breaking news
Pakistan
-
యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి.. అసిమ్ మునీర్కు రెహమాన్ సవాల్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్పై ఆ దేశ ప్రముఖ రాజకీయ నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో పాత్ర పోషించాలనుకుంటే సైన్యానికి రాజీనామా చేసి రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.జూలై 12న జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన రెహమాన్.. రాజకీయ వ్యవహారాల్లో సైన్యం జోక్యం పెరుగుతోందని ఆరోపించారు. రక్షణ, భద్రతా అంశాలకు మాత్రమే పరిమితం కావాల్సిన సైన్యం, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి రండి. ఎన్నికల్లో పోటీ చేయండి. అప్పుడు ప్రజలు యూనిఫాంలో ఉన్న వ్యక్తికి ఎన్ని ఓట్లు ఇస్తారో తెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలో ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి లేదా ఎవరు పదవి నుంచి దిగిపోవాలి అనేది నిర్ణయించడం సైన్యం పని కాదని రెహమాన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి నిర్ణయాలు ప్రజలే తీసుకోవాలని ఆయన అన్నారు.పాకిస్థాన్లో సైన్యం ప్రభావం క్రమంగా పెరుగుతోందని, ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కంటే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు.దేశంలో జనాభా పెరుగుదల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో అసిమ్ మునీర్ను చేర్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా రెహమాన్ తప్పుబట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సాధారణ పౌరులు మిలీషియాలను ఏర్పాటు చేసుకోవాలని లేదా ఆయుధాలు చేపట్టాలని వస్తున్న సూచనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ భద్రతను కాపాడడం పూర్తిగా ప్రభుత్వం, సాయుధ దళాల బాధ్యతేనని, ఆ పని కోసమే వారికి వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.దేశ రక్షణ కోసం సైనికులు విధులు నిర్వర్తిస్తారు. అందుకు వారికి జీతాలు ఇస్తున్నారు. ప్రజలను ఆయుధాలు పట్టమని చెప్పడం సరైన విధానం కాదు. నేను ఎలాంటి మిలీషియాను ఏర్పాటు చేయను’అని ఆయన స్పష్టం చేశారు. పౌరులకు ఆయుధాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వ్యక్తిగత కక్షలు, హింస, రక్తపాతం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన రెహమాన్, అలాంటి చర్యలు దేశ భద్రతకు మరింత ముప్పు తెస్తాయని అన్నారు.ఈ సందర్భంగా బలూచిస్థాన్లోని భద్రతా పరిస్థితిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ మెజారిటీ ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణ బలహీనపడిందని, ఇప్పుడు హింస పష్తూన్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోందని పేర్కొన్నారు. -
పాకిస్తాన్ గుండెల్లో గుబులు!.. పీవోకేలో పరిస్థితి అదుపు తప్పుతోందా?
పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. స్థానిక సమస్యలు, రాజకీయ హక్కులు, పాలనా విధానాలపై అసంతృప్తితో జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు చేపట్టిన భారీ మార్చ్ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.ఈ సందర్భంగా ఆందోళనకారుల కదలికలను నియంత్రించేందుకు సుమారు నాలుగు వేల మంది పాకిస్తాన్ రేంజర్స్ను మోహరించినట్లు సమాచారం. ప్రధాన రహదారులపై భద్రతను పెంచడం, కొన్ని ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించడం, నిరసనలను అడ్డుకునేందుకు పోలీసు బలగాలను రంగంలోకి దించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే, మీడియాపై కూడా నిషేధం విధించారు. దీంతో, అక్కడే ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది.అయితే, ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న JAAC గత కొంతకాలంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజా సమస్యలను ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం, పరిపాలనలో స్థానికులకు ఎక్కువ పాత్ర, ఆర్థిక సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు వంటి అంశాలపై కమిటీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలు. ఈ స్థానాలు స్థానిక ప్రజల రాజకీయ హక్కులను ప్రభావితం చేస్తున్నాయని JAAC ఆరోపిస్తోంది. ఈ రిజర్వు స్థానాల వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తోంది.అయితే ఆందోళనలు శాంతియుతంగా కొనసాగకముందే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడులు, నిరసనలు, బలగాల ప్రతిస్పందనతో పరిస్థితి అదుపు తప్పినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. పాక్ ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే భద్రతను పెంచినట్లు చెబుతోంది. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆందోళనకారులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.ముజఫరాబాద్ వైపు సాగుతున్న ఈ మార్చ్ ఇప్పుడు కేవలం స్థానిక నిరసనగా కాకుండా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి సంకేతంగా మారింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కొంటుంది? నిరసనకారులతో చర్చలకు దిగుతుందా? లేక కఠిన చర్యలకే పరిమితం అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజా డిమాండ్లు, ప్రభుత్వ నియంత్రణ చర్యలు, భద్రతా బలగాల మోహరింపు మధ్య ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి. -
POK.. ఆజాద్ కాదు.. ఆక్రమిత కశ్మీర్.. భగ్గుమన్న పాకిస్థాన్
ఇస్లామాబాద్: తాను తీసిన గొయ్యిలో తానే పడుతాడు అని సొమెత మన వాడుక భాషలో బాగ వాడుతుంటాం.. ఈ పదం ఇప్పుడు పాకిస్థాన్కు సరిగ్గా సరిపోతుంది. భారత్పై దురాక్రమణ చేసి భూమిని స్వాధీనం చేసుకొని దానిని ఆజాద్ కశ్మీర్ అంటూ తప్పుడు ప్రచారాలు చేసిన పాక్ ఇప్పుడు ఆప్రాంత ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తోంది. పీవోకేలో జరుగుతున్న నిరసనలను నియంత్రించడం ఇప్పుడు ఆ దేశానికి తలకు మించిన పనిగా మారింది. దీంతో వారిని కంట్రోల్ చేయలేక ఆ దేశం తలపట్టుకుంటుంది."పాక్ ఆక్రమిత కశ్మీర్" ఈ పేరు వింటే చాలు ప్రతి భారతీయుని గుండె రగులుతుంది. మన దేశానికి ఏ విధంగా సరితూగని దాయాది పాకిస్థాన్... అక్రమణ జరిపి తన దేశ నియంత్రణలో ఉంచుకున్న ప్రాంతం ఇది.. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్కు అంత కష్టమైన పని కాకపోయినా అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా మౌనంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ప్రజలే ఆ దేశానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవల జరిగిన నిరసనలు తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. అక్కడి ప్రభుత్వంపై వ్యతిరేకతతో నిరసనలు చేస్తున్న ప్రజలపై అధికారులు ఇష్టారీతిన కాల్పులు జరిపారు. ఈ ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల తిరుగుబాటును అణిచివేయడం ఇప్పుడు ఆ దేశానికి పెద్దసమస్యగా మారింది. గత 78 ఏళ్లుగా ఇది ఆజాద్ కశ్మీర్ అని పాకిస్థాన్ చెబుతోందని కానీ ఇది ఆజాద్ కశ్మీర్ కాదని ఆక్రమిత కశ్మీర్ అని అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భారత చెప్పింది అదే..!PoKలో జరిగిన నిరసనలకు సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక వీడియోలో JAAC నాయకుడు మాట్లాడుతూ "గత 78 సంవత్సరాలుగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ను 'ఆజాద్ కాశ్మీర్' అని పిలుస్తోంది. కానీ ఇప్పుడు 80,000 మందికి పైగా హాజరైన ఒక ర్యాలీలో PoK ప్రజలు ఈ వాదనను సవాలు చేశారు. కశ్మీర్ వివాదాస్పద భూభాగం కాదు. అది ఆక్రమిత భూభాగం. దానికి ఎన్నడూ స్వాతంత్ర్యం లేదు. గత 78 ఏళ్లుగా భారత్ ఇదే చెబుతుండగా, పాకిస్థాన్ దానిని ప్రచారం అని కొట్టిపారేస్తోంది. ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలే తమ ర్యాలీలలో అదే విషయాన్ని చెబుతున్నారు. అని వీడియోలో మాట్లాడుతున్నారు.ప్రస్తుతం జరుగుతున్న రావల్ కోట్ ర్యాలీలో 80 వేల మందికి పైగా పాల్గొన్నారు. మరి ఈ విషయంపై పాక్ ఏం చేస్తోంది. ఈ ఎనబై వేల మందిని సైతం భారత్ పంపిందని ప్రచారం చేస్తోందా అని అక్కడి నాయకులు నిలదీశారు. ఈ నిరసనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. PoKలోని ప్రజల ఆగ్రహం ఆకస్మికంగా తలెత్తినది కాదని, ఇది పాకిస్తాన్ సంవత్సరాలుగా సాగిస్తున్న దోపిడీ, హక్కుల ఉల్లంఘనలు, అక్రమ ఆక్రమణల ఫలితమేనని తెలిపింది.Pakistan has spent 78 years calling PoJK "Azad Kashmir." 🇮🇳The people of PoJK just corrected that in front of 80,000 people.JAAC leader Sardar Aman Khan said it straight."Kashmir is not disputed territory. It is occupied territory. And it was never truly Azad."India has… pic.twitter.com/jb50aHVSQE— Aviator Anil Chopra (@Chopsyturvey) July 15, 2026 -
PoKలో రక్తపాతం.. పాక్ ఆర్మీ కాల్పులు
-
పీవోకేలో పాక్ ఆర్మీ కాల్పులు.. ఆరుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావాలాకోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో సాధారణ ప్రజలపై అక్కడి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఇస్లామాబాద్ (పాకిస్తాన్ ప్రభుత్వం)పై స్థానికుల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగాయి. పీవోకే ప్రజలు పాక్కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు.వైట్హౌస్ ఎదుట నిరసనకాగా ఇటీవలే అమెరికాలో ఉన్న పీవోకే ప్రజలు వాషింగ్టన్లో ఉన్న వైట్ హౌస్ వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో పెద్దఎత్తున హింసచేలరేగుతందని పాకిస్థాన్ ఆ ప్రాంతంలో మానవహక్కులని కాల రాస్తుందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం పీవోకేలో జరుగుతున్న మానవతా సంక్షోభంపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. PoK లోని పౌర నివాస ప్రాంతాల నుండి పాకిస్తాన్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరాయుధులైన పౌరులపై ప్రాణాంతక బలగాలను ప్రయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే మరోసారి ప్రాంతంలోకాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. భారత్ సహాయం చేయాలిదాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తూ పాక్ ప్రభుత్వం అక్కడ సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్ను నిలిపివేసిందని నిరసనకారులు ఆరోపించారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటానికి, మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం జోక్యం చేసుకోవాలని వారు ఒక అసాధారణ విజ్ఞప్తి చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందేలా పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖను తెరవాలని డిమాండ్ చేశారు.పేదరికంతో సతమతమవుతున్న ప్రజలుతాజా ఘర్షణల పక్కన పెడితే, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు తెలిపాయి.'నేచర్'జర్నల్ 2025 నాటి అధ్యయనం ప్రకారం, ఇక్కడి జనాభాలో 66% మంది వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ 57% కంటే ఎక్కువ కుటుంబాలు ఆహార భద్రత లేకుండా నివసిస్తున్నాయి. దాదాపు 29% మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు (పాకిస్తాన్ జాతీయ సగటు 19.9% కంటే ఇది చాలా ఎక్కువ). పర్వత ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది, అక్కడ 90% కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. -
అక్తర్, ఆసిఫ్ భారత్కు డ్రగ్స్ తెచ్చారు..!
పాకిస్తాన్ మాజీ పేసర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్పై భారత మాజీ కేంద్ర హోంశాఖ అధికారి ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. భారత్లో పర్యటించిన సమయంలో అక్తర్, ఆసిఫ్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ బాంబు పేల్చారు.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. "భారత్లో క్రికెట్ ఆడేందుకు వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ బృందంలోని కొందరు డ్రగ్స్ను అక్రమంగా తీసుకొచ్చేవారు. షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ భారత్కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పాకిస్తాన్ హైకమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారిని వెనక్కి పంపించారు" అని అన్నారు.మాజీ పాక్ కోచ్ బాబ్ వూల్మర్ మరణాన్ని కూడా ఈ వ్యవహారంతో ముడిపెట్టారు ఆర్వీఎస్ మణి. పాకిస్తాన్ జట్టులో జరుగుతున్న డ్రగ్ స్మగ్లింగ్ విషయాన్ని బయటపెట్టాలని వూల్మర్ ప్రయత్నించారని, అందుకే ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని ఆరోపించారు.మణి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం క్రికెట్ సర్క్సిల్స్లో దుమారం రేపుతున్నాయి. మణి 2006 నుంచి 2010 వరకు కేంద్ర హోంశాఖ అంతర్గత భద్రత విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం 2013లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ల విషయానికొస్తే.. 2003-04 నుంచి 2007 వరకు ఇరు దేశాల మధ్య పరస్పర సిరీస్లు జరిగాయి. అయితే 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఈ సిరీస్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ జట్లు ఐసీసీ లేదా ఏసీసీ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. -
బంగ్లాదేశ్లో మాజీ దౌత్యవేత్తను వణికించిన భారత ఆడపులి
ఢాకా: దేశం కాని దేశంలో, విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారత్ ప్రతిష్ఠను నిలబెట్టిన భారతీయ దౌత్యవేత్త పూజా కుమారి ఝా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దక్షిణాసియా మ్యాప్లో జమ్మూ కశ్మీర్ను పాకిస్థాన్లో భాగంగా చూపించడాన్ని ఆమె వెంటనే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరిదిద్దాలని కోరారు. ఆమె సమయస్ఫూర్తి, ధైర్యం సభలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ‘సార్క్ పునరుద్ధరణ - ప్రాంతీయ సమగ్రత’ అనే అంశంపై ఉన్నత స్థాయి విదేశాంగ విధాన సెమినార్ నిర్వహించారు. ఢాకాలోని బంగ్లాదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (BIISS) ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.సదస్సులో బంగ్లాదేశ్ మాజీ దౌత్యవేత్త అహ్మద్ తారిఖ్ కరీం పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా, స్క్రీన్పై ప్రదర్శించిన దక్షిణాసియా మ్యాప్లో జమ్మూ కశ్మీర్ను పాకిస్థాన్లో భాగంగా చూపించారు. దీనిని గమనించిన భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా వెంటనే జోక్యం చేసుకుని, ఆ మ్యాప్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.దీనికి స్పందించిన తారిఖ్ కరీం.. మీరు భారత్ నుంచి వచ్చారా? అని ప్రశ్నించగా.. నేను పూజా కుమారి ఝా భారత హైకమిషన్లో సెకండ్ సెక్రటరీ అని ఆమె తనను పరిచయం చేసుకున్నారు. అనంతరం తారిఖ్ కరీం.. మీ అభ్యంతరాన్ని నమోదు చేసుకున్నాను’ అని పేర్కొంటూ తన ప్రజెంటేషన్ను కొనసాగించారు.ఎవరీ పూజా కుమారి ఝా?జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పూజా కుమారి ఝా 2022 బ్యాచ్కు చెందిన భారత విదేశాంగ సేవ అధికారిణి. ప్రస్తుతం ఢాకాలోని భారత హైకమిషన్లో రాజకీయ, సమాచార విభాగంలో సెకండ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె 2021 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించారు. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం.పూజా బీహార్ రాష్ట్రంలోని సీతామఢీ జిల్లా పురన్హియా గ్రామానికి చెందినవారు. అనంతరం ఆమె కుటుంబం ఢిల్లీకి వలస వెళ్లింది. ఆమె తండ్రి గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆఫీస్ హెల్పర్గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. పూజా కుటుంబంలో ఐదో కుమార్తె.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రైవేట్ పాఠశాల నుంచి మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆమె విద్యను కొనసాగించారు. ఆమె పెరిగిన సమాజంలో ఆడపిల్లల కంటే మగపిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అలాంటి పరిస్థితులను మార్చడానికి చదువే మార్గమని పూజా, ఆమె సోదరీమణులు నమ్మారు.ఒకప్పుడు ఆమె తండ్రి, నువ్వు ఐఏఎస్ అధికారిణి అవుతావు గానీ, బాలీవుడ్ నటి కాలేవు. పెద్ద కలలు కనకు అని చెప్పేవారని పూజా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. అయితే తన కృషి, పట్టుదలతో ఆమె ఆ మాటలను తప్పు అని నిరూపించారు.నేడు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, దేశ ప్రయోజనాలను ధైర్యంగా వినిపిస్తున్న పూజా కుమారి ఝా అనేక మంది యువతులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. India’s Second Secretary at the Indian High Commission in Dhaka, Puja Jha, raised an immediate objection after a map shown during a foreign policy seminar in Bangladesh depicted Jammu & Kashmir as part of Pakistan.She stated that Jammu & Kashmir is an integral and inalienable… pic.twitter.com/a4b2IV8ZhA— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 10, 2026 -
‘పాక్’తో లింకులు.. బిహార్ యువకుడి అరెస్ట్!
కతిహార్: బిహార్లోని కతిహార్ జిల్లాలో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అహద్గా అధికారులు గుర్తించారు.కతిహార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) పరిచయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద ముఠాతో అహద్కు సంబంధాలు ఉన్నాయనే నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతా సిబ్బంది సోమవారం అతడిని అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను సాంకేతికంగా విశ్లేషించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్కు చెందిన గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధమున్న రాణా హసీన్ అనే వ్యక్తితో నిందితుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది.దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన చాటింగ్లు చేయడం, ఆడియో కాల్స్ మాట్లాడటం, దేశంలోని సున్నితమైన ప్రాంతాల సమాచారాన్ని చేరవేయడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో భారతదేశానికి వ్యతిరేకంగా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ను వ్యాప్తి చేస్తూ, పాకిస్తాన్ వాట్సాప్ ఛానళ్ల లింకులను ఇతరులకు షేర్ చేస్తూ దేశంలో ఉగ్ర నెట్వర్క్ను విస్తరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇతర కేంద్ర భద్రతా సంస్థల సహాయంతో విచారణ జరుపుతున్నారు. -
ఢిల్లీని కమ్మేసిన పాక్ ధూళి
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్తో పాటు అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాల్లో సంభవించిన ధూళి తుఫానుల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై తీవ్రంగా పడింది. ధూళి తుపానుల వల్ల ఎగసిన ఖనిజ ధూళి కణాలు బలమైన గాలులతో సరిహద్దులు దాటి వాయువ్య భారతాన్ని, ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతాన్ని కమ్మేశాయి. దాదాపు మూడేళ్ల తర్వాత మొదటిసారిగా అత్యంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నామన్న ఢిల్లీ ప్రజల సంతోషం మూడు రోజుల ముచ్చటే అయ్యింది. ఈనెల 9వ తేదీ నాటికి రికార్డు స్థాయిలో 48గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగింది. గత 85 రోజుల్లో ఇంతటి కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. గత వారంలో ఏక్యూఐ పరిశీలిస్తే గురువారం 48, శుక్రవారం 65, శనివారం 140గా నమోదైంది. ఆదివారం నాటికి ఒక్కసారిగా 261కి పెరిగిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక మానిటరింగ్ స్టేషన్లలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆనంద్ విహార్లో 449, జహంగీర్పురిలో 344 ఏక్యూఐ నమోదైంది. ఢిల్లీలో వాయు నాణ్యత అకస్మాత్తుగా పడిపోవడంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉపసంఘం ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై, కారణాలను సమీక్షించింది. క్షేత్రస్థాయిలో ధూళి నియంత్రణ చర్యలను మరింత ఉధృతం చేయాలని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీని ఆదేశించింది. రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నందున, గాలి వేగం పెరిగితే తప్ప ఈ కాలుష్య కణాలు అంత త్వరగా వీడిపోవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ!
కరాచీకి చెందిన ఒక కంపెనీ నుంచి తనకు మంచి జీతంతో కూడిన జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొంటూ 21 ఏళ్ల టెకీ ఆదిత్య పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్లో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొంతమంది ఆసక్తిగా స్పందించగా, మరికొందరు ఇది కేవలం సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోసం చేసిన ప్రయత్నమా?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.ఆదిత్య షేర్ చేసిన స్క్రీన్షాట్ ప్రకారం.. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీ తనకు సంవత్సరానికి 1.8 లక్షల నుంచి 2.2 లక్షల డాలర్ల వరకు బేస్ శాలరీ ఆఫర్ చేసిందని తెలిపాడు. భారత కరెన్సీలో ఈ వేతనం దాదాపు రూ.2 కోట్లు. కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులు యూకే టైమ్ జోన్ ప్రకారం పనిచేస్తారని ఆఫర్ వివరాల్లో ఉన్నట్లు వెల్లడించాడు.just received an onsite offer from a Karachi-based company.$180-220k base, visa sponsored, and the team operates in the UK timezone. should I go for it? pic.twitter.com/lCa8NdQVXF— aditya (@adxtyahq) July 12, 2026తనకు వచ్చిన ఈ ఆఫర్ను అంగీకరించి అక్కడికి వెళ్లాలా?, వద్దా? అని తన ఫాలోవర్లను అడుగుతూ ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఈ పోస్టును చూసినవారిలో.. కొంతమంది నిజంగానే ఇది మంచి కెరీర్ అవకాశం కావచ్చని చెప్పారు. మరికొందరు మాత్రం ఆ ఆఫర్ నిజమా, కాదా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇంకొంతమంది ఇలాంటి పోస్టులు కేవలం ఎక్కువ లైక్లు, కామెంట్లు, వ్యూస్ కోసం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవకాశాలను అంగీకరించే ముందు కంపెనీ వివరాలు, ఉద్యోగ నిజమైనదా కాదా అనే విషయాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. -
ఇషాన్ కిషన్ గొప్ప మనసు
భారత వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్కు ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.VIDEO OF THE DAY.....!!!! ❤️ - Ishan Kishan specially came over to meet a Pakistan fan. A lovely gesture. 👏 pic.twitter.com/xwjPxiX3dz— Sheri. (@CallMeSheri1_) July 12, 2026మ్యాచ్కు ముందు వార్మప్కు వెళ్లే క్రమంలో స్టేడియంలో ఉన్న సదరు అభిమానిని గమనించిన ఇషాన్ కిషన్ స్వయంగా అతడి వద్దకు వెళ్లాడు. అతడితో చేతులు కలిపి, చిరునవ్వుతో పలకరిస్తూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ అనూహ్యమైన ఆత్మీయతతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఇషాన్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. దేశాల మధ్య విభేదాలను పక్కకు పెట్టి మంచి మనసు చాటుకున్నాడని అంటున్నారు.ఇదిలా ఉంటే, ఐదో టీ20లోనూ టీమిండియాకు ఇంగ్లండ్ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈ ఓటమితో భారత జట్టు 0-4 తేడాతో సిరీస్ను కోల్పోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ తరఫున జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. -
ఉగ్ర నెట్ వర్క్ పై ATS నిఘా
-
పాకిస్తాన్ సరికొత్త కామెడీ షో.. మాది హిందూ సంస్కృతి!
