ్గుతున్న ఈ గడ్డపై ఇప్పుడు విముక్తి నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పాకిస్తాన్ సైనిక ఉక్కుపాదం కింద నలిగిపోతున్న బలూచ్ ప్రజల పోరాటం.. కేవలం భూభాగం కోసమే కాదు, అది వారి అస్తిత్వానికి సంబంధించినది. అంతర్గత కల్లోలాలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల మధ్య నలిగిపోతున్న ఈ ప్రాంతానికి నిజంగానే విముక్తి లభిస్తుందా? లేదా ఈ మంట ఇలానే రగులుతుటుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న.భూభాగంలో 44 శాతం వాటాపాకిస్తాన్లోని మొత్తం భూభాగంలో 44 శాతం వాటా కలిగిన బలూచిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా తీవ్రమైన అశాంతికి గురవుతోంది. ఈ ప్రాంతంలో వేర్పాటువాద గ్రూపులు స్వయంప్రతిపత్తితో పాటు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం దాడులను ముమ్మరం చేస్తున్నాయి. అపారమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, తమ ప్రాంతం వెనుకబడి ఉందన్న అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.మహిళలు సైతం తిరుగుబాటు బలూచ్ తిరుగుబాటుదారులు కఠినమైన పర్వత ప్రాంతాలను ఆసరాగా చేసుకుని, ఆధునిక ఆయుధాలతో పాక్ భద్రతా బలగాలకు సవాలు విసురుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ పోరాటంలో మహిళలు ఆత్మహుతి దాడులకు సైతం సిద్ధపడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం అక్కడి సామాజిక అసంతృప్తి ఎంతగా ఉందో స్పష్టం చేస్తోంది.కీలక సరిహద్దులతో ప్రత్యేక గుర్తింపుసుమారు 3,47,190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న బలూచిస్తాన్.. విస్తీర్ణంలో భారత్లోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ఉమ్మడి వైశాల్యం కంటే పెద్దది. దీనికి పశ్చిమాన ఇరాన్, ఉత్తరాన ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు ఉన్నాయి. భారత్తో నేరుగా సరిహద్దు లేనప్పటికీ, అరేబియా సముద్ర తీరంలోని 770 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం దీనికి అంతర్జాతీయ ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది.చైనా ప్రయోజనాలుబలూచిస్తాన్లోని గ్వాదర్ నౌకాశ్రయం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా చైనా చేపట్టిన ‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’(సీపీఈసీ) ప్రాజెక్టు ఇక్కడి నుంచే సాగుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’కు ఇది సమీపంలో ఉండటంతో, ఈ ప్రాంతంపై పట్టు కోసం చైనా, పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.సామాజిక స్థితిగతులుసుమారు 1.5 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రావిన్స్లో 52 శాతం మంది బలూచ్లు. 36 శాతం పష్తూన్లు నివసిస్తున్నారు. రాజధాని క్వెట్టా నగరం ఈ ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ బ్రాహుయి, హజారా వంటి మైనారిటీ వర్గాలు వారు కూడా ఉన్నారు. అయితే స్థానిక వనరులపై తమకు అధికారం లేకపోవడంపై ఇక్కడ నిరంతరం ఘర్షణలు జరుగుతున్నాయి.పాలకుల తీవ్ర నిర్లక్ష్యంబలూచిస్తాన్ సహజ వనరుల గని. ఇక్కడ భారీ స్థాయిలో సహజ వాయువు, బంగారం, రాగి, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. కానీ ఈ వనరుల ద్వారా వచ్చే ఆదాయం తమ అభివృద్ధికి కాకుండా, పాక్ కేంద్ర ప్రభుత్వానికే చేరుతోందని బలూచ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక దోపిడీయే వేర్పాటువాదానికి ప్రధాన కారణంగా మారుతోంది.‘మహా బలూచిస్తాన్’ ఆకాంక్షవేర్పాటువాద గ్రూపులు కేవలం పాకిస్తాన్లోని బలూచిస్తాన్తోనే ఆగకుండా, పక్కనే ఉన్న ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్లోని బలూచ్ ప్రాబల్య ప్రాంతాలను కలిపి ‘మహా బలూచిస్థాన్’ ఏర్పాటు చేయాలని కలలుగంటున్నాయి. అయితే మూడు దేశాల సరిహద్దులతో ముడిపడి ఉండటం వల్ల ఈ లక్ష్యం అత్యంత సంక్లిష్టంగా, సవాలుతో కూడినదిగా మారింది.ఇదే అతిపెద్ద అవరోధంబలూచ్ నేతలు తమది స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నప్పటికీ, ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా దీనిని గుర్తించలేదు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై దౌత్యపరమైన మద్దతు లేకపోవడం దేశ స్వాతంత్ర్య పోరాటానికి పెద్ద అడ్డంకిగా మారింది. చైనా వంటి శక్తులు పాకిస్తాన్కు అండగా నిలుస్తున్నంత కాలం, దౌత్యపరమైన గుర్తింపు లభించడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ సుంకాలు: భారత్కు భారీ ఊరట -
మ్యాన్హోల్ మూతల దొంగలు.. పదేళ్లు జైలు, రూ.50 లక్షలు ఫైన్!
పొరుగు దేశం పాకిస్థాన్కి మ్యాన్హోల్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా కొత్తవి అమర్చగానే అలా మాయమైపోతున్నాయి. ఈ సమస్య ఎలా అరికట్టాలా అని ఆలోచించిన అక్కడి పంజాబ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పాక్లో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అందులో భాగంగానే ఈ సమస్య ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది.ముఖ్యమంత్రి మరియం నవాజ్ వైరల్ వీడియోలో.. 'ఉదయం మేం మూతలు వేస్తున్నాం. రాత్రి అయ్యేసరికి అవి మాయమవుతున్నాయి. వాటిని దొంగిలించొద్దు. అలా దొంగిలించి అమ్మినా, వాటిని కొన్నా పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. మూతలు లేని మ్యాన్హోల్లో పడి ఎవరైనా చనిపోతే.. అందుకు కారణమైన వాళ్లకు పదేళ్లు జైలుశిక్ష, రూ.50 లక్షల పాకిస్థాన్ రూపాయల జరిమానా విధిస్తాం' అని ఈమె చెప్పారు.ఒక్కో మ్యాన్హోల్ మూత బరువు 30 కిలోల వరకు ఉంటుంది. వాటిని స్క్రాప్గా అమ్మి రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. పాక్లో పరిస్థితి అంత దారుణంగా తయారైంది.అలా ఓ మూత లేకపోవడంతోనే ఓ తల్లికూతురు చనిపోయారు. మరో చోట పడిపోయిన పాపని సహాయక సిబ్బంది కాపాడారు. మరోవైపు ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. 45శాతం మంది పాక్ ప్రజలు పేదరికంలో.. 16.5 శాతం మంది కటిక పేదరికంలో ఉన్నారు. -
భారత్ని ముక్కలు చేస్తాం.. పాక్ సభలో LET తీవ్రవాది
21వ శతాబ్ధంలో అతిపెద్ద అబద్దాల కోరు దేశమేదైనా ఉందంటే అది పాకిస్థాన్ అనే చెప్పుకోవాలి.. బాహ్య ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్లు నటిస్తూ ఇటీవల.. టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి సంయుక్త విన్యాసాలు చేసింది.. తీరా చూస్తే ఆ దేశంలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఓ బడా టెర్రరిస్టూ భారత్పై విద్వేశం చిమ్మూతూ ప్రగల్భాలు పలికాడు.కుక్కతోక వంకర అన్న నానుడి దాయాది పాకిస్థాన్కు సరిగ్గా సరిపోతుంది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా, వాళ్లదేశంలో వారిని తరిమినా, కార్గిల్లో ఓడిపోయినా ఆ దేశానికి ఎంతకీ బుద్ధి రావట్టేదు.. ఆపరేషన్ సిందూర్ ముగిసి ఏడాది కూడా కాకముందే మరోసారి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది. పాకిస్థాన్లో కశ్మీరీ సోలిడారిటీ డే ను పురస్కరించుకొని ఆ దేశంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బహిరంగ సభ నిర్వహించగా దానికి ఆ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. వారితో పాటు లష్కర్-ఏ-తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ సయ్యద్ అబ్దుల్ రహమాన్ నఖ్వీ పాల్గొని భారత్ పై మరోసారి తమ ద్వేషాన్ని చిమ్మాడు.నఖ్వీ మాట్లాడుతూ" (అఖండ్ భారత్కో ఖండ్ ఖండ్ కరింగే) భారత్ను ముక్కలు ముక్కలుగా చేస్తాం, ఆగ్రాకి నిప్పుపెడతాం, దక్కన్ని మండిస్తాం,ఢిల్లీని షేక్ చేస్తాం" అని ప్రగల్భాలు పలికారు. కశ్మీర్కు స్వాతంత్ర్యం కల్పిస్తూనే ఢిల్లీ, ఆగ్రాలపై దాడి చేస్తామని అమరుల త్యాగాలు వృథాపోవన్నారు. అబ్దుల్ రహమాన్ నఖ్వీ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్కు అత్యంత సన్నిహితుడు.అయితే గతేడాది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనికి భారత్ దీటుగా బదులిచ్చింది. ఆపరేషన్ సిందూర్ నిర్వహించి వారి దేశంలోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తే ఇలానే ఉంటుందని ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించింది. అయినప్పటికీ పాకిస్థాన్ తీరు మార్చుకోవడం లేదు. మరోసారి ఉగ్రవాదుల బహిరంగ వేదికలకు ఆహ్వనిస్తూ వారికి సహకారం అందిస్తూ భారత్పై విషం చిమ్మే యత్నం చేస్తుంది. -
పాక్లో ఆత్మాహుతి దాడి
ఇస్లామాబాద్: కల్లోల పాకిస్తాన్లో మరో ఆత్మాహుతి చోటుచేసుకుంది. షియా వర్గీయులే లక్ష్యంగా జరిగిన ఈ దారుణంలో కనీసం 50 మంది దుర్మరణం పాలయ్యారు. 169 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని ఇస్లామాబాద్ శివార్లలో ఉన్న షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అత్యంత శక్తిమంతమైన పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కాళ్లూ చేతులూ తెగిపడ్డవారు, తీవ్ర గాయాలతో అల్లాడుతున్న వారికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. మృతులు, క్షతగాత్రుల బంధుమిత్రుల ఆర్తనాదాలు, రోదనలతో ఘటనా స్థలి మారుమోగిపోయింది. వారిలో తమవారు కూడా ఉన్నారేమోనని పలువురు వెదుక్కుంటుండటం కన్పించింది. ‘‘చాలామందిని ఆస్పత్రుల్లో చేరి్పంచాం. వారిలో ఎందరు బతికి బయటపడతారో చెప్పలేం’’అని పోలీసు అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పుకొచ్చారు. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 70 దాటినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. మృతుల్లో ఇస్లామాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ సోదరుడు, మరో బంధువు కూడా ఉన్నారు. ఆత్మాహుతి బాంబర్ ఒక విదేశీయుడని అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అతను ఫిత్నా అల్ ఖ్వరాజీ అలియాస్ తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సభ్యుడని భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ లక్ష్యం ఎప్పుడూ పాక్ సైన్యం మాత్రమేనని చెప్పుకొచి్చంది. పాకిస్తాన్ తాలిబాన్గా పిలిచే టీటీపీ కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పలు దాడులు చేస్తూ వస్తోంది. దాడిని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని హెహబాజ్ షరీఫ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపంద చర్య. అమాయకులను లక్ష్యం చేసుకోవడం మానవత్వానికే తీరని మచ్చ’’అంటూ మండిపడ్డారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ పాక్లో పర్యటిస్తున్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. ఇస్లామాబాద్లో గత ఆర్నెల్లలో ఇది రెండో ఆత్మాహుతి దాడి. గత నవంబర్లో ఒక వ్యక్తి ఏకంగా ఇస్లామాబాద్ కోర్టు కాంప్లెక్స్లోనే కారులో తనను తాను పేల్చేసుకున్నాడు! ఆ ఘటనలో 12 మందికి పైగా మరణించారు. అంతకుముందు 2008 సెప్టెంబర్లో ఇస్లామాబాద్లోని మారియట్ హోటల్లో జరిగిన ఆత్మాహుతి దాడి 63 మందిని బలిగొంది. తొలుత కాల్పులు... ఇస్లామాబాద్లోని హెహజాద్ టౌన్లో తర్లాయ్ ప్రాంతంలో ఉన్న ఖదీజా అల్ కుబ్రా ఇమాంబరాలో షియా వర్గీయులు భారీ సంఖ్యలో శుక్రవారం మధ్యాహ్న వేళ ప్రార్థనల కోసం గుమిగూడారు. అదే సమయంలో ఆత్మాహుతి బాంబర్ లోనికి దూసుకొచ్చేందుకు ప్రయతి్నంచాడు. గేట్ దగ్గర గార్డులు అడ్డుకోవడంతో అక్కడికక్కడే తనను తాను పేల్చేసుకున్నట్టు పోలీసులతో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా వెల్లడించారు. దుండగుడు తొలుత కాల్పులకు తెగబడి తర్వాత పేలుడుకు పాల్పడ్డట్టు వారిని ఉటంకిస్తూ జియో న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. పేలుడు తీవ్రతకు మసీదు ప్రధాన ద్వారం కుప్పకూలడంతో పాటు సమీప భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా ఛిన్నాభిన్నమైన మృతదేహాలు, తెగిపడ్డ అవయవాలతో రక్తంతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. దాడి తమ పనేనని ఇప్పటిదాకా ఏ ఉగ్ర సంస్థా ప్రకటించుకోలేదు. పోలీసులతో పాటు సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించాయి. ఘటన నేపథ్యంలో ఇస్లామాబాద్లోని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. పాక్ కొంతకాలంగా ఆత్మాహుతి దాడులతో అతలాకుతలమవుతోంది. స్వతంత్ర బలూచిస్తాన్ డిమాండ్తో ఆ ప్రావిన్స్లో బలూచ్తిఆన్ లిబరేషన్ ఆర్మీ నిరంతరం పాక్ సైనికులపై దాడులకు దిగుతోంది. ఆ క్రమంలో ఇటీవల జరిపిన ఆత్మాహుతి దాడుల్లో భారీ సంఖ్యలో సైనికులు మృత్యువాత పడటం తెలిసిందే. సైన్యం ప్రతీకార దాడుల్లో బలోచీ సాయుధులు కూడా వందల్లో మరణించారు. -
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు. అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.భారత్పై ప్రత్యక్ష ప్రభావంభారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే.. భారమే అయినా..న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు.. అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
పాక్ ఆర్మీ అరాచకం.. బలూచిస్తానీల ఊచకోత
ఇస్లామాబాద్: కల్లోలిత బలూచిస్తాన్ ప్రావిన్స్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్లో కనీసం 216 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్తాన్ ఆర్మీ గురువారం తెలిపింది. మరో 22 మంది భద్రతా సిబ్బంది, మహిళలు, చిన్నారులు కలిపి 36 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారంది.రాద్ ఉల్ ఫిత్నా–1 పేరుతో జనవరి 26వ తేదీన చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని తెలిపింది. ఉగ్రవాద బృందాల నాయకత్వాన్ని, పోరాట పటిమను తీవ్రంగా దెబ్బకొట్టామని, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. గత ఐదు రోజులుగా నిలిపివేసిన రైళ్ల రాకపోకలను గురువారం నుంచి తిరిగి అధికారులు మొదలుపెట్టారని వెల్లడించింది. ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులను కలిపే ఈ ప్రావిన్స్లో బలూచ్ వేర్పాటువాద గ్రూపులు చురుగ్గా పనిచేస్తున్నాయి.ఇదిలా ఉండగా.. బలూచిస్థాన్ వేర్పాటువాదులు చేతుల్లో పాక్ సైన్యానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బలోచ్ లిబరేషన్ ఆర్మీ రెబల్స్కు పాక్ సైన్యం ఎదురు నిలబడి పోరాడలేని పరిస్థితి నెలకుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో రెబల్స్ను ఎదుర్కొనలేక తమ సైన్యం చేతులెత్తేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీతో ఎటువంటి చర్చలు ఉండబోవని అసిఫ్ తేల్చిచెప్పారు. మహిళలు, చిన్నారులు సహా పౌరులను చంపుతోన్న ఉగ్రవాదులతో చర్చలు ప్రసక్తేలేదని పాక్ రక్షణ మంత్రి ఉద్ఘాటించారు. నేరస్థులకు, వేర్పాటువాద గ్రూపులకు మధ్య సంబంధం ఉందని, బీఎల్ఏ బ్యానర్ కింద నేర ముఠాలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్తో సరిహద్దులు పంచుకునే బలూచిస్థాన్ ప్రావిన్సుల్లో దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది. పాక్ పాలన కింద తాము ఉండబోమని, ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కోరుకుంటున్నారు. -