-
కార్గో విమానం అదృశ్యం : సముద్రంలో కూలిపోయిందనే ఆందోళన
షార్జా నుండి కరాచీ వెళ్తున్న కె2 ఎయిర్వేస్ (K2 Airways) కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం (KTA1732) అదృశ్యమైంది. అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా కరాచీ సమీపంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఫ్లైట్రాడార్24 భావిస్తోంది. అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ (PAA) తీర ప్రాంతంలో గాలింపు , రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసింది.ఏమి జరిగింది?పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:18 గంటలకు విమానంలోని నావిగేషన్ సిస్టమ్లో సమస్య ఉన్నట్లు పైలట్ నివేదించారు. ఆ తర్వాత రాత్రి 9:21 గంటల సమయంలో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోతూ, వేగంగా దిశ మార్చుకున్నట్లు రాడార్లో కనిపించింది. కరాచీకి పశ్చిమంగా 155 నాటికల్ మైళ్ల దూరంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.భయంకరమైన వేగంతో కిందకు పడిపోయింది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ఫ్లైట్రాడార్24 (Flightradar24) డేటా ప్రకారం, విమానం నుండి చివరి సిగ్నల్ వచ్చేసరికి అది సముద్ర మట్టానికి కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, అది నిమిషానికి 22,400 అడుగుల అత్యంత వేగంతో కిందకు దూసుకుయింది. అదృశ్యమైన ఈ బోయింగ్ 737-400 విమానం 1999 నాటిది. మొదట ప్రయాణీకుల విమానంగా పనిచేసి, 2012లో కార్గో విమానంగా మారింది. 2024లోనే ఇది కె2 ఎయిర్వేస్ సంస్థలో చేరింది.ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (IWT) పక్కనబెట్టాలన్న భారతదేశం నిర్ణయం పాకిస్తాన్ను ఒక రేంజ్లో వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాలను ఆపితే యుద్ధమే అంటూ పాక్ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని తీసుకుంటామని ప్రకటించడం కలకలం రేపింది.పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధూ జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. సైనిక కమాండర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని పునరుద్ఘాటించింది .అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ నదీ జలాల వాటాను దక్కించు కునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధూ జలాల హక్కుల కోసం పోరాడుతామని సైన్యం వెల్లడించింది. గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) భారతదేశం నిలిపివేసింది (Abeyance లో పెట్టింది). దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం, మంత్రులు భారత్పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు, వార్ వార్నింగ్లివ్వడం శోచనీయం.పాకిస్తాన్ NSC మార్గదర్శకాలు ఏమిటి?నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని "యుద్ధ చర్య" (Act of War)గా పరిగణించాలని పాకిస్తాన్ NSC గతంలోనే నిర్ణయించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' కింద పోరాడుతామని తెలిపింది. అలాగే కాశ్మీరీలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది.బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరిక వైరల్పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక వీడియో వైరల్ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తి లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, అన్ని రంగాలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము."పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతు న్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేసింది.సింధు జలాలు- పాకిస్తాన్ 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్కు.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఆ సమాచారాన్ని పంచు కోవాల్సిన అవసరం ఉండదు.భారత్ ప్రాజెక్టులు: సింధు బేసిన్లో సావల్కోట్, రట్లే, బుర్సార్, పకాల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. పాక్ వ్యవసాయం అతలాకుతలం: పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80-90 శాతం ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యామ్లలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.దీంతో తమ అత్యంత బలహీనమైన పాయింట్ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం, ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ -
అందుకే పాక్ ఆ పరిస్థితిలో ఉంది: భారత్
ఢిల్లీ: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్కు మతి భ్రమించిందని భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసిఫ్ ఏ పనీలేక తనకు అవగాహన లేని విషయాలపై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తి రక్షణ మంత్రిగా కొనసాగడం వల్లే పాక్ ప్రస్తుత ఆ పరిస్థితుల్లో ఉందని చురకలు వేసింది.ద్వీపదేశం సెషల్స్ కొత్తగా ఏర్పాటు చేసిన ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్’ను ఇటీవల ప్రధాని మోదీకి ఇచ్చి గౌరవించిన విషయం తెలిసిందే. దీనిపై ఆసిఫ్ ‘అది అడిగి తెచ్చుకున్న కృత్రిమ గుర్తింపు’ అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసూయ మహాచెడ్డదని, ఇతరులను ద్వేషించే వారికి ఇది ఎక్కువగా ఉంటుందని ఎద్దేవా చేసింది.గత వారం సెషల్స్ దేశంలో ప్రధాని మోదీ పర్యటించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రధాని మోదీ చూపుతున్న నిబద్ధతకు, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లటానికి ఆయన చేస్తున్న కృషికిగాను ప్రస్తుత సెషల్స్ ప్రభుత్వం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. -
పాక్ ఎయిర్ఫోర్స్ కెప్టెన్ అసీమ్ తారిక్ను కాల్చి చంపిన దుండగులు
ఇస్లామాబాద్లో ఓ మహిళను అపహరించేందుకు దుండగులు ప్రయత్నించగా, ఆమెను కాపాడే క్రమంలో జోక్యం చేసుకున్న పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ను వారు కాల్చిచంపినట్టు పాకిస్థాన్ సమా టీవీ తెలిపింది.ఈ ఘటన మార్గల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ చౌక్ వద్ద జరిగింది. మృతుడిని గ్రూప్ కెప్టెన్ అసీమ్ తారిక్గా గుర్తించారు. ఆయన నైన్త్ అవెన్యూ మీదుగా వెళ్తుండగా ఓ వ్యక్తి మోటార్సైకిల్పై ఓ మహిళను బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్టు గమనించినట్టు సమాచారం.సమా టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రూప్ కెప్టెన్ తారిక్ జోక్యం చేసుకుని దాడిని అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ రోడ్డుకు అవతలి వైపునకు పారిపోయింది. ఈ సమయంలో అనుమానితుడు సాద్ అధికారి పట్ల దుర్భాషలాడి, ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు తెలిపింది. ఈ కాల్పుల్లో అధికారి తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆధారాలు సేకరిస్తున్నారు. మహిళ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ సమా టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఆమె సహోద్యోగి. ఉద్యోగానికి తీసుకెళ్తానని చెప్పి మార్గం మళ్లించి మరో చోటుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని తెలిపింది. ఆమె ప్రతిఘటించడంతో పరిస్థితి మరింత విషమించేలోపు అధికారి జోక్యం చేసుకున్నారు.అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ ఈ ఘటనపై ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్ నుంచి అత్యవసర నివేదిక కోరారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మళ్లీ పాక్ కెప్టెన్గా బాబర్ ఆజం.. అధికారిక ప్రకటన
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల కోసం స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంను మరోసారి టెస్టు జట్టు కెప్టెన్గా నియమించింది. ఇప్పటివరకు టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన షాన్ మసూద్ను పదవి నుంచి తప్పిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.దాదాపు మూడు సంవత్సరాల క్రితం టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన షాన్ మసూద్ ఆశించిన స్థాయిలో జట్టును నడిపించలేకపోయాడు. అతని నాయకత్వంలో పాకిస్తాన్ ఘోర వైఫల్యాలను ఎదుర్కొంది. 16 టెస్టు మ్యాచ్లు ఆడగా కేవలం నాలుగింట మాత్రమే విజయాలు సాధించింది. మిగిలిన 12 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.ముఖ్యంగా ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలోనే టెస్టు సిరీస్ను వైట్వాష్గా కోల్పోవడం మసూద్ కెప్టెన్సీకి ఎసరుపెట్టింది. గత రెండేళ్లలో అతడి నాయకత్యంలో పాక్ బంగ్లాదేశ్ చేతిలో రెండోసారి వైట్వాష్ను ఎదుర్కోవడంతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనల్లో కూడా వరుసగా సిరీస్లను క్లీన్స్వీప్గా కోల్పోయింది.ఈ పరిస్థితుల్లో మళ్లీ బాబర్ ఆజంపై పాక్ క్రికెట్ బోర్డు విశ్వాసం ఉంచింది. మసూద్కు ముందు కూడా బాబర్ టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఇటీవల టెస్ట్ల్లో బాబర్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కెప్టెన్గా నియమించడం గమనార్హం.కాగా, పాక్ క్రికెట్ బోర్డు ఇవాళ వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల కోసం తమ టెస్ట్ జట్టును ప్రకటించింది. విండీస్ పర్యటనకు 16 మంది, ఇంగ్లండ్ పర్యటనకు 17 మంది (ఫిట్నెస్ను బట్టి సౌద్ షకీల్ జట్టులో అవకాశం) సభ్యులను పాక్ సెలెక్టర్లు ఎంపిక చేశారు.ఈ రెండు పర్యటనల కోసం ప్రకటించిన జట్టులో నలుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఎడమచేతి స్పిన్నర్ అలీ ఉస్మాన్, బ్యాటర్ మహ్మద్ అవైస్ జఫర్, ఫాస్ట్ బౌలర్ ఉబైద్ షా, వికెట్కీపర్-బ్యాటర్ మహ్మద్ ఘాజీ ఘోరీ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.పాకిస్తాన్ జట్టు ఈ నెల చివర్లో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. రెండు టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టరౌబాలో జరగనుండగా, రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి 6 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో నిర్వహించనున్నారు.వెస్టిండీస్ పర్యటన అనంతరం పాకిస్తాన్ నేరుగా ఇంగ్లండ్కు వెళ్లనుంది. అక్కడ మూడు టెస్టుల సిరీస్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగుతుంది. తొలి టెస్టు లీడ్స్లో, రెండో టెస్టు లార్డ్స్లో, మూడో టెస్టు బర్మింగ్హామ్లో జరగనుంది.వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల కోసం పాకిస్తాన్ టెస్టు జట్టు..బాబర్ ఆజం (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్ అవైస్, ఇమామ్ ఉల్ హక్, ఖుర్రం షహ్జాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), మహ్మద్ అవైస్ జఫర్, మహ్మద్ ఘాజీ ఘోరీ (వికెట్కీపర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, షాన్ మసూద్, ఉబైద్ షా. -
మరో ‘సీమా హైదర్’ లవ్ స్టోరీ..‘కథ అడ్డం తిరిగింది’
శ్రీనగర్: సామాజిక మాధ్యమం ‘స్నాప్చాట్’ పరిచయంతో సరిహద్దులు దాటి ప్రేమికురాలిని కలవడానికి వచ్చిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యువకుడిని భారత సైన్యం తిరిగి పాకిస్తాన్కు అప్పగించింది. అధికారుల కథనం ప్రకారం.. పీఓకేలోని ముజఫరాబాద్ జిల్లాకు చెందిన జీషాన్ మీర్, జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్కు చెందిన ఇరామ్ మజీద్ అనే యువతి 2025 మే నెల నుండి స్నాప్చాట్లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. ప్రేమికురాలిని కలుసుకోవాలనే ఉద్దేశంతో జీషాన్, ఈ ఏడాది జూన్ 1న ఉరి సెక్టార్లోని సిలికోట్ ప్రాంతంలో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడు.ఆ సమయంలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న భారత సైన్యం అతడిని గుర్తించి అదుపులోనికి తీసుకుంది. అనంతరం ప్రాథమిక విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. నెల రోజుల పాటు భద్రతా సంస్థల దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత, మానవతా దృక్పథంతో అతడిని శనివారం (జూలై 4న) కమన్ అమన్ సేతు సరిహద్దు వద్ద పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు అప్పగించినట్లు సైన్యం వెల్లడించింది. విచారణ సమయంలో జీషాన్ పట్ల అత్యంత గౌరవంతో, నిష్పక్షపాతంగా వ్యవహరించామని అధికారులు తెలిపారు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీమా హైదర్ ఉదంతాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుకు తెచ్చింది.ఇది కూడా చదవండి: మరో ‘పరీక్ష కుంభకోణం’: సమాధానాలు దిద్దకుండానే ఉద్యోగాలు! -
పాక్ను షేక్ చేస్తున్న కొత్త కేసు.. చిక్కుల్లో డిప్యూటీ పీఎం బంధువు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలనం సృష్టించిన ఇద్దరు విదేశీ మహిళలపై కిడ్నాప్, సామూహిక అత్యాచార కేసు దర్యాప్తులో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక క్రిప్టోకరెన్సీ వ్యాపార వివాదం ఉండి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముహమ్మద్ రజా దార్, పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంధువుగా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. నెదర్లాండ్స్కు చెందిన ఒక మహిళ, వెనిజులాకు చెందిన మరో మహిళ వ్యాపార అవసరాల కోసం జూన్ 29న పాకిస్తాన్లోని లాహోర్కు చేరుకున్నారు. అయితే, వారికి ముందే పరిచయం ఉన్న ముహమ్మద్ రజా దార్.. ఇద్దరికి పాకిస్తాన్కు ఆహ్వానించినట్లు సమాచారం. అనంతరం వారిని ఒక ఇంటికి తీసుకెళ్లి బంధించి, పలువురు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.క్రిప్టోకరెన్సీ వివాదం ఏమిటి?దర్యాప్తులో భాగంగా న్యాయమూర్తి ఎదుట బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితులు తమ వద్ద ఉన్న క్రిప్టోకరెన్సీ డిజిటల్ వాలెట్లు, పాస్వర్డులు, ఆర్థిక వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, వాటిని అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అలాగే, తమను విడుదల చేసే ముందు 1 లక్ష అమెరికన్ డాలర్లు (100,000 USD) అందాయని ప్రధాన నిందితుడు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ అంశాలన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న ఆరోపణలు. కాగా, వాటిని అధికారులు నిర్ధారించలేదు.ముందే వ్యాపార సంబంధాలుప్రాథమిక విచారణ ప్రకారం, ముహమ్మద్ రజా దార్ మరియు బాధిత మహిళలు గత ఏడాది సింగపూర్లో పరిచయం అయ్యారు. వారు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యాపార ప్రాజెక్టులో కలిసి పనిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదే పరిచయంతో మహిళలకు పాకిస్థాన్కు వెళ్లేందుకు బిజినెస్ వీసాలు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన విభేదాలే ఈ ఘటనకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. కోర్టు నిందితులను పోలీసు కస్టడీకి పంపి విచారణకు అనుమతించింది.రాజకీయ చర్చ..ఈ ఘటన పాకిస్తాన్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏకంగా ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ బంధువు పేరు బయటకు రావడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలు నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. బాధితులు చేసిన ఆరోపణలు, క్రిప్టోకరెన్సీ వివాదం, చెల్లింపు వంటి అంశాలపై ఇంకా కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. నిందితులపై ఉన్న ఆరోపణలు విచారణలో భాగంగా పరిశీలించబడుతున్నాయి. -
మళ్లీ పాక్ కెప్టెన్గా బాబర్ ఆజం..!
పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మళ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ స్థానంలో ఆయనను తిరిగి నియమించే దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.గత రెండేళ్లుగా పాకిస్తాన్ టెస్ట్ జట్టు ప్రదర్శన దారుణంగా దిగజారింది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలో సిరీస్ సహా రెండు సిరీస్ల్లో ఓడింది. దీంతో బాబర్ ఆజం మళ్లీ టెస్ట్ కెప్టెన్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వెస్టిండీస్తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బాబర్కు పగ్గాలు అప్పజెప్పవచ్చన సమాచారం.బాబర్ 2019-2023 మధ్యలో పాక్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2023 వరల్డ్ కప్ తర్వాత ఆ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. 2024లో మళ్లీ వైట్-బాల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ, అదే ఏడాది చివర్లో మరోసారి రాజీనామా చేశాడు.ప్రస్తుతం షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అతని ట్రాక్ రికార్డు దారుణంగా ఉంది. అతని నాయకత్వంలో పాకిస్తాన్ 16 టెస్టుల్లో 12 మ్యాచ్లు ఓడిపోయింది. కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో WTC 2023–25 సీజన్ను పాకిస్తాన్ చివరి స్థానంలో ముగించింది.టెస్ట్ కెప్టెన్సీ విషయంలో వైట్-బాల్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పేరు కూడా పరిశీలనలోకి వచ్చినా, ఆయన ఆ ఆఫర్ను తిరస్కరించడంతో చివరకు బాబర్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.బాబర్ ఆజం కెప్టెన్సీ రికార్డు చూస్తే, ఇప్పటివరకు 148 మ్యాచ్ల్లో నాయకత్వం వహించి 84 విజయాలు సాధించాడు. టెస్ట్ ఫార్మాట్లో 20 మ్యాచ్లకు కెప్టెన్గా ఉండగా 10 విజయాలు, 6 పరాజయాలు నమోదు చేశాడు. ఈ గణాంకాల ఆధారంగా PCB అతనికే మళ్లీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
పాక్లో కలకలం: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల కోసం ‘మాయ’ స్మగ్లింగ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లోని ఆస్పత్రుల నుంచి ప్లాసెంటా(మాయ)లను కొనుగోలు చేసి, వాటిని రహస్య ప్రాంతాల్లో ఎండబెట్టి, ప్రాసెస్ చేసి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ఒక పెద్ద ముఠాను పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) బట్టబయలు చేసింది. ప్లాసెంటా (మాయ) అనేది గర్భధారణ సమయంలో తల్లి గర్భాశయంలో ఏర్పడుతుంది. ఇది బొడ్డు తాడు ద్వారా పిండంతో అనుసంధానమై ఉంటుంది. తల్లి రక్తం నుండి పిండానికి ఆక్సిజన్, పోషకాలు, యాంటీబాడీలను అందించడంతో పాటు, పిండం నుండి కార్బన్ డైయాక్సైడ్, ఇతర వ్యర్థాలను తొలగించడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే గర్భధారణను కొనసాగించడానికి, శిశువు ఎదుగుదలకు, ప్రసవానికి అవసరమైన హార్మోన్లను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. ప్రసవం తర్వాత దీనిని వైద్య వ్యర్థాలుగా పారవేస్తారు.అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఖరీదైన ‘యాంటీ ఏజింగ్’ ఇంజెక్షన్ల తయారీ కోసం ఈ మానవ కణజాలాలను విదేశాలకు ఆ ముఠా స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇస్లామాబాద్లోని ఒక గృహంలో అక్రమంగా నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్పై అధికారులు దాడి చేశారు. అక్కడ మానవ అవయవాలను, ముఖ్యంగా మాయలను ఎండబెట్టడానికి అమర్చిన పెద్ద పెద్ద రాక్లు, ట్రేలను కనుగొన్నారు. ఈ సోదాల్లో సుమారు 500 నుండి 550 కిలోల మాయలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వియత్నాంనకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 100 కిలోల మానవ కణజాలాల షిప్మెంట్ను విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఈ అక్రమ నెట్వర్క్కు సంబంధించి ముగ్గురు చైనా పౌరులు, ఇద్దరు పాకిస్తాన్ పౌరులతో కలిపి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.ఆస్పత్రి సిబ్బందికి ఒక్కో మాయకు సుమారు 800 పాకిస్తానీ రూపాయలు చెల్లించి ఈ ముఠా సేకరిస్తున్నట్లు విచారణలో తేలింది. వీటిని ప్రాసెస్ చేసిన తర్వాత 'షీ ప్లాసెంటా' వంటి పేర్లతో వియత్నాం వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కణజాలంతో తయారు చేసే ఒక్కో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ ధర అంతర్జాతీయ మార్కెట్లోలక్షల్లో పలుకుతోందని, విదేశాల్లోని సంపన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాపారం సాగుతోందని అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: బోల్సోనారో గృహ నిర్బంధం పొడిగింపు -
పాకిస్తాన్కు ఊహించని శత్రువు.. పెంచిన పామే కాటేసిందా?
ఆసియా ఖండంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?. ఇటీవల అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ భూభాగంలోని పలు లక్ష్యాలపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. అంతకు కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ సైన్యం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసింది. దానికి ప్రతీకారంగానే అఫ్గానిస్తాన్ ఈ డ్రోన్ దాడులు జరిపింది. మార్చి నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య అసలు ఈ శత్రుత్వం ఎందుకు మొదలైంది? ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతీయ రాజకీయాల్లోకి రష్యా ఎందుకు ఎంట్రీ ఇస్తోంది? ఉక్రెయిన్ యుద్ధంతో బిజీగా ఉన్న రష్యా, హఠాత్తుగా తాలిబాన్లతో చేతులు కలపడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?అప్పట్లో భాయీ భాయీ..!పాక్-అఫ్గాన్ పాలిటిక్స్లోకి వెళ్లే ముందు ఫ్లాష్బ్యాక్ తిరగేస్తే.. ఇప్పుడు ఒకరినొకరు చంపుకుంటున్న ఈ పాకిస్తాన్, తాలిబాన్లు.. ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. 1980ల కాలంలో అఫ్గానిస్తాన్లోకి సోవియట్ రష్యా సైన్యం ప్రవేశించినప్పుడు, వారికి వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్లకు, తాలిబాన్లకు పాకిస్తాన్ వెన్నుదన్నుగా నిలిచింది. అమెరికా నుంచి వచ్చిన నిధులను, ఆయుధాలను పాకిస్తానే వీరికి సరఫరా చేసింది. అంతెందుకు.. తాలిబాన్లను తయారు చేసే హక్కానీ యూనివర్సిటీ కూడా పాక్ గడ్డపైనే ఉంది. 1996లో తాలిబాన్లు మొదటిసారి కాబూల్ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, వారిని అధికారిక దేశంగా గుర్తించిన కేవలం మూడు దేశాలలో పాకిస్తాన్ ఒకటి. ఆ తర్వాత 2001లో అఫ్గానిస్తాన్పై అమెరికా దాడి చేసి.. తాలిబాన్లను గద్దె దించినప్పుడు కూడా, పాకిస్తాన్ దొంగచాటుగా తాలిబాన్లకే మద్దతు ఇచ్చింది. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా పాకిస్తాన్ వినలేదు. ఎందుకంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికా వెళ్లిపోతే మళ్లీ తాలిబాన్లే అధికారంలోకి వస్తారని పాకిస్తాన్కు తెలుసు. వారిని మచ్చిక చేసుకుంటే, పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలను.. ముఖ్యంగా ‘తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్’ని వారు అణచివేస్తారని పాకిస్తాన్ ఆశపడింది.మాట వినని తాలిబాన్లు..!2021లో అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్ను వదిలి వెళ్ళిపోయాక, తాలిబాన్లు మళ్లీ కాబూల్ను హస్తగతం చేసుకున్నారు. పాకిస్తాన్ పండగ చేసుకుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు, పాకిస్తాన్ మాట వినడం మానేశారు. పాకిస్తాన్లో ఘోరమైన దాడులకు పాల్పడే ఖీఖ్కీ ఉగ్రవాదులను, అలాగే బలూచిస్తాన్ విముక్తి పోరాట సమూహాలను అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి ఆపడానికి తాలిబాన్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని ఫలితంగా పాకిస్తాన్లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ నివేదికల ప్రకారం.. గత పదేళ్లలోనే లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లో పాకిస్తాన్ భద్రతా బలగాలు భారీగా నష్టపోయాయి.దాదాపు 1,200 మందికి పైగా పాక్ సైనికులు, పోలీసులు ఈ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. దాంతో సహనం కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు అఫ్గానిస్తాన్ లోపల ఉన్న ఖీఖ్కీ స్థావరాలపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా కాబూల్, కాందహార్ నగరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ‘మీరు ఉగ్రవాదులను ఆపకపోతే నేరుగా మీపైనే దాడి చేస్తాం’ అని తాలిబాన్లకు హెచ్చరికలు పంపింది. దీంతో.. ఖతార్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ కుదిర్చినప్పటికీ.. అది ఎంతో కాలం నిలవలేదు. మొన్నటికి మొన్న పాకిస్తాన్లో జరిగిన ఒక ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ ఆర్మీ అఫ్గానిస్తాన్పై బాంబుల వర్షం కురిపించింది. దానికి కౌంటర్గా తాలిబాన్లు సరిహద్దుల్లో భారీ సైనిక దాడికి దిగారు. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్తాన్ డ్రోన్లు పాకిస్తాన్ సరిహద్దు దాటి వచ్చి దాడులు చేశాయి. ఇరు దేశాలూ ఇప్పుడు ఒక అంతం లేని యుద్ధ వలయంలో చిక్కుకున్నాయి.పాక్పై రగిలిపోతున్న తాలిబాన్లు?సరే, తాలిబాన్లు ఈ ఉగ్రవాదులను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇక్కడ రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, వారి దగ్గర సరైన వ్యవస్థలు, సైనిక సామర్థ్యం లేదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం అఫ్గానిస్తాన్లో ప్రస్తుతం 20కి పైగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నింటినీ అణిచివేయడం తాలిబాన్ల వల్ల కావడం లేదు. రెండోది, తాలిబాన్లలోనే అంతర్గతంగా గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఒప్పుకొన్నా, మరో గ్రూప్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తోంది. అయితే, ఈ నిరంతర యుద్ధ వాతావరణంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. అదే.. రష్యా ఎంట్రీ!గత ఏడాది తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఆ తర్వాత ఈ ఏడాది మే నెలలో రష్యా, అఫ్గానిస్తాన్తో ఒక కీలకమైన సైనిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, అఫ్గానిస్తాన్ దగ్గరున్న పాత సోవియట్ కాలపు ఆయుధాలను, యుద్ధ విమానాలను రష్యా రిపేర్ చేసి, ఆధునీకరిస్తుంది. ఈ ఒప్పందం తర్వాత తాలిబాన్ల రక్షణ మంత్రి ఒక సంచలన ప్రకటన చేశారు. ‘ఇకపై పాకిస్తాన్ మాపై దాడులు చేయడానికి ధైర్యం చేయలేదు’ అనేది దాని సారాంశం. అంటే రష్యా అండ చూసుకునే తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని అర్థం చేసుకోవచ్చు.రష్యాకు వచ్చే లాభమేంటంటే..?తాలిబాన్లకు సహాయం చేయడం వల్ల రష్యాకు వచ్చే లాభం ఏంటి? మొదటి లాభం ఏంటంటే.. రష్యాకు కూడా ఉగ్రవాద భయం ఉంది. 2024లో మాస్కో కాన్సెర్ట్ హాల్పై దాడి చేసిన ‘ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్’ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నారు. తాలిబాన్లతో దోస్తీ చేస్తే, ఆ ఉగ్రవాదులను అణచివేయవచ్చన్నది రష్యా ప్లాన్. ఇక రెండోది, ఉక్రెయిన్ యుద్ధం వల్ల సెంట్రల్ ఆసియాలో రష్యా కోల్పోయిన పట్టును మళ్లీ సాధించడం. ఇందుకోసం రష్యా తన నేతృత్వంలోని ఇ ఖీౖ కూటమిని వాడుకుంటోంది. తజకిస్తాన్ సరిహద్దుల్లో రష్యా తన సైనిక ఉనికిని భారీగా పెంచుతోంది. చివరగా చెప్పాలంటే.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి కుదరాలంటే అఫ్గాన్ గడ్డపై ఉగ్రవాదం అంతం కావాలి. అందుకు తాలిబాన్లకు సైనిక, ఆర్థిక సహాయం అవసరం. ఇప్పుడు రష్యా ఆ పాత్రను పోషించడానికి సిద్ధమైంది. మరి రష్యా రాకతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందా? లేదా పాకిస్తాన్, రష్యాల మధ్య కొత్త విభేదాలకు దారితీస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి. -హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
పాకిస్తాన్కు బిగ్ ఝలక్..
న్యూఢిల్లీ: సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ పాకిస్తాన్ను నేరుగా, నిర్మొహమాటంగా విమర్శించారు. అమెరికా-ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం పాకిస్తాన్ ప్రపంచ ప్రతిష్టను పెంచవచ్చేమో, కానీ.. దేశంలో అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించలేదన్నారు. కౌసికన్ సూటిగా పాక్ వైఫల్యం అంచున ఉన్న దేశమన్నారు. పాకిస్తాన్ సమస్య భారత్, ఆఫ్ఘనిస్థాన్ కాదని, దాని సొంత రాజకీయ నాయకులు, సైన్యమేనని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందని ఒక ప్రపంచ సదస్సులో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా కౌసికన్..‘పాకిస్తాన్ దౌత్యపరమైన ఎత్తుగడలను బాగా వేసి ఉండవచ్చు, కానీ అది దేశ ప్రజలకు అన్నం పెట్టదని నొక్కి చెప్పారు. ఒక దౌత్యపరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పాకిస్తాన్ చాలా చురుకుగా, చాలా విజయవంతంగా వ్యవహరించిందని, అమెరికా దృష్టిలో దౌత్యపరంగా పాకిస్తాన్ను పునరుద్ధరించడానికి అది కొంతవరకు దోహదపడిందని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించడానికి అది పెద్దగా ఏమీ చేయలేదన్నారు. తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మొదటి 10 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. పాక్ ఇటీవలి దౌత్య విజయాలు దీర్ఘకాలంలో అమెరికాతో దాని సంబంధాలను మారుస్తాయన్న అంచనాలపైనా ఆయన నీళ్లు చల్లారు. పాక్పై విధించిన ఆంక్షలన్నింటినీ అమెరికా ఎప్పటికీ ఎత్తివేయదని స్పష్టం చేశారు. భౌగోళిక కారణాలు సాకు మాత్రమే... భారత్, ఆఫ్ఘనిస్థాన్లతో ఉన్న సరిహద్దుల వల్లే పాకిస్తాన్ సమస్యలు ఎదుర్కొంటోందన్న ఓ పాక్ జర్నలిస్ట్ అభిప్రాయాన్ని ఆయన తిప్పికొట్టారు. ‘‘ప్రతిదానికీ భౌగోళిక స్థానాన్ని కారణంగా చూపలేరు. అది కేవలం ఒక సాకు మాత్రమే. ఆ సంక్షోభం పాక్ రాజకీయ నాయకులు, సైన్యం సృష్టించుకున్నదే’’ కౌసికన్ పేర్కొన్నారు. ప్రారంభం నుంచీ పాక్లో పాలన దారుణంగా ఉంది. నాకు ఎలాంటి పరిష్కారం కనిపించడం లేదు. అక్కడి రాజకీయ నాయకులు, పారీ్టలు వృధా. ఈ సమస్యలో సైన్యం కూడా పెద్ద భాగంగా ఉంది’’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ స్వతంత్ర చరిత్రలో దాదాపు సగం కాలం పాటు సైన్యం పాలనలోనే ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యకలాపాలపై సైన్యం ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కౌసికన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
‘తక్షశిల జోలికి వెళ్లొద్దు’.. పాక్కు యునెస్కో హెచ్చరిక
పాకిస్థాన్లోని వేదకాలపు నాటి తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న పరిరక్షణ పనులపై ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం యునెస్కో హెచ్చరించింది. ఈ పురాతన కట్టడాల సంరక్షణ పనుల్లో సిమెంట్ వాడటమే కాక, ఇతర ఆధునిక ముడి పదార్థాలు వినియోగించడాన్ని గుర్తించింది. ఇది యునెస్కో నిబంధనలకు విరుద్ధమని పేర్కొని, ప్రపంచ వారసత్వ ప్రదేశ జాబితాలోంచి తక్షశిల తొలగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. పాకిస్థాన్ పురావస్తు శాఖ ఇటీవల తక్షశిలలో ప్రారంభించిన పునరుద్ధరణ పనుల్లో సిమెంట్ వినియోగించింది. తద్వారా పురావస్తు స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి యునెస్కో అంతర్జాతీయంగా ఆమోదించిన సూత్రాలను ఉల్లంఘించింది.పాకిస్తాన్ ప్రస్తుతం ఖైబర్ పఖ్తున్వాలోని బునెర్లో ఉన్న బౌద్ధ క్షేత్రమైన రాణి ఘాట్తో పాటు సింధ్లోని థట్టాలో ఉన్న స్కిథో-పార్థియన్, బౌద్ధ క్షేత్రమైన భాన్భోర్ వంటి ప్రదేశాలకు ప్రపంచ వారసత్వ హోదాను కోరుతోంది. అయితే తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ చర్చల సమయంలో తక్షశిల వివాదం పాక్ చేసిన ప్రతిపాదనలకు ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. -
పాక్ హెచ్చరికలను తిప్పికొట్టిన భారత్
ఢిల్లీ: పాక్ బెదిరింపుల వేళ.. సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని పాకిస్థాన్కు భారత్ తెగేసి చెప్పింది. సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ.. పొరుగు దేశం.. ఉగ్రవాదానికి పూర్తిగా స్వస్తి చెప్పేంత వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత్ తేల్చి చెప్పింది. ఒప్పందం ఇప్పటికీ అమలులోనే ఉందని.. నీళ్లను ఆయుధంగా మార్చవద్దంటూ పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సహా ఇతర మంత్రులు చేసిన హెచ్చరికలను భారత్ తిప్పికొట్టింది.గత ఏడాది (2025) ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి నుంచి పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు అబద్ధాలు చెప్తోంది. సరిహద్దు నదులను పంచుకునే ఇతర దేశాలకు భారత్ నిర్ణయం ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనికి సమాధానంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నేడు పాకిస్తాన్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపనంత వరకు ఏదీ మారదని తేల్చిచెప్పింది.సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. పాకిస్తాన్ నిరంతరం సాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఈ ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడింది. పాకిస్తాన్ నమ్మదగిన విధంగా శాశ్వతంగా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలంటూ రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదానికి సురక్షిత స్థావరంగా మారిన పాకిస్తాన్, సింధు జలాల విషయంలో తానే తవ్వుకున్న గోతిలో పడి విలవిలలాడుతోందని.. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న ఈ దేశం, ఇప్పటికీ భారత్పై, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్పై దాడులు చేయడానికి ఉగ్రవాదులకు తన భూభాగాన్ని వాడుకునేలా అనుమతిస్తూనే ఉంది’’ అంటూ రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు.1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. -
బలూచిస్థాన్లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం
క్వెట్టా/ఇస్లామాబాద్: పాకిస్థాన్ దక్షిణ పశ్చిమ రాష్ట్రం బలూచిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.శుక్రవారం ఉదయం క్వెట్టా నుంచి దేశ రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సు షెరాని–జోబ్ హైవేపై దనసర్ ప్రాంతంలో అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్పష్టత లేదు. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.Very sad news 😢💔At least 40 killed, 8 injured as passenger bus falls into ravine near Balochistan-KP border.#Balochistan #Accident pic.twitter.com/N222P3v64y— Balochistan Ko Bachao (BKB) (@balochistankb) July 3, 2026బస్సు ఒవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మార్గమధ్యంలో మరో బస్సు చెడిపోవడంతో అక్కడి ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారని వెల్లడించారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగడం.. బస్సు అదుపు తప్పి ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. షెరాని డిప్యూటీ కమిషనర్ హజ్రత్ వాలి కకర్ మాట్లాడుతూ, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామని, మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (MERC) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 40 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన ఎనిమిది మందిని వెంటనే జోబ్ ట్రామా సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నీటి ప్రవాహంలో కాకుండా బండ రాళ్ల మీద బస్సు పడడంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా నమోదైందని చెబుతున్నారు. ప్రమాద స్థలంలో ఆరు అంబులెన్సులు, 12 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, పది లైట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహాయక చర్యల్లో వచ్చి చేరాయి. స్థానిక అధికారులతో పాటు సమీప ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంత రెస్క్యూ బృందాలు కూడా ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. -
‘తుపాకులు ఇచ్చింది మీరే.. ఇప్పుడు ఉగ్రవాదులమంటారా?’