కశ్చిరీలకు మద్దతుగా పాక్లో ర్యాలీలు
ఇస్లామాబాద్: కశ్చిరీ ప్రజలకు సంఘీభావంగా గురువారం పాకిస్తాన్ వ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. జమ్మూకశ్చిర్ సమస్యకు పరిష్కారం కశ్చిర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ఐరాస భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయడమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. కశ్చిర్ సాలిడారిటీ డేను పురస్కరించుకుని ముజఫరాబాద్లోని పీవోకే అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కశ్చిర్ పాకిస్తాన్లో భాగంగా మారనుందన్నారు. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నా ప్రకటించిన విధంగానే దేశ విదేశాంగ విధానానికి కశ్చిరే ప్రాతిపదికగా ఉంటుందని తెలిపారు. కశ్చిర్ అంశాన్ని పాలస్తీనాతో ముడిపెట్టిన షెహబాజ్ షరీఫ్ ఈ సందర్భంగా హతులైన ఉగ్రవాదులు బుర్హాన్ వనీ, సయ్యద్ అలీ జిలానీ వంటి వారి పేర్లను ప్రస్తావించారు. అనంతరం సరిహద్దుల్లోని ఫార్వర్డ్ పోస్ట్ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్, అధ్యక్షుడు జర్దారీ కూడా కశ్చిర్ ప్రజలకు సంఘీభావం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. సదస్సులు, సమావేశాలతోపాటు ఉదయం 10 గంటల సమయంలో దేశవ్యాప్తంగా ఒక నిమిషం మౌనం పాటించినట్లు ప్రభుత్వ రేడియో వెల్లడించింది. -
భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. కడుపు మంటలో పాకిస్థాన్
ఇస్లామాబాద్: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని గందరగోళంలోకి నెట్టింది. పొగడ్తలతో, ఫోటోలకు ఫోజులిచ్చే ప్రయత్నాలు సరిపోవని ప్రజలు, మాజీ మంత్రులు,ఆర్థిక నిపుణులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒత్తిడిలో పాక్ ప్రధాని షెహబాజ్ పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఉంటే, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాత్రం ‘నిస్సహాయ ప్రేమికుడు’ అనే అపవాదు మూటగట్టుకుంటున్నారనే చర్చ మొదలైంది. మరి ఈ ట్రేడ్ డీల్ పాకిస్థాన్ పాలకుల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చిందా?ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో స్తబ్ధుగా ఉన్న సంబంధాలు తాజాగా భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య పరమైన ఒప్పందాలతో పరిస్థితులు మెరుగున పడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్లో ప్రజలు తమ నేతల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు భారత్ గ్లోబల్ వాణిజ్యంలో ముందడుగు వేస్తుంటే..పాక్ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారుట్రంప్ సేవలో అసిమ్ మునీర్ఈ సందర్భంగా తమ పాలకుల తీరును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పలు దుమ్మెత్తి పోస్తున్నారు. అమెరికాకు మరింత దగ్గరై వాణిజ్యంతో పాటు ఇతర అంశాల్లో లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడింది. గతేడాది ట్రంప్ను కీర్తిస్తూ పాక్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్తో కలిసి విందులో పాల్గొన్నారు. పైగా, ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఆపినందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు సైతం పంపించింది దాయాది దేశం.ఆర్ధిక ఇబ్బందులతో సతమతంఅయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం పాక్పై కొంచెం కూడా కనికరం చూపించలేదు. పాక్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై 19శాతం సుంకాల్ని విధించింది. ఆ సుంకాలను చెల్లిస్తూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది. భారత్ మాత్రం తన ఎగుమతులపై సుంకాలను 18 శాతానికి తగ్గించినా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ఒప్పందాల నుంచి తప్పుకుంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా, అమెరికాతో ట్రేడ్డీల్ కుదుర్చుకున్న భారత్పై పాక్ దేశస్థులు ప్రశంసలు కురిపిస్తూనే తమదేశాది నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. భారత్ను చూసి నేర్చుకోండి. ఫొటోలకు ఫోజులివ్వడం కాదని, దేశానికి లబ్ధి చేకూరే పనులు చేయాలని సూచిస్తున్నారు. ఇక దాయాది మాజీ మంత్రులు ఎక్స్ వేదికగా పాలకులపై సెటైర్లు వేస్తున్నారు. మాజీ పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మంత్రి హమ్మాద్ అజ్హర్ ఇలా ట్వీట్ చేశారు. 21వ శతాబ్దంలో విదేశాంగ విధానం అనేది కేవలం చూపులు, వ్యక్తిగత సంబంధాల గురించి కాదు. అది ఆర్థిక శక్తిని వినియోగించడం, సుంకాల తగ్గింపు, దేశీయ మార్కెట్ను మరింత విస్తరించడం. భారత్ ఇటీవల యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందాలు దీనికి నిదర్శనం. అతిగా పొగడ్తలు కురిపించడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు అర్రులు చాచడం వంటివి పనికి రావు’ అని పేర్కొన్నారు. ట్రంప్ను నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయకపోయినా సుంకాల విషయంలో తాను ఏది కావాలనుకుందో భారత్ అది సాధించింది. ట్రంప్ పాకిస్థానికి ఇచ్చింది అదనంగా షూ పాలిష్ చేసుకునే అవకాశం తప్ప ఇంకేముంది?’ అని పాకిస్తాన్ ఆర్థికవేత్త జావేద్ హసన్ ఎద్దేవా చేశారు.మొత్తానికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్లో ఎవరికి ఎంత లాభం అనేది పక్కనపెడితే.. దౌత్య పరంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు పాక్ పాలకులకు మాత్రం కంట్లో నలుసులా, గోటి చుట్టూ రోకటి పోటులా మారాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. -
పాక్కు బంగారం దొరికింది.. భూమిలో నుంచి బయటపడేది అప్పుడే..
పొరుగు దేశం పాకిస్థాన్ గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కనీసం ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో ఉంది .అయితే, ఇప్పుడు సింధు నదిలో బంగారు నిల్వలు కనుగొనడంతో ఆ దేశానికి గడ్డు రోజులు పోతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మైనింగ్ మంత్రి ఇబ్రహీం హసన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ దేశంలో భారీ బంగారు నిల్వలను కనుగొన్నట్లు పేర్కొన్నారు. పంజాబ్ ప్రావిన్స్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు కనుగొనబడ్డాయి. కానీ నదుల్లో బంగారు నిల్వలను కనుగొనడం వల్ల ఆఫ్రికన్ దేశాల్లో జరుగుతున్నట్లుగా కొత్త సమస్యలు వస్తాయన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. కానీ కథ ఇక్కడితో ముగియదు. గతంలో ఆఫ్రికా దేశాలు కూడా ఇలాగే బంగారు నిల్వలు కనుగొన్నారు.. బుర్కినా ఫాసో, మాలి, నైజర్ లాంటి దేశాల్లో బంగారం బయటపడింది. అయితే ఆ దేశాలు అభివృద్ధి దిశగా వెళ్లక పోగా అక్కడ బంగారం మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తీవ్రవాద గ్రూపులు తమ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాయి. గత 15ఏళ్ల కాలంలో అనేక ఆఫ్రికన్ దేశాల్లో బంగారం, విలువైన లోహాల నిల్వలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. తీవ్రవాద గ్రూపులు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉగ్రవాదం, నెట్వర్కింగ్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాయి. బంగారం ద్వారా తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని కలలు కంటున్న స్థానిక ప్రజలను బంగారం తవ్వకం పనిలోకి దింపారు. జీతాలు స్థానికులే చెల్లిస్తున్నారు. ఆ డబ్బు మాత్రం ఉగ్రవాదులకు వెళ్తోంది. అన్ని వనరులను ఆక్రమించుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడి యువతను కూడా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… మన పొరుగుదేశం చైనా కూడా ఇటీవలే భారీ బంగారు నిల్వలను కనుగొంది. అక్కడి పాలకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే ఆశతో ఉంది. కానీ బంగారం దొరకడం ఒక్కటే కాదు… వాటిని పారదర్శకంగా, ప్రజల ప్రయోజనానికి ఉపయోగించడం చాలా ముఖ్యం. కాబట్టి చివరికి ప్రశ్న ఒక్కటే—ఈ బంగారం పాకిస్థాన్కు వరమా? లేక భవిష్యత్తులో కొత్త జియోపాలిటికల్ ఆటకు వేదిక అవుతుందా? దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతుందా? లేక అంతర్గత సమస్యలను మరింత పెంచుతుందా? దీనికి సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.సింధు నదిలో దొరుకుతున్న బంగారం హిమలయ పర్వతాల నుంచి వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ టెక్టోనిక్ కార్యకలాపాల కారణంగా మిలియన్ల ఏళ్ల క్రితం నదిలో ఖనిజాలు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ మీదుగా ఆ నది ప్రవహించినప్పుడు బంగారు కణాలు దానిలో వెళ్లిపోతాయి. అనంతరం ఒడ్డున ప్లేసర్ డిపాజిట్లుగా ఏర్పడతాయి. అంటే బంగారు నిల్వలుగా రూపాంతరం చెందుతాయి. నీటి మట్టాలు తక్కువగా ఉండే శీతాకాలంలో అవి బయటపడతాయి. -
భారత్తో జరగాల్సిన మ్యాచ్కు జట్టును ప్రకటించిన పాక్ క్రికెట్ బోర్డు
క్రికెట్ అభిమానులను ఇది కన్ఫ్యూజ్ చేసే వార్త. ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. అదేంటి.. ఆ రోజు భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాక్ ప్రభుత్వం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది కాదా అనుకుంటున్నారా..? అవును ఇది నిజమే. అంతకుముందు వార్త కూడా నిజమే.వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న భారత్-పాక్ మధ్య రెండు మ్యాచ్లు జరగాల్సి ఉన్నాయి. పాక్ ప్రభుత్వం పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మరో మ్యాచ్ మహిళల ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా జరగాల్సి ఉంది.ఈ మ్యాచ్కు పాక్ ప్రభుత్వం నుంచి కాని, ఆ దేశ క్రికెట్ బోర్డు నుంచి కాని ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఈ మ్యాచ్తో పాటు టోర్నీ మొత్తం కోసమే పీసీబీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా ఉమ్మె-హాని ఎంపికైంది.ఈ జట్టులో ఎమాన్ నసీర్, గుల్ రుఖ్, హఫ్సా ఖలీద్, హురైనా సజ్జాద్, షావాల్ జుల్ఫికార్ కీలక బ్యాటర్లు. వికెట్ కీపర్లుగా కోమల్ ఖాన్, యుస్రా ఆమిర్ ఎంపికయ్యారు. ఆల్రౌండర్లుగా నూరీన్ యాకూబ్, ఉమ్మె-హాని ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అనోషా నసీర్, లుబ్నా బెహ్రామ్, నేహా షర్మిన్ నదీమ్ , సయిదా మసూమా జాఫ్రీ , వహీదా అఖ్తర్ ఆ జట్టు బలంగా ఉంది. రిజర్వ్ ప్లేయర్లుగా జునాష్ అబ్దుల్ సత్తార్, మహమ్ అనీస్, అంబర్ కైనాత్, ఆయేషా బిలాల్ ఎంపికయ్యారు.ఈ టోర్నీలో పాక్ షెడ్యూల్ ఇలా ఉంది. ఫిబ్రవరి 13 – పాకిస్తాన్ ‘A’ vs నేపాల్ (ఉదయం 9.30) ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ ‘A’ vs ఇండియా ‘A’ (మధ్యాహ్నం 2.00) ఫిబ్రవరి 17 – పాకిస్తాన్ ‘A’ vs UAE (మధ్యాహ్నం 2.00) అన్ని మ్యాచ్లు బ్యాంకాక్లో జరగనున్నాయి. ఇదిలా ఉంటే, ఈ టోర్నీలో భారత ఏ జట్టు కూడా ఫిబ్రవరి 13నే తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్లాండ్ గ్రూప్-బిలో ఉండగా.. పాక్, భారత్, యూఏఈ, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ ఫిబ్రవరి 13న యూఏఈతో, 15న పాకిస్తాన్తో, 17న నేపాల్తో మ్యాచ్లు ఆడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా ఆల్రౌండర్ రాధా యాదవ్ వ్యవహరించనుంది. -
పాక్తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేసుకున్న విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు-ఐసీసీ మధ్య అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా అనుకుంటుండగా, ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నట్లు ఐసీసీ పాక్పై చర్యలు తీసుకోకపోగా.. ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఓ బంపరాఫర్ ఇచ్చింది.ప్రపంచకప్లో పాక్ ఆడే మ్యాచ్లకు పూర్తిస్థాయి ఉర్దూ వ్యాఖ్యానాన్ని అందిస్తామని ప్రకటించింది. ఐసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రత్యేక ఫీడ్ను ఐసీసీ స్వయంగా తయారు చేసి పాకిస్తాన్ స్థానిక ఛానల్ PTVలో ప్రసారం చేయనుంది. అదనంగా Myco, Tamasha, Tapmad, ARY Zapp వంటి డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో కూడా అందుబాటులో ఉంచనుంది. ఇప్పటి వరకు పాక్ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ ఫీడ్ లేదా పరిమిత స్థానిక కవరేజ్పై ఆధారపడ్డారు. తాజాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాక్తో అనుబంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తీసుకున్నదిగా తెలుస్తుంది. ఐసీసీ తొలిసారి అందించనున్న పూర్తి ఉర్దూ వ్యాఖ్యానం పాక్ ఆడబోయే వార్మప్ మ్యాచ్కు కూడా వర్తిస్తుంది.ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు. పాక్ ఇన్ని డ్రామాలాడుతున్నా, ఆ దేశ అభిమానుల కోసం ఇలాంటి సౌకర్యాలెందుకని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్గా భారతీయుడు (జై షా) ఉండి కూడా పాక్కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడమేంటని నిలదీస్తున్నారు. ఒప్పందాలకు విరుద్దంగా భారత్తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని చూస్తున్న పాక్పై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ఆఫర్లు ఏంటని పెదవి విరుస్తున్నారు. తక్షణమే పాక్పై చర్యలు తీసుకొని, ఆ జట్టు ప్రపంచకప్ మొత్తం నుంచే తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు.కాగా, భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ మినహా మిగతా ప్రపంచకప్ మ్యాచ్లన్నిటినీ ఆడతామని ఇటీవల పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ మరియు ప్రపంచకప్ ప్రసారకర్తలకు పెద్ద సమస్యగా మారింది. ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల ఐసీసీకి, ప్రసారక్తలను ఆర్దికంగా చాలా నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని నివారించడం కోసమే ఐసీసీ పాక్ అభిమానులను టార్గెట్ చేస్తూ ఉర్దూ వ్యాఖ్యానం అస్త్రాన్ని ప్రయోగించిందని తెలుస్తుంది. ఒకవేళ పాక్ ఇప్పుడు కూడా తగ్గకుండా భారత్తో మ్యాచ్ ఆడమని భీష్మించుకు కూర్చుంటే ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి. -
పాక్కు బలూచ్ సవాలు!