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పరిపాలనలోని కశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. కాశ్మీరీల చేతుల్లో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.రావలకోట్లో జరిగిన భారీ నిరసన సభలో అమన్ ఖాన్ మాట్లాడుతూ.. కాశ్మీరీల చేతుల్లో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే. ఇప్పుడు అదే సైన్యం మమ్మల్ని ఉగ్రవాదులని పిలుస్తోంది. ఇది ప్రజలను మోసం చేసే ప్రయత్నం. అంతేకాకుండా, ఎన్నో సంవత్సరాలుగా కాశ్మీర్ ప్రజలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం, ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తున్న వారిపైనే ఉగ్రవాదుల ముద్ర వేస్తోందని ఆయన ఆరోపించారు.కాగా, పీవోకేలో గత కొన్ని వారాలుగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీల పెంపు, పరిపాలనా వైఫల్యాలు, రాజకీయ హక్కుల కొరత వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రావలకోట్ సహా పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిరసనకారులు పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ, తమ ప్రాంతానికి మరింత స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రసంగాల్లో పాకిస్తాన్ పరిపాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయితే, పీవోకేలో కొనసాగుతున్న ఈ పరిణామాలు అక్కడి రాజకీయ పరిస్థితులు, ప్రజా అసంతృప్తిపై మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.భారత్ వైఖరి..భారత్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) భారతదేశంలో అంతర్భాగమే అనే అధికారిక వైఖరిని కొనసాగిస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ మాత్రం ఈ ప్రాంతంపై తన పరిపాలనా హక్కును సమర్థిస్తోంది. కాశ్మీర్ అంశంపై ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. -
పాకిస్థాన్లో ఫ్రెంచ్ మహిళ 10 ఏళ్ల బందీఖానా.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్!
భావప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో, ఒక మహిళ తన ఐదుగురు పిల్లలతో కలిసి ఏకంగా పదేళ్ల పాటు చీకటి గదిలోనే బందీగా నలిగిపోయిన ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘోర మానవ హక్కుల ఉల్లంఘన ఉదంతం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.2014లో పాకిస్థాన్కు వచ్చిన నాటి నుండి నేటి వరకు కనీసం సూర్యరశ్మి కూడా సరిగ్గా తగలని ఒక మట్టి ఇటుకల గదిలో బందీగా మారిన ఒక ఫ్రెంచ్ మహిళను, ఆమె ఐదుగురు పిల్లలను పాకిస్థాన్ పోలీసులు ఎట్టకేలకు రక్షించారు. లవ్ మ్యారేజ్, విదేశీ ప్రయాణం జీవితాన్ని మారుస్తుందని ఆశపడిన ఆ మహిళకు పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ఒక నరకకూపాన్ని ఎలా పరిచయం చేసిందో వివరిస్తూ సాగే ఒక సంచలన నిజాల కథనం ఇది.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే, 54 ఏళ్ల సిల్వీ యాస్మినా అనే ఫ్రెంచ్ మహిళ తన పాకిస్థానీ భర్త అహ్మద్ ఖాన్తో కలిసి పన్నెండేళ్ల క్రితం పాకిస్థాన్ అడుగుపెట్టింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బారా అనే చిన్న పట్టణంలో ఒక శిథిలావస్థకు చేరిన మట్టి ఇటుకల ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లిన భర్త, నాటి నుండి ఆమె బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా కట్టడి చేశాడు. మానసికంగా, శారీరకంగా విపరీతమైన క్రూర స్వభావం కలిగిన అహ్మద్ ఖాన్, రోజువారీగా ఆమెను పశువుకంటే హీనంగా హింసించేవాడు.కేవలం గదికే పరిమితం చేయడమే కాకుండా, బాహ్య ప్రపంచానికి ఏ చిన్న సమాచారం పొక్కినా చంపేస్తానని బెదిరిస్తూ పదేళ్లకు పైగా ఒక బందీలా ఉంచాడు. ఈ క్రమంలో పుట్టిన ఐదుగురు పిల్లలను కూడా కనీసం స్కూలు ముఖం చూడనివ్వకుండా, ఆ నలుగు గోడల మధ్యే బంధీలుగా ఉంచడం ఆ భర్త క్రూరత్వానికి పరాకాష్టగా నిలిచింది. అయితే, ఈ సుదీర్ఘ నరకయాతన నుండి బయటపడటానికి ఆ దేవుడే ఒక మార్గాన్ని చూపించాడు. ఒకరోజు భర్త కళ్ళు కప్పి, యాస్మినా కుమారుల్లో ఒకడు అత్యంత చాకచక్యంగా ఆ ఇరుకైన బందీఖానా నుండి తప్పించుకున్నాడు.ఎలాగోలా ప్రాణాలు చేతబట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆ బాలుడు, తన తల్లి పడుతున్న నరకయాతనను, తమ బందీఖానా గురించిన వివరాలను పోలీసులకు వివరించాడు. బాలుడి మాటలకు దిగ్భ్రాంతి చెందిన జిల్లా పోలీస్ చీఫ్ వకార్ అహ్మద్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగింది. నిఘా నీడన ఉన్న ఆ మట్టి ఇటుకల ఇంటిపై మెరుపు దాడి చేసి, ముఖంపై తీవ్ర గాయాలతో దీనస్థితిలో ఉన్న సిల్వీ యాస్మినాను, ఆమె ఐదుగురు పిల్లలను సురక్షితంగా రక్షించారు. క్రూర భర్త అహ్మద్ ఖాన్ను అక్కడికక్కడే అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం జైలుకు తరలించారు.రక్షించబడిన అనంతరం పోలీసులు రికార్డ్ చేసిన వీడియోలో సిల్వీ యాస్మినా ఇంగ్లీష్, ప్యాంటో భాషల మిశ్రమంలో మాట్లాడుతూ, తనను ఈ నరకం నుండి కాపాడిన పోలీసు అధికారులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. 2014 నుండి తాను ఈ దేశంలో కనీసం స్వేచ్ఛగా శ్వాస కూడా తీసుకోలేకపోయానని, కళ్లెదుటే పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోదించానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన పిల్లలను ఎలాగైనా తిరిగి ఫ్రాన్స్ పంపించి వేయాలని ఆమె అధికారులను వేడుకుంది. ప్రస్తుతం బాధితులకు రక్షణ కల్పించేందుకు వారిని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ ప్రభుత్వం, బాధితుల స్వదేశీ పునరావాసం కోసం ఇస్లామాబాద్లోని ఫ్రెంచ్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతోంది.పాకిస్థాన్లో మహిళలపై జరిగే గృహహింస, సంప్రదాయాల పేరుతో సాగే వేధింపుల తీవ్రతకు ఈ అంతర్జాతీయ ఘటనే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం, పాకిస్థాన్లో ప్రతి ఏటా వందలాది మంది మహిళలు భర్తలు, కుటుంబ సభ్యుల చేతిలో శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు. అయితే సమాజానికి భయపడి చాలా కేసులు వెలుగులోకి రావడం లేదు. ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాల్లో కఠినమైన సంప్రదాయ నిబంధనలను ఉల్లంఘించారనే నెపంతో అక్కడ ఏటా ఎంతో మంది మహిళలు పరువు హత్యలకు గురవుతున్నారు. ఒక విదేశీ మహిళకే ఇలాంటి దుస్థితి పడితే, ఇక స్థానిక మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలంటూ సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ సమాజంతో పాటు స్థానిక చట్టాలకు కూడా ఒక పెద్ద మేల్కొలుపు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘పాక్’లో కూలిన ట్యూషన్ సెంటర్ పైకప్పు.. 14 మంది మృతి!
లాహోర్: పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాహ్లా జిల్లా పరిధిలోని ఈద్గా బస్తీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక నివాస భవనం పైకప్పు కూలిపోయింది. అక్కడ ఒక ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో 14 మంది పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏడు నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు క్లాసులో ఉన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు, స్థానికులు శిథిలాల నుండి 20 మందిని సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిలో ఒక మహిళా ఉపాధ్యాయురాలితో పాటు మరో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భవనంపై కార్మికులు పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, నాణ్యతా లోపమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి కాంట్రాక్టర్తో సహా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ విషాద ఘటనపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈ ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి, వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను, జిల్లా అధికారులను ఆదేశించారు. -
పాక్పై వైమానిక దాడులు.. తాలిబాన్ సంచలన ప్రకటన
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాకిస్థాన్ భూభాగంలోని ఐసిస్-ఖొరాసాన్ (ISIS-K) ఉగ్రవాద స్థావరాలపై తమ బలగాలు వైమానిక దాడులు నిర్వహించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ దాడుల్లో ఉగ్రవాద శిబిరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు లక్ష్యంగా చేసుకున్నామని, అక్కడి నుంచే ఆఫ్ఘనిస్తాన్లో దాడులకు కుట్రలు జరుగుతున్నాయని తాలిబాన్ అధికారులు వెల్లడించారు.తాలిబాన్ సర్కార్ ప్రకటన ప్రకారం.. పాకిస్థాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో ఐసిస్-ఖొరాసాన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తమకు నిఘా సమాచారం అందిందని పేర్కొన్నారు. దేశ భద్రత దృష్ట్యా ముందస్తు చర్యగా ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లిందని తాలిబాన్ వర్గాలు పేర్కొన్నప్పటికీ, మృతులు లేదా గాయపడిన వారి సంఖ్యపై అధికారిక సమాచారం వెల్లడించలేదు.అయితే, ఆఫ్ఘనిస్తాన్ చేసిన ఈ ప్రకటనలను పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. తమ భూభాగంలో తాలిబాన్ పేర్కొన్న ప్రాంతాల్లో ఐసిస్ స్థావరాలు లేవని, వైమానిక దాడులు జరిగాయన్న వాదన కూడా నిరాధారమని స్పష్టం చేసింది. తాలిబాన్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఇస్లామాబాద్ పేర్కొంది.ఇటీవలి నెలలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సరిహద్దు దాటుతున్న ఉగ్రవాద గ్రూపులకు ఒకరిపై మరొకరు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), ఐసిస్-ఖొరాసాన్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల విషయంలో ఇరు దేశాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గతంలో పాకిస్థాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రకటించగా, వాటిలో పౌరులు మరణించారని తాలిబాన్ తీవ్రంగా ఆరోపించింది.ప్రస్తుతం తాలిబాన్ ప్రకటించిన ఈ వైమానిక దాడులపై స్వతంత్రంగా ధృవీకరణ లభించలేదు. దాడులు జరిగిన ప్రాంతాలు, నష్టం వివరాలు, మృతుల సంఖ్య వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, ఈ పరిణామం దక్షిణాసియాలో భద్రతా పరిస్థితులు, ఆఫ్ఘనిస్తాన్–పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాక్ వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన చేసిన పీవోకే ప్రజలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పాక్లో భాగం కాదని, అంతేగాక తాము భారత్తో సంబంధాలు పెంచుకుంటామని పీవోకేలో నిరసనకారులు హెచ్చరించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని రావలాకోట్ ప్రాంత ప్రజలు వేల సంఖ్యలో నిరసన తెలుపుతున్నారు. పాకిస్థాన్ పాలనపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆగ్రహం కారణంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ సహా స్థానిక నేతలు నాయకత్వం వహిస్తున్నారు. రావలాకోట్లో వేలాది మంది నిరసనకారులు మంగళవారం 22వ రోజూ ఆందోళన కొనసాగించారు.ఈద్గాహ్ మైదానంలో జరిగిన నిరసనలో పలువురు నాయకులు మాట్లాడారు. పీవోకేను ఇకపై పాకిస్థాన్ అధీన ప్రాంతంగా పరిగణించకూడదని పేర్కొన్నారు. భారత్తో మరింత బలమైన సంబంధాలు ఏర్పరచుకునే దిశగా అడుగులు వేస్తామని పాక్ సర్కారుని హెచ్చరించారు.పాలనపై చాలా కాలంగా ఉన్న అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అణచివేత, పాలనా నిర్లక్ష్యంపై ఈ ఉద్యమం ప్రారంభమైంది. నిరసనల సమాచారం బయటకు వెళ్లకుండా, ప్రజల్లో అవగాహన పెరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అధికారులు జూన్ 5 నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పాకిస్థాన్ అధికారులు 2 వారాల పాటు ఆహార సరఫరా, ఇతర అత్యవసర వస్తువుల రాకపోకలను అడ్డుకోవడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది.అమన్ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాకిస్థాన్ పరిపాలనలో ఉన్న కశ్మీర్ పాకిస్థాన్లో భాగం కాదని, తమకు పాకిస్థాన్ అవసరం కంటే, పాక్కే ఈ ప్రాంత అవసరం ఎక్కువని వ్యాఖ్యానించారు. ఆహారం, ఇతర అత్యవసర వస్తువులపై ఆంక్షలు కొనసాగితే ఈ ప్రాంత ప్రజలు సాయం కోసం భారత్ వైపు చూడవచ్చని అన్నారు. అలా జరిగితే ప్రాంత రాజకీయ పరిస్థితులు మారిపోతాయని, పాకిస్థాన్పై ఒత్తిడి పెరుగుతుందని అమన్ ఖాన్ చెప్పారు.ఒక వీడియోలో.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఈ ప్రాంతం పాకిస్థాన్లో భాగం కాదని ప్రకటించారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ను తిరస్కరిస్తున్నామని, నియంతృత్వాన్ని సహించబోమని చెప్పారు. ఈ నిరసనలు పాక్ ఆక్రమిత కశ్మీర్కే పరిమితం కాలేదు. విదేశాల్లో నివసిస్తున్న మద్దతుదారులు కూడా పలు దేశాల్లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు.*RAWALAKOT ROARS:* "PoJK Is Not Part of Pakistan" Thousands defy Islamabad. Sit-in at LoC since 9 June. Aman Khan: "If Pakistan blocks food, PoK's borders could open. Islamabad will beg PoK to stay." @CMShehbaz oppression has consequences. @UN @POTUS @narendramodi… pic.twitter.com/GhI0XWjwDk— 🇮🇳Bhartiyavibhooti🇮🇳 (@Bhartiyavibhoti) June 30, 2026 -
కశ్మీర్లో కలకలం: పోలియో ప్రకటనపై పాక్ నినాదం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖలో ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపింది. అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ఒక కరపత్రంలో పొరుగు దేశానికి సంబంధించిన నినాదం కనిపించడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక అనధికారిక పోలియో నినాద పత్రంపై జమ్ముకశ్మీర్ ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే నినాదంతో కూడిన ఈ వివాదాస్పద కరపత్రం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో, ఉన్నతాధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి అత్యవసర విచారణకు ఆదేశించారు.రాజౌరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్-2026కు సంబంధించిన ఒక ప్రకటన సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవ్వడాన్ని గుర్తించారు. ఈ కరపత్రం బ్లాక్ మెడికల్ ఆఫీసర్ (బీఎంఓ) కార్యాలయం ద్వారా అధికారికంగా ప్రచురించినట్లు ఉంది. దీనిపై తీవ్రంగా స్పందించిన రాజౌరి సీఎమ్ఓ, సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్కు తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.ఈ కరపత్రాన్ని పరిశీలించిన అధికారులకు అందులో నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ లోగోతో పాటు ‘పోలియో ఫ్రీ పాకిస్తాన్’ అనే టెక్స్ట్ కనిపించింది. ఈ లోగో లేదా నినాదానికి జమ్ముకశ్మీర్ ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యా విభాగంతో కానీ, లేదా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కానీ ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ పత్రంలో సదరు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ పేరు, అధికారిక హోదా స్పష్టంగా ముద్రించి ఉండటం గమనార్హం.ఇది కూడా చదవండి: ముంబై ఘటన: జింక్ ఫాస్ఫైడ్ అంత ప్రమాదకరమా? -
'ఆ చేతులు నరికేస్తాం'.. భారత్పై పాక్ ప్రేలాపనలు
భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరింత ముదురుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని అమలులో నిలిపివేసిన భారత్పై పాకిస్థాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘పాక్కు రావాల్సిన నీటిని అడ్డుకునే చేతులను నరికేస్తాం’’ అంటూ ఆ దేశ మంత్రి ఒకరు హెచ్చరికలు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సింధు జలాల ఒప్పందం(Indus Water Treaty)పై పాకిస్థాన్ ప్రభుత్వం మరోసారి భారత్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇస్లామాబాద్లో ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్, పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ సోమవారం సంయుక్త పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో.. భారత్ తమ దేశానికి రావాల్సిన నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు."పొరుగు దేశ ప్రధాని తన చేతిలో ఉన్న కుళాయిని మూసేస్తానంటున్నారు. పాకిస్థాన్కు ఒక్క చుక్క నీళ్లు కూడా రానివ్వనని చెబుతున్నారు. మా వాటా నీటిపై ఎవరైనా చేయి వేస్తే.. ఆ చేతులను నరికేస్తాం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే సింధు జలాల ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పష్టం చేశారు.ఒప్పందం ఇప్పటికీ అమల్లోనే: పాక్సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ మాట్లాడుతూ.. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ చట్టబద్ధంగానే అమల్లో ఉందన్నారు. ఒక దేశం ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం, సవరించడం లేదా నిలిపివేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పాకిస్థాన్కు నీటిపై ఉన్న హక్కులు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా న్యాయ నిపుణులు, జలవనరుల నిపుణులతో ఇస్లామాబాద్లో అంతర్జాతీయ సదస్సు కూడా నిర్వహిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. భారత్ నిర్ణయానికి అంతర్జాతీయ మద్దతు లభించలేదని కూడా పాక్ అంటోంది.🚨 Water Gone. Threats On."Touch Our Water, We'll Cut Off Your Hand": Pakistan Minister Musadik Malik.Arre bhai, koi inko batao... pichhle 1.5 saal se paani hi band haiVideo: ARY news pic.twitter.com/Kc1d2JxCN4— OsintTV 📺 (@OsintTV) June 29, 2026పహల్గామ్ తర్వాత.. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్కు కేటాయించారు. అయితే 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని చెబుతున్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా ముగింపు పలికే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే భారత్వ వాదనను పాకిస్థాన్ ఖండించింది.యుద్ధ హెచ్చరికలు కూడా..సింధు జలాల వివాదంపై ఇప్పటికే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. నీటి భద్రత తమ జాతీయ భద్రతలో భాగమని, దానికి ముప్పు ఏర్పడితే భారత్పై యుద్ధానికి కూడా వెనుకాడబోమని వ్యాఖ్యానించారు. తాజా ప్రకటనలతో పాకిస్థాన్ మరోసారి అదే వైఖరిని కొనసాగించింది.భారత్ ఏమంటోంది?అయితే భారత్ మాత్రం పాక్ ప్రేలాపనలు పట్టించుకోవడం లేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత ప్రతినిధి అనుపమా సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంలో భాగంగా ఉపయోగించే దేశం సహకార ఒప్పందాల ప్రయోజనాలు కోరడం తార్కికం కాదన్నారు. 1960లో కుదిరిన ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అతీతంగా శాశ్వత హక్కుగా పరిగణించలేమని ఆమె స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అందుకే సింధు జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తుత వాస్తవాలకు అనుగుణంగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అలాగే జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించిన భారత్, అంతర్జాతీయ వేదికలను ఉపయోగించి పాకిస్థాన్ ఉగ్రవాదం, అంతర్గత సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.మరోసారి మాటల యుద్ధంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక ఉద్రిక్తతలు పెరిగిన వేళ.. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం కూడా మరో ప్రధాన వివాదంగా మారింది. ఒకవైపు పాకిస్థాన్ యుద్ధ హెచ్చరికలు, మరోవైపు ఉగ్రవాదం కొనసాగినంత కాలం సహకారం ఉండదన్న భారత్ వైఖరితో.. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది. పరిస్థితి ఎలా మారుతుందన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. -
అఫ్గాన్ సరిహద్దుల వెంట దాడులు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ సరిహద్దుల వెంబడి జరిపిన దాడుల్లో కనీసం 29 మంది మిలిటెంట్లు హతమయ్యారని పాకిస్తాన్ ప్రకటించింది. శనివారం కరాచీలోని పారామిలటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై మిలిటెంట్లు జరిపిన దాడికి ఇది ప్రతిస్పందన అని సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ చెప్పారు. నిఘా వర్గాలందించిన పక్కా సమాచారం మేరకు ఖైబర్ ప్రావిన్స్లోని బజౌర్ జిల్లా పరిధిలోని జమాత్ ఉల్ అహ్రార్, ఫిత్నా అల్ ఖ్వారిజ్లకు చెందిన మూడు స్థావరాలపై ఈ వైమానిక దాడులు జరిగాయన్నారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. కరాచీలోని పాక్ రేంజర్స్ హెడ్డాఫీసుపై దాడికి తమదే బాధ్యతంటూ నిషేధిత జమాతుల్ అహ్రార్ ప్రకటించుకుంది. 2,600 కిలోమీటర్ల పొడవైన అఫ్గాన్ సరిహద్దుల్లోని తాలిబన్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఫిబ్రవరిలో ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్ పేరుతో కనీసం 53 ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది. సరిహద్దులకు సమీపంలోని తమ ఖైబర్, బలూచిస్తాన్ ప్రావిన్స్లలో అఫ్గాన్లోని తాలిబన్లు ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. తాజాగా పాకిస్తాన్ చేపట్టిన దాడులను అఫ్గానిస్తాన్ ఖండించింది. తమ కునార్, పక్టియా, పక్టికా ప్రావిన్స్లపై దాడులకు దిగడాన్ని గగనతల అతిక్రమణ, సార్వభౌమత్వానికి భంగకరమంటూ పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ కూడా కరాచీలోని రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడికి అఫ్గాన్ మిలిటెంట్లే కారణమంటూ ఆ దేశ దౌత్యాధికారికి సమన్లు పంపించింది. -
17 ఏళ్లుగా అతడు అదృశ్యం.. ఇప్పటికీ పోరాడుతున్న కుమార్తె
పారిస్: బలోచ్ నేషనల్ మూవ్మెంట్ (బీఎన్ఎమ్) సీనియర్ నేత డాక్టర్ దీన్ ముహమ్మద్ బలోచ్ అదృశ్యమై 17 ఏళ్లు అవుతోంది. బలోచ్ స్వేచ్ఛ కోసం గొంతెత్తిన వారిని అదృశ్యం చేసి, వారి ఆచూకీని తెలియకుండా చేసే పాకిస్థాన్ చర్యలకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. తన తండ్రి ఆచూకీ తెలుసుకోవాలని, అదృశ్యమైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ 17 ఏళ్లుగా శాంతియుతంగా పోరాడుతున్నా, ఆమెకూ బెదిరింపులు ఎదురవుతున్నాయని బలోచ్ నేషనల్ మూవ్మెంట్ ఆరోపిస్తోంది.ముహమ్మద్ బలోచ్ అదృశ్యానికి 17 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీఎన్ఎమ్ అధ్యక్షుడు డాక్టర్ నసీమ్ బలోచ్ స్పందించారు. బలోచిస్థాన్లో అదృశ్యమైన వారు పడుతున్న బాధలకు ఈ ఘటన ఇప్పటికీ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.ఎక్స్లో డాక్టర్ నసీమ్ బలోచ్ దీనిపై మాట్లాడుతూ.. "ఇన్నేళ్లుగా ఓ వ్యక్తి అదృశ్యమైతే ఏ కుటుంబమైనా భరించలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆయన కుటుంబ సభ్యులు అనిశ్చితి, వేదన మధ్య జీవిస్తున్నారు. ఆయనకు ఏమైందో తెలుసుకునే కనీస హక్కు కూడా వారికి దక్కలేదు" అని అన్నారు.డాక్టర్ దీన్ ముహమ్మద్ కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ను నసీమ్ బలోచ్ ప్రస్తావిస్తూ.. "తన తండ్రితో పాటు.. అదృశ్యమైన వారిని తిరిగి తీసుకురావాలన్న శాంతియుత పోరాటానికి ఆమె ధైర్యంగా అంకితమైంది. న్యాయం దక్కాల్సిన చోట కూడా ఆమె బెదిరింపులను ఎదుర్కొంటోంది. ఆమె మానవ హక్కుల పోరాటాన్ని, తన తండ్రి తిరిగి రావాలన్న ఉద్యమాన్ని విడిచిపెట్టేలా బెదిరింపులు, భయపెట్టే చర్యలు ఎదుర్కొంటోంది" అని ఆరోపించారు. ఈ ఘటన పాకిస్థాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు నిదర్శనమని ఆరోపించారు. ఇది కఠిన వాస్తవాన్ని బయటపెడుతోందని, పాకిస్థాన్లో ప్రభుత్వ తీరును ప్రశ్నించే వారికి మానవ హక్కులు, న్యాయం లేకుండా చేస్తున్నారని తెలిపారు. అదృశ్యమైన కుటుంబ సభ్యుడి గురించి సమాచారం అడగడాన్నే నేరంగా చూస్తున్నారని, మానవ హక్కుల పరిరక్షకులను గొంతెత్తినందుకు బెదిరిస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్ పాలనలో తమ బలోచ్ ప్రజలు మౌలిక హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను సాధించలేరని బీఎన్ఎమ్ నమ్ముతోందని అన్నారు. "చివరకు సత్యం, న్యాయమే గెలుస్తాయని మేము నమ్ముతున్నాం. మా లక్ష్యాలు నెరవేరే వరకు మా శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తాం" అని తెలిపారు.పోరాటంలో వెనక్కితగ్గని కుమార్తె డాక్టర్ దీన్ ముహమ్మద్ బలోచ్ కుమార్తె సమ్మీ దీన్ బలోచ్ బలోచిస్థాన్లో అదృశ్యాలపై గళమెత్తుతున్న ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త. ఆమె తండ్రి 2009లో అదృశ్యమైనప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం నిరంతరం పోరాడుతోంది.ఆమె బలోచ్ యక్జెహ్తీ కమిటీలో కీలక నాయకురాలిగా, వాయిస్ ఫర్ బలోచ్ మిస్సింగ్ పర్సన్స్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 2014లో క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వరకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి, తన తండ్రితో పాటు అదృశ్యమైన బలోచ్లను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.బలోచిస్థాన్లో బలవంతపు అదృశ్యాలు, న్యాయ విచారణ లేకుండా జరిగే హత్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై కూడా ఆమె స్వరం వినిపిస్తోంది. మానవ హక్కుల పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు 2024లో ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ అవార్డు లభించింది.ఆందోళన కార్యక్రమాల సందర్భంగా ఆమెను పలుసార్లు పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు, విదేశీ ప్రయాణాన్ని కూడా అడ్డుకున్నట్లు మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. తండ్రి ఆచూకీ కోసం మొదలైన ఆమె పోరాటం, ఇప్పుడు బలోచిస్థాన్లో అదృశ్యమైన వేలాది మంది కుటుంబాల తరఫున న్యాయం కోరే ఉద్యమంగా మారింది. -
పాక్ దొంగ బుద్ధి.. డబుల్ ట్యాప్ వ్యూహం!