బలూచిస్తాన్ స్వాతంత్య్ర కాంక్షను ఉక్కుపాదాల కింద తొక్కివుంచాలని ఏడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ పాలకులకు యథాప్రకారం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత వారం చివరిలో తొమ్మిది జిల్లాల్లో కొనసాగించిన ఆత్మాహుతి దాడుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 84 మంది పాక్ సైనికుల్ని హతమార్చి, మరో 18 మందిని అపహరించింది. ప్రతీకారంగా తాము జరిపిన దాడుల్లో 133 మంది బీఎల్ఏ మిలిటెంట్లు చనిపోయారని పాక్ సైన్యం ప్రకటించింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ భాషనూ, సంస్కృతినీ విస్మరించిన పర్యవసానంగా అది విడివడి బంగ్లాదేశ్గా ఆవిర్భవించిన సంగతి తెలిసి కూడా దేశంలో 40 శాతం భూభాగం గల బలూచిస్తాన్ను పాక్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోటిన్నరమంది జనాభా నివసించే ఆ ప్రాంతానికి ఒకపక్క అఫ్గానిస్తాన్, మరోపక్క ఇరాన్, మూడోవైపు అరేబియా సముద్రం ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అత్యధిక భూభాగంలో భూగర్భ జలాలే ఆధారం. అక్కడ పండే యాపిల్స్, ద్రాక్ష, బాదం, ఖర్జూరం వగైరాలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. పాక్ పండ్ల ఎగుమతుల్లో 90 శాతం వాటా బలూచిస్తాన్ ప్రాంతానిదే. నీటి పారుదల సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో గోధుమ, వరి, బార్లీ, ఆలుగడ్డ పండుతాయి. ఇంతగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నా బలూచిస్తాన్ అభివృద్ధిని పాలకులు పూర్తిగా మరిచిపోయారు. అక్కడి భూపొరల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. రాగి, సీసం, క్రోమైట్, గ్రానైట్, జింకు వగైరాలున్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం ఉన్నాయి. వీటిల్లో బంగారం, రాగి గనుల నిర్వహణ చైనా చేతుల్లో ఉంది. అది పెట్టుబడి పెట్టి నిర్మించిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచిస్తాన్ ప్రాంతం లోనిదే. 6,500 కోట్ల డాలర్లతో చైనా నిర్మించతలపెట్టిన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాలోని షిన్జియాంగ్ నుంచి గ్వాదర్ వరకూ ఉంటుంది. చైనా దోపిడీ చాలలేదన్నట్టు నిరుడు సెప్టెంబర్లో అమెరికా కూడా వచ్చింది. ఆ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ స్ట్రాటజిక్ మెటల్స్తో పాక్ సైన్యం అనుబంధ సంస్థ 50 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా బూటకమనీ, గ్వాదర్ నౌకాశ్రయం తర్వాత తమ మత్స్యకారులు జీవిక కోల్పోయారనీ, గుక్కెడు మంచినీళ్లు దొరకడం కూడా కష్టమవుతున్నదనీ బీఎల్ఏ ఆరోపణ. పాకిస్తాన్ ఆవిర్భవించాక 1948లో బలూచిస్తాన్ను బలవంతంగా విలీనం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. అణిచేద్దామని చూసిన ప్రతి సారీ అవి మరింత తీవ్రంగా పోటెత్తుతున్నాయి. పాక్ సంస్కృతి, సంప్రదాయాలతో తమకేమాత్రం పోలిక ఉండదని, ఒక దేశంగా ఉంటేనే అస్తిత్వ పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంతవాసుల వాదన. ఇందుకోసం వామపక్ష భావాలతో ప్రభావితుడైన మీర్ గౌస్ బిజెంజో ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో పోరాటాలు జరిగాయి. పాక్ పరిధిలోనే స్వయంపాలనకు హామీ ఇవ్వాలన్న డిమాండ్తో నేషనల్ అవామీ పార్టీ (ఎన్ఏపీ) ఏర్పాటు చేసి, 1970 ఎన్నికల్లో బలూచిస్తాన్, ప్రస్తుత ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మరో మూడేళ్లకే అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రభుత్వాలనూ కూలదోసింది. ఈ అప్రజాస్వామిక చర్యే అనంతర కాలంలో మిలిటెన్సీకి బీజం వేసింది. బలూచిస్తాన్లో పాక్ సైన్యం చేయని దురాగతం లేదు. బలూచ్ యూనివర్సిటీలోనూ, వెలుపలా యువతను అపహరించటం, హతమార్చటం దానికి అలవాటైన విద్య. 2011 నుంచి ఇంతవరకూ 10,000 మంది మాయమయ్యారంటే ఇదెంతగా ఉందో అంచనా వేయొచ్చు. 2018 తర్వాత బలూచ్ మిలిటెంట్ సంస్థలు ఏకం కావటంతో పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. నిరుడు మార్చిలో జాఫర్ఖాన్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేయటం మొదలుకొని పాక్ సైన్యంపై సాగిస్తున్న నిరంతర దాడులు పాలకుల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. చారిత్రక ఆకాంక్షలను అణగదొక్కి, అభివృద్ధిని విస్మరించే ఏ పాలకులకైనా ఇదే దుఃస్థితి ఎదురవుతుంది. తప్పు తెలుసుకోకుండా, గుణపాఠం నేర్చుకోకుండా, మిలిటెంట్లకు భారత్ మద్దతుందని అనవసర యాగీ చేయటం పాక్ పాలకుల నిస్సహాయతకు అద్దం పడుతోంది. -
తన పరువు తానే తీసుకుంటున్న పాక్!
‘‘మిత్రదేశాల్ని అప్పులు అడగాలంటే సిగ్గనిపిస్తోంది. అయినా తప్పడం లేదు. నేను, మన ఆర్మీ చీఫ్ ఇద్దరం జోలె పట్టుకుని వీలైనన్నీ ఎక్కువ దేశాలు తిరిగాం. ఇంకా తిరగడానికి కూడా వెనకాడబోం’’ అంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మొన్నీమధ్యే బహిరంగంగా ఒక ప్రకటన చేయడం చూశాం. ఈ క్రమంలో సొంత దేశ పౌరులు తమ గురించి ఏం అనుకున్నా దులిపేసుకుంటాం అనే చందాన ఆయన మాట్లాడారు. ఈ లిస్ట్లో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేరారు.అంతర్జాతీయ సమాజంలో పాక్ తన పరువు తానే తీసుకుంటోంది. మొన్నీమధ్యే అప్పుల గురించి ఆ దేశ ప్రధాని మాట్లాడిన విషయం తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయన్ని పాక్ పౌరులు నెట్టింట తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వంతు వచ్చింది. జాతీయ అసెంబ్లీలో ఆయన.. బలూచ్ రెబల్స్ను ఎదుర్కోవడం తమ వల్ల కాదనే రీతిలో మాట్లాడడం గమనార్హం. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోనే అతిపెద్ద రీజియన్. ఇలాంటి చోట.. తక్కువ సంఖ్యలో దాగి ఉన్న బలూచ్ రెబల్స్ను ఎదుర్కోవడం మన(పాక్) సైన్యానికి పెద్ద సవాల్గా మారింది. పైగా బలూచ్ రెబల్స్ వద్ద ఆధునిక ఆయుధాలు ఉంటున్నాయి. రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు, థర్మల్ వెపన్ సైట్స్.. ఇలాంటివెన్నో వాళ్లు వాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ కూడా ఎక్కువే. పాక్ సైన్యం కూడా మునుపెన్నడూ అలాంటి ఆయుధాల్ని చూసి ఉండదు.. అంటూ ప్రసంగించారాయన. ఈ క్రమంలో అమెరికానే వాటిని సమకూర్చి ఉంటుందని సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘ఆ అత్యాధునిక ఆయుధాలు అమెరికన్వే. రెబల్స్ నాయకత్వం ఆఫ్గనిస్తాన్లో ఉండి.. అక్కడి నుంచి మద్దతు పొందుతున్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడం.. రెబల్స్ ఆధునిక సాంకేతికత వాడటం వల్ల మన (పాక్) భద్రతా దళాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. బీఎల్ఏ లాంటి గ్రూపులు క్రిమినల్ గ్యాంగ్స్తో కలసి పనిచేస్తూ, ఆయిల్ స్మగ్లింగ్ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి. సాధారణ పౌరులను, మహిళలను, పిల్లలను చంపే అలాంటి గ్రూపులతో పాక్ ప్రభుత్వం ఏనాడూ చర్చు జరపబోదు అని ఖ్వాజా జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేశారు. సాధారణంగా ఒక దేశం తన భద్రతా లోపాలను, సైన్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను బహిరంగంగా ఒప్పుకోవడం.. అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిష్టను దెబ్బతీసుకోవడమే. ఇప్పుడు రక్షణ మంత్రి ఖ్వాజా అదే పని చేశారని అక్కడి జనం తిట్టుకుంటున్నారు. సంపాదించేవారని ఆరోపించారు.ఇటీవల కాలంలో బలూచిస్తాన్లో బలూచిస్తాన్లో రెబల్స్ తిరుగుబాటు మళ్లీ తీవ్రరూపం దాల్చింది. పాక్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని రెబల్స్ వైవిధ్యమైన దాడులకు తెగపడుతున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూలేని రీతిలో మహిళలతో పాక్ ఆర్మీపై బలూచ్ రెబల్స్ గ్రూపులు ఆత్మాహుతి దాడులు జరుపుతున్నాయి. గతవారం ఏకకాలంలో 12 చోట్ల దాడులు జరిపి 80 మంది ప్రాణాలు తీశాయి. అదే సమయంలో పాక్ ఆర్మీ ప్రతిఘటనతో.. ఇరువైపులా భారీగానే ప్రాణ నష్టం సంభవిస్తోంది. అయితే.. కిందటి ఏడాది.. బలూచిస్తాన్లో ప్రయాణికులతో వెళ్తున్న రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత అమెరికా ఆ గ్రూప్ను ఉగ్రసంస్థగా గుర్తిస్తూ.. ఆ రీజియన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా(KBK ప్రాంతాలను "Level 4: Do Not Travel" జాబితాలో చేర్చింది. అంటే అటువైపు ప్రయాణాలు అత్యంత ప్రమాదకరమైనవని చెప్పడమన్నమాట. ఒక్క బీఎల్ఏ మాత్రమే కాదు.. అక్కడి రెబల్స్ గ్రూపుల్లో చాలావాటిని అమెరికా ఉగ్రసంస్థగా ఈపాటికే గుర్తించింది కూడా. ఈ తరుణంలో.. అమెరికన్ అత్యాధునిక ఆయుధాలనే బలూచ్ రెబల్స్ ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారే అవకాశంగా కనిపించడమే కాదు.. అంతర్జాతీయంగానూ పాక్కు ఇబ్బందులు కలిగించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
'ఫోర్స్ మజ్యూర్' క్లాజ్ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్
టీ20 వరల్డ్కప్ 2026లో భారత్–పాకిస్తాన్ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్ను పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్కాట్ డ్రామాకు తెరలేపింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడేందుకు భారత్ పాక్కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్కాట్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్ మజ్యూర్ క్లాజ్.ఏంటా ఫోర్స్ మజ్యూర్ క్లాజ్..? ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్ భారత్తో వరల్డ్కప్ మ్యాచ్ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్ మొత్తం ఆడి, భారత్తో గ్రూప్ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్ను మాత్రమే బాయ్కాట్ చేస్తామనేది ఐసీసీ-పాక్ క్రికెట్ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.ఒప్పందాల్లో పాక్ భారత్తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. పాక్ జట్టు మొత్తం టోర్నమెంట్ ఆడుతోంది. కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్ వర్గాల్లో భయం మొదలైంది. భారత్తో మ్యాచ్ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇరాన్–అమెరికా చర్చలకు పాక్
ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికాల మధ్య త్వరలో జరిగే చర్చల్లో పాల్గొనాలని పాకిస్తాన్కు ఆహ్వానం అందింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఇరాన్–అమెరికాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, ఒక ఒప్పందానికి వచ్చేందుకు తటస్థ దేశం తుర్కియే వేదికగా త్వరలో చర్చలు జరిగే అవకాశాలున్నాయి.శాంతి ప్రయత్నాలకు మరింత విస్తృతమైన గుర్తింపు, మద్దతు లభించేలా ఇరుగుపొరుగు దేశాలకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. విదేశాంగ మంత్రుల స్థాయి చర్చల్లో పాల్గొనాలంటూ సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్టు, ఒమన్, యూఏఈ తదితర దేశాలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న యత్నాలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు దేశాల మధ్య వివాదానికి ఇదే ప్రధాన అంశంగా మారింది. తమపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన పక్షంలో అణ్వాయుధాల అంశాన్ని వదిలేస్తామని ఇరాన్ అంటోంది. -
భారత్తో మ్యాచ్ రద్దు.. పాక్పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాతో జరగాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్ను పాక్ జట్టు రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గత రెండ్రోజులగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఐసీసీ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ ఎహసాన్ మణి కొట్టిపారేశాడు. ఈ విషయంలో ఐసీసీ పాక్ జట్టును ఏమీ చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.ఈ నిర్ణయం పీసీబీ కాకుండా పాక్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం వల్లే ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదని వెల్లడించాడు. ఆయన మాటల్లో.. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించినప్పుడు ఏ దేశానికీ శిక్షలు ఉండవు. ఇదే కారణంతో (భద్రత) టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను పాక్లో ఆడేందుకు నిరాకరించింది. అప్పుడు టీమిండియాపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పాక్ జట్టు విషయంలోనూ అంతే. ఒకే సమస్యకు రెండు విధానాలు ఉండకూడదని అన్నారు. కాగా, తాజా పరిస్థితి ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. ఓవైపు అభిమానుల ప్రయోజనాలు, ప్రపంచ క్రికెట్ సమగ్రత దెబ్బతింటున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్ల ఐసీసీకి శిక్షలు విధించే అధికారం తగ్గిపోతోంది. ఈ లూప్ హోల్ను ఆసరాగా తీసుకొనే పీసీబీ డ్రామాలాడుతుంది. భారత్తో మ్యాచ్ రద్దుపై ఇప్పటివరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ మాటగా కాలయాపన చేస్తుంది. ఐసీసీ నియమాలను అడ్డు పెట్టుకొని రోజుకో డ్రామాకు తెరలేపుతుంది.మరోవైపు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉండటంతో పాక్పై సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. షా.. రూల్స్ను పక్కన పెట్టి పాక్పై కఠిన చర్యలు తీసుకుంటాడని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ షా తన పరపతిని ఉపయోగిస్తే పాక్ జట్టుకు అంత భారీ శిక్షలు కాకపోయినా, ఓ మోస్తరు శిక్షలు అయినా పడే అవకాశం ఉంది. పాక్ జట్టు భారీ జరిమానాతో పాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి అంక్షలు ఎదుర్కోవచ్చు. పాక్పై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. -
ఇండియా, EU డీల్ .. కుప్పకూలనున్న పాక్ ఆర్థిక వ్యవస్థ?
ఇటీవల భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ అగ్రిమెంట్ పాకిస్థాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టెసే ప్రమాదముందని ఆ దేశ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఇంతకాలం యూరప్-పాక్ మధ్య నడిచిన జీరో టారిఫ్ హానీమూన్ ఈ డీల్ వల్ల ముగిసిందన్నారు. దీని వల్ల ఆ దేశంలో తీవ్ర ఆర్థిక నష్టంతో పాటు దాదాపు కోటి ఉద్యోగాలు పోయే అవకాశం ఉందన్నారు.ఈయూ- భారత్ మధ్య జరిగిన ఒప్పందం పాకిస్థాన్ని పేదరికంలోకి నెట్టేసే అవకాశం ఉన్నట్లు ఆ దేశ నాయకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో పాక్పై పడే ప్రభావం అంచనా వేస్తున్నారు. దీనిపై ఆ దేశ మాజీ వాణిజ్య శాఖ మంత్రి స్పందించారు. "ఇంతకాలం ఈయూతో జరిగిన హానీమూన్ ఒప్పందం ముగిసింది. 10 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వం పరిశ్రమలకు చౌకవిద్యుత్, తక్కువ పన్నులు, సులభమైన రుణాలు అందించాలి అలా అయితే ఇతర దేశాలతో పోటీపడగలం" అని ఆయన అన్నారు.యూరోపియన్ యూనియన్లో ఇంతకాలం పాకిస్తాన్ హావా నడిచింది. ఆ దేశానికి చెందిన దాదాపు 65 శాతం వస్తువులు ఎటువంటి పన్నులు లేకుండా అక్కడికి ఎగుమతి చేయబడుతున్నాయి. ఇప్పుడు భారత్తో ఈయూ డీల్ నేపథ్యంలో ఆ ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. భారత్, ఈయూ ఈ ఏడాది జనవరి 27న వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. దాదాపు 200 కోట్ల మంది ప్రజలు ఈ ఒప్పందంలో భాగంగా ప్రభావితమవుతారు. ప్రపంచ జీడీపీలో ఈ ఈయూ-భారత్ మార్కెట్ విలువ దాదాపు 25 శాతం. ఈ ఒప్పందం రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను ఏకం చేస్తుంది. -
పాక్ ఆర్మీ దాడులు.. 177కు చేరిన BLA మృతులు
బలూచిస్థాన్ తిరుగుబాటు దారులపై పాకిస్థాన్ ఆర్మీ విరుచుకుపడుతుంది. తాజాగా ఆ ప్రాంతంలో దాడి చేసి మరో 22 మంది BLA ( బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ) సైనికులను మట్టుబెట్టించినట్లు తెలిపింది. దీంతో సైన్యం దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 177కు చేరుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.BLA ఆర్మీ కోసం పాకిస్తాన్ సైనికులు గాలింపును తీవ్రతరం చేస్తున్నారు. బీఎల్ఎఫ్ స్థావరాలపై పక్కా ప్రణాళికతో దాడి చేసి వారి స్థావరాలను ధ్వంసం చేశారు. భద్రతా చర్యలలో భాగంగా క్వెట్టా ప్రాంతంలో రైలు సేవలను సైన్యం నిలిపివేసింది. అంతేకాకుండా ఇంటర్నెట్ను కట్ చేసింది. భద్రతా బలగాలు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఉగ్రమూకల స్థావరాలను నిర్విర్యం చేస్తున్నాయని పాక్ ఆర్మీ ప్రకటించింది.అయితే ఇటీవలే బలుచిస్థాన్ ఆర్మీ ఉగ్రదాడులు చేసిన తర్వేతే కౌంటర్గా ఈ దాడులు చేపడుతున్నట్లు బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. కేవలం రాజకీయ చర్చల ద్వారానే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని వారికి తగిన రీతిలో బదులివ్వడానికి పటిష్టమైన సైన్యం అవసరమన్నారు.అయితే బలూచిస్తాన్లోని ఉగ్రవాదులతో సహా వారి సానూభూతిపరుల నెట్వర్క్ మెుత్తంగా 4నుంచి 5వేల మధ్య ఉండే అవకాశం ఉందని సర్ఫరాజ్ బుగ్తీ అభిప్రాయపడ్డారు. ఈ దాడులలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పాకిస్థాన్ ఆర్మీ సంయమనం పాటించిందని ఆయన తెలిపారు. -
పాక్ సైన్యానికి చుక్కలు.. మునీర్కు కొత్త టెన్షన్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యానికి బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)కు చెందిన ఇద్దరు మహిళలు చుక్కలు చూపించారు. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా మారి పాకిస్తాన్ సిబ్బంది దాదాపు 200 మందిని హతమర్చారు. మరోవైపు.. బలోచిస్థాన్ అంతటా పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ‘హీరోఫ్’ పేరుతో రెండో దశ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు బీఎల్ఏ పేర్కొంది. దీంతో, దాయాది పాక్కు బీఎల్ఏ వెన్నులో వణుకుపుట్టించినట్టు అయ్యింది.ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజులుగా దాయాది దేశం పాకిస్తాన్లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలోచిస్థాన్ ప్రావిన్సులో ఉన్న 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతోన్న దాడులకు తమదే బాధ్యత అని తాజాగా బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో పాక్ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లేనని వెల్లడించింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మెంగల్ అనే యువతి చేసిన దాడిలో పాక్ సిబ్బంది సహా వంద మంది మృతి చెందినట్లు తెలిపింది. మరో ఆత్మాహుతి బాంబర్ హవా బలోచ్ దాడిలోనూ అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక, ఇద్దరు మహిళలు దాడులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 🚨🔴Balochistan Liberation Army releases photos of two female suicide attackers after deadly Pakistan attack. pic.twitter.com/OuZb2tsyt2— THE UNKNOWN MAN (@Theunk5555) February 2, 2026ఇదిలా ఉండగా.. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే.. సంచలన ఆరోపణలకు దిగింది. బలూచ్ యోధుల్ని ఏమీ చేయలేక.. తమ ఇంట ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని పేర్కొంది. ‘‘పాక్ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అది వాళ్ల కెపాసిటీకి మించిన పని. అందుకే మా ఇంట ఆడవాళ్లపై పడ్డారు. ఇది పిరికిపంద చర్య కాదంటారా?’’ అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బీఎల్ఏ పేర్కొంది.Watch this fearless woman fighter of #Baloch Liberation Army (BLA) while participating in #OperationHerof2 in #Gwadar in #Balochistan.She is Fidayee #HawaBaloch who fought along with fellow Fidayeen. The video released by BLA has her last statement before her ultimate… pic.twitter.com/tSrahHGhAn— Ajay Kaul (@AjayKauljourno) February 1, 2026మీడియా నివేదికల ప్రకారం.. ఆత్మాహుతి చేసుకున్న బలూచ్ యోధురాలు హవా బలోచ్కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆమె తండ్రి 2021లో పాకిస్తాన్ భద్రతా దళాల చేతిలో మరణించినట్టు తెలిసింది. అతడు బీఎల్ఏ యోధుడని సమాచారం. సదరు మహిళ తిరుగుబాటులో చేరడానికి ముందు అధికారికంగా విద్యను కూడా పొందినట్టు నివేదించబడింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న బలోచ్ వేర్పాటువాద ఉద్యమం ధోరణిని ప్రతిబింబిస్తుంది.పాక్ ఓవరాక్షన్.. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు. NOSHKI: Baloch Liberation Army fighters patrolling pic.twitter.com/E73PrCJyGj— Shazia Bugti (@Shazia_Bugti079) February 2, 2026 -
ఓటీటీలో దురంధర్ క్రేజ్.. ఏకంగా పాకిస్తాన్లో నంబర్వన్గా ట్రెండింగ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించడమే కాదు.. ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.ఈ మూవీని పాకిస్తాన్కు వ్యతిరేకంగా తెరకెక్కించారని పాక్తో పాటు గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. అయితే ఓటీటీలో విడుదలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో దురంధర్ దూసుకెళ్తోంది. పాకిస్తాన్లోనూ ఈ మూవీ నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పాకిస్థాన్లో నెట్ఫ్లిక్స్లో అగ్రస్థానంలో ఉందని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్లో థియేటర్లలో విడుదల కాని ఈ చిత్రం.. ఓటీటీకి వచ్చిన రెండు రోజుల్లోనే దేశంలో నంబర్ వన్గా ట్రెండింగ్లో నిలవడం విశేషం. ఈ సినిమా 'తేరే ఇష్క్ మే', 'హక్', 'ది బిగ్ ఫేక్' లాంటి బాలీవుడ్ చిత్రాల కంటే ముందుంది.కాగా.. ఈ చిత్రంలో సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సీక్వెల్ సైతం ఈ ఏడాది మార్చి 19న విడుదల కానుంది. -
పాక్ బలగాల పిరికిపంద చర్యలు
పాకిస్తాన్ గడ్డ మీద బెలూచిస్తాన్లో పరిణామాలు మళ్లీ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టాయి. బెలూచ్ రెబల్స్ పాక్ బలగాలపై అనూహ్య రీతిలో దాడులు జరపడం.. ఆ ఆత్మాహుతి దాడులు జరిపిన వాళ్లలో ఇద్దరు మహిళలు ఉండడం, ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించడం!.. ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ధురందర్ సినిమా చూసిన వాళ్లకు పాక్లో బలూచ్లు ఎదుర్కొనే వివక్ష గురించి ఓ ఐడియా ఉండొచ్చు. అయితే.. వాస్తవంలోనూ బలూచ్ ప్రజలు తమ అణచివేతకు వ్యతిరేకంగా నిలబడి.. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో.. మహిళా ఫిదాయిన్ల త్యాగం చర్చనీయాంశంగా మారింది. పాక్ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేపట్టిన ‘ఆపరేషన్ హెరోఫ్ – ఫేజ్ II’.. దానికి కౌంటర్గా పాక్ ఆర్మీ జరిపిన దాడులు 40 గంటలకుపైనే కొనసాగాయి. ఈ ఆపరేషన్లో పాక్ సైన్యాన్ని, ఫ్రంట్ వారియర్స్ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు మహిళా ఫిదాయీన్లు పాల్గొన్నారని బీఎల్ఏ ప్రకటించింది. ‘‘ఖరాన్, మస్తుంగ్, టంప్, పస్ని ప్రాంతాల్లో మా ఆపరేషన్లు పూర్తయ్యాయి. క్వెట్టా, నోష్కీ ప్రాంతాల్లో కూడా మా యోధులు ఉన్నారు. అక్కడి పాక్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. దాడుల్లో మొత్తం 200 మంది పాక్ సైనికులు మరణించారు. బలూచ్ ప్రజల్లారా.. పాక్ సైన్యానికి దూరంగా ఉండండి. మా పోరాటానికి మద్దతు ప్రకటించండి’’ అంటూ బీఎల్ఏ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం ఆ సంఖ్యను తక్కువగా చేసి చెబుతోంది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్.. మహిళలే ఆత్మాహుతి దాడులు జరిపారని చెబుతూ.. శుక్రవారం 41 మంది, శనివారం 92 మంది బీఎల్ఏ రెబల్స్ హతమయ్యారని ప్రకటించారు. నోష్కీ, హబ్, చమన్, నసీరాబాద్, గ్వాదర్, మక్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని అన్నారు. బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ.. బీఎల్ఏ రెబల్స్ జరిపిన దాడుల్లో 17 భద్రతా సిబ్బంది, 31 పౌరులు మరణించారన్నారు. పాకిస్తాన్ సైన్యం 40 గంటలపాటు ప్రతిదాడి చేసి 140కి పైగా మిలిటెంట్లను హతమార్చినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటిస్తే.. బీఎల్ఏ మాత్రం 18 మంది మాత్రమే తమ యోధులు మరణించారని, ఇందులో 11 మంది ఆత్మాహుతి దాడుల్లోనే వీరమరణం పొందారని ప్రకటించుకుంది. Fidayeen" (ఫిదాయీన్) అనే పదం అరబిక్ మూలం నుంచి వచ్చింది. అర్థం తన ప్రాణాలను త్యాగం చేసే వ్యక్తి లేదంటే ఆత్మాహుతి యోధుడు/యోధురాలు అని..ఇదే మొదటిది కాదు.. !ఈ తరహా మహిళా మానవ బాంబు దాడులకు (fidayeen strike) దిగడం బలూచ్ రెబల్ గ్రూప్స్కు తొలిసారేం కాదు. బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ తరఫున జరీనా రఫీయా అలియాస్ ట్రాంగ్ మహూ అనే సూసైడ్ బాంబర్ ఆ మధ్య చగయ్ సమీపంలో చైనా మైనింగ్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి జరిపింది. ఈ దాడిలో చైనాకు ఆస్తినష్టం జరపడంతో పాటు ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. తాజా దాడుల్లో.. 24 ఏళ్ల ఆసిఫా మంగళ్ తోపాటు మరో యోధురాలు పాల్గొన్నట్లు బీఎల్ఏ ప్రకటించుకుంది. నోష్కీలోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంపై వాహన బాంబుతో ఆసిఫా, మరో మహిళా యోధురాలు హవా బలోచ్ గ్వాదర్ ఫ్రంట్లో పోరాడి మరణించిందని తెలిపింది. వాళ్ల ఫొటోలు, దాడికి ముందు వాళ్ల ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని కూడా విడుదల చేసింది.#BLA the group behind ongoing coordinated attacks in #Balochistan has released a video showing one of its female fighters “Hawa Baloch” aka Droshum, reportedly filmed during a battle.Reports suggest more female fighters are involved but yet to be identified. pic.twitter.com/8bLY3iJSZ7— Hammad Baloch (@Hammad_Baluch) February 1, 2026మరోవైపు.. బీఎల్ఏ విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే.. సంచలన ఆరోపణలకు దిగింది. బలూచ్ యోధుల్ని ఏమీ చేయలేక.. తమ ఇంట ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని పేర్కొంది. ‘‘పాక్ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అది వాళ్ల కెపాసిటీకి మించిన పని. అందుకే మా ఇంట ఆడవాళ్లపై పడ్డారు. ఇది పిరికిపంద చర్య కాదంటారా?’’ అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బీఎల్ఏ పేర్కొంది. Hawa Baloch.Woman fighter of #Balochistan fighting the brutal, occupying Pakistan army.The young soldier died just hours later, defending her land, but not before sending dozens of Paki troops to the hoors.As brave as the rebel women of Iran.pic.twitter.com/sMDcExLd1E— Abhijit Majumder (@abhijitmajumder) February 1, 2026పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు.బెలూచిస్తాన్లో తిరుగుబాట్ల చరిత్ర👇 మొదటి తిరుగుబాటు (1948): ఖాన్ ఆఫ్ కలాత్ పాకిస్తాన్లో విలీనాన్ని వ్యతిరేకించడంతో ప్రారంభమైంది. రెండో దశ తిరుగుబాటు (1958–59): భూస్వామ్యం, స్వతంత్రత డిమాండ్లతో మళ్లీ అల్లర్లు. మూడో దశ తిరుగుబాటు (1963–69): గిరిజన నాయకులు, పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు.. నాలుగో దశ తిరుగుబాటు (1973–77): పెద్ద ఎత్తున సైనిక చర్యలు, వేలాది మరణాలు.. ఐదో దశ తిరుగుబాటు (2003–ప్రస్తుతం): అత్యంత దీర్ఘకాలంగా.. ప్రస్తుతం కొనసాగుతున్నాయి.బెలూచిస్తాన్లో తిరుగుబాట్లు (Baloch Insurgency) అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. బీఎల్ఏ, బీఎల్ఎఫ్ తరహా రెబల్స్ గ్రూపులు వేర్పాటువాద పోరాటాల్లో ప్రముఖంగా పాల్గొంటున్నాయి. అయితే పాక్తో పాటు మరికొన్ని దేశాలు వీటిని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి. బలూచ్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా సుమారు కోటి 50 లక్షలు. ఇందులో ఇరాన్లోనే 40 లక్షల మంది ఉన్నట్లు 2023 గణాంకాలు చెబుతున్నాయి. అఫ్గనిస్తాన్లో మరో 10 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రధానమైన బలూచిస్తాన్ ప్రావిన్లో మాత్రం వీళ్ల జనాభా తక్కువగా ఉంటోంది. అందుకు అక్కడి ఉద్రిక్తతలు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఏదిఏమైనా.. బెలూచిస్తాన్ రీజియన్లో నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పొచ్చు. -
భారత్తో మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్కు తప్పదు భారీ మూల్యం
భారత్తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది. ఈ చర్య వల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే, పీసీబీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది. పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని తెలియజేయలేదని ప్రకటిస్తూనే.. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. క్రీడా సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను (గ్రూప్ స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ, చివరికి భారత్తో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.వివాదం ఎక్కడ మొదలైదంటే..?ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్కప్ కోసం తమ జట్టును భారత్కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్తో మ్యాచ్ను మాత్రమే రద్దు చేసుకుంటున్న ప్రకటించింది.భారత్–పాకిస్తాన్ పోటీ ప్రాముఖ్యత - ఈ రెండు జట్ల మధ్య పోటీని “మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్” అని పిలుస్తారు. - ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఈ మ్యాచ్ను ఉత్కంఠగా వీక్షిస్తారు.ఆర్థిక నష్టం అంచనా - ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది.- పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. - క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. ప్రతి భారత్ మ్యాచ్ విలువ సుమారు 10–11 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు ₹100 కోట్లు) ఉంటుంది. - పాకిస్తాన్తో మ్యాచ్కు వచ్చే సరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. - ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ద్వారా రూ. 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వహకులు అంచనా వేశారు.- మ్యాచ్ జరగకపోతే, ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.పాకిస్తాన్కు కలిగే నష్టాలు- భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకోవడం వల్ల పాక్ క్రికెట్ బోర్డు ఆర్దికపరమైన నష్టాలతో పాటు పరిపాలనాపరమైన మరెన్నో కఠనమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. - టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.- పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు.- ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. - ఫైనల్గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.- PSLకు ఇతర బోర్డులు NOCలు ఇవ్వకుండా ఆపుతుంది.- ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ను తొలగించే అవకాశం ఉంది. -