పాకిస్తాన్ కపట దాడులతో.. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు మరోసారి నెత్తురోడింది. అర్ధరాత్రి వేళ.. జనావాసాలు, మసీదులపై మొదటిసారి దాడులు జరగగా.. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనూ.. పాక్ అనైతికంగా మరోసారి మెరుపు దాడులు జరిపింది. ఈ ఘటనల్లో కనీసం 35 మంది మరణించారని, వాళ్లంతా నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తులని పాక్ ప్రకటించుకుంది. అయితే ఆఫ్ఘన్ అధికారులు మాత్రం మృతుల్లో ఎక్కువ మంది అమాయక ప్రజలే ఉన్నారని చెబుతున్నారు.పక్తికా, పక్తియా, కునార్ ప్రాంతాల్లో పాకిస్తాన్ వైమానిక దళం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో దాడులు ప్రారంభించినట్లు సమాచారం. 25 నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతాల్లో రెండో దశ దాడులు జరిగినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. వివాదాస్పదంగా భావించే “డబుల్ ట్యాప్” వ్యూహం ఈ దాడుల్లో అమలయ్యిందన్న ఆరోపణలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. మొదటి దాడుల తర్వాత సహాయక చర్యలకు వెళ్లిన వాళ్లపైనా రెండోసారి మెరుపు దాడి జరిగింది. ఈ ఘటనలతో మరణాల సంఖ్య పెరిగిందని, గాయపడిన వారి సంఖ్య వందకు పైగా చేరిందని తెలుస్తోంది.Pakistani airstrikes reportedly hit civilian areas in Afghanistan’s Paktia, Paktika, and Kunar provinces, killing more than 40 people—including women and children—and injuring dozens more. Reports describe it as one of the deadliest cross-border attacks in recent years pic.twitter.com/08pAHmtsKk— Israel Army (@Israeldefences) June 29, 2026పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్యలను ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా చేసిన “ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్లు”గా సమర్థించుకుంటోంది. దేశంలో ఇటీవల జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ సైనిక చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా టీపీపీ అనుబంధ గ్రూపులపై చర్యల భాగంగా ఈ దాడులు జరిగినట్లు పాకిస్తాన్ వాదిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. పౌర ప్రాంతాలు, ఇళ్లు, మసీదులే లక్ష్యంగా మారాయని, మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని కాబూల్ అధికారులు చెబుతున్నారు. పాకిస్తాన్ చేసిన చర్యలను “అక్రమ దాడులు”గా అభివర్ణిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.2021 తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. తరచూ సరిహద్దు ఉద్రిక్తతలు, పరస్పర ఆరోపణలు కొనసాగుతుండటంతో ప్రాంతంలో అస్థిరత నెలకొంది. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు కూడా పూర్తిగా నిలబడలేకపోయాయి. తాజా దాడులతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇల్లీగల్ కాదా?.. “డబుల్ ట్యాప్” అనే సైనిక వ్యూహాన్ని అంతర్జాతీయ చర్చల్లో చాలాసార్లు అత్యంత వివాదాస్పదమైన, మానవతా పరంగా తీవ్రంగా విమర్శించబడే పద్ధతిగా పేర్కొంటారు. సాధారణంగా మొదటి దాడి తర్వాత సహాయక బృందాలు, వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు చేరుకునే సమయంలో అదే ప్రాంతంపై రెండోసారి దాడి చేయడాన్ని డబుల్ ట్యాప్ దాడులంటారు. మానవ హక్కుల సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి. అయితే..ఇది అధికారిక అంతర్జాతీయ చట్టాల్లో ప్రత్యేకంగా “illegal by name”గా నిర్వచించబడకపోయినా.. పౌరుల భద్రత, యుద్ధ నిబంధనలు, జెనీవా కన్వెన్షన్ స్పిరిట్కు విరుద్ధమనే విమర్శలు బలంగా వినిపిస్తాయి. గతంలో కూడా ఇలాంటి వ్యూహాలపై ఆరోపణలు వివిధ యుద్ధాల సమయంలోనూ వినిపించాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దు ఘటనల్లో కూడా అదే తరహా “డబుల్ ట్యాప్” వ్యూహం ఉపయోగించారన్న ఆరోపణలు రావడంతో, ఇది మళ్లీ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. -
పాక్ పారా మిలటరీ హెడ్డాఫీసుపై ఉగ్ర దాడి
కరాచీలోని పారా మిలటరీ విభాగం పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై శనివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గులిస్తాన్–ఇ– జౌహార్ ప్రాంతంలోని ఈ కార్యాలయం గేట్ను వాహనంతో ఢీకొట్టిన సాయుధులు లోపలికి వస్తూనే కాల్పులకు దిగారని అధికారులు తెలిపారు. బలగాలు వెంటనే ధీటుగా స్పందించాయన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయినట్లు తెలిసిందన్నారు. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) నుండి విడిపోయిన ఉగ్రవాద ముఠా 'జమాత్-ఉల్-అహ్రార్' ప్రకటించుకుంది. 'ఖులాఫా-ఎ-రషీదీన్ ఇష్తిషాదీ బ్రిగేడ్' అనే ఆత్మాహుతి దళం ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది. పాకిస్తాన్లో ఇటీవల పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉగ్రదాడిపై దర్యాప్తును ప్రారంభించాయి. కంట్రోల్ రూమ్, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఉగ్రవాదులు లోపలికి ఎలా ప్రవేశించారనే కోణంలో విచారణ చేపట్టారు. కరాచీలో హై అలర్ట్స్ ప్రకటించారు. -
షాకింగ్: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రనేతలు?!
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ కార్యక్రమంలో లష్కర్-ఎ-తోయిబా (LeT) కీలక నేతలు, అందునా 2025 పహల్గామ్ దాడి అనుమానిత కీలక సూత్రధారి సైఫుల్లా కసూరి సహా పలువురు హాజరైనట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.Ex Cricketer Shoaib Akhtar's Brother died of heart attack!Shahid Akhtar's funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026సైఫుల్లా కసూరి గతంలో భారత్పై పలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 26/11 తరహా దాడుల గురించి, సముద్ర మార్గ దాడుల గురించి అతను చేసిన వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించాయి. పహల్గామ్ దాడికి ఇతనే సూత్రధారి అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు సైతం బలంగా ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలతో అతని కార్యకలాపాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎల్ఈటీకి రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్తాన్ మార్కాజీ ముస్లిం లీగ్ (PMML) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.జూన్ 24న గుండెపోటుతో అక్తర్ సోదరుడు మరణించారు. ఆయన కూడా మాజీ క్రికెటరే. గురువారం ఇస్లామాబాద్లోని హెచ్-8 గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో ప్రార్థనల సమయంలోనే వాళ్లంతా అక్కడ హల్చల్ చేశారు. అయితే.. క్రికెట్లో రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరున్న షోయబ్ అక్తర్.. భారత్ను ద్వేషించేలా మాట్లాడరు!. కానీ దాయాదుల పోరు సందర్భాల్లో ఎమోషనల్, ఫైర్డ్ కామెంట్స్ చేస్తారు. అదే సమయంలో భారత క్రికెట్ సిస్టమ్ను చాలాసార్లు ఓపెన్గా ప్రశంసించారు కూడా. అయితే షోయబ్ అక్తర్కు వాళ్లకు సంబంధాలు ఉన్నాయా? లేదంటే షాహిద్ అక్తర్కు వాళ్లు దగ్గరా?.. ఇప్పటివరకు షోయబ్ అక్తర్ నుంచిగానీ.. ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. Prominent figures and terrorists linked to Lashkar-e-Taiba (LeT) openly attended the funeral of Shahid Akhtar, the elder brother of former Pakistani cricketer Shoaib Akhtar, in Islamabad. pic.twitter.com/Src3ftlmf1— Vyom Pallav 🇮🇳 (@VyomPallav) June 27, 2026అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం లేదంటే స్థానిక భద్రతా సంస్థల నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాధిక్ కూడా అంత్యక్రియలకు హాజరు కావడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిషేధిత సంస్థల నేతల వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సాధారణంగా అత్యంత రహస్యంగా, నీడల్లో కనిపించే ఈ నెట్వర్క్ సభ్యులు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలా ప్రత్యక్షమవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో నిషేధాలు ఉన్నప్పటికీ ఈ ఉగ్రసంస్థలు పాక్లో రాజకీయ ముసుగులో కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ సంఘటన పాకిస్తాన్లో ఉగ్ర నెట్వర్క్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.భారత్ గతంలో చేపట్టిన చర్యలు, సరిహద్దు భద్రతా చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు మరింత సున్నితంగా మారాయి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీసింది. పరిశీలకులు మాత్రం.. నిషేధిత సంస్థలు పూర్తిగా కనుమరుగుకాకుండా “పాలిటికల్ షెల్టర్” లేదా “ఫ్రంట్ ఆర్గనైజేషన్స్” ద్వారా కొనసాగుతున్న అవకాశం ఉందని అంటున్నారు.LeT నెట్వర్క్ నేపథ్యంలష్కర్-ఎ-తోయిబా అనేది 1990ల చివర్లో ఏర్పడిన ఉగ్ర సంస్థగా గుర్తింపు పొందింది. భారత్లో 2008 ముంబై దాడులు సహా పలు భారీ దాడుల్లో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఇది నిషేధిత ఉగ్ర సంస్థగా గుర్తించబడింది. సైఫుల్లా కసూరి వంటి నేతలు ఈ సంస్థలో కీలక కమాండ్ స్థాయిలో ఉన్నారని భద్రతా విశ్లేషణలు చెబుతున్నాయి. -
భారత్ 7 పాకిస్తాన్ 1
లండన్: పురుషుల ప్రొ హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును మరోసారి చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన తమ 15వ లీగ్ మ్యాచ్లో భారత జట్టు 7–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (20వ ని.లో), హర్మన్ప్రీత్ సింగ్ (26వ ని.లో), హార్దిక్ సింగ్ (34వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (35వ ని.లో), అభిషేక్ (41వ ని.లో), రాజ్కుమార్ పాల్ (44వ ని.లో), దిల్ప్రీత్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ జట్టుకు అబూ మహమూద్ (13వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన తమ 14వ లీగ్ మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–4తో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. భారత్, పాకిస్తాన్ జట్లు 15 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. 17 పాయింట్లతో భారత్ 7వ స్థానంలో ఉండగా... ఆడిన 15 మ్యాచ్ల్లోనూ ఓడిన పాక్ చివరిదైన 9వ స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు తమ చివరి మ్యాచ్ను రేపు ఇంగ్లండ్తో ఆడుతుంది. -
పాకిస్తాన్లో ఫ్రెంచ్ మహిళకు విముక్తి
ఇస్లామాబాద్: ఏళ్ల తరబడి పాకిస్తాన్లో బందీగా ఉన్న ఓ ఫ్రెంచ్ మహిళ, ఆమె ఐదుగురు పిల్లలకు విముక్తి లభించింది. పిల్లల్లో ఒకరైన టీనేజ్ కుమారుడు ఇంటి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. జూన్ 18న వారిని దాచిన ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అత్యంత శిథిలావస్థలో ఉన్న గది నుంచి 54 ఏళ్ల సిల్వీ యాస్మినా, ఆమె పిల్లలను రక్షించారు. వారిని పెషావర్లోని ఆశ్రయానికి తీసుకువెళ్లారు. ఆ కుటుంబం ఫ్రాన్స్కు తిరిగి వెళ్లాలని న్నట్లు పోలీసులు తర్వాత ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి తెలియజేశారు. వారి శరీరాలపై గాయాలు, దెబ్బల గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఉన్న బారా పర్వత ప్రాంతంలో ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఆ్రస్టేలియాలో అక్రమంగా నివస్తున్నాడు. ఆ సమయంలో సిల్వీతో పరిచయం ఏర్పడింది. 2003లో వారిద్దరి వివాహం జరిగింది. 2014లో ఆ్రస్టేలియా నుంచి పాకిస్తాన్కు వచ్చారు. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు. పాకిస్తాన్కు వచ్చిన తరువాత మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. అయితే పాకిస్తాన్కు వచ్చినప్పటినుంచే పరిస్థితులు మారిపోయాయయి. మహిళను ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. ఆ ఇద్దరు పెద్ద పిల్లలు చదువు మాన్పించేశారు. అంతేకాదు.. పాకిస్తాన్లో పుట్టిన ముగ్గురు పిల్లలయితే పాఠశాల ముఖమే చూడలేదు. భర్త తనను, పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని సిల్వీ తెలిపారు. ‘‘12 ఏళ్లపాటు మా స్వేచ్ఛను హరించాడు. మమ్మల్ని రోజూ కొట్టేవాడు. నన్ను, నా పిల్లలను ఇతర వ్యక్తులతో కలవకుండా అడ్డుకున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు. నా భవిష్యత్తు అప్పటికే నాశనమైపోయింది. నా పిల్లల భవిష్యత్తు కూడా నాశనమవుతుందని భయపడ్డాను.’’అని ఆమె పోలీసులకు చెప్పారు. -
నా భార్య సపోర్ట్ ఇండియాకే..!
భారత్తో క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన ప్రతిసారి అతడి భార్య టీమిండియానే గెలవాలని కోరుకుంటుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.హసన్ అలీ భార్య సమియా అర్జూ భారత్లో (హర్యానా) జన్మించిందన్న విషయం చాలామందికి తెలీదు. ఆమె ఫరీదాబాద్లోని మానవ్ రచనా యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివింది. అనంతరం దుబాయ్లోని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్ ఇంజినీర్గా పని చేసింది. అక్కడే హసన్ అలీతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2019లో వీరిద్దరూ దుబాయ్లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.నేను కూడా బాగా ఆడాలని కోరుకుంటుంది..!‘పాక్ ప్యాషన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసన్ అలీకి ఓ సరదా ప్రశ్న ఎదురైంది. "మీ భార్య భారతీయురాలు కాబట్టే పాకిస్తాన్ భారత్పై గెలవకూడదని కోరుకుంటుందా? అందుకే పాక్ జట్టు ఓడిపోతుందా?" అని ప్రశ్నించగా ఆయన నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.తన భార్య సమియా అర్జూ భారతీయురాలు కావడంతో సహజంగానే భారత జట్టుకు మద్దతు ఇస్తుందని, అయితే అదే సమయంలో తాను పాకిస్తాన్ తరఫున బాగా ఆడాలని కూడా కోరుకుంటుందని తెలిపాడు."ఆమె నాకు ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది. కానీ ఆమె భారతీయురాలు కాబట్టి భారత్ గెలవాలని కూడా కోరుకుంటుంది. అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు" అని హసన్ అలీ వ్యాఖ్యానించాడు.అదే భారత్ విజయ రహస్యంభారత్ వరుసగా పాకిస్తాన్పై ఆధిపత్యం చెలాయించడానికి అసలు కారణం ఏమిటన్న ప్రశ్నకు హసన్ అలీ మరింత ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. భారత క్రికెట్ వ్యవస్థ ప్రస్తుతం సరైన దిశలో సాగుతోందని, ముఖ్యంగా ఐపీఎల్, దేశీయ క్రికెట్ వ్యవస్థ ఆటగాళ్లకు ఏడాది పొడవునా నాణ్యమైన పోటీని అందిస్తున్నాయని పేర్కొన్నాడు. అదే భారత జట్టు ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు.ఇదిలా ఉంటే, హసన్ అలీ ప్రస్తుతం ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్లో యార్క్షైర్ తరఫున ఆడుతున్నాడు. గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. వన్డేలు, టీ20ల్లో అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ జాతీయ జట్టులో స్థిర స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. -
సిగ్గులేకుండా పందుల్లా మెక్కుతున్నారు.. పాక్ మహిళా క్రికెటర్లపై ఇంజమామ్ సీరియస్
-
పీవోకేపై పాకిస్తాన్ కఠిన వ్యూహాం!
ముజఫరాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నెలలుగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆహారం, మందులు, ఇంధనం వంటి నిత్యవసర వస్తువుల సరఫరాలను అడ్డుకుంటోందని స్థానిక సంస్థలు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలు మరింత సంక్షోభంలోకి నెట్టబడ్డారని చెబుతున్నారు.ఆందోళనకారుల ఆరోపణల ప్రకారం పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీవోకేలోకి వచ్చే ప్రధాన సరఫరా మార్గాలపై భద్రతా తనిఖీల పేరుతో సరుకు వాహనాలను నిలిపివేస్తున్నారు. దీనివల్ల గోధుమలు, పిండి, కూరగాయలు, వంటనూనె, పెట్రోల్, డీజిల్, వైద్య సామగ్రి వంటి వస్తువుల సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడిందని, ఆసుపత్రులు కూడా అవసరమైన ఔషధాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇంధన కొరత కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా వ్యవస్థలు కూడా ప్రభావితమయ్యాయి.పెరుగుతున్న ఒత్తిడి..పీవోకేలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు పరిమితంగా ఉండటం, జీవన వ్యయం పెరగడం, ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ దిగ్బంధం ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా పడుతోంది. మార్కెట్లలో సరుకుల కొరత కారణంగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.పాక్ ప్రభుత్వ వైఖరిఈ ఆరోపణలను పాక్ ప్రభుత్వం అధికారికంగా ఖండించింది. భద్రతా కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు పెంచామని, సరఫరాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఉద్యమకారులు మాత్రం ఇది ప్రజా ఉద్యమాలను బలహీనపరిచేందుకు చేపట్టిన వ్యూహమని ఆరోపిస్తున్నారు.ఎందుకు ఆందోళనలు?గత కొంతకాలంగా పీవోకేలో విద్యుత్ చార్జీల పెంపు, అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యవసరాల ధరల పెరుగుదల వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతం అయినప్పటికీ స్థానిక ప్రజలకు అధిక ధరలకు కరెంట్ సరఫరా చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, సమ్మెలు, బంద్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గత ఏడాది జరిగిన నిరసనల తర్వాత కొన్ని డిమాండ్లను అంగీకరిస్తామని పాక్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, వాటి అమలులో పురోగతి లేకపోవడంతో ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు.భద్రతా బలగాల కఠిన చర్యలు..ఇటీవలి వారాల్లో పీవోకేలో అనేక ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలువురు ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడం, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిరసనకారులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు వివాదానికి దారితీశాయి. మానవ హక్కుల కార్యకర్తలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను చెప్పుకునే హక్కును అణచివేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.అంతర్జాతీయంగా చర్చ..పీవోకేలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు కశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికలపై ప్రస్తావించే పాకిస్తాన్, మరోవైపు తన ఆధీనంలోని ప్రాంతంలో ప్రజా అసంతృప్తిని ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రజల ఆర్థిక సమస్యలను పరిష్కరించడం కంటే కఠిన చర్యలకు ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి మరింత సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది. సరఫరాల కొరత కొనసాగితే పీవోకేలో మానవతా సంక్షోభం తలెత్తే ప్రమాదం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. -
పాక్ సైన్యాధ్యక్షుడి కోసం మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్?!
ఇరాన్-అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో.. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను హత్య చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందా?.. ఇందుకోసం ఆ దేశపు గూఢచారి సంస్థ మొస్సాద్ను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దించారా?.. ఓ బ్రెజిలియన్ జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా.. పాకిస్థాన్తో పాటు ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రూపొందిన ఒప్పందానికి సైతం "ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్"గా పిలిచారు. ఆపై తదుపరి చర్చలు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగాయి. వీటికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశపు సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ కూడా హాజరయ్యారు.అయితే.. ఈ నేపథ్యంతో ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత మారియో నాఫల్ నిర్వహించిన పోడ్కాస్ట్లో బ్రెజిలియన్ జర్నలిస్టు, జియోపాలిటికల్ విశ్లేషకుడు పెపే ఎస్కోబార్ సంచలన ఆరోపణలకు దిగాడు. మొస్సాద్(Mossad) సంస్థ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాల మేరకు అసీం మునీర్తో పాటు పాకిస్థాన్ ప్రతినిధి బృందంపై హత్యాయత్నానికి సిద్ధమైంది. ఈ విషయమై పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్కు అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది అని పేర్కొన్నాడు. అంతేకాక.. ఈ సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్ తన మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరిక పంపిందని ఎస్కోబార్ చెప్పారు. "మా ప్రతినిధి బృందాన్ని తాకితే మిమ్మల్ని ప్రపంచ పటంలో నుంచి చెరిపేస్తాం" అనే సందేశం పాక్ ఇజ్రాయెల్కు పంపిందని ఆయన ఆ పాడ్కాస్ట్లో వెల్లడించారు. మొస్సాద్ అనేది ఇజ్రాయెల్కు చెందిన అత్యంత కీలక విదేశీ గూఢచారి సంస్థ. దీని పూర్తి పేరు "ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్". 1949లో స్థాపించబడిన ఈ సంస్థ.. విదేశాల్లో గూఢచర్యం, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, రహస్య సమాచార సేకరణ వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. శత్రు దేశాల్లో రహస్య ఆపరేషన్లు నిర్వహించడంలో, ఇజ్రాయెల్కు ముప్పుగా భావించే వ్యక్తులను గుర్తించి నిర్వీర్యం చేయడంలో మొస్సాద్కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలైన అమెరికా సీఐఏ, బ్రిటన్ ఎంఐ6, రష్యా ఎఫ్ఎస్బీ(గతంలో KGB) వంటి ప్రముఖ గూఢచారి సంస్థల సరసన దీనికి చోటు ఉంది.ఇదిలా ఉండగా, పాకిస్థాన్-ఇజ్రాయెల్ సంబంధాలు ఎప్పటి నుంచో ఉద్రిక్తంగానే ఉన్నాయి. పాకిస్థాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ను దేశంగా అధికారికంగా గుర్తించలేదు. గాజా విషయంలోనూ ఇజ్రాయెల్పై పాక్ ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ వస్తోంది. ఈ విషయమై ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇజ్రాయెల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో పాకిస్థాన్ ‘ఇరాన్-అమెరికా’ చర్చల్లో నిజంగా తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించగలదా? అనే సందేహాలు ఇజ్రాయెల్ వర్గాలు వ్యక్తం చేశాయి.అయితే మునీర్ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై పాకిస్థాన్ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అలాగే ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే.. ఎస్కోబార్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్కు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పాక్ ప్రముఖ జర్నలిస్టు సయ్యద్ తలత్ హుస్సేన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ "ఇందులో ఒక్క ముక్క నిజం కూడా లేదు. అలాంటి ఘటన ఏదీ జరగలేదు" అని స్పష్టం చేశారు. ఒక సీనియర్ భద్రతాధికారి కూడా ఈ కథనాన్ని "వక్రీకృత ప్రచారం"గా అభివర్ణించినట్లు వెల్లడించారు. దీంతో ప్రస్తుతానికి అసీం మునీర్పై మొస్సాద్ హత్యాయత్నం జరిగిందన్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో.. కొన్ని వర్గాల్లో మాత్రమే చక్కర్లు కొడుతున్న ఆరోపణగానే ఉంది. -
అప్పుడు పాక్.. ఇప్పుడు బంగ్లాదేశ్.. భారత్ అప్రమత్తం
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ప్రస్తుతం చైనాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. చైనా ప్రధానమంత్రి లీని, అధ్యక్షుడు షీ జిన్పింగ్ను కలవనున్నారు. ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రధాన అంశంగా బంగ్లాదేశ్ జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన, తుది చర్చలు వంటివి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.పాకిస్థాన్ కూడా ఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్పై వీటిని ఉపయోగించినట్లు సమాచారం. ఆ సమయంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద ముప్పులను సమర్థంగా నిర్వీర్యం చేసింది.బంగ్లాదేశ్ 24 చైనా జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో ఈ ఒప్పందం కీలక ఫలితంగా నిలవనుందని భావిస్తున్నారు.పలు నివేదికల ప్రకారం.. రక్షణ, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకుంటున్నాయి చైనా, పాకిస్థాన్. 2026 ఆగస్టు నాటికి యుద్ధ విమానాల కొనుగోలును ఖరారు చేయాలని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. జె-10సీ అనేది చైనా వైమానిక దళం వినియోగించే యుద్ధ విమానం. జె-10సీఈ అనేది ఇతర దేశాలకు విక్రయించేందుకు రూపొందించిన వెర్షన్.ఈ కొనుగోలుతో పాకిస్థాన్ తర్వాత ఈ ప్రత్యేక విమానాన్ని వినియోగించే రెండో విదేశీ దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఒక్కో యుద్ధ విమానం విలువ సుమారు $40 మిలియన్లు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలపై చైనా, బంగ్లాదేశ్ అధికారులు ఇంకా చర్చలు జరుపుతున్నట్లు సోర్సెస్ తెలిపాయి.బంగ్లాదేశ్ వైమానిక దళాన్ని ఆధునికీకరణ చేసుకోవాలనుకుంటోంది. జె-10సీఈ ఆ దేశ వైమానిక యుద్ధ సామర్థ్యాలను బాగా పెంచవచ్చు. అదే సమయంలో దక్షిణాసియాలో వ్యూహాత్మక ప్రభావాలు కూడా ఉంటాయి. ఇది బంగ్లాదేశ్-చైనా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు బంగాళాఖాతంలో ప్రాంతీయ సమతౌల్యాన్ని ప్రభావితం చేయవచ్చు.ఎక్కడ మోహరిస్తారు? భారత్ విషయానికి వస్తే, మన దేశం రెండు పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఒప్పందం కుదిరి యుద్ధ విమానాలు బంగ్లాదేశ్కు చేరితే, వాటిని ఎక్కడ మోహరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది.బంగ్లాదేశ్ ఇప్పటికే ఉత్తర బంగ్లాదేశ్లోని లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరం (బీఏఎఫ్ స్టేషన్ లాల్మొనిర్హాట్)ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రదేశాల వైమానిక స్థావరంగా ఇది పనిచేసింది. ఈ స్థావరం భారత సరిహద్దుకు కేవలం 12-15 కి.మీ దూరంలో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్కు సమీపంలోనూ ఉంది. ఈ స్థావర పునరుద్ధరణకు చైనా సాయం చేసే అవకాశంపై చర్చలు జరిగాయి. ఈ బంగ్లాదేశ్ వైమానిక దళ కేంద్రంలో కొత్త యుద్ధ విమాన హ్యాంగర్లు నిర్మించే పనులు కూడా ఉన్నాయి.కేంద్ర సర్కారు ఏమన్నది? భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ స్థావరం ఉండటంతో భారత్లో భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2025 ఆగస్టు 8న లోక్సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్లోని లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరానికి సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం గమనించింది. 2025 మే 26న బంగ్లాదేశ్ సైన్యం సైనిక కార్యకలాపాల సంచాలకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని కూడా గమనించింది. ప్రస్తుతం లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని సైనిక అవసరాలకు వినియోగించే ప్రణాళికలు లేవని ఆయన చెప్పారు. జాతీయ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలను భారత ప్రభుత్వం గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది” అని తెలిపారు.పాకిస్థాన్ వైమానిక దళం ప్రస్తుతం 36 చైనా తయారీ చెంగ్డు జె-10సీఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. జె-10 విమానాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న ఆగ్నేయాసియా దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. కనీసం 42 చెంగ్డు జె-10 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న నిర్ణయం ఇండోనేషియా రక్షణ కొనుగోలు విధానంలో మార్పును సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆ దేశం రష్యా, అమెరికాపై ఆధారపడేది. -
పాక్లోకి భారత్ విమానం.. హెచ్చరికలతో తప్పిన ప్రమాదం
అమృత్సర్: ఢిల్లీ నుంచి అమృతసర్కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో పెద్ద ప్రమాదంలో పడింది. సాంకేతిక సమస్యతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అనంతరం పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెచ్చరికలతో అప్రమత్తమైన పైలట్లు, వెంటనే విమానాన్ని సరిదిద్ది తిరిగి భారత గగనతలంలోకి మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అసలేం జరిగింది?జూన్ 22 రాత్రి రాత్రి 9:18 ప్రాంతంలో ఢిల్లీ నుంచి అమృత్సర్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-479) బయిలుదేరింది. అయితే సాంకేతిక సమస్యలతో పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. దీంతో పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు, వెంటనే విమానాన్ని సరిదిద్ది తిరిగి భారత గగనతలంలోకి ప్రవేశపెట్టారు. దీంతో విమానం యూ-టర్న్ తీసుకుని సురక్షితంగా భారత్లోకి ప్రవేశించింది.అయితే విమానం అమృత్సర్ చేరుకునే సమయానికి ఎయిర్పోర్ట్లో విమానాల రద్దీ ఎక్కువగా ఉండటంతో, అధికారులు దానిని తిరిగి ఢిల్లీకి మళ్లించారు.అనంతరం ఢిల్లీలో తనిఖీల అనంతరం తిరిగి బయలుదేరి, జూన్ 23 తెల్లవారుజామున 2:20 గంటలకు విమానం అమృత్సర్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.పాకిస్థాన్ ల్యాండ్లోకి ఎందుకు వెళ్లకూడదు?భారతదేశానికి చెందిన ఏ విమానమూ పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లకూడదు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు ఎయిర్ స్పేస్ బ్యాన్ విధించుకున్నాయి. ఒక దేశ విమానాలు మరో దేశంలో ఎట్టిపరిస్థితుల్లో గగన స్థలంలో సంచరించకూడదు. ఈ గడువను నెలనెల పొడిగింపు చేస్తూ వస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నిషేధం జూలై 24, 2026 వరకు అమల్లో ఉంటుంది. -
‘బబితా’ కాదు ‘ఖదీజా’.. స్లీపర్ సెల్ నెట్వర్క్ గుట్టురట్టు
జైపూర్: రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) తాజాగా ఒక అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ను ఛేదించింది. పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహమ్మద్’తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా అనే మహిళను అధికారులు జైపూర్లో అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్, ఆమె దేశ వ్యతిరేక శక్తులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం జూన్ 27 వరకు ఆమెను ఏటీఎస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.పాకిస్తాన్ చేతుల్లో సోషల్ మీడియా ఖాతాలుసవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన బబితా ధాకడ్ జైపూర్లోని వాటికా ప్రాంతంలో తండ్రితో కలిసి నివసిస్తోంది. గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియా, వాట్సాప్ ఖాతాలను పాకిస్తాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. తన మొబైల్ సిమ్ కార్డుకు సంబంధించిన యాక్సెస్ క్రిడెన్షియల్స్ (రహస్య సమాచారం) మొత్తాన్ని ఆమె సరిహద్దు అవతలి ఉన్న హ్యాండ్లర్లకు అప్పగించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిఘా నీడలో ఉన్న కాలంలో ఆమె జైపూర్లోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్లు ఏటీఎస్ పేర్కొంది.మసూద్ అజహర్ కుటుంబంతో కనెక్షన్?పాకిస్తాన్లోని బహావల్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న పలువురు ఉగ్రవాద హ్యాండ్లర్లతో ఈమె టచ్లో ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. వారు ఆమెకు మతపరమైన బ్రెయిన్వాష్ (ఇండోక్ట్రినేషన్) చేసినట్లు తెలుస్తోంది. విచిత్రమేమిటంటే, ఆమెతో మాట్లాడిన వారిలో ఒకరు తాను జైష్-ఎ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యుడినని, బహావల్పూర్ నుండి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. ఈ వ్యవహారం వెనుక భారతదేశంలో పెద్ద ఎత్తున ‘స్లీపర్ సెల్’ నెట్వర్క్ను నిర్మించేందుకు, కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టేందుకు జైష్ ముఠా ప్రయత్నించిందని అధికారులు అనుమానిస్తున్నారు.మత మార్పిడి.. పాక్కు వెళ్లేందుకు ప్లాన్ఏటీఎస్ అధికారుల విచారణలో బబితా పలు సంచలన విషయాలను అంగీకరించింది. ఒక పాకిస్తానీ మత గురువు (మౌల్వీ) ఫోన్ ద్వారా చేసిన బోధనలకు ఆకర్షితురాలై తాను ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన పేరును ‘ఖదీజా’గా మార్చుకున్నట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెను గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్కు తీసుకువెళ్లేందుకు అవతలి వైపు ఉన్న వ్యక్తులలో చర్చించినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమెపై ఉగ్రవాద నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి, డిజిటల్ సాక్ష్యాలను ల్యాబ్కు పంపారు.ఇది కూడా చదవండి: మొహర్రం సెలవుపై క్లారిటీ.. ఇక ‘లాంగ్ వీకెండ్’.. -
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్లో విషాదం నెలకొంది. మంగళవారం రాత్రి షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ కన్నుమూశాడు. తన అన్న మరణ వార్తను అక్తర్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 'నా అన్న అల్లా దగ్గరికి వెళ్లిపోయాడు' అని ఎమోషనల్ కామెంట్ను జత చేశాడు. అయితే షాహిద్ ఎప్పుడు చనిపోయారన్నది కచ్చితంగా తెలియనప్పటికీ అక్తర్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సమయం ఆధారంగా మంగళవారం రాత్రే అతడు కన్నుమూసినట్లు తెలుస్తోంది. 2021లో షోయబ్ అక్తర్ తన అమ్మను కోల్పోయాడు. ఆ సమయంలో అక్తర్కు సోదరుడు షాహిద్ అండగా ఉన్నాడు. ఇప్పుడు అన్న కూడా మరణించడం షోయబ్ అక్తర్కు పూడ్చలేని లోటు అని చెప్పొచ్చు. షోయబ్ అక్తర్ క్రికెటర్గా మారడానికి అన్న షాహిద్ అక్తర్ ప్రోత్సాహం మరువలేనిది. అక్తర్ టీనేజీ వయసు దాకా క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఒకసారి స్థానిక క్రికెట్ జట్టులో ప్లేయర్ అవసరం పడడంతో షోయబ్ అక్తర్ను ఆ మ్యాచ్లో ఆడేందుకు అవకాశమివ్వాలని సదరు జట్టును కోరాడు.అలా స్థానిక క్రికెట్లో రాణించిన షోయబ్ ఆ తర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. అనంతరం అతడికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆరోజు అన్న షాహిద్ అండగా నిలబడకపోయుంటే ఇవాళ షోయబ్ అక్తర్ ఈ స్థాయిలో ఉండేవాడు కాదేమో. ఆరోజు ఆ మ్యాచ్ అవకాశం తన కెరీర్కు టర్నింగ్ పాయింట్ అని అక్తర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్ పాకిస్తాన్ తరఫున 1997లో అరంగేట్రం చేశాడు. 14 ఏళ్ల కెరీర్లో అక్తర్ 46 టెస్టుల్లో 178 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత క్రికెట్ అనలిస్ట్గా, మెంటార్గా యాక్టివ్ మోడ్లో ఉన్నాడు. అంతేకాదు అక్తర్ యూట్యూబ్ చానెల్కు అంతర్జాతీయంగా మంచి ఫాలోయింగ్ ఉంది.Read: ‘మెస్సీపై ప్రశ్నలెందుకు’.. రొనాల్డో అసహనం! -
చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. సెమీస్కు ఆస్ట్రేలియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ గ్రూప్-ఏలో మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో చిత్తుగా ఓడింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 13.4 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడంతో ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ (32) టాప్ స్కోరర్గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ, సదర్లాండ్, ఎలిస్ పెర్రీలు తలా రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ (79) అర్ధశతకంతో రాణించగా, జార్జియా వోల్ (39), సదర్లాండ్ (27), నికోలా కేరీ (26 నాటౌట్) రాణించారు. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, రమీన్ షమీమ్, నష్రా సంధూ తలా రెండు వికెట్లు తీశారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలీస్ పెర్రీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకుంది. పాక్పై విజయంతో ఆస్ట్రేలియా నాకౌట్లో అడుగుపెట్టింది. మరో బెర్తు కోసం భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గురువారం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ జట్టుతో కీలక మ్యాచ్ ఆడనుంది. -
జోరు కొనసాగించాలని...