మీకు బాగా అలవాటుగా మారిపోయింది: భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో జరిగే ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసత్య ఆరోపణలు చేయడమే ఆ దేశానికి బాగా అలవాటుగా మారిపోయిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ధ్వజమెత్తారు. ఇటీవల పాకిస్తాన్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక భారత్ హస్తముందనే ఆరోపణలను జైశ్వాల్ ఖండించారు. పాకిస్తాన్ తరచూ ఇలాంటి ఆరోపణలు చేసి తన అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.పాకిస్తాన్కు అసత్య ఆరోపణలు చేయడం తప్పితే వేరే పని లేనట్లు ఉందని చురకలంటించారు. ముందు పాకిస్తాన్ అసత్య ప్రేలాపన వదిలి ఆ దేశ ప్రజల దీర్ఘ కాలిక ప్రయోజనాలపై దృష్టి పెడితే బాగుంటందన్నారు. పాకిస్తాన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవి, ఆధారరహితమైనవి. ఇది పాకిస్తాన్ తరచూ ఉపయోగించే పద్ధతి – తన అంతర్గత వైఫల్యాల నుండి దృష్టి మళ్లించడమే. ప్రతి హింసాత్మక ఘటన తర్వాత అసంబద్ధమైన ఆరోపణలు చేయడం బదులు, పాకిస్తాన్ తన ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను తీర్చడంపై దృష్టి పెట్టాలి. అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనలు, అణచివేత, క్రూరత్వం అంతర్జాతీయంగా బాగా తెలిసిన విషయాలు.కాగా, పాకిస్తాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించకుండా, వాటి బాధ్యతను భారత్పై మోపడానికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యాఖ్యలు, భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఆరోపణలను ఎదుర్కొనే విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బలోచిస్తాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారుల దాడులు చేస్తున్నారు. తమకు స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్ ఏడాది కాలంగా బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు.. పాక్పై దాడికి తిగుతున్నారు. ఇది పాకిస్తాన్ అంతర్గత భద్రతా సమస్యలను మరింత స్పష్టంగా చూపిస్తోంది.బలోచిస్తాన్లో ఇటీవల జరిగిన దాడుల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు దీని వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. ఈ దాడులకు భారత్ కారణమని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆరోపించారు. ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా దాన్ని భారత్పై నెట్టే యత్నం చేసింది. దీన్ని భారత్ ఖండిస్తూ.. వారి దేశంలో సమస్యలను వేరే దేశంపై మోపడం పాక్కు బాగా అలవాటుగా మారిపోయిందని భారత్ స్ట్రాంగ్గా బదులిచ్చింది. -
దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..
-
పాక్ పై భారత్ ఘన విజయం
-
పాక్లో 145 మంది ఉగ్రవాదులు హతం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్లోని 40 గంటల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 145 మంది ఉగ్రవాదులు, మరో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. క్వెట్టా, సిబి, మస్తుంగ్, గ్వాదర్, నోష్కి, పాస్ని, పంజ్గుర్, ఖరన్ ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నట్లు బలూచిస్తాన్ ప్రావిన్స్ సీఎం సర్ఫరాజ్ బుగ్తి చెప్పారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు సూసైడ్ బాంబర్లు కూడా ఉన్నారన్నారు. మొత్తం 145 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకుని, గుర్తింపు ప్రక్రియ చేపట్టారని వివరించారు. శనివారం పలు ప్రాంతాల్లో పౌరులతోపాటు భద్రతా సిబ్బందిపై బలూచ్ సాయుధ గ్రూపులు దాడులకు పాల్పడటంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. శనివారం భద్రతా బలగాలు పంజ్గుర్, షబాన్ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్లలో 41 మంది ఉగ్రవాదులు చనిపోయారని గుర్తు చేశారు. ఈ ఘటన అనంతరం ప్రావిన్స్లో అప్రమత్తత ప్రకటించామని చెప్పారు. అఫ్గానిస్తాన్ నుంచి కొందరు అందించే ఆదేశాల ప్రకారం ఇక్కడున్న వారు ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు పథకం పన్నారని బుగ్తి ఆరోపించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తాలిబన్ వంటి గ్రూపులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పశ్చాత్తాప భావనతో లొంగిపోవాలనుకునే వారిని మాత్రం స్వాగతిస్తామని చెప్పారు. బలూచిసాŠత్న్లో ఉగ్రవాదుల హింసాత్మక కార్యకలాపాలతో 2024లో 787 మంది చనిపోగా, 2025లో ఈ సంఖ్య 956కు అంటే దాదాపు 22 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.పాక్ ఆరోపణలను ఖండించిన భారత్బలూచిస్తాన్లో అశాంతి వెనుక భారత్ హస్తముందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తి గా నిరాధారాలని పేర్కొంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతిసారీ పాక్ మిలటరీ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ఎత్తుగడల కు పాల్పడుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. బదులుగా అక్కడి ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేతలో పాకిస్తాన్కు దారుణమైన రికార్డు ఉందని పేర్కొన్నారు. -
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు కూడా అర్హత సాధించింది.బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్త్లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ తలపడతాయి. -
పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై–వోల్టేజ్ పోరుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, పాక్ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్-పాక్ ఇప్పటివరకు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా కలిచి వేస్తుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. భారత్-పాక్ మ్యాచ్ రద్దు వల్ల అభిమానులకే కాదు, వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ, ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.కాగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇటీవలికాలంలో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మొదలైంది. ఈ కారణంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ భారత్లో జరగాల్సిన లీగ్ మ్యాచ్లు ఆడమని భీష్మించుకు కూర్చుంది. వేదికలను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ససేమిరా అంది. ఈ విషయంలో పాక్ బంగ్లాదేశ్కు మొదటి నుంచి వంత పాడుతూ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. కాగా, ప్రపంచకప్లో పాక్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే షెడ్యూలై ఉండింది. -
మూడో టీ20లోనూ ఆసీస్ను చిత్తు చేసిన పాక్
టీ20 ప్రపంచకప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో పాక్ 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో ఆసీస్ను వైట్వాష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసిన పాక్.. అనంతరం ఆసీస్ను 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.రాణించిన బాబర్, సైమ్పాక్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా పాక్ ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 10, కెప్టెన్ సల్మాన్ అఘా 5, ఖ్వాజా నఫే 21, మొహమ్మద్ నవాజ్ 5, ఫహీం అష్రాఫ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.తిప్పేసిన నవాజ్అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో గ్రీన్ (22), స్టోయినిస్ (23), జోష్ ఫిలిప్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్ష్ (1), షార్ట్ (2), రెన్షా (1), ఓవెన్ (8), కన్నోలీ (0), కుహ్నేమన్ (5) దారుణంగా విఫలమయ్యారు. ఆడమ్ జంపా బ్యాటింగ్కు దిగలేదు. పాక్ ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో కూడా భారీ విజయాలు సాధించింది. ఈ సిరీస్కు ఆసీస్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రపంచకప్ దృష్ట్యా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది. -
విరాట్ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ భారత దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు విరాట్ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (32), మొహమ్మద్ రిజ్వాన్ (30), డేవిడ్ వార్నర్ (28), జోస్ బట్లర్ (28) ఉన్నారు.మరో రికార్డుతాజా హాఫ్ సెంచరీతో బాబర్ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.ఫామ్లోకి వచ్చిన బాబర్BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్ల్లో 202 పరుగులు) చేసిన బాబర్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఫామ్లోకి వచ్చాడు.మ్యాచ్ పరిస్థితి లాహోర్ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్ చేసింది. సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచిన పాక్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
పాకిస్తాన్తో కీలక మ్యాచ్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు. -
భారత్తో మ్యాచ్.. పాక్ హెడ్ కోచ్ ఘోర తప్పిదం
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది. బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించాడు. ఐసీసీ నియమాల ప్రకారం, PMOA (Player and Match Officials Area)లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం. ఇవి మ్యాచ్ ఫలితాలను ప్రభావితం (ఫిక్సింగ్ లేదా చీటింగ్) చేసే అవకాశం ఉందని ఐసీసీ ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఆర్టికల్ 4.1.1 ప్రకారం PMOAలో ఎవరూ మొబైల్ ఫోన్ వాడకూడదు. ఆర్టికల్ 4.1.2 ప్రకారం ల్యాప్టాప్లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కూడా వాడకూడదు. -
పాక్ కల్నల్ ఇమ్రాన్ దారుణ హత్య.. భారత్ హస్తం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో భారత్ వ్యతిరేకులను టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. వారిని వెంటాడి మరీ చంపుతున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రవాద దాడి ప్లాన్కు కారణమని భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నర్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చడం పాకిస్తాన్ను టెన్షన్కు గురిచేస్తోంది. ఇమ్రాన్ దయాల్ ఐఎస్ఐ చీఫ్ హఫీజ్ సయీద్కు సన్నిహితుడు కావడం విశేషం.వివరాల మేరకు.. పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని చెబుతోంది.BIG BREAKING NEWS 🚨 Pakistani Army Lt Col Imran Dayal shot dead by UNKNOWN MEN in Dera Ismail Khan, Pakistan.As per news reports, he was identified as a handler in the 2025 Pahalgam terror attack.ISI is also clueless. Police have no idea. He was a very close associate of… pic.twitter.com/747JDjA0yb— News Algebra (@NewsAlgebraIND) January 31, 2026కానీ, దాడి కారణంగా ఇమ్రాన్ వాహనం పూర్తిగా దెబ్బతిన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కడం లేదు. భారత్ మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు ఇమ్రాన్ దయాల్ అత్యంత సన్నిహితుడు. ఇక, ఇమ్రాన్ దయాల్.. భారత్లోని పహల్గాం ఉగ్రదాడికి ముఖ్య కారకుడు అని తెలుస్తోంది. ఇమ్రాన్ హత్యతో రంగంలోకి దిగిన అధికారులు.. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా దాడులతో పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యంలో ఆందోళన మొదలైనట్టు సమాచారం. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు, ఇలా పాక్తిస్తాన్కు చెందిన కీలక నేతలను హతమారుస్తున్న నేపథ్యంలో వారంతా భారత్ దురంధర్లు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భారత్కు చెందిన సీక్రెట్ ఏజెంట్లే వారిని హతమారుస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 🚨 BIG! Pakistani Army Lt Col Imran Dayal, identified as a handler in the 2025 Pahalgam terror attack, was SHOT DEAD by UNIDENTIFIED GUNMEN in Dera Ismail Khan👉 UNKNOWN GUNMEN continue to ELIMINATE terrorists in Pakistan 🔥#Agyat 👍👌👏 pic.twitter.com/lIqgxzBRsg— DR. AMIT MANOHAR (@dramitmanohar) January 31, 2026ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రత్యేక ప్రాంతం బలూచిస్తాన్లో ఆ ప్రాంతానికి చెందిన తిరుగుబాటు సంస్థ బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) పాక్ భద్రతా సిబ్బందిపై దాడులకు దిగింది. దీంతో పాక్ పోలీసులు కూడా ఎదురుదాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, 80 మంది బీఎల్ఏ ఉద్యమకారులు మరణించినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఐదు జిల్లాలకు చెందిన 12 ప్రదేశాల్లో, ఏకకాలంలో ‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా సిబ్బందిపై గన్స్, ఇతర ఆయుధాలతో దాడి చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు దిగింది. క్వెట్టా, మాస్తంగ్, నుష్కి, పస్ని, గ్వాదర్ జిల్లాల్లో బీఎల్ఏ దాడులు చేసింది. దీంతో పాక్ సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగి, బీఎల్ఏ దాడుల్ని తిప్పికొట్టారు. అయితే, బలూచ్ నేతలే ఇమ్రాన్ను హత్య చేశారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా, పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో కొన్నేళ్లుగా తిరుగుబాటు ఉద్యమం నడుస్తోంది. పాకిస్తాన్ నుంచి వేరుపడాలని కోరుతూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దళాలలకు, బీఎల్ఏకు మధ్య నిరంతరం ఘర్షణ కొనసాగుతూనే ఉంది.Dera Ismail Khan: Shaheed Lieutenant Colonel Imran Dayal was laid to rest in his ancestral village with full military honors.The funeral prayers were attended by GOC 40 Division, Major General Mudassar, who presented the national flag, which was received by the martyr’s son pic.twitter.com/ggnjdcuIuf— Makhdoom Shahab-ud-Din (@ShahabSpeaks) January 30, 2026 -
"పీవోకే" అధ్యక్షుడి మృతి
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు సుల్తాన్ మహమ్ముద్ చౌదరి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇస్లామాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించినట్లు పాకిస్థాన్ ప్రకటించింది.పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకుడిగా ఉన్న సుల్తాన్ మహమ్ముద్ చౌదరి 2021లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న మహమ్మద్ చౌదరి శనివారం చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతిపట్ల పాక్ అధ్యక్షుడు ఆసిప్ ఆలీ జర్దారీ సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్కు ప్రత్యేకంగా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి ఉన్నప్పటికీ రక్షణ, విదేశాంగం, కరెన్సీ, కీలక విధానాలు అన్నీ పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంటాయి. ఆ దేశంలోని కశ్మీర్ అపైర్స్ అనే మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. -
పాకిస్తాన్దే సిరీస్
లాహోర్: ఐసీసీ టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ జట్టు ఆ్రస్టేలియాపై సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో పాకిస్తాన్ 90 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను చిత్తు చేసింది. మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సల్మాన్ ఆగా (76; 8 ఫోర్లు, 4 సిక్స్లు), ఉస్మాన్ ఖాన్ (53; 4 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 15.4 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలినవాళ్లు ప్రభావం చూపలేక పోయారు. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
భారత్ x పాకిస్తాన్
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్లో యువ భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్లో చోటు దక్కించుకునేందుకు ఆదివారం ‘సూపర్ సిక్స్’ గ్రూప్–2లో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఆడిన అన్నీ మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా కొనసాగుతున్న ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు... చిరకాల ప్రత్యర్థిపై కూడా అదే జోరు కొనసాగిస్తూ సెమీఫైనల్కు చేరాలని భావిస్తోంది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు... ఆరో సారి వరల్డ్కప్ చేజిక్కించుకునే దిశగా మరో ముందడుగు వేయాలని చూస్తోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో అమెరికాపై ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై విజయాలు సాధించిన యువభారత్... సూపర్ సిక్స్ తొలి మ్యాచ్లో జింబాబ్వేపై గెలిచింది. ఇప్పుడు పాక్పై కూడా నెగ్గితే గ్రూప్–2 నుంచి నేరుగా సెమీఫైనల్కు చేరనుంది. ఓడినా భారత జట్టుకు అవకాశాలు ఉన్నాయి. గ్రూప్లో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్... భారత జట్టుపై భారీ తేడాతో గెలిస్తే తప్ప సెమీస్ చేరడం కష్టమే. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, ఆయుశ్ మాత్రే, వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందుతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో అంబరీశ్, ఉధవ్ మోహన్, హెనిల్ పటేల్ కీలకం కానున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఫుల్ఫామ్లో ఉన్నాడు. ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టుపై భారీ సెంచరీతో మ్యాచ్ను లాగేసుకున్న అతడిని త్వరగా పెవిలియన్కు పంపాల్సిన అవసరముంది. -
పాక్లో విమానాశ్రయాల వేలం.. కారణం అదే?
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలలోని అంతర్జాతీయ ఎయిర్పోర్టులను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా వేలం వేయనున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న బహుళజాతి కంపెనీలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చని ప్రకటించింది.ఇటీవల యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్లో ఆకస్మిక పర్యటన చేశారు. అనంతరం కొద్దిరోజులకే ఆయన పాకిస్థాన్లోని కరాచీ ఎయిర్పోర్టు నిర్వహించే బాధ్యతనుంచి యూఏఈ తప్పుకుంటుందని ప్రకటించారు. ఈ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణకు బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, కరాచీ, లాహెర్ విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. గతంలో ఇస్లామాబాద్ విమానాశ్రయం నిర్వహణను ప్రభుత్వమే నిర్వహించాలని భావించినా ప్రస్తుతం ఆ ఆలోచన నుంచి విరమించుకున్నట్లు తెలిపారు.దీనికోసం దేశీయ సంస్థలతో పాటు ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సంస్థలు సైతం బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు. విమానాశ్రయాల కార్యకలాపాల సామర్థ్యాలను పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర కారణాల రీత్యా వీటికి బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ బిడ్డింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని పేర్కొన్నారు.కాగా ఈ విషయంలో యుఏఈ టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన సంస్థలతో సానుకూల చర్చలు జరిగాయని అయితే ఇస్లామాబాద్ విమానాశ్రయాన్ని యుఏఈకి లీజ్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలు అసత్యమని పాక్ తెలిపింది. అటువంటి ఒప్పందాలు ఏవి జరగలేదని పేర్కొంది. -
పాక్లో 70 మంది మిలిటెంట్లు మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్లో భద్రతా బలగాలు, మిలిటెంట్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో కనీసం 70 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరితో పాటు 10 మంది భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్లో ఆర్మీకి, బలుచిస్థాన్ తిరుగుబాటు దారులకు మధ్య పెద్దఎత్తున కాల్పులు జరిగాయి. బలుచిస్థాన్ ప్రాంతంలోని 12 ప్రాంతాలలో ఆ దేశ భద్రత బలగాలు, పోలీసులు స్థావరాలే టార్గెట్గా ఈ దాడులు జరిగాయి. శుక్రవారం రాత్రి మెుదలైన ఈ కాల్పులు శనివారం ఉదయం వరకూ సాగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులలో 70 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లు ప్రాణాలు వదలగా, 10 మంది వరకూ సైనికులు మృతి చెందినట్లు బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.బలూచిస్థాన్ ప్రాంతంలోని క్వెట్టా, మక్రాన్, హబ్, చమన్, నసీరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలలో ఈ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండడంతో ముష్కరుల దాడిని అప్రమత్తంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. నసీరాబాద్ జిల్లాలో ముష్కరులు రైల్వేట్రాక్పై బాంబు అమర్చగా దానిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. అయితే భద్రతా బలగాలు జరిగిన దాడిలో ఇదివరకూ 70 మంది ఉగ్రవాదులు మరణించారని మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. -
ఆ టైంలో మేమిద్దరం సిగ్గుతో తలదించుకునేవాళ్లం
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్నిచోట్లా అప్పుల కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో సొంత పౌరులే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నా.. ఏనాడూ ఆ దేశ ప్రభుత్వం స్పందించింది లేదు. తాజాగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ విషయాన్ని అంగీకరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇస్లామాబాద్లో జరిగిన బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో కలిసి నేను రహస్యంగా చాలా దేశాల వద్దకు వెళ్లి అప్పులు అడిగాం. ఆ సమయంలో మాకు చాలా సిగ్గుగా అనిపించి తలలు దించుకునేవాళ్లం. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండు చేసినా సరే.. అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుంది’ అంటూ షరీఫ్ ప్రసంగించారు. అయితే..రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు పాక్ను నిరాశ పరచలేదని షరీఫ్ చెప్పుకొచ్చారు. పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, చైనా.. ఇలా మిత్ర దేశాలన్నింటికీ కృతజ్ఞతలు చెప్పారాయన. అదే సమయంలో.. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మిత్ర దేశాల నుంచి అప్పులు కోరడంపై పాక్ ప్రధాని నిరాశ వ్యక్తంచేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో సౌదీ ఆరేబియా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ.. మరిన్ని రుణాలు అడగడం తనను ఇబ్బంది పెట్టిందన్నారు. ఇదిలా ఉంటే.. పాక్కు ఆర్థికసాయం అందించిన దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.ఇదీ చదవండి: వాళ్లంతా బిచ్చగాళ్లే.. పాక్ పరువు పోయిందిగా! -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్వీఓ అంటే..?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రమాదకరమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని, అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చికత్స తీసకుంటున్నట్లు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. పైగా ఇమ్రాన్ ఎదుర్కొంటుంది ప్రమాదకరమైన కంటి వ్యాధి అని, సకాలంలో వైద్యం అందించకపోతే కంటి చూపే పోయే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. అసలు ఇమ్రాన్కు వచ్చిన తీవ్రమైన కంటి వ్యాధి ఏంటి..ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి తెలుసుకుందామా..!.రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ని అక్కడ వైద్యులు పరీక్షించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖాన్కు రెటీనా సిర మూసివేత(రెటీనా నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే చిన్న సిరలు మూసివేత) ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలిందని అధికారులు తెలిపారు. ఆయన్ను ప్రభుత్వాస్పత్రికి తరలించి ఓ 20 నిమిషాల పాటు చికిత్స అందించి తిరిగి జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు కూడా. ఇంతకీ అసలేంటి రెటీనా సిర మూసుకుపోవడం..రెటీనా సిర మూసుకుపోవడం అంటే..రెటీనా సిర మూసుకుపోవడం లేదా ఆవీఓ అనేది రెటీనా నుంచి రక్తాన్ని బయటకు పంపే సిరలో పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుపడటం. దీని వల్ల కంటి వెనుక భాగంలో ఉన్న కణజాల పొర, కాంతిని మనం చూడగలిగే చిత్రాలలోకి అనువదిస్తుంది.రెటీనా సిరలో అడ్డంకి రెటీనా నుంచి రక్తం బయటకు రాకుండా నిరోధిస్తుంది.దాంతో కంటిలో ఒత్తిడి పెరిగి వాపు వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఫలితం దృష్టి సమస్యలు లేదా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. రోగి కంటి పరిస్థితి దృష్ట్యా ఇంజెక్షన్ల ద్వారా చికిత్స నుంచి శస్త్రచికిత్స వరకు ఏదైనా చేయాల్సి ఉంటుంది. అదంతా రోగి కంటి సమస్యపై ఆధారపడి ఉంటుందట. ఈ పరిస్థితి ఎందువల్ల అంటే..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన అధ్యయనాలు ప్రకారం..ఈ పరిస్థితి రెటీనా సిర ద్వారా సాధారణ రక్త ప్రవాహానికి అంతరాయం వల్ల సంభవిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.కారణాలు..రక్తం గడ్డకట్టడంరక్త ప్రవాహం మందగించడంరెటీనా సిర, రెటీనా ధమనితో కలిసే చోట కుంచించుకుపోవడం.ఇది ఎక్కువగా 40 ఏళ్లు పైబడిన యువకులలో, ముఖ్యంగా డయాబెటిస్, గ్లాకోమా లేదా అధిక రక్తపోటు వంటి కొన్ని వైద్య పరిస్థితులు ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువ.రెటీనా సిర మూసుకుపోవడంలో సంకేతాలు, లక్షణాలుఅస్పష్టమైన దృష్టి లేదా దృష్టి నష్టంనల్ల మచ్చలు లేదా గీతలుకంటిలో నొప్పి, ఒత్తిడిఎలా నిర్ధారిస్తారు..కంటి సంరక్షణ నిపుణులు కంటి పరీక్ష, రెటీనా ఇమేజింగ్ పరీక్షల ద్వారా కనుపాపలను విస్తరించి ఆవీఓని నిర్ధారిస్తారు. చికిత్స..రెటీనా సిరలో అడ్డంకిని తిప్పికొట్టడానికి లేదా నయం చేయడానికి ప్రస్తుతం ఎటువంటి మార్గం లేదు. కానీ కంటి సంరక్షణ నిపుణులు యాంటీ-VEGF ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్యాన్రెటినల్ ఫోటోకోగ్యులేషన్తో రెటీనా సిర మూసుకుపోవడం వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు లేదా చికిత్స చేయవచ్చు.రెటీనా సిర మూసుకుపోయే ప్రమాదాన్ని నివారించడానికి మొదటి సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం. ఈ సమస్య బారినపడకూడదంటే..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువుని నిర్వహించడం వంటివి చేయాలి. అలాగే ధూమపానం, పొగాకు వంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులును సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అడవి బిడ్డలే ఆరాధ్య దైవాలై..) -
ఈయూతో భారత్ దోస్తీ.. పాకిస్తాన్కు కొత్త టెన్షన్!