లండన్: ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టును... ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టును ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు తన కీలక పోరుకు సిద్ధమైంది. ప్రొ లీగ్ 2025–2026 సీజన్లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తోనూ భారత్ రెండు మ్యాచ్లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుండగా... రెండో మ్యాచ్ను శుక్రవారం నిర్వహిస్తారు. 2024లో చైనా వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి భారత్, పాక్ ముఖాముఖిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ 2–1తో గెలిచింది. ప్రస్తుత యూరోప్ అంచె ప్రొ లీగ్లో భారత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జట్లను ఓడించి జోరు మీదుంది. జుగ్రాజ్ సింగ్, మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్ తమకు లభించిన అవకాశాలను గోల్స్గా మలుస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ హాకీలో పాకిస్తాన్పై భారత్దే పైచేయిగా ఉంది. గత పదేళ్లలో ఈ రెండు జట్ల మధ్య 17 మ్యాచ్లు జరగ్గా... 15 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. మరో రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రొ లీగ్లోనూ పాక్పై తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత ప్రొ లీగ్ సీజన్లో భారత్ 10 పాయింట్లతో 8వ స్థానంలో... పాకిస్తాన్ జట్టు పాయింట్ల ఖాతా తెరవకుండానే చివరిదైన 9వ స్థానంలో ఉన్నాయి. ప్రొ లీగ్లో మొత్తం తొమ్మిది జట్లు 16 మ్యాచ్ల చొప్పున ఆడతాయి. ఇప్పటికి అన్ని జట్లు 12 మ్యాచ్ల చొప్పున పూర్తి చేసుకున్నాయి. ఈనెల 28తో సీజన్ ముగియనుండగా... 34 పాయింట్లతో బెల్జియం అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
బిత్తర పోయిన పాక్ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన ఈ చర్చలు సజావుగా కొనసాగుతున్నాయని తొలుత ప్రకటించినప్పటికీ.. వేదికపై మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు, ప్రోటోకాల్ వివాదాలు, ఆకస్మిక వాకౌట్లు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య చోటుచేసుకున్న హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల తొలి దశ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత వాతావరణంలో సాగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, ప్రోటోకాల్ అంశాలు మొదట్లోనే వివాదానికి దారితీశాయి.This was humiliation. No one in modern history has made America wait and beg for negotiations. This was the moment JD Vance should have returned to Washington. The Islamic regime did this on purpose. Trump, if you don't understand politics, you should at least understand… pic.twitter.com/NVWAxr8NMH— Amjad Taha أمجد طه (@amjadt25) June 21, 2026ముందుగా నిర్ణయించిన హ్యాండ్షేక్, జాయింట్ ఫోటో సెషన్లో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనకపోవడం చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఫోటో-ఆప్ను తిరస్కరించి సమావేశ వేదిక నుంచి బయటకు వెళ్లినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.ఈ ఆకస్మిక పరిణామాల మధ్య, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు కొద్దిసేపు ఏదో సమాచారం అందించినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ వెంటనే ఇరాన్ బృందం వేదిక నుంచి వాకౌట్ చేయడంతో షెహబాజ్ షరీఫ్ ఆశ్చర్యానికి లోనయ్యారని, పక్కనే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో వెంటనే చర్చించిన దృశ్యాలు వైరల్గా మారాయి. అదే.. సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పరిస్థితిని గమనిస్తూ.. షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఇరాన్ ప్రతినిధుల వాకౌట్ కారణం గురించి ఆయన ఆరా తీసినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు.. పలకరింపుల సమయంలోనూ అమెరికా ప్రతినిధి అయిన జేడీ వాన్స్కు ఘోర అవమానం జరిగింది!. ఖతార్ ప్రతినిధి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ను పలకరించి జేడీ వాన్స్ను పట్టించుకోనట్లు చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో జేడీ వాన్స్ ఆయన్ని పలకరించే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఖతార్ ప్రతినిధి చేసిన పనితో పాక్ ప్రధాని బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇదంతా సోషల్ మీడియాలో “ప్రోటోకాల్ స్నబ్”గా(అధికారిక కార్యక్రమాల్లో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేదంటే నిర్లక్ష్యంగా సరైన గౌరవం ఇవ్వకుండా వదిలేయడం) చర్చకు దారితీసింది.Watch Qatar snub Vance. So embarrassing. pic.twitter.com/RWSpcsL5IU— 🇺🇸 Pamela Geller 🇮🇱 (@PamelaGeller) June 21, 2026ఇక.. మీటింగ్ హాల్లోకి ఇరాన్ విదేశాంగ మంత్రి తిరిగి ప్రవేశించినప్పుడు, అమెరికా బృందం సభ్యులు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్తో ఒకే గదిలో స్వల్ప క్షణాల పాటు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ ప్రతినిధులు కొంత దూరం పాటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ఊపందుకున్నాయి. “అమెరికాకు దౌత్యపరమైన ఎదురుదెబ్బా?”, “ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనా?”, “ఇరాన్ వ్యూహాత్మక వాకౌటా?” అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య వైరల్గా మారాయి.అయితే మరోవైపు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ బృందాలు మాత్రం చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్న వార్తలను ఖండించాయి. తొలి దశ చర్చలు సుమారు 80 నిమిషాలు కొనసాగిన తర్వాత ఇరాన్ బృందం అంతర్గత సంప్రదింపుల కోసం తాత్కాలికంగా బయటకు వెళ్లినట్లు అధికారిక సమాచారం చెబుతోంది. ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక ఆంక్షల ఉపసంహరణ, నిలిచిపోయిన నిధుల విడుదల, చమురు ఆంక్షలపై సడలింపులు వంటి అంశాలపై సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగినట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఖతార్ సహకారంతో కొన్ని కీలక ప్రక్రియలు ప్రారంభమైనట్లు సమాచారం బయటకు వచ్చింది.మొత్తం మీద, స్విట్జర్లాండ్ వేదికపై జరిగిన ఈ చర్చలు ఒకవైపు ఉద్రిక్తతలు, వాకౌట్లు, ప్రోటోకాల్ ఘర్షణలతో సాగినా.. మరోవైపు కొంత పురోగతి సంకేతాలు కూడా కనిపించాయని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ కనిపించిన హావభావాలు, ఆకస్మిక పరిణామాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. -
భారత్తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన
భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొత్త రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే ఏ చర్యనైనా తమ దేశం సహించదని, అవసరమైతే భారత్తో యుద్ధానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు, నదీ జలాల నిర్వహణ చర్యలపై స్పందించిన ఖవాజా ఆసిఫ్.. పాకిస్తాన్కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది కేవలం జలాల సమస్య కాకుండా జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవనాధారం సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో నీటి హక్కులను కాపాడుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తామని చెప్పారు. అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా తమ దేశం వెనుకాడదని ఆయన వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.ఇండస్ ఒప్పందం ఏమిటి?1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధూ నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు దేశాల మధ్య విభజించారు. రవి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా, ఇండస్, జీలం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ వినియోగించుకునేలా ఒప్పందం రూపొందించబడింది. అయితే పశ్చిమ నదులపై కూడా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం కొన్ని పరిమిత హక్కులు భారత్కు కల్పించబడ్డాయి. గత ఆరు దశాబ్దాలుగా అనేక యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు ఎదురైనా ఈ ఒప్పందం కొనసాగుతుండటం విశేషం.ఎందుకు మళ్లీ వివాదం?గత కొంతకాలంగా జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా చీనాబ్, జీలం నదులపై నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇవి ఇండస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఒప్పంద పరిధిలోనే ఉన్నాయని, నీటి ప్రవాహాన్ని మళ్లించడం లేదా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా, దేశానికి లభించిన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడం తమ బాధ్యత అని చెబుతోంది.మారిన పరిస్థితులు..ఇటీవలి కాలంలో భారత్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండస్ ఒప్పందంపై భారత్లో కూడా చర్చలు పెరిగాయి. "రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు" అంటూ గతంలో భారత నాయకత్వం చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదం కొనసాగితే ఇండస్ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష అవసరమని భారత రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. -
భారత్పై విషం చిమ్మిన పాక్
ఢిల్లీ: భారతలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. జర్దారీ వ్యాఖ్యలు అత్యంత ద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో కూడినవని విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఇస్లామాబాద్కు ఎంతమాత్రం లేదని మరోసారి స్పష్టం చేసింది.ఇటీవల పాకిస్థాన్ అధ్యక్షుడు భారత్పై విషం చిమ్మారు. ఎక్స్ వేదికగా భారత్ను విమర్శిస్తూ "భారతదేశంలోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి 'మసీదు గంజ్ షహీదా'తో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలి, ఇలాంటి చర్యలు కొనసాగితే, అవి భారతదేశ విచ్ఛిన్నానికి నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది" అని ఎక్స్ వేదికగా విమర్శించారు. తాజాగా దీనికి భారత్ తీవ్రస్థాయిలో బదులిచ్చింది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయమై మాట్లాడుతూ... "పాకిస్థాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారతదేశం ఖచ్చితంగా తిరస్కరిస్తోంది. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాకిస్థాన్ స్వంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే, ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వివిధ మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించడంలో పాకిస్థాన్కు ఉన్న సుదీర్ఘమైన, దురదృష్టకరమైన చరిత్ర ప్రపంచమంతటికీ తెలిసిందే" అని స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా ఆ దేశంలో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై అక్కడ నిరంతరం దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. రాజకీయ ప్రేరేపిత దాడిజర్దారీ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, ఆ దేశంలో కొనసాగుతున్న మతోన్మాదం, ద్వేషపూరిత విధానాల నుంచే ఇవి పుట్టుకొచ్చాయని జైస్వాల్ ముగించారు. "ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఆ దేశ జాతీయ విధానాలైన మతోన్మాదం, ద్వేషం ఆధారంగా చేసిన ఒక ఉద్దేశపూర్వక రాజకీయ దాడిగా మాత్రమే పరిగణించవచ్చు" అని ఆయన అన్నారు.వారణాసిలోని చారిత్రాత్మక 'మస్జిద్ గంజ్ షహీదా'తో పాటు భారతదేశంలోని ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేతకు ముప్పు ఉందంటూ జర్దారీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో చేసిన పోస్ట్కు సమాధానంగా భారత్ ఈ ఘాటు స్పందన ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో ఇస్లామాబాద్ జోక్యం చేసుకోకూడదని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. -
పాక్ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్ దశలో పాక్కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో ఆ జట్టు తదుపరి రౌండ్కు చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట గెలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకుంది. గ్రూప్-ఏలో బంగ్లా, పాక్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా.. పాక్, నెదర్లాండ్స్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. సౌథాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. వీరు మినహా మరే ఇతర బంగ్లా బ్యాటర్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. పాక్ బౌలర్లు తొలి 16 ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, చివరి 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకొని మూల్యం చెల్లించుకున్నారు. షోర్నా అక్తెర్ చివర్లో పాక్ బౌలర్ల భరతం పట్టింది. ముఖ్యంగా తస్మియా రుబాబ్ బౌలింగ్ను చీల్చిచెండాడింది. రుబాబ్ మినహా పాక్ బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ ఫాతిమా సనా (4-1-18-2), నష్రా సంధు (4-0-14-1), సదియా ఇక్బాల్ (4-0-21-1) అద్బుతమైన గణాంకాలు నమోదు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. షంజిద అక్తెర్ (4-0-21-3), నహిద అక్తెర్ (4-0-18-3), రబేయా ఖాన్ (4-1-17-1), మరుఫా అక్తెర్ (4-1-18-0), రితూ మోనీ (4-0-24-1) ధాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు మినహా ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. -
పాక్పై ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దాడులు
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. పాక్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని తమ వైమానిక దళం దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ దాడులు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో జరిగినట్లు సమాచారం.ఈ శిబిరాలు ISIL-Khorasan (ఐసిస్-కె) కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడి నుంచి ఆఫ్ఘన్పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించింది.అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘన్ ప్రకటనలను అబద్ధాలు, దుష్ప్రచారంగా అభివర్ణించింది.గత కొద్ది నెలలుగా ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పలుమార్లు దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలితాన్ని ఇవ్వలేదు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా ఇరు దేశాలు కయ్యానికి కాలుదువ్వుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తుంది. -
భారత్-పాక్ సరిహద్దుల్లో అరుదైన ‘షేక్హ్యాండ్’
శ్రీనగర్: ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం.. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్థాన్ పౌరుడు అసద్ ఖాన్ను స్వదేశానికి అప్పగించే సందర్భంగా ఇరు దేశాల సైన్యాధికారులు పరస్పరం కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మానవతా విలువలకు కట్టుబడి ఉన్న భారత సైన్యం.. అసద్ ఖాన్ను గౌరవంగా చూసుకుంది. అనంతరం పాకిస్థాన్ సైన్యానికి అప్పగించింది. దీంతో పాక్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా తీత్వాల్ సెక్టార్ పరిధిలోని సిమారి ప్రాంతంలో గత వారం నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అసద్ ఖాన్ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆయన పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా (కేపీకే) ప్రాంతానికి చెందినవాడని సైన్యం వెల్లడించింది. అయితే, అతడిని విడుదల చేయాలని పాకిస్థాన్లోని పలువురు నెటిజన్లు భారత సైన్యాన్ని కోరారు.కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచిన అధికారులు.. అసద్ ప్రవర్తనపై ఎటువంటి అనుమానం రాకపోవడంతో తిరిగి స్వదేశానికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో అసద్ ఖాన్ను సరిహద్దు క్రాసింగ్ పాయింట్ దగ్గర పాకిస్థాన్ సైన్యానికి అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను భారత సైన్యం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేసింది. వాటిలో భారత సైన్యానికి చెందిన మేజర్ హోదా అధికారి, పాకిస్థాన్ సైన్యాధికారితో కరచాలనం చేస్తున్న దృశ్యం కనిపించింది.Repatriation of Pak NationalA Pakistani national, Asad Khan, a resident of Khyber Pakhtunkhwa (KPK), who was apprehended in Simari village, Kupwara, on 12 June 2026 after crossing the Line of Control, was repatriated to Pakistan on 18 June 2026.During his stay in India, Asad… pic.twitter.com/4MUKLUylZh— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) June 19, 2026ఈ సందర్భంగా భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, “ఖైబర్ పఖ్తూన్ఖ్వా నివాసి అసద్ ఖాన్ జూన్ 12న నియంత్రణ రేఖ దాటి సిమారి గ్రామం వద్ద పట్టుబడ్డాడు. జూన్ 18న అతడిని పాకిస్థాన్కు తిరిగి పంపించాం. భారత్లో ఉన్నంత కాలం అతడిని గౌరవంగా.. మానవతా దృక్పథంతో చూసుకున్నాం. సైన్యం నైతిక విలువలకు నిదర్శనం” అని పేర్కొంది. -
యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!
-
పాకిస్తాన్కు బిగ్ షాక్.. భారత్ దెబ్బ అదుర్స్
దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ మరోసారి విరుచుకుపడింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాక్ మధ్య సింధూ జలాల ఒప్పంద విషయంలో పాకిస్తాన్ను కడిగిపారేసింది. పాత ఒప్పందానికి ఇప్పుడు కాలం చెల్లిపోయిందని గట్టి హెచ్చరికలు చేసింది. అలాగే, అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాక్ కుటిల ప్రయత్నాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.జెనీవాలో శుక్రవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 62వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్ తన 'రైట్ ఆఫ్ రిప్లై'ను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ మాట్లాడుతూ.. భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరి అత్యంత స్పష్టంగా ఉందన్నారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్, అంతర్జాతీయ సహకార ఫలాలను, డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని తేల్చి చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ చెక్కుచెదరని శాశ్వత హక్కుగా లేదా జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.#WATCH | First Secretary at the Permanent Mission of India to the United Nations, Anupama Singh says, "Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation… pic.twitter.com/D3takMgklM— ANI (@ANI) June 18, 2026అలాగే, పాక్ను ఫ్రాంకెన్స్టైన్ స్టేట్ (సొంతంగా సృష్టించిన భూతం చేతిలోనే నాశనమయ్యే పరిస్థితి)గా అభివర్ణించారు. పాక్ తన అంతర్గత సవాళ్ల పరిష్కారంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. పాక్ రక్షణ మంత్రే స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారిని మోహరించడం తమ ప్రభుత్వ విధానమని గతంలో బహిరంగంగానే అంగీకరించారని ఆమె గుర్తు చేశారు. అంతటి ఉగ్రవాద చరిత్ర ఉంచుకుని, మళ్లీ తామే ఉగ్రవాద బాధితులమని పాక్ చెప్పుకోవడం ఒక పెద్ద హాస్యాస్పదంగా ఉందన్నారు. వారు పెంచిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు తనను తిరిగి కరుస్తుంటే పాక్ షాక్కు గురవుతోందని దుయ్యబట్టారు.అయితే, గతేడాది పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో, పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వస్తి పలికేంత వరకు సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. పాకిస్తాన్ మనుగడ పూర్తిగా సింధూ నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. పాక్లో 16 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో దాదాపు 80 శాతం భూమికి ఈ నదీ జలాలే ఆధారం. అంతేకాకుండా, ఆ దేశం ఉపయోగించే మొత్తం నీటి వినియోగంలో 93 శాతం సింధూ నది నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో, తన దేశ ఆర్థిక, భౌగోళిక మనుగడకు కారణమైన నదీ జలాల విషయంలో పాక్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారత్ సూచించింది. -
బంగాళాఖాతంలోకి పాక్ జలాంతర్గాములు!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన యుద్ధం వేళ పాకిస్తాన్ నావికాదళాన్ని భారత్ దారుణంగా దెబ్బతీశాక బంగాళాఖాతం జలాల వైపు కన్నెత్తిచూడని పాకిస్తాన్ 55 సంవత్సరాల తర్వాత మళ్లీ బంగాళాఖాతం వైపు దృష్టిసారించింది. చైనా తయారీ హంగోర్ శ్రేణి జలాంతర్గామిని బంగాళాఖాతంలో నిఘా కోసం మొహరించాలని పాక్ యోచిస్తోంది. పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి ఇటీవలే కరాచీకి చేరుకుంది. అంతకుముందు చైనా నుంచి వస్తూ అంతర్జాతీయ సముద్రజలాల గుండా పయనిస్తూ ఈ జలాంతర్గామి శ్రీలంక సమీపంగా వచ్చింది.ఈ జలాంతర్గామికి ఎస్కార్ట్గా వస్తున్న నౌకల కాన్వాయ్(ఫ్లోటిల్లా)కు కమాండర్ ఒమర్ ఫరూఖ్ కొలంబో పోర్ట్లో మాట్లాడారు. ‘‘అధునాతన హంగోర్ తరగతి జలాంతర్గామితో పాక్ ఇకపై సముద్రతలంలోనూ తన సత్తా చాటనుంది. బంగాళాఖాతంలో మా కార్యకలాపాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది ఆట తీరును మార్చేసే గేమ్ ఛేంజర్. ఈ రకం ఎనిమిది జలాంతర్గాములను సమకూర్చుకోబోతున్నాం’’అని ఆయన వెల్లడించారు. అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతం దాకా తమ నిఘా కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు కమాండర్ చెప్పడంతో పాక్ కుయుక్తి బహిర్గతమైంది. బంగాళాఖాతం ఎందుకంత కీలకం? భారత్–పాకిస్తాన్ యుద్ధం వేళ డయ్యూ పరిధిలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రీని పాక్కు చెందిన పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి మూడు టార్పెడోలతో దాడిచేసి ముంచేసింది. అయినాసరే యుద్ధంపై దీని ప్రభావం ఏమాత్రం పడలేదు. భీకరంగా దాడిచేసిన భారత్ పాక్ పీచమణిచింది. అప్పట్నుంచి బంగాళాఖాతంలో పాక్ జలాంతర్గాముల సంచారమే లేదు. తాజాగా బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూలడం, పాక్ అనుకూల ప్రభుత్వం కొలువుతీరడంతో దశాబ్దాల తర్వాత బంగాళాఖాతంపై పాక్ కన్నుపడింది. భౌగోళికంగా బంగాళాఖాతంపై భారత పట్టు అధికం.అండమాన్ నికోబార్ దీవులు ఉండటంతో అక్కడి నుంచి సముద్రంలోపలికి 370 కిలోమీటర్లదాకా భారత ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఉంది. అక్కడిదాకా సముద్రజలాలపై సర్వాధికారం భారత్కే దఖలుపడుతోంది. ఉత్తర తీరం వైపే విశాఖపట్నంలో భారత నావికాదళ తూర్పు కమాండ్ ప్రధాన స్థావరం ఉంది. ఇదే బంగాళాఖాతం బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియాలకూ తీరప్రాంతంగా ఉంది.అదీకాకుండా బంగాళాఖాతం అనేది భారత వస్తూత్పత్తులు, ఇంధన వాణిజ్యానికి, నౌకల రాకపోకలకు కీలక మార్గంగా మారింది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో పాక్ అడుగుపెట్టడం భారత నావికా, నిఘా కార్యకలాపాలకు అవరోధంగా మారే ఆస్కారముంది. పాక్ తన తీర ప్రాంతానికి సుదూరంగా హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తే భారత్కు ఎప్పుడూ తలనొప్పేనని యుద్దరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. సముద్ర జలాల్లో హంగోర్ జలాంతర్గామి -
భారత్కు పాక్ కొత్త సవాల్.. 1971 గాయం మానలేదా?