ఇస్లామాబాద్: భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం కారణంగా దాయాది దేశం పాకిస్తాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. భారత్, ఈయూ ఒప్పందం పాకిస్తాన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆ దేశ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, యూరోపియన్ యూనియన్కు పాకిస్తాన్ భారీ మొత్తంలో ఎగుమతులు చేస్తోంది. ఈ క్రమంలో వాణిజ్యం విషయంలో 2014లో పాకిస్తాన్కు ఈయూ ‘జీఎస్పీ+’ హోదాను కూడా ఇచ్చింది. దీని కింద రాయితీ సుంకాల కారణంగా ఐరోపాకు పాకిస్తాన్ టెక్స్టైల్స్ ఎగుమతులు 108 శాతం పెరిగాయి. రెండు పక్షాల మధ్య వాణిజ్య విలువ 12 బిలియన్ యూరోలకు చేరువైంది. అయితే, ఈ హోదా గడువు వచ్చే ఏడాది డిసెంబరుతో ముగియనుంది. ఇలాంటి సమయంలో భారత్, ఈయూ మధ్య ఇటీవలే వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కారణంగా తమ ఎగుమతులపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈయూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా తాహిర్ అంద్రాబీ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత్-ఈయూ ఒప్పందం గురించి మాకు తెలిసింది. అందులోని అంశాలను గమనిస్తున్నాం. ఇప్పటి వరకు ఈయూకి పాకిస్తాన్ భారీగా ఎగుమతులు చేస్తోంది. జీఎస్పీ+ స్కీం.. ఈయూతో ద్వైపాక్షిక సహకారానికి విజయవంతమైన నమూనాగా నిరూపితమైంది. ఈ ఒప్పందం ద్వారా పాక్ నుంచి ఈయూ దేశాలకు టెక్స్టైల్స్ ఎగుమతులు అక్కడి మార్కెట్ అవసరాలను సరసమైన ధరల్లోనే తీరుస్తున్నాయి. గత ఏడాది తమ మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల సందర్భంగా జీఎస్పీ+ అంశం చర్చకు వచ్చింది. ఈయూతో దీర్ఘకాలంగా ఉన్న స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకర సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు’ తెలిపారు.భారత్, ఈయూ డీల్.. ఇదిలా ఉండగా.. భారత్, ఈయూ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈయూ నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఆంటోనియో కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతోపాటు భద్రత, రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలూ కుదిరాయి. ఎఫ్టీఏపై చర్చలతో ప్రారంభించి మొత్తం 13 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కారణంగా ఐరోపా కార్లు, మద్యం భారత్లో చౌకగా లభించనున్నాయి. భారతీయ రైతులు, చిన్న పరిశ్రమలవారి ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ జీడీపీలో 25శాతానికి, వాణిజ్యంలో మూడో వంతుకు ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహించనుంది. ఎఫ్టీఏతో ఈయూ దేశాలకు భారత్ చేసే 99శాతానికిపైగా ఎగుమతులపై సుంకాలు తగ్గుతాయి. అలాగే ఈయూ భారత్కు చేసే 97శాతం ఎగుమతులపై సుంకాలు దిగివస్తాయి. భారత్ నుంచి ఎగుమతి చేసే టెక్స్టైల్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్త కళలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చే మద్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు తదితరాలపై సుంకాలు తగ్గుతాయి. -
ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్
గత కొంతకాలంగా ఇంటా-బయటా.. ఆ ఫార్మాట్-ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జట్టుకు టీ20 ప్రపంచకప్కు ముందు, స్వదేశంలో ఊరట కలిగించే విజయం లభించింది. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి, వన్డే ప్రపంచ ఛాంపియన్లైన ఆస్ట్రేలియన్లను చిత్తు చేశారు. 169 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని ప్రపంచకప్కు ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నారు. ఈ మ్యాచ్లో ఆసీస్ తమ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ లేకుండా ట్రవిస్ హెడ్ నాయకత్వంలో బరిలోకి దిగింది. మిచెల్ లేని లేటు ఆసీస్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. వ్యూహ్యాల అమలు దగ్గరి నుంచి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మిచెల్ లేని ఆసీస్ సాధారణ జట్టులా కనిపించింది. ఈ గెలుపులో పాక్ బౌలర్ల గొప్పతనం పెద్దగా లేకపోయినా, ఆసీస్ బ్యాటర్ల డొల్లతనం స్పష్టంగా తెలిసింది. బౌలింగ్లో ఆడమ్ జంపా నైపుణ్యం వల్ల పాక్ను తక్కువ స్కోర్కే పరిమితం చేయగలిగినా, దాన్ని ఛేదించడంలో మాత్రం ఆసీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఫలితం మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్కు తొలి బంతికే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ను జేవియర్ బార్ట్లెట్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అయితే ఆతర్వాత పాక్ కుదురుకుంది. మరో ఓపెనర్ సైమ్ అయూబ్ (40), వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ అఘా (39) బాధ్యతాయుతంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అయూబ్ ఔటయ్యాక బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (24) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, ఈసారి కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన ఫకర్ జమాన్ (16 బంతుల్లో 10) జిడ్డుగా ఆడి పాక్ భారీ స్కోర్ చేయకపోవడానికి అడ్డు గోడ అయ్యాడు. చివర్లో ఉస్మాన్ ఖాన్ (18), మహ్మద్ నవాజ్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేసినా కుదర్లేదు. ఆడమ్ జంపా (4-0-24-4) పాక్ ఆటగాళ్ల పాలిట కొరకరాని కొయ్యలా మారగా.. బార్ట్లెట్ (4-0-26-2), బియర్డ్మన్ (4-0-33-2) పాక్ ఆటగాళ్ల పప్పులు ఉడకనివ్వలేదు. చివరి ఓవర్లో బియర్డ్మన్ రెండు వికెట్లు తీసి పాక్ను 168 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమిమతమయ్యేలా చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. ఆతర్వాత ట్రవిస్ హెడ్ (23), గ్రీన్ (36) కాసేపు మెరుపులు మెరిపించినా, దాన్ని కొనసాగించలేకపోయారు. వీరద్దరు ఔటయ్యాక ఆసీస్ ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో బార్ట్లెట్ (34 నాటౌట్) బ్యాట్ ఝులిపించినా, అప్పటికే ఆసీస్ ఓటమి ఖరారైపోయింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు. మొత్తంగా పాక్ స్పిన్నర్లు ఆసీస్ ఆటగాళ్లను విజయవంతంగా కట్టడి చేసి, సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లారు. రెండో టీ20 ఇదే లాహోర్ వేదికగా జనవరి 31న జరుగనుంది. -
సొంత ప్రజల్నే ఫూల్స్ చేసిన పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనడం ఖరారైంది. మొహిసిన్ నఖ్వీ నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచకప్లో పాల్గొనే తమ జట్టు కోసం కొలొంబోకు (పాక్ తమ ప్రపంచకప్ మ్యాచ్లు ఇక్కడే ఆడుతుంది) విమానం టికెట్లు బుక్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకొని పాక్ డ్రామాలు ఆడుతుంది.ప్రపంచకప్లో పాల్గొనే అంశంపై తమ ప్రధాని ఫిబ్రవరి 2ను డెడ్లైన్గా విధించాడని మొహిసిన్ సొంత ప్రజల్నే ఫూల్స్ చేశాడు. పైకి డ్రామాలు ఆడుతూ, లోలోపల ప్రపంచకప్ బరిలోకి దిగేందుకు అన్నీ సిద్దం చేశాడు. పాక్ జట్టు ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో కలిసి (మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత) ప్రపంచకప్ కోసం కొలొంబోకు ప్రయాణించనుంది. ఈ విషయాన్ని టెలికామ్ ఏషియా బ్రేక్ చేసింది. ఇది తెలిసి పాక్ ప్రజలు నఖ్వీపై ఫైరవుతున్నారు.ప్రపంచకప్లో పాల్గొనే అంశం ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీస్తున్నారు. దీనికి ప్రధాని డెడ్లైన్ విధించారని ఎందుకు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెట్కు నఖ్వీ వల్లే సగం దరిద్రం పట్టిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.కాగా, పాక్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకున్నా, భారత్తో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. నఖ్వీ కదలికలు చూస్తే భారత్తో మ్యాచ్ బహిష్కరణపై సందేహాలు కలుగుతున్నాయి. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీమిండియాతో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలన్నది పాక్ వ్యూహంగా తెలుస్తుంది. ఇలా చేసి ఐసీసీ శిక్షల నుంచి తప్పించుకోవాలని పీసీబీ వ్యూహాలు రచిస్తున్నట్లు ఎన్డీటీవీ నివేదిక తెలిపింది. ఇదే జరిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భారత్-బంగ్లాదేశ్ మధ్య పేచీలో పాక్ ఎంటరై బంగ్లాదేశ్కు వత్తాసు పాడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. తదనంతరం పరిణామాల్లో పాక్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. తీరా చూస్తే పాక్ ప్రపంచకప్లో పాల్గొనేందుకు కొలొంబోకు టికెట్లు బుక్ చేసుకొని సొంత ప్రజల్నే ఫూల్స్ చేసింది. -
ఇమ్రాన్ ఖాన్ కండిషన్ సీరియస్?!
క్రికెట్ దిగ్గజం, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి ఏమైంది? అనే అంశంపై మరోసారి తెర మీదకు వచ్చింది. అవినీతి కేసుల్లో ఆయన్ని రావల్పిండి(పంజాబ్) అడియాలా జైల్లో పెట్టి పాక్ ప్రభుత్వం.. జైల్లో ఆయన పట్ల దారుణంగా వ్యహరిస్తోందన్న విమర్శలు వెల్లవెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందంటూ తాజాగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. దీంతో ఖాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబం, పీటీఐ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అడియాలా జైలులో ఖైదీగా ఉన్న ఖాన్కు కంటి సమస్య (Central Retinal Vein Occlusion) తలెత్తిందని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యాధికి తక్షణ చికిత్స లేకపోతే శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయమై తక్షణమే కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నారు.అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో 2023 ఆగస్టులో ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి అడియాలా జైల్లోనే ఉన్నారు. అయితే.. ఆయన్ని ఒంటరిగా సెల్లో ఉంచారని.. తోటి ఖైదీలు, జైలు సిబ్బందిని ఆయనతో మాట్లాడనివ్వడం లేదని.. పైగా ఆయన ఉన్న గది, చుట్టుపక్కల పరిసరాలు కలుషితంగా ఉన్నాయని.. రోజులో కనీసం పట్టుమని పది అడుగులు కూడా వేయని స్థితిలో ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ పోస్ట్ చేశారాయన. అప్పటి నుంచి 100 రోజులకుపైగా ఆయన్ని ములాఖత్కు కూడా అనుమతించలేదు. దీంతో జైల్లో ఆయనకు ఏదైనా జరిగిందా? అనే చర్చా నడిచింది కూడా. చివరకు.. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో కుటుంబ సభ్యులను ఆయన్ని కలిసేందుకు అనుమతించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కథనాలతో అడియాలా జైలు అధికారులు స్పందించారు. ఆయనకు జైల్లోనే చికిత్స అందిస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఖాన్ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వైద్యుల సూచనకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు. జైల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని.. అక్కడ ప్రాథమిక చికిత్స కూడా అందడం కష్టమని.. తక్షణమే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిందేని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమను ఆయన్ని కలిసేందుకు అనుమతించాలని కోరుతున్నారు. అయితే ఈ విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా స్పందించలేదని సమాచారం. కోర్టు ఆదేశాలు బేతాఖరుఖాన్ చివరిసారిగా తన వ్యక్తిగత వైద్యుడిని 2024 అక్టోబరులో కలిశారు. అప్పటి నుంచి ఎలాంటి వైద్య పరీక్షలు జరగలేదని, ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడంలేదని పీటీఐ విమర్శిస్తోంది. అలాగే 2025 ఆగస్టు నుంచి పెండింగ్లో ఉన్న పిటిషన్పై కూడా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖాన్ సోదరీమణులు అడియాలా జైలు బయట పీటీఐ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఖాన్ సోదరి నూరీన్ ఖానుమ్ మాట్లాడుతూ.. ఆయన అనారోగ్యం వార్తలు నిజమైతే మాకు ముందే సమాచారం ఇవ్వాలి కదా. మేమే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేవాళ్లం కదా అని అన్నారు. మరో సోదరి అలీమా ఖానుమ్ మాట్లాడుతూ.. జైలు అధికారులు తమకుగానీ, లీగల్ టీంకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా వాళ్లిద్దరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈ పరిణామాలపై ప్రతిపక్ష కూటమి తహఫుజ్ ఆయిన్-ఇ-పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని షెహబాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.విచారణ ఎప్పుడంటే..ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. పీటీఐ నాయకులు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో ములాఖత్ను అనుమతించాలని కోరుతున్నారు. పార్టీ చైర్మన్ బరిస్టర్ గోహర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఖైదీని కలవడం ఒక చట్టబద్ధమైన హక్కు, ఖాన్తో పాటు ఆయన సతీమణి బుష్రా బీబీ ఆరోగ్యం కూడా బాగోలేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని పీటీఐ కోరగా.. రేపు లేదంటే ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. -
పాక్లో "లవు"ని ఆలయం పునఃప్రారంభం
పాకిస్థాన్లోని సాంస్కృతిక వారసత్వ కట్టడాల పరిరక్షణకు అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అక్కడి లాహెర్కోట లోని శ్రీ రామచంద్రుడి కుమారుడి లోహ్ ఆలయాన్ని పునరుద్ధరించి భక్తుల సందర్శనార్థం పున:ప్రారంభించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు.పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్ కోటలో చారిత్రక లోహ్ మందిరాన్ని వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA), ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ – పాకిస్థాన్ సహకారంతో పునరుద్ధరించారు. ఈ దేవాలయం శ్రీరాముడి ఇద్దరు కుమారుల్లో ఒకరైన లవుడికి సంబంధించిందిగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి 2018లో కొంతమేర మరమ్మత్తులు జరుపగా ఇప్పుడు పూర్తిస్తాయిలో పునరుద్ధరించారు.అయితే హిందూ సంప్రదాయం ప్రకారం, లాహోర్ నగరానికి లవుడి పేరు మీద ఆ పేరు వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు. చారిత్రక లాహోర్ కోటలో కనిపించే సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు హిందూ దేవాలయాలు, సిక్కులకు చెందిన నిర్మాణాలు, మొఘల్ మసీదులు, బ్రిటిష్ కాలపు కట్టడాలు—ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇటీవల లాహెర్ కోటను పర్యవేక్షించిన ఓ సిక్కు ట్రావెలర్ సిక్కుల పాలన కాలంలో లాహోర్ కోటలో సంరక్షించబడిన సుమారు 100 చారిత్రక స్మారక కట్టడాలను గుర్తించారు. దీంతో లాహోర్ కోటకు సిక్కు సామ్రాజ్య కాలంలో ఉన్న చారిత్రక విలువను సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA) అమెరికాకు చెందిన సిక్కు పరిశోధకుడు డా. తరుంజీత్ సింగ్ బుటాలియాను నియమించి “Lahore Fort during the Sikh Empire” అనే పేరుతో ఒక టూర్ గైడ్ పుస్తకాన్ని రచించారు. -
సరిహద్దుల్లో కలకలం: ‘ఈ-మిత్ర’ ముసుగులో..
జైసల్మేర్: రాజస్థాన్ సరిహద్దు జిల్లా జైసల్మేర్లో పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తరపున పనిచేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జనవరి 25 అర్థరాత్రి సమయంలో నెహదాన్ గ్రామంలోని నిందితుడి నివాసానికి చేరుకున్న భద్రతా బృందం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.అదుపులోకి తీసుకున్న వ్యక్తిని జబరరామ్ మేఘవాల్గా అధికారులు గుర్తించారు. నిందితుడు గత నాలుగేళ్లుగా సరిహద్దు ప్రాంతంలో ‘ఈ-మిత్ర’ (ఆన్లైన్ సర్వీస్) కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ముసుగులో అతను పాకిస్తాన్కు చెందిన ఒక మహిళా హ్యాండ్లర్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. అతనికి వ్యాపార రీత్యా ప్రభుత్వ పథకాలు, కీలక పత్రాలకు సంబంధించిన వివరాలు ఉండటంతో, అతను ఈ సమాచారాన్ని పొరుగు దేశానికి చేరవేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.సీఐడీ (ఇంటెలిజెన్స్) బృందాలు మేఘవాల్ను తదుపరి విచారణ కోసం జైపూర్కు తరలించాయి. నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, కంప్యూటర్ సిస్టమ్లను అధికారులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. మేఘవాల్ గత నాలుగేళ్లుగా ఆ గ్రామంలో ‘ఈ-మిత్ర’ కేంద్రం నడుపుతున్నాడని, ఈ నేపధ్యంలో ఏయే డేటాను విదేశీ శక్తులకు చేరవేశాడనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.సోషల్ మీడియా సాయంతో పాక్ హ్యాండ్లర్తో పరిచయం ఏర్పడిన నిందితుడు ‘హనీట్రాప్’కు గురై ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. మేఘవాల్ కేవలం డబ్బు కోసమే ఈ పనిచేశాడా లేక ఎవరి ఒత్తిడికైనా లొంగి గూఢచర్యానికి పాల్పడ్డాడా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఉదంతంపై భద్రతా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇది కూడా చదవండి: ‘పాక్’ కట్టుకథలపై ‘సమితి’లో ఉరిమిన భారత్ -
‘పాక్’ కట్టుకథలపై ‘సమితి’లో ఉరిమిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ చేసిన తప్పుడు వ్యాఖ్యలపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఏడాది జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’పై పాక్ ప్రతినిధి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతదేశాన్ని, భారత ప్రజలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా పాకిస్తాన్ పనిచేస్తోందని, అంతర్జాతీయ వేదికలపై స్వార్థపూరిత కథనాలను అల్లుతోందని హరీష్ పేర్కొన్నారు. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు ఇస్లామాబాద్కు లేదని పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. 2025, మే 7న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యాన్ని హరీష్ వివరిస్తూ.. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడికి సమాధానంగానే ఈ చర్య తీసుకున్నట్లు హరీష్ గుర్తుచేశారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి, సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. #WATCH | Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish, says, "I now respond to the comments of the representative of Pakistan, an elected member of the Security Council, which has a single-point agenda to harm my country and my people. He has… pic.twitter.com/I8pX4tt1zl— ANI (@ANI) January 27, 2026అనంతరం భారత సైనిక శక్తికి భయపడి మే 10న నేరుగా పాకిస్తాన్.. భారత్కు ఫోన్ చేసి, యుద్ధాన్ని ఆపాలని వేడుకుందని హరీష్ తెలిపారు. సింధు జలాల ఒప్పందం గురించి ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల క్రితం భారత్ ఈ ఒప్పందాన్ని సద్భావనతో కుదుర్చుకుందని, అయితే పాకిస్తాన్.. మూడు యుద్ధాలతో పాటు, లెక్కలేనన్ని ఉగ్రదాడులతో ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కిందని హరీష్ విమర్శించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా వేలమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ తన తీరు మార్చుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించిందని ఆయన తెలిపారు.ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన గురించి మాట్లాడే ముందు పాకిస్తాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత రాయబారి చురకలంటించారు. పాక్ సైన్యం రాజ్యాంగ విరుద్ధంగా 27వ సవరణ ద్వారా ఎలా తిరుగుబాటు చేసిందో, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు జీవితకాల రక్షణ ఎలా కల్పించిందో గుర్తెరగాలని హరీష్ అన్నారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని పునరుద్ఘాటిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితిని వేదికగా వాడుకోవద్దని ఆయన పాకిస్తాన్ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: కొండపై ‘మ్యాగీ’ అమ్మితే.. ఇంత భారీ లాభమా? -
టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్ నఖ్వీ ట్వీట్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026లో దాయాది పాకిస్తాన్ పాల్గొనడంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐసీసీకి ధిక్కారస్వరం వినిపించి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ బాటలోనే పాక్ కూడా నడుస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, దేశ ప్రధాని అనుమతి లభించాకే తుది నిర్ణయం వెలువడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో నఖ్వీ ఇవాళ (జనవరి 26) వారి ప్రధాని షహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను అతను ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే నఖ్వీ చేసిన ఈ ట్వీట్లో ఓ పెద్ద తప్పిందం దొర్లడం, ప్రస్తుతం కలకలం రేపుతుంది. నఖ్వీ తన ట్వీట్లో ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరుకు బదులు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించాడు. నఖ్వీ చేసిన ఈ తప్పిదం వివాదాస్పదంగా మారింది.ఇంతకీ నఖ్వీ చేసిన ట్వీట్లో ఏముందంటే.. ప్రధానమంత్రి మియాన్ మహ్మద్ నవాజ్ షరీఫ్తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై వారికి వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు.దేశ అధ్యక్షుడి పేరు తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ ట్వీట్తో టీ20 వరల్డ్కప్లో పాక్ పాల్గొనడంపై త్వరలో స్పష్టత రాబోతోందన్న విషయంపై సంకేతాలు వెలువడ్డాయి. పాక్ ప్రభుత్వం సూచనప్రాయంగా పాక్ జట్టు ప్రపంచకప్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో పాక్ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతుంది.వివాదం ఎలా మొదలైందంటే..? బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్లో తమ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడబోమని మొండిపట్టు పట్టింది. ఈమేరకు ఐసీసీకి పలు మార్లు విజ్ఞప్తి చేసింది.బీసీబీ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐసీసీ భద్రతా బృందం భారత్లో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అయినా మొండిపట్టు వీడని బీసీబీ, చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. దీంతో స్కాట్లాండ్ బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఓ దశలో బంగ్లా బాటలోనే తాము కూడా నడుస్తామని చెప్పింది. చివరికి సమస్య పెద్దదిగా మారుతుండటంతో పీసీబీ బంగ్లాదేశ్ను మధ్యలోనే వదిలేసి యూటర్న్ తీసుకుంది. -
హరీస్ రవూఫ్పై వేటు
లాహోర్: వచ్చే నెలలో భారత్–శ్రీలంక వేదికగా జరిగే పురుషుల టి20 ప్రపంచకప్లో పాల్గొనే పాకిస్టాన్ జట్టును ఆదివారం ప్రకటించారు. 15 మంది సభ్యుల పాక్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘా నాయకత్వం వహిస్తాడు. గతేడాది ఆసియా కప్ ఫైనల్ ఆడిన పేసర్ హరీస్ రవూఫ్పై సెలక్టర్లు వేటు వేయడం గమనార్హం. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన బిగ్బాష్ టి20 లీగ్లో హరీస్ రవూఫ్ 20 వికెట్లతో లీగ్ ‘టాపర్’గా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (94 మ్యాచ్ల్లో 133 వికెట్లు) తీసిన పాక్ బౌలర్గానూ గుర్తింపు పొందాడు. ‘పాక్ తరఫున రవూఫ్ చాలా క్రికెట్ ఆడాడు. శ్రీలంకలో పిచ్ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేశాం’ అని వివరించాడు. మెగా టోర్నీలో ఆడటం, ఆడకపోవడం అనేది పాక్ ప్రభుత్వం చూసుకుంటుందని జావేద్ అన్నాడు. బంగ్లాదేశ్ను ప్రపంచకప్ నుంచి తప్పించగానే పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ తమ దేశ ప్రధానమంత్రి అదేశాల మేరకే నడుచుకుంటామని, ఐసీసీ ప్రకారం కాదని చెప్పారు. పాక్ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఈ మెగా ఈవెంట్లో పాక్ ఆడుతుందని నఖ్వీ తెలిపారు. ఆతిథ్య భారత్ ఉన్న గ్రూప్ ‘ఎ’లో పాకిస్తాన్ ఉంది. ఇందులో నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా ఇతర జట్లు. వచ్చేనెల 7 నుంచి జరిగే ప్రపంచకప్లో పాక్, నెదర్లాండ్స్ల మధ్యే తొలి మ్యాచ్ జరుగనుంది. పాకిస్తాన్ టి20 జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్ ), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నాఫే, మొహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీఖ్. -
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
-
టీ20 వరల్డ్కప్కు పాక్ జట్టు ప్రకటన.. కీలక మార్పులు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనడంపై ఆనిశ్చితి కొనసాగుతుండగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జనవరి 25) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది ఆసియా కప్ జట్టులో లేని బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు తిరిగి రావడం పాకిస్తాన్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కెప్టెన్గా సల్మాన్ అలీ అఘా కొనసాగుతుండగా.. పలువుర స్టార్ ఆటగాళ్లపై వేటు పడింది. హరీస్ రౌఫ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, హసన్ అలీ, హుస్సైన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హరీస్, సుఫియాన్ ముఖీమ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ తారిక్ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టు..సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (wk), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (wk), ఉస్మాన్ తారిక్మా పని మేము చేశాం.. మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుంది..!ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, పాక్ టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రపంచకప్లో పాల్గొనబోమని పాక్ సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పీసీబీ, పాక్ జట్టు హెడ్ కోచ్ గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నారు. “మేము సెలెక్టర్లం. మా పని జట్టును ఎంపిక చేయడం. పాల్గొనడం ప్రభుత్వ నిర్ణయం” అని సెలెక్టర్లు అన్నారు.నెదర్లాండ్స్తో ఢీఅన్నీ కుదిరితే పాక్ ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్తో మ్యాచ్తో తమ వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దీనికి ముందు పాక్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.ఇదిలా ఉంటే, భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడేందుకు భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని పీసీబీ చీఫ్ నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.తదనంతర పరిణామాల్లో.. టీ20 వరల్డ్కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.నేపథ్యంభారత్-బంగ్లాదేశ్ మధ్య పంచాయితీ (బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు, తదనంతర పరిణామాల్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ను ఐపీఎల్ నుంచి తొలగించడం) నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకొని ఓవరాక్షన్ చేస్తుంది. -
టీ20 వరల్డ్కప్ నుంచి పాకిస్తాన్ కూడా ఔట్?
అంతా ఊహించిందే జరిగింది. టీ20 వరల్డ్కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.పొట్టి ప్రపంచకప్ను బహిష్కరించే అవకాశం ఉందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చాడు. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మాట్లాడిన తర్వాత టీ20 ప్రపంచ కప్లో పాల్గొనడంపై పీసీబీ నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ తెలిపాడు. బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని నఖ్వీ ఆరోపించాడు.కాగా భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్లు ఆడేందుకు భారత్కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
పాక్లో ఘోరం.. ఒకే కుటుంబంలోని 9 మంది సజీవ సమాధి
పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తోంది. ఖైబర్ ప్రావిన్స్లో మంచు చరియలు విరిగి ఓ ఇంటిపై పడటంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సజీవ సమాధి అయ్యారు. ఘటన నుంచి ఒక్క బాలుడు మాత్రమే గాయాలతో తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు.చిత్రాల్ జిల్లా దామిల్ ప్రాంతంలోని సెరిగాల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుందన్నారు. ఆ ప్రాంతంలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని అధికారులు తెలిపారు. పెద్ద మంచు పలక దిగువకు జారుతూ వచ్చి పర్వతప్రాంతంలోని వీరున్న నివాసంపై పడిందని చెప్పారు.మృతదేహాలను వెలికి తీశామని, ప్రాణాలతో ఉన్న 9 ఏళ్ల బాలుడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చామన్నారు. ఖైబర్తోపాటు బలూచిస్తాన్, బల్టిస్తాన్ పీవోకేల్లో దట్టమైన మంచు కారణంగా జనజీవనం స్తంభించింది. ఉష్ణోగత్రులు కొన్ని చోట్ల మైనస్ 20 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. మంచు కారణంగా రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
పాకిస్తాన్ దరిద్రం.. పాత ఫోన్లూ కొనలేక అవస్థలు
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో అక్కడి పౌరులకు కొత్త స్మార్ట్ఫోన్ల సంగతి పక్కనపెడితే పాత (యూజ్డ్) ఫోన్లనూ కొనుక్కోవడమూ భారమైంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం.. యూజ్డ్ స్మార్ట్ఫోన్లపై విధించే వాల్యుయేషన్, సుంకాలను తగ్గించింది.ప్రస్తుత ధరల వద్ద కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హై-ఎండ్ స్మార్ట్ఫోన్లు అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్తో పాటు ఇతర వేరియంట్లకు కూడా కొత్త అంచనా విలువలను కస్టమ్స్ వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఖరారు చేసింది.ప్రపంచవ్యాప్తంగా పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సవరణ అవసరమైందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. డాన్ పత్రిక నివేదిక ప్రకారం.. ఐఫోన్ వంటి మోడళ్లు వయస్సు పెరిగే కొద్దీ, వారి ప్రాథమిక రిటైల్ జీవితకాలం ముగింపునకు చేరుకునే సరికి సహజంగానే విలువ కోల్పోతాయి.మార్కెట్ రేట్లకు అనుగుణంగా విలువలను సర్దుబాటు చేయడం ద్వారా, ఉపయోగించిన స్మార్ట్ఫోన్లను పౌరులకు మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రీవ్యాల్యూయేషన్ చేపట్టారు. తాజా అప్డేట్లో నాలుగు ప్రముఖ బ్రాండ్లకు చెందిన 62 మోడళ్ల హ్యాండ్సెట్లు ఉన్నాయి.శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీల మార్కెట్ డేటా, అధికారిక ట్రేడ్-ఇన్ ధరలను పరిశీలించిన తర్వాత కొత్త విలువలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై అమ్మకపు పన్ను, నిలిపివేత పన్ను, ప్రత్యేక సుంకాలు వంటి సంక్లిష్టమైన పన్ను విధానం అమల్లో ఉండగా, ఇవన్నీ ప్రభుత్వ నోటిఫై చేసిన వాల్యుయేషన్ ఆధారంగా లెక్కిస్తారు.2026 కోసం సవరించిన వ్యాల్యూయేషన్లు 2024తో పోలిస్తే యూజ్డ్ స్మార్ట్ఫోన్ల విలువల్లో భారీ తగ్గుదలని చూపుతున్నాయి. ముఖ్యంగా యూజ్డ్ ఐఫోన్ల ధరలు 32% నుంచి 81% వరకు తగ్గాయి. ఈ మార్పులతో పాకిస్తాన్లో పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గి, వినియోగదారులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
పాకిస్తాన్లో హై అలర్ట్.. ఆత్మాహుతి దాడిలో కీలక నేత మృతి
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ బాంబు దాడిలో పది మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్లో ఉన్నారని సమాచారం. దీంతో, పాకిస్తాన్లోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఖురేషి మోర్ సమీపంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్లో శాంతి కమిటీ చీఫ్ నూర్ ఆలం మెహసూద్ నివాసంలో జరిగిన వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుడు కారణంగా పది మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా పోలీసు అధికారి సజ్జాద్ అహ్మద్ సాహిబ్జాదా ధృవీకరించారు. మృతుల్లో శాంతి కమిటీ కమాండర్ జాగ్రీ మెహసూద్ కూడా ఉన్నారు. కాగా, దాడి జరిగిన సమయంలో పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు నృత్యం చేస్తున్నట్లు సమాచారం. పేలుడు కారణంగా గది పైకప్పు కూలిపోయింది, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.#BREAKING𝐃𝐞𝐫𝐚 𝐈𝐬𝐦𝐚𝐢𝐥 𝐊𝐡𝐚𝐧 𝐒𝐮𝐢𝐜𝐢𝐝𝐞 𝐁𝐥𝐚𝐬𝐭 𝐊𝐢𝐥𝐥𝐬 𝐎𝐯𝐞𝐫 𝐓𝐞𝐧, 𝐈𝐧𝐜𝐥𝐮𝐝𝐢𝐧𝐠 𝐏𝐞𝐚𝐜𝐞 𝐂𝐨𝐦𝐦𝐢𝐭𝐭𝐞𝐞 𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐬A suicide bombing struck a wedding ceremony in the Qureshi Mor area of Dera Ismail Khan district, Khyber Pakhtunkhwa, on… pic.twitter.com/KKvtYRi1rx— نقطةNUQTA (@NUQTA31) January 23, 2026అనంతరం, ఖైబర్ పఖ్తుంఖ్వా రెస్క్యూ 1122 ప్రతినిధి బిలాల్ అహ్మద్ ఫైజీ మాట్లాడుతూ.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఏడు అంబులెన్స్లు, ఒక అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్లో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి ఇప్పటివరకు ఏ టెర్రరిస్టు బాధ్యత వహించలేదు. దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.