భారత్-పాకిస్తాన్ మధ్య 1971 యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత దాదాపు ఐదు దశాబ్దాలుగా బంగాళాఖాతంలో పెద్దగా కనిపించని పాకిస్తాన్ నౌకాదళం.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది. చైనా సాయంతో నిర్మించిన అత్యాధునిక హంగోర్-క్లాస్ జలాంతర్గాములను బంగాళాఖాతంలో మోహరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం నౌకాదళ విస్తరణేనా? లేక 1971 తర్వాత కోల్పోయిన వ్యూహాత్మక ప్రభావాన్ని తిరిగి సాధించాలనే ప్రయత్నమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.1971లో ఏం జరిగింది?1971 యుద్ధం పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద సైనిక, రాజకీయ పరాజయం. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా అవతరించింది. దీంతో పాక్కు బంగాళాఖాతంలో ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ (PNS Ghazi) విశాఖపట్నం సమీపంలో మునిగిపోయింది. తూర్పు ప్రాంతంలో భారత నౌకాదళం సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో పాకిస్తాన్కు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం దాదాపు లేకుండాపోయింది. అప్పటి నుంచి పాక్ నౌకాదళం ప్రధానంగా అరేబియా సముద్రం, కరాచీ, గ్వాదర్ ప్రాంతాలకే పరిమితమైంది.పాక్ ప్లానేంటి?పాకిస్తాన్ నౌకాదళం చైనా సహకారంతో కొనుగోలు చేస్తున్న 8 హంగోర్-క్లాస్ జలాంతర్గాములు దాని సముద్ర వ్యూహంలో పెద్ద మార్పునకు నాంది పలుకుతున్నాయి. మొదటి జలాంతర్గామి PNS హాంగోర్ ఇప్పటికే పాక్ నౌకాదళంలో చేరింది. మిగిలినవి 2028 నాటికి దశలవారీగా చేరనున్నాయి. పాక్ నౌకాదళ అధికారుల ప్రకారం.. ఈ కొత్త సామర్థ్యాలతో అరేబియా సముద్రానికి మాత్రమే కాకుండా తూర్పు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వరకు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఏర్పడుతోంది.హంగోర్ జలాంతర్గాముల ప్రత్యేకత?ఈ జలాంతర్గాములు చైనా Type-039B యూవాన్ క్లాస్ నమూనా ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ సామర్థ్యాల వల్ల పాక్ నౌకాదళానికి గతంతో పోలిస్తే గణనీయమైన వ్యూహాత్మక ప్రయోజనం లభించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.వీటి ప్రధాన ప్రత్యేకతలు:AIP (Air Independent Propulsion) టెక్నాలజీనీటి అడుగున ఎక్కువకాలం ప్రయాణించే సామర్థ్యంతక్కువ శబ్దంతో కదిలే స్టెల్త్ సిస్టమ్ఆధునిక సోనార్, సెన్సార్ వ్యవస్థలుటార్పెడోలు, యాంటీ-షిప్ క్షిపణుల సామర్థ్యంభవిష్యత్తులో బాబర్-3 క్రూయిజ్ క్షిపణుల వినియోగ అవకాశాలుచైనా పాత్ర ఎంత కీలకం?ఈ ప్రాజెక్టు వెనుక అసలు శక్తి చైనానే. హంగోర్ జలాంతర్గాముల ఒప్పందం విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు. నాలుగు జలాంతర్గాములు చైనాలో, మరో నాలుగు కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఆయుధాల విక్రయం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో చైనా-పాక్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా కూడా భావిస్తున్నారు. భారత్ చుట్టూ "స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్" వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా, గ్వాదర్ నుంచి బంగాళాఖాతం వరకు తన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోందని భారత వ్యూహ నిపుణులు భావిస్తున్నారు.భారత్కు ఆందోళన అంశమేనా?సైనికంగా చూస్తే ప్రస్తుతం భారత నౌకాదళం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు, స్కార్పీన్ క్లాస్ సబ్మెరైన్లు, దీర్ఘశ్రేణి సముద్ర నిఘా వ్యవస్థలు, తూర్పు నౌకాదళ కమాండ్ వంటి అంశాల్లో భారత్కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. అయితే, పాకిస్తాన్ జలాంతర్గాములు బంగాళాఖాతంలో కార్యకలాపాలు నిర్వహించడం వల్ల భారత నౌకాదళం తన తూర్పు తీర భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే భారత్ కూడా కొత్త జలాంతర్గాముల కొనుగోలు, దేశీయ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.బంగ్లాదేశ్ అంశం కూడా కీలకమేపాక్ బంగాళాఖాతంలో ఉనికిని పెంచాలంటే బంగ్లాదేశ్తో సంబంధాలు కీలకం కానున్నాయి. గత కొంతకాలంగా ఇస్లామాబాద్-ఢాకా సంబంధాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే బంగాళాఖాతం ఇప్పటికీ భారత ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పరిగణించబడుతుంది. అందువల్ల పాక్ ఉనికి పెరిగినా, అది ఎంత స్థాయిలో ప్రభావం చూపగలదన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. కాగా, వాస్తవానికి బంగాళాఖాతంలో పాక్ నిరంతర ఉనికి కొనసాగించడం అంత సులభం కాదు. భౌగోళిక పరిమితులు, లాజిస్టిక్స్, భారత నౌకాదళ ఆధిపత్యం వంటి అంశాలు ఇప్పటికీ ఇస్లామాబాద్కు పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. -
ఉత్కంఠ పోరులో పాక్పై సౌతాఫ్రికా గెలుపు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం తర్వాత, పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడినా, 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెర్క్సెన్ (52) మెరుపు అర్ద సెంచరీతో, నదినే డి క్లెర్క్ (37) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో సౌతాఫ్రికాను గెలిపించారు.తొలుత బ్యాట్తో (55 నాటౌట్) సత్తా చాటిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా, ఆతర్వాత బంతితోనూ (2.5-0-16-3) చెలరేగి సౌతాఫ్రికా శిబిరంలో గుబులు రేపింది. సనాకు సదియా ఇక్బాల్ (4-0-26-2), తుబా హస్సన్ (4-0-28-2), నష్రా సంధు (4-0-28-1) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ దశలో ఓటమి దిశగా సాగింది. అయితే అప్పటికే డెర్క్సెన్, క్లెర్క్ గెలుపుకు పునాది వేయడంతో సౌతాఫ్రికా విజయతీరాలకు చేరగలిగింది.అంతకుముందు 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ను ఫాతిమా సనా (38 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), తుబా హస్సన్ (23) ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 71 పరుగులు జోడించడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్లో సనా, తుబాతో పాటు ఇరామ్ జావెద్ (11), ఆలియా రియాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ 3, షబ్నిమ్ ఇస్మాయిల్, ఖాకా తలో వికెట్ తీశారు. -
భారత మ్యాప్ వివాదం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM)ను మళ్లీ పాత పేరైన యూఎస్ పసిఫిక్ కమాండ్ (USPACOM)గా మార్చినట్లు ప్రకటించారు. ఎనిమిదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఈ మార్పు చేశారు.1947 జనవరి 1న అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ యూఎస్ పసిఫిక్ కమాండ్గా ఏర్పాటు చేశారు. అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు, అప్పటి రక్షణ మంత్రి జిమ్ మాటిస్లు యూఎస్ పసిఫిక్ కమాండ్ను కాస్తా యూఎస్ ఇండియా పసిపిక్ కమాండ్గా మార్చారు.ఎనిమిదేళ్ల తర్వాత పాత పేరు అయిన యూఎస్ పసిఫిక్ కమాండ్గా మార్పు చేశారు. సాంకేతిక, చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకే మళ్లీ పాత పేరును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే పేరు మారుస్తూ అమెరికా రక్షణ శాఖ వెబ్సైట్లో యూఎస్ పసిఫిక్ కమాండ్ మ్యాప్ను ఏర్పాటు చేసింది. ఆమ్యాప్పై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ మ్యాప్లో అమెరికా పీవోకేను పాక్ భూభాగంలో చూపించింది. దీంతో తప్పుడు మ్యాప్ను ప్రదర్శించడంపై భారతీయులు ట్రంప్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం అమెరికా-భారత్ సంబంధాలపై దౌత్య పరమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. -
ఎడారిలో ‘ఫ్యూయల్ రైడర్స్’.. ప్రతీ ట్రిప్ ఓ సవాలే..
ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి. ఎడారి గాలులు శరీరాన్ని కాల్చేస్తున్నాయి. ఒకవైపు సాయుధ ఘర్షణలు, మరోవైపు భద్రతా బలగాల తనిఖీలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రతిరోజూ వందలాది బైకర్లు ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దు మీదుగా పెట్రోల్, డీజిల్ను తరలిస్తూ జీవన పోరాటం సాగిస్తున్నారు. ఇది కేవలం అక్రమ రవాణా కథ కాదు. పేదరికం, నిరుద్యోగం, సరిహద్దు ప్రాంతాల నిర్లక్ష్య అభివృద్ధి రాసిన ఒక విషాద గాథ.ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం వేలాది మంది యువకులు ఇదే జీవితాన్ని గడుపుతున్నారు. ఇరాన్లో తక్కువ ధరకు లభించే ఇంధనాన్ని పాకిస్తాన్కు తరలిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. చట్టపరంగా ఇది అక్రమ రవాణాగా పరిగణించబడుతున్నప్పటికీ, స్థానికుల దృష్టిలో ఇది బతికే మార్గం. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మరియు ఇరాన్లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంతాల మధ్య దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ ప్రాంతం ఎడారులు, కొండలు, నిర్జన మార్గాలతో నిండి ఉంటుంది. అధికారిక వాణిజ్య అవకాశాలు తక్కువగా ఉండటంతో వేలాది మంది స్థానికులు ఇంధన రవాణాపైనే ఆధారపడుతున్నారు.ఇరాన్లో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా ఇంధన ధరలు తక్కువగా ఉంటాయి. అదే ఇంధనాన్ని పాకిస్తాన్లో విక్రయిస్తే మంచి లాభం వస్తుంది. ఈ ధరల వ్యత్యాసమే భారీ స్థాయిలో ఇంధన రవాణాకు కారణమైంది. సరిహద్దు ప్రాంతాల్లోని డిపోల నుంచి పెట్రోల్, డీజిల్ను జెర్రీ క్యాన్లలో నింపుకుని బైక్లకు కట్టుకొని ప్రయాణించడం అక్కడ సాధారణ దృశ్యంగా మారింది. ఒక్కో బైక్పై అనేక క్యాన్లలో వందల లీటర్ల ఇంధనాన్ని మోస్తారు. ఇంధనం బరువుతో బైక్ నియంత్రణ కోల్పోతే ప్రమాదం తప్పదు. చిన్న స్పార్క్ వచ్చినా అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కుటుంబ పోషణ కోసం ఈ ప్రమాదాలను లెక్కచేయకుండా యువకులు ఈ పనిలో కొనసాగుతున్నారు.ఈ ప్రాంతంలో పరిస్థితులను మరింత క్లిష్టం చేస్తున్నది భద్రతా సమస్య. బలూచ్ సాయుధ గ్రూపుల కార్యకలాపాలు, భద్రతా దళాల ఆపరేషన్లు, సరిహద్దు పర్యవేక్షణ కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిసార్లు కాల్పులు, అరెస్టులు, వాహనాల స్వాధీనం వంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. అయినప్పటికీ జీవనోపాధి కోసం ప్రజలు ఈ మార్గాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు.నిపుణుల అంచనా ప్రకారం రోజుకు లక్షల లీటర్ల నుంచి మిలియన్ల లీటర్ల వరకు ఇరానియన్ ఇంధనం వివిధ మార్గాల ద్వారా పాకిస్తాన్లోకి చేరుతోంది. గతంలో వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం రోజుకు సుమారు 5 నుంచి 6 మిలియన్ లీటర్ల ఇంధనం అక్రమ మార్గాల్లో పాక్లోకి ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యాపారంలో వేలాది వాహనాలు, పడవలు, బైకులు పాల్గొంటున్నట్లు అంచనాలు ఉన్నాయి. పాక్ ప్రభుత్వం ఈ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, స్థానికుల జీవనాధారం దీనిపైనే ఆధారపడటంతో సమస్య సంక్లిష్టంగా మారింది. అధికారుల దృష్టిలో ఇది స్మగ్లింగ్. కానీ సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజల దృష్టిలో ఇది ఆకలి నుంచి బయటపడే మార్గం.ఇటీవలి కాలంలో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్పై ఆంక్షలు, ఇంధన సరఫరా సమస్యలు ఈ వ్యాపారాన్ని మరింత ప్రాధాన్యంగా మార్చాయి. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆంక్షల వల్ల నష్టపోయిన ఇరాన్కు ఇది అదనపు ఆదాయ మార్గంగా మారగా, పాకిస్తాన్లోని పేద ప్రాంతాలకు చౌకైన ఇంధనం అందించే వ్యవస్థగా కొనసాగుతోంది. -
పాకిస్థాన్లో కాల్పులు.. పదేళ్ల విదేశీ చిన్నారి మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. ఒక పోలీసు అధికారి చేసిన పొరపాటుతో పదేళ్ల ముక్కపచ్చలారని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దొంగతనానికి సంబంధించిన ముఠాను ఛేదిస్తున్న క్రమంలో జరిపిన కాల్పుల్లో పోరపాటున విదేశీయులకు బుల్లెట్లు తగిలాయి. ఈ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన బాలిక అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ఒక పోలీసు అధికారిని అరెస్టు చేశారు.పంజాబ్ పోలీసుల కథనం ప్రకారం, దోపిడీ జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు వెను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అనుమానితులు కుటుంబ కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఒక కుటుంబానికి చెందిన వాహనాన్ని అడ్డగించారు. వారు ఆపకపోవడంతో అధికారి పొరపాటుగా భావించి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అయితే ఈకాల్పుల ఘటనలో దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాకు చెందిన 10 ఏళ్ల హానియా అనే బాలిక మరణించగా, ఆమె తండ్రి, సోదరుడు గాయపడ్డారని తెలిపారు. దీంతో ఈ కాల్పులకు కారణమైన అధికారని పోలీసులు అరెస్టిు చేశారు.కాగా ఆస్ట్రేలియా పెర్క్కు సంబంధించిన బాధితులు పాకిస్థాన్లోని తమ బంధువులను కలవడానికి వచ్చారని ఆ సమయంలో కాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఆస్ట్రేలియ ప్రధాని ఆంటోనియా ఆల్బనీస్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై పారదర్శకమైన విచారణ జరగాలని కోరారు. గాయపడిన వారికి ఆస్ట్రేలియా కాన్సులేట్ సహాయం అందిస్తున్నట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.An Australian family's been caught up in a horror shooting while on holidays in Pakistan. Police opened fire, killing a nine-year-old girl and wounding her father and brother, apparently mistaking them for thieves. pic.twitter.com/zAZxr1ccou— 7NEWS Sydney (@7NewsSydney) June 13, 2026 -
ముగిసిన ఇరాన్-అమెరికా యుద్ధం
పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ కాలంలో ఇరు దేశాలు మరిన్ని శాంతి చర్చలు నిర్వహించి దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయనున్నాయి. అయితే ఈ డీల్ తాలుకా మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. డీల్ కుదిరిన నేపథ్యంలో.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకా దళ దిగ్భంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తైందని.. ఇరాన్పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హర్ముజ్ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయనో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని నౌకలు హర్ముజ్లో ఇంజిన్లు ప్రారంభించాలని.. తమ ప్రయాణాలను తిరిగి ప్రారంభించాలని.. చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలని ట్రంప్ పేర్కొన్నారు.ఇటు ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే(జూన్ 14) డీల్ కుదరడం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. భారీ మూల్యం అయితే ఈ మూడు నెలల యుద్ధం ఇరు దేశాలనే కాదు.. పలు దేశాల్ని సైతం భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. అమెరికా వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఇరాన్లోని పలు సైనిక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలు, కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్లో అమెరికా బ్లాకేడ్ వల్ల వాణిజ్య నౌకలు ఆగిపోయాయి. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడుల కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తి నాశనం అయ్యాయి. ఇరువైపులా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. హర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. సముద్ర రవాణా వ్యయాలు పెరగడంతో.. ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం పడింది. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా వ్యవస్థలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పాక్ను తిప్పేశారు
ధనాధన్ ఫార్మాట్లోనూ విశ్వవిజేతగా అవతరించాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత మహిళల జట్టు టైటిల్ వేటను బ్రహ్మాండంగా ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను తొలి మ్యాచ్లో చిత్తు చేసి టీమిండియా గెలుపు గర్జన చేసింది. బ్యాటింగ్లో స్మృతి మంధాన, రిచా ఘోష్, హర్మన్ప్రీత్ విజృంభించగా... బౌలింగ్లో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి, స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ తమ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చారు. బర్మింగ్హామ్: ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్లో శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఘనవిజయంతో కప్పు వేటను ఘనంగా ప్రారంభించింది. గ్రూప్–1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (44 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో విజృంభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించింది. చివర్లో రిచా ఘోష్ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టింది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా, ఫాతిమా సనా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మునీబా అలీ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. పవర్ప్లే ముగిసేసరికి 52/1తో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్తాన్... స్పిన్నర్ల రంగప్రవేశం తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ 10 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 21 పరుగులిచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకుంది. భారత పురుష క్రికెటర్ల మాదిరిగానే... మహిళా క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్లకు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదు. ప్రపంచకప్లో సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే మ్యాచ్ల్లో న్యూజిలాండ్తో శ్రీలంక; ఇంగ్లండ్తో ఐర్లాండ్ తలపడతాయి. తొలి బంతికే సిక్సర్... ఓపెనర్ షఫాలీ వర్మ (6) తొలి బంతికే సిక్స్ బాదడంతో... టీమిండియాకు మంచి ఆరంభం దక్కుతుందనుకుంటే అది సాధ్యపడలేదు. ఐదో బంతికి షఫాలీ అవుట్ కాగా... జెమీమా (1) విఫలమైంది. దీంతో భారత్ 18/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో నాయకద్వయం జట్టును ఆదుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్తో కలిసి వైస్ కెప్టెన్ స్మృతి ఇన్నింగ్స్ను నిర్మించింది. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన ఈ జంట... కుదురుకున్నాక చక్కటి షాట్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్కు 91 పరుగులు జోడించిన అనంతరం స్మృతి అవుట్ కాగా... హార్డ్ హిట్టర్ భారతి ఫుల్మాలి (1) నిరాశ పరిచింది. ఈ దశలో దీప్తి శర్మ (12 నాటౌట్) అండతో రిచా రెచ్చిపోయింది. పాకిస్తాన్ పేలవ ఫీల్డింగ్ కూడా మనవాళ్లకు కలిసి వచ్చింది. ఒక్క ఓవర్లో 23 పరుగులు... తస్మియా రుబాబ్ వేసిన ఇన్నింగ్స్19వ ఓవర్లో భారత బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. తొలి బంతికి ఫోర్ కొట్టిన దీప్తి రెండో బంతికి సింగిల్ తీయగా... ఆ తర్వాత రిచా రఫ్ఫాడించింది. వరుసగా 4, 6, 4, 4 బాదింది. దీంతో ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో మరో 15 పరుగులు రాబట్టారు. మొత్తంగా తొలి 10 ఓవర్లలో 65 పరుగులకే పరిమితమైన టీమిండియా ఆ తర్వాత 10 ఓవర్లలో 105 పరుగులు చేసింది. 87 అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా స్మతి మంధాన అవతరించింది. 86 సిక్స్లతో హర్మన్ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది.14 టి20 ఫార్మాట్లో పాకిస్తాన్పై భారత్ గెలిచిన మ్యాచ్లు. ఇరు జట్ల మధ్య 17 మ్యాచ్లు జరిగాయి. మూడింటిలో పాక్ గెలిచింది.166 మహిళల టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ గుర్తింపు పొందింది. 165 వికెట్లతో థిపాచా పథావోంగ్ (థాయ్లాండ్) పేరిట ఉన్న రికార్డును దీప్తి సవరించింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) మునీబా (బి) సాదియా 6; స్మృతి (సి) సనా (బి) షమీమ్ 68; జెమీమా (సి) నటాలియా (బి) తస్మియా 1; హర్మన్ప్రీత్ (సి) నటాలియా (బి) సనా 36; భారతి (స్టంప్డ్) మునీబా (బి) సాదియా 1; రిచా (బి) సనా 34; దీప్తి శర్మ (నాటౌట్) 12; శ్రేయాంక పాటిల్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–109, 4–110, 5–123, 6–168. బౌలింగ్: సాదియా 4–0–41–2; ఫాతిమా సనా 4–0–33–2; తస్మియా 4–0–41–1; రమీన్ షమీమ్ 4–0–30–1; నష్ర 4–0–25–0. పాకిస్తాన్ మహిళల ఇన్నింగ్స్: మునీబా (రనౌట్) 41; ఫెరోజా (సి) భారతి (బి) దీప్తి 12; ఆయేషా (సి) స్మృతి (బి) దీప్తి 12; సైరా జబీన్ (సి) హర్మన్ (బి) శ్రీ చరణి 2; నటాలియా (సి) హర్మన్ (బి) శ్రీ చరణి 7; సనా (సి) స్మృతి (బి) షఫాలీ 0; ఆలియా (సి) జెమీమా (బి) దీప్తి 18; షమీమ్ (సి) శ్రేయాంక (బి) శ్రీ చరణి 4; నష్ర (సి) హర్మన్ (బి) దీప్తి 4; తస్మియా (సి) జెమీమా (బి) దీప్తి 0; సాదియా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (17 ఓవర్లలో ఆలౌట్) 106. వికెట్ల పతనం: 1–38, 2–53, 3–58, 4–75, 5–77, 6–79, 7–91, 8–105, 9–105, 10–106. బౌలింగ్: అరుంధతి రెడ్డి 2–0–21–0; శ్రేయాంక 3–0–17–0; క్రాంతి గౌడ్ 1–0–14–0; దీప్తి శర్మ 4–0–10–5; శ్రీ చరణి 4–0–21–3; షఫాలీ 3–0–22–1. -
టీమిండియా ఘన విజయం
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. దీప్తి శర్మ (4-0-10-5) మాయాజాలానికి పాక్ 106 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరఫున బ్యాటింగ్లో మంధాన (68) రాణించగా.. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించింది. ఓటమి దిశగా పాక్75 పరుగుల వద్ద నాలుగు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన పాక్.. ఓటమి దిశగా సాగుతోంది. 75 పరుగుల వద్ద మునీబా అలీని (41) దీప్తి శర్మ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయగా.. 77 పరుగుల వద్ద ఫాతిమా సనాను (0) షఫాలీ, 79 పరుగుల వద్ద నతాలియాను (7) శ్రీ చరణి ఔట్ చేశారు. 13 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 83-6గా ఉంది. ఆలియా రియాజ్ (4), రమీన్ షమీమ్ (1) క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పాక్7.4వ ఓవర్- 58 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. శ్రీచరణి బౌలింగ్లో హర్మన్ప్రీత్కు క్యాచ్ ఇచ్చి సైరా జబీన్ (2) ఔటైంది. రెండో వికెట్ కోల్పోయిన పాక్6.3వ ఓవర్- 53 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ కోల్పోయింది. దీప్తి శర్మ బౌలింగ్లో స్మృతి మంధనకు క్యాచ్ ఇచ్చి అయేషా జాఫర్ (12) ఔటైంది.ఇండియాకు తొలి బ్రేక్171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్కు మెరుపు ఆరంభం లభించింది. 4.4 ఓవర్లలో ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (24), గుల్ ఫెరోజా (12) 38 పరుగులు చేశారు. అయితే 4.5వ ఓవర్లో భారత్కు తొలి బ్రేక్ లభించింది. ఫెరోజాను దీప్తి శర్మ ఇంటిదారి పట్టించింది. భారతి ఫుల్మలి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఇది జరిగింది. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించింది. ఆమెకు కెప్టెన్ హర్మన్ప్రీత్ (36) సహకరించింది. ఆఖర్లో రిచా ఘోష్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించింది. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ 12 (నాటౌట్), షఫాలీ వర్మ 6, జెమీమా రోడ్రిగ్స్ 1, భారతి ఫుల్మాలి 1, శ్రేయాంక పాటిల్ 1 (నాటౌట్) పరుగు చేశారు. ఆపఖ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్ తలో 2 వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఫాతిమా సనా బౌలింగ్లో నతాలియాకు క్యాచ్ ఇచ్చి హర్మన్ప్రీత్ (36) ఔటైంది. 👉 సాదియా ఇక్బాల్ బౌలింగ్లో భారతీ ఫుల్మలీ (1) స్టంప్ ఔట్ కావడంతో 110 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.మంధాన (68) ఔట్.. మూడో వికెట్ డౌన్ధాటిగా ఆడుతున్న మంధాన (68) రూపంలో టీమిండియా 109 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రమీన్ సమీమ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన మంధాన ఫాతిమా సనాషేక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. హాఫ్ సెంచరీ బాదిన మంధానపాక్తో మ్యాచ్లో ఓపెనర్ స్మృతి మంధాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన మంధాన ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన (55), హర్మన్ప్రీత్ (21) పరుగులతో ఆడుతున్నారు.9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ ఎంతంటే..?18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. స్మృతి మంధన (28), కెప్టెన్ హర్మన్ప్రీత్ (17) ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నారు. 9 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54-2గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా3.2వ ఓవర్- 18 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. తస్మియా రుబాబ్ బౌలింగ్లో నతాలియా పర్వేజ్ క్యాచ్ పట్టడంతో జెమీమా రోడ్రిగ్స్ (1) పెవిలియన్కు చేరింది. తొలి బంతికే సిక్సర్.. ఐదో బంతికి వికెట్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు మెరుపు ఆరంభం లభించింది. ఇన్నింగ్స్ తొలి బంతికే సదియా ఇక్బాల్ బౌలింగ్లో షఫాలీ వర్మ సిక్సర్ కొట్టింది. అయితే అదే ఓవర్ ఐదో బంతికి మునీబా అలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (జూన్ 14) బిగ్ ఫైట్ జరుగనుంది. దాయాదులు భారత్, పాకిస్తాన్ ఎడ్జ్బాస్టన్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లోనూ భారత, పాక్ కెప్టెన్లు నో హ్యాండ్ షేక్ ఆనవాయితీని కొనసాగించారు. తుది జట్లు:భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్పాకిస్తాన్: గుల్ ఫిరోజా, మునీబా అలీ(w), అయేషా జాఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, ఫాతిమా సనా(c), రమీన్ షమీమ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్, సదియా ఇక్బాల్ -
యుద్దంలో పాక్ ఓడిపోతే అదే చేయాలి
తిరువనంతరపురం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో చర్చలు జరపాలని RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలు సమర్ధిస్తున్నానని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ ఇలా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ "మనం హిట్లర్ లాంటి వాళ్లం కాదు, అది మన స్వభావం కూడా కాదు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్లో భాగం చేయడమో లేదా వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలి. అందుకోసం వారితో చర్చలు జరిపే మార్గాలను (తలుపులను) ఎప్పుడూ తెరిచే ఉంచాలి" అని భగవత్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, నియంతృత్వాన్ని అంతమొందించాలని అదే సమయంలో మంచిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.పాకిస్తాన్లో మారుతున్న ఆలోచనలుదేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారన్నారు. అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని, 'రెండు దేశాల సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన అక్కడ అంతర్గతంగా బలంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్ఎస్ఎస్కు విడిగా ఎలాంటి ప్రత్యేక విధానాలు ఉండవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ, అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. యూనిఫామ్ వేసుకుని చేసే రూట్ మార్చ్లను చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థ అనుకుంటారని, వ్యాయామాలు చూసి వ్యాయామశాల అనుకుంటారని, కానీ బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, దానిని లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన కోరారు. -
మన మహిళలు రెడీ
బర్మింగ్హామ్: మహిళల వన్డే వరల్డ్ కప్ చాంపియన్ భారత్ తొలి సారి టి20 ప్రపంచకప్ను కూడా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్గా ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పాక్కంటే పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్కు ముందు ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లను వారి సొంతగడ్డపై ఓడించిన హర్మన్ప్రీత్ సేన... స్వదేశంలో శ్రీలంకను 5–0తో చిత్తు చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ల చేతుల్లో సిరీస్లు కోల్పోయినా... జట్టు కూర్పులో భాగంగా చేసిన పలు ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పటి వరకు టి20 ప్రపంచకప్లలో పాక్పై భారత్ 6–2తో ఆధిక్యంలో ఉండగా... ఓవరాల్గా టి20ల్లో కూడా భారత్ 13–3తో పైచేయి సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా ఆరంభిస్తే భారత్ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మూడో స్థానంలో యస్తిక భాటియా, భారతి ఫుల్మలిలలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది చూడాలి. మిడిలార్డర్లో జెమీమా, హర్మన్ తమ స్థాయికి తగ్గి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఎప్పటిలాగే ఫినిషింగ్లో రిచా ఘోష్ మెరుపు బ్యాటింగ్ కనబర్చగల సమర్థురాలు. ప్రధాన పేసర్గా క్రాంతి గౌడ్ ఖాయం కాగా...అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్లలో ఒకరికే రెండో పేసర్గా చాన్స్ లభిస్తుంది. ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, నందిని శర్మ, దీప్తి శర్మలతో భారత్ ఆడటం ఖాయమైంది. మరో వైపు 2024 వరల్డ్ కప్లో భారత్ చేతిలో చిత్తయిన పాక్ జట్టు ఈ సారైనా పోటీనివ్వాలని భావిస్తోంది. జట్టు కెపె్టన్ ఫాతిమా సనా ఆల్రౌండ్ ప్రదర్శనపై జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా బంతి తగలడంతో సనా మోకాలికి గాయమైంది. అయితే ఇది ప్రమాదకరమైందని కాదని, ఆమె బరిలోకి దిగుతుందని పాక్ మేనేజ్మెట్ ప్రకటించింది. సీనియర్ ఓపెన్ మునీబా, గుల్ ఫెరోజా ఎలాంటి ఆటతీరు కనబరుస్తారనేది చూడాలి. పాక్ జట్టులో ఈ సారి కొత్త ప్లేయర్ ఇమాన్ ఫాతిమాపై అందరి దృష్టీ నిలిచింది. అండర్–19 స్థాయినుంచి వచ్చిన ఆమె టి20ల్లో 150కు పైగా స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేయగల సమర్థురాలు. ఫినిషర్గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఇమాన్పై పాక్ ఆశలు పెట్టుకుంది.డానీ వ్యాట్ సెంచరీమహిళల టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్–2 మ్యాచ్లో ఇంగ్లండ్ 87 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 219 పరుగులు చేసింది. మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టు అత్యధిక స్కోరు ఇదే. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఓపెనర్ డానీ వ్యాట్ (62 బంతుల్లో 105 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగింది. అమీ జోన్స్ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సీవర్ బ్రంట్ (22 బంతుల్లో 46 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షిక (39; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ 4 వికెట్లు పడగొట్టింది.ఆ్రస్టేలియా అదరహో...మాంచెస్టర్: మహిళల టి20 ప్రపంచకప్లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఆసీస్ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా ఫోబ్ లిచ్ఫీల్డ్ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎలైస్ పెరీ (36), వేర్హామ్ (32) మెరుపులతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 172 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్లో స్కాట్లాండ్ 40 పరుగులతో ఐర్లాండ్పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. -
సరిహద్దు దాటి భారత్లో అడుగుపెట్టిన పాకిస్థానీ.. దొరికేశాడు..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సిమ్రీ గ్రామం సమీపంలో ఓ పాకిస్థాన్ పౌరుడిని అధికారులు పట్టుకున్నారు. భద్రతా పరంగా దీన్ని భారీ విజయంగా చెప్పుకోవచ్చు. భారత సైన్యం చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి నిర్వహించిన ‘ఆపరేషన్ సిమ్రీ’ ఫలితంగా అతడు దొరికాడు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాకిస్థాన్ పౌరుడు అనుమానాస్పదంగా నియంత్రణ రేఖను దాటాడు. నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా అప్రమత్తమైన చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే అవకాశాన్ని నివారించింది."నిర్దిష్ట నిఘా సమాచార ఆధారంగా, అప్రమత్తంగా ఉన్న చినార్ వారియర్స్ జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి జూన్ 12న కుప్వారాలోని సిమ్రీ గ్రామం సమీపంలో అనుమానాస్పద పరిస్థితుల్లో నియంత్రణ రేఖ దాటిన ఓ పాక్ పౌరుడిని పట్టుకున్నారు. వేగంగా స్పందించిన చినార్ వారియర్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఆ వ్యక్తిని అడ్డుకుని, భద్రతా ఉల్లంఘన జరిగే ప్రమాదాన్ని నివారించింది. చొరబాటుదారుడిపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది" అని చినార్ కార్ప్స్ ఎక్స్ ద్వారా పోస్టు చేసింది.నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) అంటే భారత్, పాకిస్థాన్ అధీన ప్రాంతాల మధ్య ఉన్న సైనిక విభజన రేఖ. ఈ ప్రాంతం చాలా కీలకం. ఉగ్రవాదులు చొరబడకుండా సైనికులు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. OP SIMRI, KupwaraBased on specific intelligence input, alert #ChinarWarriors, in a joint operation with @JmuKmrPolice, apprehended a Pak National near Simri Village, Kupwara on 12 Jun 2026, who had crossed the Line of Control under suspicious circumstances. Acting swiftly, the… pic.twitter.com/NCpX0gUbta— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) June 13, 2026 -
పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉగ్రవాదానికి పాకిస్తాన్ అందిస్తున్న మద్దతును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది నీరు చేరకుండా ఎన్డిఎ (NDA) ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ ఏర్పాటు చేసిన 'మేధావుల సమావేశం'లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్యాల భాష అర్థం కాని వారికి ఎలా సమాధానం చెప్పాలో తమ ప్రభుత్వానికి బాగా తెలుసని 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ప్రపంచానికి నిరూపించామని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అండగా నిలిచే వారికి సింధు నదీ జలాలు అంద కుండా చేస్తామని హెచ్చరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన రక్తం, నీరు కలిసి ప్రవహించవు అన్న హెచ్చరికను రక్షణ మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ, బాధితుల పట్ల కరుణ చూపనివారికి తమ నుంచి నీటిని ఆశించకూడదని చెప్పామన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలిచేవారికి, మానవాళికే ముప్పుగా ఉన్నవారికి ఈ జలాలు అందకుండా చేస్తామన్నారు.కాగా సింధు నదీ వ్యవస్థకు చెందిన నదుల జలాల వినియోగానికి సంబంధించి 1960 సెప్టెంబర్ 19న భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం (IWT) కుదిరింది. అయితే గత ఏడాది జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, అంతర్జాతీయ చట్టం ప్రకారం సార్వభౌమ దేశంగా తనకున్న హక్కులను వినియోగించుకుంటూ, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నమ్మదగిన, తిరుగులేని రీతిలో మద్దతు ఉపసంహరించుకునే వరకు భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసింది.అలాగే గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ, రక్షణ మంత్రి ఆర్టికల్ 370 రద్దు, దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడంలో పురోగతి, జీఎస్టీ (GST) అమలు, దేశవ్యాప్త విద్యుదీకరణ మరియు న్యాయ వ్యవస్థలో సంస్కరణలను ప్రస్తావించారు. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిలయంగా ఉన్న కాశ్మీర్, ఇప్పుడు పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.శ్రీనగర్లోని లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది, అక్కడ తొలిసారిగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి, మొహర్రం ఊరేగింపులు ప్రశాంతంగా సాగుతున్నాయి, దశాబ్దాలుగా మూతపడి ఉన్న సినిమా హాళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన
ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, ఆధునిక వంతెనలు ఉన్నాయి. కానీ కేవలం ఇనుప తీగలు, సరిగ్గా అమర్చని చెక్క పలకలతో నిర్మించిన ఒక వంతెనను చూస్తే మాత్రం ఎవరికైనా వణుకు పుట్టడం ఖాయం. పాకిస్తాన్లోని ఉత్తర పర్వత ప్రాంతంలో ఉన్న ‘హుస్సేనీ సస్పెన్షన్ బ్రిడ్జ్’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెనగా గుర్తింపు పొందింది. గిల్గిట్-బాల్టిస్తాన్ రీజియన్లో ఉధృతంగా ప్రవహించే హుంజా నదిపై నిర్మించిన ఈ వంతెన పర్యాటకులకు వింత అనుభూతిని ఇస్తూనే, ప్రతి అడుగులోనూ మృత్యువును పరిచయం చేస్తుంది. అసలు ఈ వంతెన అంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.భీకర గాలులను తట్టుకునే ప్రత్యేక వింత డిజైన్ఈ వంతెనను చూడగానే ఎవరికైనా భయం వేయడం సహజం. వంతెనపై ఉన్న చెక్క పలకల మధ్య చాలా ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. అయితే, ఇది పాలకుల నిర్లక్ష్యం కాదు. ఇదొక వ్యూహాత్మక ఇంజనీరింగ్ డిజైన్. గోజల్ లోయలో వీచే అత్యంత వేగవంతమైన, భీకర గాలులు వంతెనను పడగొట్టకుండా ఉండటానికే ఈ ఖాళీలను ఉంచారు. ఒకవేళ ఈ చెక్కలను దగ్గర దగ్గరగా అమరిస్తే, బలమైన గాలులను తట్టుకోలేక మధ్యలోకి విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఖాళీల గుండా గాలులు అడ్డులేకుండా సాగిపోతాయి. అయితే ఈ ఖాళీలపై అడుగు వేస్తూ కింద ఉన్న నీటిని చూస్తూ నడవడం పర్యాటకులకు ఒక అగ్నిపరీక్షే.ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలిచిన వంతెనహుస్సేనీ వంతెనకు భారీ విధ్వంసం, పునర్నిర్మాణాల చరిత్ర ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న వంతెన అసలైనది కాదు. గతంలో ఇక్కడ నిర్మించిన వంతెనలు ఈ ప్రాంతంలో వచ్చే తీవ్రమైన వాతావరణ మార్పులు, రుతుపవనాల వరదలు, నదీ ప్రవాహాల ఉధృతికి కొట్టుకుపోయాయి. ప్రకృతి ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ.. ప్రస్తుత వంతెన పక్కనే పాత వంతెనకు సంబంధించిన తుప్పు పట్టిన, విరిగిపోయిన ఇనుప కేబుళ్లు ఇప్పటికీ వేలాడుతూ కనిపిస్తాయి. స్థానికులు నిరంతరం ఈ వంతెనను పర్యవేక్షిస్తూ, విరిగిపోయిన చెక్కల స్థానంలో కొత్తవాటిని మారుస్తూ పునరుద్ధరిస్తుంటారు.సాహసికులకు స్వర్గధామంప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహస ప్రియులకు ఈ వంతెన ఒక స్వర్గధామం. తమ ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రతి ఏటా వందలాది మంది అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వంతెనపై నడుస్తున్నప్పుడు వచ్చే బలమైన గాలులకు అది ఇరువైపులా ఊగులాడుతూ ఉంటే గుండె ఆగినంత పనవుతుంది. ఎటువంటి ఆధునిక రక్షణ ఏర్పాట్లు, పటిష్టమైన రైలింగ్లు లేని ఈ వంతెనపై ప్రయాణం ఒక అద్భుతమైన, అత్యంత ప్రమాదకరమైన ప్రయాణ అనుభూతిని మిగుల్చుతుంది.స్థానికుల జీవననాడి..అంతర్జాతీయ పర్యాటకులకు ఇది కేవలం ఒక సాహస వినోదం మాత్రమే కావచ్చు. కానీ స్థానికులకు మాత్రం ఇది నిత్య జీవితంలో ఒక భాగం. హుస్సేనీ గ్రామాన్ని, నది అవతల ఉన్న జరాబాద్ వ్యవసాయ భూములతో అనుసంధానించే ఏకైక మార్గం ఇదే. స్థానికులు ప్రతిరోజూ భారీ బరువులను, నిత్యావసర సరుకులను నెత్తిన పెట్టుకుని ఈ ఊగిసలాడే చెక్కలపై ఎంతో సునాయాసంగా నడుచుకుంటూ వెళ్తుంటారు. వారి దైనందిన జీవన గమనానికి ఈ వంతెనే ఏకైక ఆధారం.నిర్వహణ ఖర్చులు.. పర్యాటక రుసుముఈ ప్రమాదకరమైన వంతెనను సజీవంగా ఉంచడానికి స్థానికులు ఎంతో పాటుపడుతున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి సుమారు 200 రూపాయల (స్థానిక కరెన్సీ) నిర్వహణ రుసుమును వసూలు చేస్తారు. ఈ నిధులన్నింటినీ నేరుగా స్థానిక కమ్యూనిటీ నిధికి బదిలీ చేస్తారు. అత్యంత కఠినమైన శీతాకాలం ప్రారంభం కావడానికి ముందే వంతెనకు అవసరమైన కొత్త చెక్కలను కొనుగోలు చేయడానికి, ఇనుప తీగలను మరమ్మతు చేయడానికి ఈ డబ్బును వినియోగిస్తారు.ఇది కూడా చదవండి: ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం -
ఆక్రమిత కశ్మీర్ కల్లోలం
ఎప్పుడూ జమ్మూ, కశ్మీర్ గురించి అంతర్జాతీయ వేదికలపై గంభీరోపన్యాసాలిస్తూ, మానవ హక్కుల చాంపియన్గా తనను తాను చిత్రించుకునే పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా ఆక్రమిత కశ్మీర్లో నెత్తురుటేర్లు పారిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం సైన్యం కాల్పుల్లో 30 మంది మరణించారంటున్నా, వాస్తవ సంఖ్య అంతకుమించి ఉంటుందన్నది స్థానికులు చెప్పే మాట. మరో 200 మంది గాయపడ్డారు. వేలాదిమంది అరెస్టయ్యారు. ఈసారి సాగిన నిరసన ప్రదర్శన సాధారణమైంది కాదు. ముజఫరాబాద్ ప్రదర్శనలో అన్నివర్గాలకూ చెందిన లక్షన్నరమంది పాల్గొన్నారు. మతం పేరు చెప్పి, గతం పేరుచెప్పి ఎల్లకాలమూ జనాన్ని మభ్యపెట్టడం సాధ్యంకాదని పాక్ పాలకులకు ఈ నిరసనలు తెలియజెప్పాయి. తమ ప్రాంత నదుల్లో మంగళ డ్యామ్వంటి ప్రాజెక్టులు నిర్మించి,ఇక్కడ ఉత్పత్తయ్యే జలవిద్యుత్ను పంజాబ్ తదితర ప్రాంతాలకు తరలించుకుపోతూ, స్థానికులకు అరకొర సదుపాయాలు కల్పించటం విషయంలో రెండు దశాబ్దాల క్రితమే అసంతృప్తి పెల్లుబికింది. కానీ సంఘటితం కాకపోవటంవల్ల చల్లారిపోయాయి. 2023లో రావల్కోట్, ముజఫరాబాద్, మరికొన్ని ఇతర ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై కమిటీలు ఏర్పడి ఉద్యమించాయి. ప్రజల మౌలికాహారమైన గోధుమ పిండి ధర పెంచడాన్నిప్రశ్నించాయి. వీటిని ప్రభుత్వం బేఖాతరు చేసిన ఫలితంగా ఆ కమిటీ లు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జాక్)గా ఒక్కటయ్యాయి. ఆనకట్టల కారణంగా పలువురు నిర్వాసితులవుతున్నా, వలసపోతున్నా పట్టించు కునేవారు లేరు. పోనీ అని స్థానిక ప్రజలకైనా ఒరిగేదేమీ ఉండదు. మిలిటెన్సీ ఉందన్న పేరిట భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించటం ఒక్కటే వారికి కనబడేది. అందుకేశాంతియుత పద్ధతుల్లో పన్నుల నిరాకరణ ఉద్యమం నిర్వహించటం, విద్యుత్ బిల్లుల చెల్లింపు నిలిపివేయటం, సంపూర్ణ బంద్, లాంగ్మార్చ్ వంటివి ఈ మూడేళ్లలో ఎన్నో జరిగాయి. సైన్యం పడగనీడలో కాలక్షేపం చేసే ప్రభుత్వానికుండే అధికారాలు అంతంత మాత్రం. ఏ జవాబుదారీతనమూ లేని సైన్యానిదే పెత్తనం. అందుకే ఆక్రమిత కశ్మీర్కు ఎదుగూ బొదుగూ లేదు. ఆ ప్రాంత వనరుల్ని కొల్లగొట్టడానికి పాక్ పాలకులు ఒక సృజనాత్మక విధానం కనుక్కున్నారు. 53 మందితో దానికొక అసెంబ్లీ ఉంది. ఆక్రమిత కశ్మీర్కు ముఖ్యమంత్రి కాదు... ప్రధాని ఉంటాడు. కానీ అధికారాలన్నీ ఇస్లామాబాద్లో కొలువుదీరిన సైనికాధికారుల ఆధిపత్యంవుండే కశ్మీర్ కౌన్సిల్ చేతిలో ఉంటాయి. ఈసారి కేవలంఆర్థిక సమస్యలపై మాత్రమే కాదు... అసెంబ్లీ అమరికపై కూడా డిమాండ్లు బయల్దేరాయి. మొత్తం 53 స్థానాలుండగా, ‘శరణార్థుల’కు డజను కేటాయిస్తారు. మరో అయిదు మహిళలకూ... ఉలేమాలు, సాంకేతిక నిపుణులు, విదేశాల్లో స్థిరపడిన కశ్మీరీలకు ఒక్కొక్క స్థానం ఉంటాయి. ఈ ఖాతాలకింద పోయే 20 స్థానాలకూ ఎన్నికలు జరిగేదెక్కడో, నిర్వహించేదెవరో ఎవరికీ తెలియదు. వారు ఎన్నుకోవాల్సింది మాత్రం 33 మందిని.మళ్లీ ఇందులో అత్యధికులు పాక్ పాలకుల కనుసన్నల్లో నడిచేవారే ఉంటారు. చివరకు కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఉద్యమకారులు అడిగేదల్లా ‘శరణార్థుల’ డజను స్థానాలూ రద్దు చేయాలన్నదే. కానీ అలా చేస్తే స్థానికుల పెత్తనం పెరుగుతుందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే జాక్ నాయకుల ఆచూకీ చెబితే 35,000 డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది. వచ్చే నెల్లో ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ప్రాంత వనరుల దోపిడీ తప్ప, వారి ఆకాంక్షల్ని నెరవేర్చడం సాధ్యపడదని ఉద్యమాలను అణిచేయటం ద్వారా పాక్ చెబుతోంది. పాలకులు వలసవాద మనస్తత్వంతో ఆప్రాంతాన్ని చెరబట్టారు తప్ప, స్థానికుల డిమాండ్లపై ఖాతరు లేదు. ఉద్యమకారులు38 కోర్కెలు ప్రభుత్వం ముందుంచారు. డజను సీట్ల కోటా రద్దుతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయనాయకులకిస్తున్న ఖరీదైన కార్లు, ఉచిత విద్యుత్ తదితర రాయితీలు రద్దు చేసి, ఆ నిధులు జన సంక్షేమానికి వ్యయం చేయాలని కూడావారు కోరుతున్నారు. ఇలాగే మొండికేస్తూ పోతే ఆ ప్రాంత ప్రజల ఆగ్రహం మరింత పెరుగుతుందే తప్ప చల్లారదని పాకిస్తాన్ పాలకులు గ్రహించాలి. -
భారత్, పాక్, బంగ్లాదేశ్ల నుంచి గల్ఫ్కు 1.90 కోట్ల మంది వలస
న్యూఢిల్లీ: 2010వ సంవత్సరం తర్వాత భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి సుమారు 1.90 కోట్ల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు ఓ అధ్యయనం గుర్తించింది. ఏడాదికి సరాసరిన 13.5 లక్షల మంది చొప్పున సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈలకు బతుకుదెరువు కోసం వెళ్లారని ఈ సర్వే తేల్చింది. పశ్చిమాసియా దేశాలకు ప్రధానంగా వలసలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దక్షిణాసియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందిన వారే ఈ ప్రాంతానికి ఎక్కువగా వలస వెళ్లినట్లు గుర్తించామని సర్వే చేపట్టిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలిసిస్, పాపులేషన్ అండ్ జస్ట్ సొసైటీస్ ప్రోగ్రామ్కు చెందిన గై అబెల్ తెలిపారు. ముఖ్యంగా బంగ్లాదేశీయులు 2010 తర్వాత ఏడాదికి 3 లక్షల మంది చొప్పున సౌదీ వెళ్లినట్లు ఇటీవల జర్నల్ నేచర్లో ప్రచురితమైన ఇందుకు సంబంధించిన కథనం పేర్కొంది. అకస్మాత్తుగా తలెత్తిన సంక్షోభం వంటి పరిస్థితుల వల్ల కాకుండా ఈ వలసలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయని వివరించింది. -
పాక్ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్ అక్కడే!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి.. చాలామందికి ఓ సందేహం రావొచ్చు. పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతమే అయితే అక్కడ ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి, శాసనసభ, రాజ్యాంగం, జెండా ఎందుకు ఉన్నాయి? పీవోకే నిజంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమా? కాదా?.. ఇటీవల పీవోకేలో చెలరేగిన ఆందోళనలు, పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత చర్యల నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.పాకిస్థాన్ అధికారికంగా పీవోకేను "ఆజాద్ జమ్మూ అండ్ కశ్మీర్"గా పిలుస్తుంది. పేరు వింటే అది స్వతంత్రమో.. స్వయం ప్రతిపత్తితో నడిచే ప్రాంతంలా అనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక శాసనసభ ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, న్యాయవ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం కూడా ఉన్నాయి. పైకి చూస్తే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉన్న ప్రాంతంలా కనిపిస్తుంది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.ఈ వ్యవస్థ వెనుక ఉన్న కథ 1947 విభజన కాలానికి వెళ్తుంది. జమ్మూ కశ్మీర్ సంస్థానం భారత్లో విలీనం కావడంతో మొదటి భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసే సమయానికి కశ్మీర్లోని కొంత భూభాగం పాకిస్థాన్ ఆక్రమణలో మిగిలిపోయింది. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్లో అధికారిక ప్రావిన్స్గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కశ్మీర్పై తమ హక్కు బలహీనపడుతుందని ఇస్లామాబాద్ భావించింది. అందుకే ఒకవైపు కశ్మీర్ వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే, మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది.దీంట్లో భాగంగానే 1949 కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగం, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్థాన్ తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రపతి, ప్రధాని, శాసనసభ, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీవోకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ రాజ్యాంగం ప్రకారం పీవోకేలో ఆ దేశ అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతి కాగా.. ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. కానీ అలా ఏనాడూ జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు, కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్ అనుమతితోనే అమలవుతాయి. పీవోకే పరిపాలనలో కూడా పాకిస్థాన్ నుంచి పంపిన అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.అంతేకాదు, పీవోకేలో రాజకీయ వ్యవస్థపై పాకిస్థాన్ ప్రభావం ఎంత బలంగా ఉందో అక్కడి ఎన్నికల విధానం కూడా చూపిస్తుంది. శాసనసభలో కొన్ని స్థానాలు పీవోకేలో నివసించే ప్రజల కోసం కాకుండా, పాకిస్థాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.మరో వివాదాస్పద అంశం విధేయత ప్రమాణం. పీవోకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కశ్మీర్ పాకిస్థాన్లో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. భిన్నాభిప్రాయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అక్కడ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని విమర్శలు ఉన్నాయి. అలా.. ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ సృష్టించిన నామ మాత్రపు రాజకీయ వ్యవస్థేనని స్పష్టమవుతోంది. ఇక భారత్ మాత్రం పీవోకేను ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా పీవోకే భారత భూభాగమేనని అధికారికంగా పేర్కొంటోంది. అందుకే పీవోకేకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు, జెండా వంటి వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో అది స్వతంత్ర ప్రాంతమో, ప్రత్యేక దేశమో అయిపోదని భారత్ వాదిస్తోంది. దశాబ్దాలుగా ‘ఆజాద్ కశ్మీర్’ అనే పేరుతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వాస్తవానికి పీవోకే రాజకీయ, పరిపాలనా, భద్రతా వ్యవస్థలన్నీ ఇస్లామాబాద్ నియంత్రణలోనే కొనసాగుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే పీవోకేలో కనిపించేది ఒక ప్రభుత్వం అయితే.. పనిచేసేది మాత్రం పాకిస్థాన్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థేనని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పాక్ దాడులు.. 11 మంది చిన్నారులు మృతి
కాబూల్: పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. నిన్న ( మంగళవారం) రాత్రి తాలిబన్ల భూభాగంపై పాక్ వైమానిక దాడులతో విరుచుకపడడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో అధికంగా చిన్నారులే ఉన్నట్లు అఫ్గానిస్థాన్ ప్రకటించింది. చిన్నారులు నిద్రపోతున్న సమయంలో దాడులు చేయడంతో వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ దేశ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.గత కొద్ది కాలంగా అఫ్గానిస్థాన్- పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి ని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకున్నాయని పాక్ వైమానిక దళం విరుచుకపడింది. అయితే ఈ దాడిపై అఫ్గాన్ ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.ఆయన మాట్లాడుతూ "నిన్న రాత్రి, పాకిస్తానీ సైన్యం మరోసారి ఆఫ్ఘనిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించి, కునార్, ఖోస్ట్ మరియు పక్తికా ప్రావిన్సులలోని పౌరుల ఇళ్లపై బాంబులు వేసింది. దీని ఫలితంగా 11 మంది పిల్లలు, ఒక మహిళ, ఒక వృద్ధుడు మరణించారు.మరో 14 మంది మహిళలు, పిల్లలు గాయపడ్డారు.బాధితులు నిద్రిస్తున్న సమయంలో రాత్రిపూట దాడులు జరిగాయి., దీంతో బాంబు దాడుల నుండి తప్పించుకోవడానికి వారికి ఏమాత్రం అవకాశం లభించలేదు. ఇది పూర్తిగా అమానవీయం" అని అన్నారుఅదే విధంగా గత కొద్దికాలంగా పాక్ దాడుల్లో మృతిచెందిన చిన్నారులతో కూడిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. కాగా పాక్ జరిగిన దాడుల్లో మెుత్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక దాడితో అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
POKలో పాక్ ఆర్మీ అరాచకం..! 30 మంది మృతి..
-
అఫ్గాన్పై పాక్ భీకర వైమానిక దాడులు.. 13 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: సరిహద్దు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. అఫ్గానిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆకస్మిక దాడితో అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అఫ్గాన్ ఆరోపణలు.. పాక్ దాడులుఅఫ్గానిస్తాన్ భూభాగమే లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం ఈ వైమానిక దాడులకు తెగబడిందని అఫ్గాన్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక పాక్ సైనిక వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.భారీగా ప్రాణనష్టం.. ఆందోళనలో ప్రజలుఈ తాజా వైమానిక దాడులలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందింది. గాయపడిన 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడులు ఏయే నిర్దిష్ట ప్రాంతాలలో జరిగాయి? మరణించిన వారి పూర్తి వివరాలు, వారి గుర్తింపును అఫ్గాన్ అధికార యంత్రాంగం ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతఈ దాడుల అనంతరం ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత కొంతకాలంగా పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో ఈ వైమానిక దాడులు జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది.ఇది కూడా చదవండి: అమెరికా పౌరసత్వం రద్దు.. ఎవరీ నీరజ్ శర్మ? -
భారత్పై కన్నేసిన పాక్.. అసలు లక్ష్యమేంటి?
భారత్ టార్గెట్గా దాయాది దేశం పాకిస్తాన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ గత 16 నెలల కాలంలో వరుసగా ఆరు భూ పరిశీలన (Earth Observation) ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కాగా, పాక్ చర్యలు దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, భూవినియోగ మ్యాపింగ్ వంటి పౌర అవసరాల కోసం అని పాకిస్తాన్ ప్రకటిస్తున్నప్పటికీ, రక్షణ నిపుణులు ఇవి సైనిక నిఘా సామర్థ్యాన్ని కూడా పెంచగలవని విశ్లేషిస్తున్నారు.వేగంగా పాకిస్తాన్ అంతరిక్ష విస్తరణ.. గతంలో పరిమిత స్థాయిలో ఉన్న పాకిస్తాన్ అంతరిక్ష కార్యక్రమం ఇప్పుడు గణనీయంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా చైనా సాంకేతిక సహకారంతో భూ పరిశీలన, రిమోట్ సెన్సింగ్ రంగాల్లో పాకిస్తాన్ కొత్త ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాల్లో PRSC-EO1, PRSC-EO2, PRSC-EO3 వంటి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి భూమి ఉపరితల చిత్రాలను సేకరించి విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే, భూ పరిశీలన ఉపగ్రహాలు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉపరితల చిత్రాలు, భౌగోళిక సమాచారం, వాతావరణ మార్పులు, వ్యవసాయ పరిస్థితులు వంటి అంశాలను నమోదు చేస్తాయి. భద్రతా మరియు సరిహద్దు పర్యవేక్షణ కూడా చేయనున్నాయి. ఇక, అధునాతన సెన్సర్లు కలిగిన ఉపగ్రహాలు సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, వాహనాల కదలికలు వంటి అంశాలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి.భారత్ను గమనించే సామర్థ్యం ఎంత?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఉపగ్రహాలు భారత భూభాగం మీదుగా ప్రయాణించే సమయంలో చిత్రాలను సేకరించగలవు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, వాయుసేన కేంద్రాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను గుర్తించే అవకాశం ఉంది. ఇలా ఆయా ప్రాంతాలపై సమాచారం పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఉపగ్రహాలు 24 గంటలూ ఒకే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా గమనించవు. అవి కక్ష్యలో తిరుగుతాయి. కాబట్టి ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట వ్యవధుల్లో మాత్రమే చిత్రీకరించగలవు. అంతేకాకుండా.. భారత్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. దేశ విస్తీర్ణం సుమారు 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆరు ఉపగ్రహాలు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలిగినా, మొత్తం దేశాన్ని ప్రతి క్షణం పర్యవేక్షించడం అసాధ్యం.సన్-సింక్రోనస్ కక్ష్య ప్రయోజనంపాకిస్తాన్ తాజా ఉపగ్రహాల్లో చాలా వరకు సన్-సింక్రోనస్ ఆర్బిట్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కక్ష్య ప్రత్యేకతలు ఏంటంటే.. ప్రతిరోజూ ఒకే ప్రాంతాన్ని దాదాపు ఒకే సమయానికి చిత్రీకరించగలదు. భూమిపై మార్పులను పోల్చి చూడటం సులభం. సైనిక నిఘా, మ్యాపింగ్, పర్యావరణ అధ్యయనాలకు అనుకూలంగా ఉంటుంది.భారత్, పాక్ మధ్యలో చైనా..పాకిస్తాన్, చైనా మధ్య అంతరిక్ష సహకారం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. పాకిస్తాన్కు చైనా ఉపగ్రహ సాంకేతికత, శిక్షణ, డేటా ప్రాసెసింగ్ మద్దతు ఇస్తోంది. దీంతో పాకిస్తాన్ సొంత అంతరిక్ష సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. మరోవైపు. అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కంటే ఎంతో ముందుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థలు, వ్యూహాత్మక నిఘా ఉపగ్రహాలు వంటి విస్తృత సామర్థ్యాలను అభివృద్ధి చేసింది. అదనంగా భారత్ తన సరిహద్దుల పర్యవేక్షణ కోసం మరింత పెద్ద ఉపగ్రహ నెట్వర్క్ను కూడా విస్తరిస్తోంది. కాగా, భారత్, పాకిస్తాన్ రెండూ తమ భద్రతా అవసరాల కోసం ఉపగ్రహ నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయి.భవిష్యత్తు యుద్ధాల్లో ఉపగ్రహాల పాత్రప్రస్తుతం యుద్ధాలు కేవలం సైనికులపై ఆధారపడటం లేదు. టెక్నాలజీపై ఆధారపడి దాడులు జరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఉపగ్రహ సమాచారానికి అత్యంత ప్రాధాన్యం లభించింది.ఉపగ్రహాలతో ఇలా..క్షిపణుల మార్గదర్శనండ్రోన్ కార్యకలాపాలుకమ్యూనికేషన్నావిగేషన్లక్ష్యం గుర్తింపుగూఢచారి సమాచారం వంటి పనుల్లో కీలకం. -
రావలకోట్లో రగడ.. 150 మంది మృతి?
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రావలకోట్ (Rawalakot) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కార్యకర్తలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో జేఏఏసీకు చెందిన కొందరు వ్యక్తులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు భద్రతా సిబ్బంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది.అయితే.. నిరసనకారులు మాత్రం భద్రతా బలగాలే తమపై బలప్రయోగం చేశాయని ఆరోపిస్తున్నారు. ఈ ఉద్రిక్తతల్లో ఏడుగురు పౌరులు మరణించినట్లు పేర్కొన్నారు.BIG NEWS - Reports claim that around 150 people were killed and hundreds injured in Rawalakot, PoK, after Pakistani forces allegedly opened fire.Pok residents want Independence from Pakistan.pic.twitter.com/ZvPo7zDA4o— News Algebra (@NewsAlgebraIND) June 8, 2026రావలకోట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం స్థానిక ప్రజలు, పాకిస్థాన్ పరిపాలన మధ్య పెరుగుతున్న అసంతృప్తి. ముఖ్యంగా విద్యుత్ చార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, అభివృద్ధి లోపం, రాజకీయ హక్కులపై అసంతృప్తి వంటి అంశాలు ప్రజల్లో ఆగ్రహానికి దారితీసినట్లు సమాచారం.ఇంటర్నెట్ సేవలు కూడా పరిమితయ్యాయని, ఈ కారణంగానే సమాచార ప్రసారం కూడా పరిమితమైందనే వాదనలు వెలువడుతున్నాయి. అందుకే ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు అనే విషయాలు అధికారికంగా వెలువడలేదు. కానీ ఈ ఉద్రిక్తతల్లో ఏకంగా 150 మంది మరణించినట్లు, చాలామంది గాయపడ్డారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. -
190 vs 170.. పాక్పై భారత్ లీడ్
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరోసారి దక్షిణాసియా కేంద్రంగా చర్చ మొదలైంది. అణు శక్తి, ఆయుధ సామర్థ్యం, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య.. భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో.. పాకిస్థాన్పై ఆధిక్యం సాధించిందని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక వెల్లడించింది. సిప్రి ఇయర్బుక్ 2026 ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్హెడ్స్ ఉండగా, పాకిస్థాన్ వద్ద సుమారు 170 మాత్రమే ఉన్నాయని అంచనా వేసింది. ఇరు దేశాలు 2025లో కూడా తమ అణు ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించడంపై దృష్టి పెట్టాయని.. ముఖ్యంగా భారత్ తన దీర్ఘశ్రేణి అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా వరకు చేరగలిగే డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా ఫిషైల్ మెటీరియల్ సేకరణ, కొత్త డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఆపరేషన్ సిందూర్ టైంలో.. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను సిప్రి “అసాధారణంగా తీవ్రమైన మిలిటరీ క్రైసిస్”గా అభివర్ణించింది. అయితే అణు ఘర్షణ దిశగా వెళ్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. ప్రపంచ స్థాయిలో చూస్తే మొత్తం 9 అణు దేశాల వద్ద కలిపి సుమారు 12,241 వార్హెడ్స్ ఉన్నాయని సిప్రి తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా, రష్యా వద్దే అధిక భాగం ఉండగా, చైనా వేగంగా తన అణు సామర్థ్యాన్ని విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. చైనా వద్ద ఇప్పటికే సుమారు 620 వార్హెడ్స్ ఉన్నాయని అంచనా. భారత్ విషయానికి వస్తే.. కొత్త తరహా అణు ఆయుధ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు అభివృద్ధి చేయడం ద్వారా తన వ్యూహాత్మక స్థాయిని పెంచుకుంటోందని సిప్రి స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా తన అణు శక్తిని విస్తరించే ప్రయత్నాల్లో ఉందని, వచ్చే దశాబ్దంలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.డేంజర్ జోన్ ఎందుకంటే..సిప్రి నివేదికలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాలపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని, డిసార్మ్మెంట్ ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని స్పష్టం చేసింది. దేశాలు రక్షణ పేరుతో అణు ఆయుధాల వైపు మరింత మొగ్గు చూపుతున్నాయని, ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.అణు ఆయుధాలపై పారదర్శకత తగ్గడం, దేశాల మధ్య చర్చలు–ఒప్పందాలు బలహీనపడటం, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల.. భవిష్యత్తులో విపరీతాలు జరగొచ్చని సిప్రి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అవతలి దేశం దాడి చేయబోతుందనుకుని ఇవతలి దేశం పొరపడడం, చిన్న సంఘటనను పెద్ద ముప్పుగా భావించడం, అవసరం లేని సమయంలో సైనిక చర్యలకు వెళ్లడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా జరగొచ్చని అంటున్నారు. పెద్ద దేశాల మధ్య చిన్న పొరపాటు కూడా పెద్ద యుద్ధ ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ గతంలో భారత్–పాక్ మధ్య గతంలో చోటు చేసుకున్న సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తున్నారు. -
అంతరిక్షంలో దాయాది దొంగ దెబ్బ.. భారత్కు సవాల్!
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తుపాకులు తాత్కాలికంగా శాంతించినప్పటికీ, తెరవెనుక దాయాది దేశం భారత్ను దెబ్బతీయడానికి భారీ వ్యూహాన్ని రచిస్తోంది. అంతరిక్షంలో సరికొత్త గూఢచారి ఉపగ్రహాల నెట్వర్క్ను నిర్మిస్తూ, భారత్పై నిరంతర నిఘా పెడుతోంది. ‘ది ప్రింట్’ పరిశోధనాత్మక కథనం ప్రకారం.. గత 16 నెలల వ్యవధిలోనే (జనవరి 2025 నుండి జూన్ 2026 మధ్య) పాకిస్తాన్ ఏకంగా 6 ఎర్త్-అబ్జర్వేషన్ (భూ-నిఘా) ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలన్నీ భారత భూభాగాన్ని ప్రతి రెండు రోజులకు ఒకసారి క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చైనా వెన్నుదన్ను.. అసాధారణ వేగంపాకిస్తాన్ అంతరిక్ష సంస్థ ‘సుపార్కో’ (SUPARCO) 1961లో ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు కేవలం 15 ఉపగ్రహాలను ప్రయోగిస్తే, అందులో 6 ఉపగ్రహాలను కేవలం ఈ 16 నెలల్లోనే ప్రయోగించడం గమనార్హం. చైనా సాంకేతిక, లాంచ్ మద్దతుతోనే పాక్ ఈ అసాధారణ వేగాన్ని అందుకోగలిగింది. జనవరి 2025లో 'PAUSAT-1', 'PRSC-EO1' ప్రయోగాలతో మొదలైన ఈ సిరీస్, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 'PRSC-EO3' వరకు చేరింది. ఒకప్పుడు నత్తనడకన సాగిన పాక్ స్పేస్ ప్రోగ్రామ్, ఉన్నట్టుండి ఉసేన్ బోల్ట్ వేగంతో దూసుకుపోవడం వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తోందని మాజీ ఇస్రో అధికారులు అభిప్రాయపడుతున్నారు.కశ్మీర్ లక్ష్యంగా ప్రత్యేక కక్ష్యసాధారణంగా నిఘా ఉపగ్రహాలను సన్-సింక్రోనస్ కక్ష్యల్లో ఉంచుతారు. అయితే, పాకిస్తాన్ ఇటీవల ప్రయోగించిన 'PRSC-EO3' ఉపగ్రహాన్ని అమెరికాకు చెందిన స్పేస్ సంస్థ 'COMSPOC' విశ్లేషించింది. ఇది సాధారణ కక్ష్యలో కాకుండా 38 డిగ్రీల వంపు (Inclined Orbit) ఉన్న ప్రత్యేక కక్ష్యలో తిరుగుతోంది. దీనివల్ల గ్లోబల్ కవరేజ్ తగ్గినప్పటికీ, భారత్, కశ్మీర్ ప్రాంతాలపై ఈ ఉపగ్రహం రోజుకు పలుమార్లు ప్రయాణిస్తూ అత్యంత నిశితమైన నిఘా వేయడానికి వీలవుతుంది. ఈ హైపర్స్పెక్ట్రల్ ఉపగ్రహాల వల్ల భూమిపై ఆర్మీ కదలికలు, దాచి ఉంచిన ఆయుధ సంపత్తిని కూడా పాక్ సులువుగా గుర్తించగలదు.భారత్కు పెరుగుతున్న సవాళ్లుఒకవైపు పాకిస్తాన్ అంతరిక్ష నిఘాను పటిష్టం చేసుకుంటుంటే, మరోవైపు గత ఏడాది కాలంలో భారత్ మూడు వ్యూహాత్మక ఉపగ్రహ మిషన్లలో (EOS-N1, EOS-09, NavIC NVS-02) వైఫల్యాలను ఎదుర్కొంది. సరిహద్దుల్లో సైనిక కదలికలు, హిందూ మహాసముద్రంలో నౌకాదళ ఆస్తులను కాపాడుకోవడానికి భారత్ తన సొంత అంతరిక్ష నిఘా సామర్థ్యాన్ని తక్షణమే పెంచుకోవాల్సిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
టీమిండియాపై పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు
పాకిస్తాన్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షా టీమిండియాను ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. తమ మధ్య జరిగే మ్యాచ్ల్లో అంపైరింగ్ నిర్ణయాలు, షెడ్యూలింగ్ సహా అనేక అంశాలు భారత్కు అనుకూలంగా ఉంటాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాజాగా ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. భారత్తో మ్యాచ్ల్లో చాలా విషయాలు వాళ్లకు అనుకూలంగా ఉంటాయి. అంపైరింగ్ నిర్ణయాలు, కొన్ని డ్రెస్సింగ్రూమ్ నిర్ణయాలు, మ్యాచ్ల నిర్వహణ కూడా వారి కోరికల మేరకే జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గెలిస్తే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నాడు.భారత్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో..ఇటీవలికాలంలో భారత్పై పాకిస్తాన్ రికార్డు నిరాశాజనకంగా ఉంది. టీమిండియాపై పాక్ చివరిసారి 2022 ఆసియా కప్ సూపర్-4 దశలో విజయం సాధించింది. అప్పటి నుంచి జరిగిన ఆరు వరుస మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది.వన్డేల్లో అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత పాకిస్తాన్ భారత్ను ఓడించలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు వన్డేల్లోనూ భారత్దే పైచేయిగా నిలిచింది.గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలుభారత్కు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని కొందరు పాక్ మాజీలు గతంలోనూ ఆరోపించారు. అయితే ప్రస్తుత క్రికెటర్ ఖుష్దిల్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.ఖుష్దిల్ షా భారత్పై ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన వన్డేలో 39 బంతుల్లో 38 పరుగులు చేసి, వికెట్ తీసుకున్నప్పటికీ, ఆ మ్యాచ్లో పాక్ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. మొత్తంగా షా పాక్ తరఫున 15 వన్డేలు, 38 టీ20లు ఆడి 762 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు. -
షాహీన్ అఫ్రిదికి ఊహించని షాక్
పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన రెడ్బాల్ శిక్షణ శిబిరంలో అతడికి చోటు దక్కలేదు. దీంతో షాహీన్ టెస్టు భవిష్యత్తుపై సందేహాలు నెలకొన్నాయి.జూన్ 8 నుంచి జూలై 10 వరకు జరిగే రెడ్బాల్ క్యాంప్కు 22 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన పీసీబీ, షాహీన్ పేరును జాబితాలో చేర్చలేదు. అయితే జూన్ 15 నుంచి సెప్టెంబర్ 18 వరకు కొనసాగే వైట్బాల్ క్యాంప్లో మాత్రం అతడికి స్థానం కల్పించింది.ఆస్ట్రేలియాపై మెరిసినా..తాజాగా పాక్ ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను గెలవడంలో (2-1) షాహీన్ కీలక పాత్ర పోషించాడు. మూడు ఇన్నింగ్స్ల్లో 7 వికెట్లు తీసి, 3.86 ఎకానమీతో ఆకట్టుకున్నాడు.అలాగే ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్లు సాధించాడు. అయినప్పటికీ రెడ్బాల్ క్యాంప్ నుంచి అతడిని తప్పించడంపై ఆశ్చర్యకరంగా ఉంది.తీవ్ర విమర్శలుఇటీవలి కాలంలో పాక్ టెస్ట్ జట్టు ప్రదర్శనలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండోసారి వైట్వాష్కు గురికావడం, నాలుగు వరుస టెస్టుల్లో ఓడిపోవడం జట్టు ఘోర పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో భారీ మార్పులు చేయాలని పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.రెడ్బాల్ క్యాంప్లో స్టార్ ఆటగాళ్లురెడ్ బాల్ క్యాంప్లో షాహీన్కు చోటు దక్కకపోయినా.. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, సల్మాన్ అఘా, ఇమామ్ ఉల్ హక్, ఆమిర్ జమాల్ వంటి ప్రముఖులకు అవకాశం లభించింది.ఇదిలా ఉంట, పాక్ తదుపరి టెస్ట్ మ్యాచ్లు జులై ఆఖర్లో ఆడాల్సి ఉంది. జులై 25 నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్లో పర్యటించనుంది. ఈ సిరీస్తో పాటు తదుపరి టెస్ట్ షెడ్యూల్ దృష్ట్యా పాక్ రెడ్ బాల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. -
పాక్ గాలితీసిన భారత మాజీ ఆర్మీచీఫ్
కోల్కతా: భారత రిటైర్డ్ ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవణే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా మధ్య పాక్ మధ్యవర్తిత్వం ఒట్టిమాటే అన్నారు. పాక్ చేసేది మధ్యవర్తిత్వం కాదని కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమేనన్నారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత మాజీ సైన్యాధిపతి నరవణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ" పుస్తకం విడుదల కాకముందే దేశంలో ప్రకంపనలు సృష్టించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని పలు అంశాలను ప్రస్థావించడంతో లోక్సభలో పెద్ద దుమారం చేలరేగింది. కాగా తాజాగా నరవణే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై మాట్లాడారు.నరవణే మాట్లాడుతూ" ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలలో పాక్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు చెబుతోంది. కానీ అది కేవలం కొరియర్ సర్వీస్ మాత్రమే, జాతీయ భద్రత ఎప్పుడూ ఆర్థిక భద్రతపైనే ముడిపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థే అన్నింటిని నడిపిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.ప్రపంచ వాణిజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రయత్నాలు ఎల్లప్పుడూ స్వయం సమృద్ధిపైనే ఉండాలి" అని అన్నారు.ఇటీవల పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా ఇవి ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణాకు ఆటంకం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. -
పాక్ నిషేధం లేదా?.. జాతరలో కొన్న బెడ్షీట్పై మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ వెలుగుచూసింది. ఓ జాతరలో కొనుగోలు చేసిన బెడ్షీట్పై ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ (Made in Pakistan) అనే లేబుల్ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోను మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, పాకిస్తాన్కు చెందిన వస్తువులు భారత్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయంలో బుధవారం సంకష్ట చతుర్థి జాతర జరిగింది. ఈ జాతరకు పూణేకు చెందిన ఓ మహిళ వెళ్లింది. జాతరలో ఆమె.. బెడ్షీట్ను కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో దానిపై ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవు. అయితే, ఇంటికి వెళ్లాక దానిని వాష్ చేయడంతో ఒక మూలన దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని రాసి ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, వెంటనే దీన్ని ఫోన్లో రికార్డు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పోలీసులు గుర్తించారు.पुणे के चिंचवड़ में मोरया गोसावी मंदिर के संकष्टी चतुर्थी के दिन मेले में मेड इन पाकिस्तान चीजों की बिक्रीहिंदू महिला ने किया उजागर वीडियो हुआ वायरल pic.twitter.com/JN859goEf9— Amrendra Bahubali 🇮🇳 (@TheBahubali_IND) June 5, 2026ఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెడ్షీట్ను అమ్మిన సదరు వీధి వ్యాపారి ఎవరు? అతడికి ఈ స్టాక్ ఎక్కడి నుంచి సరఫరా అయింది? స్థానిక మార్కెట్లోకి ఈ పాకిస్తాన్ వస్తువులు ఎలా ప్రవేశించాయి? అనే సప్లై చైన్ నెట్వర్క్ను ఛేదించే పనిలో పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాశారు. అయితే, మహారాష్ట్రలోని శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో కూడా ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ అని ఉన్న కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జాతరలు, స్థానిక మార్కెట్లలో విక్రయించే వస్తువులపై నిఘా వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.ఇదిలా ఉండగా.. 2019లో జరిగిన పుల్వామా అటాక్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి. భారత్.. పాకిస్తాన్కు ఇచ్చిన Most Favoured Nation (MFN) హోదాను రద్దు చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా అనేక భారతీయ వస్తువుల దిగుమతులపై పరిమితులు విధించింది. అందువల్ల ‘Made in Pakistan’ అనే లేబుల్ ఉన్న వస్తువు భారత మార్కెట్లో కనిపిస్తే అక్రమంగా దేశంలోని వచ్చేనట్టే లెక్క. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రత, దిగుమతి నియంత్రణలు, అక్రమ సరఫరా గొలుసులపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. -
పాక్పై గెలిచి ఫైనల్లోకి భారత్
కాకమిగహారా (జపాన్): ఆసియా కప్ అండర్–18 హాకీ టోర్నమెంట్లో భారత జట్టు టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత జట్టు 5–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో జపాన్ 8–1 గోల్స్ తేడాతో మలేసియా జట్టును ఓడించింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున పుర్తి ఆశిష్ తాని (12వ, 49వ, 53వ, 56వ, నిమిషాల్లో) నాలుగు గోల్స్ చేయగా... షారుఖ్ అలీ (35వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. పాక్ జట్టు తరఫున ఆదిల్ (27వ నిమిషంలో), అస్లమ్ మొహమ్మద్ ఫర్హాన్ (37వ నిమిషంలో), ఉజేర్ అహ్మద్ ఖురేషి (42వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత్కు లభించిన ఆరు పెనాల్టీ కార్నర్లలో మూడింటిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్ను కూడా గోల్గా మలిచింది. పాక్ జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక దాంట్లో సఫలమైంది. ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీలో భారత జట్టు కాంస్య పతకం కోసం పోటీపడనుంది. చైనా జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–3 తేడాతో ఓటమి పాలైంది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత మహిళల జట్టు ఆడుతుంది. -
ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్!
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో పాకిస్తాన్ జట్టు జోష్లో ఉంది. అయితే సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు ఆల్రౌండర్ షాదాబ్ఖాన్ను అదృష్టం తలుపుతట్టింది.ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్) తొలి ఎడిషన్లో షాదాబ్ ఖాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. తద్వారా యూరోప్ టీ20 క్రికెట్ లీగ్లో ఆడనున్న తొలి పాక్ క్రికెటర్గా షాదాబ్ ఖాన్ నిలవనున్నాడు. ఇక ఈటీపీఎల్ టోర్నీలో షాదాబ్ ఖాన్ ఎడిన్బర్గ్ క్యాసిల్ రాకర్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ఈ ఎడిన్బర్గ్ క్యాసిల్ ఫ్రాంచైజీని మాజీ న్యూజిలాండ్ క్రికెటర్లు కైల్మిల్స్, నాథన్ మెక్కల్లమ్లు సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్గా ఉండనున్నాడు. టామ్ బ్రూస్, టామ్ కరన్, జేజే స్మట్స్, ఆండ్రీ గౌస్తో కలిసి షాదాబ్ ఖాన్ ఆడనున్నాడు. కాగా ఎడిన్బర్గ్ మంచి ధరకే షాదాబ్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్లో ఈ పాకిస్తాన్ క్రికెటర్కు మంచి డిమాండ్ ఉంది. పాకిస్తాన్ సూపర్లీగ్లో (పీఎస్ఎల్) ఇస్లామాబాద్ యునైటెడ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న షాదాబ్ ఆ జట్టుకు మూడు పీఎస్ఎల్ టైటిల్స్ అందించడం విశేషం. పీఎస్ఎల్, బీబీఎల్, సీపీఎల్, బీపీఎల్, హండ్రెడ్ టోర్నీ కలిపి 350కి పైగా మ్యాచ్లాడిన షాదాబ్ఖాన్ 3,915 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తరఫున 124 టీ20ల్లో 1009 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు. యూరోప్లో క్రికెట్ను ప్రోత్సహించే దిశగా స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్లోని స్థానిక క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చేందుకు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ పేరిట కొత్త టోర్నీని తీసుకొచ్చింది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కో-ఓనర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో చాలా మంది మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు కలిపి ఆయా ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్ (ఎడిన్బర్గ్ క్యాసిల్), రాహుల్ ద్రవిడ్ (డబ్లిన్ గార్డియన్స్), గ్లెన్ మ్యాక్స్వెల్ (ఐరిష్ వోల్వ్స్), స్టీవ్ వా (ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్), జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ (రోటర్డామ్ డాకర్స్)కు ఓనర్లుగా ఉన్నారు. ఈటీపీఎల్-2026 టోర్నీ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది.చదవండి: గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా? -
పాకిస్తాన్కు కొత్త టెన్షన్.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్
ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం పాత్రను ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రశ్నిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి."ఇజ్రాయెల్ దృష్టిలో పాకిస్థాన్ విశ్వసనీయ మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వం చేసే దేశం అన్ని పక్షాల విశ్వాసాన్ని పొందాలి. పాకిస్థాన్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు" అంటూ రూవెన్ అజర్ స్పష్టం చేశారు. ఇరాన్కు సంబంధించిన సున్నితమైన అంశాల్లో పాకిస్థాన్ పాత్రపై తమకు సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.అమెరికా లేదా ఇతర దేశాలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్ను సంప్రదించవచ్చని, అయితే అది ఇజ్రాయెల్ అభిప్రాయాన్ని మార్చదని అజర్ వ్యాఖ్యానించారు. తమకు ప్రధానంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, అలాగే ఇరాన్ ప్రభావాన్ని నియంత్రించడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.పాకిస్థాన్పై ఎందుకు అనుమానాలు?ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం మధ్యవర్తిగా వ్యవహరించే దేశం తటస్థ వైఖరిని కలిగి ఉండాలి. అయితే పాకిస్థాన్కు ఇప్పటికీ ఇజ్రాయెల్తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అంతేకాకుండా, గతంలో ఇజ్రాయెల్ విధానాలపై ఇస్లామాబాద్ చేసిన విమర్శలు కూడా ఆ దేశ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అజర్ సూచించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో పాకిస్థాన్ పాత్ర పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇస్లామాబాద్ దౌత్య సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ప్రాంతీయ మిలిటెంట్ సంస్థల కార్యకలాపాలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో పాకిస్థాన్ను మధ్యవర్తిగా అంగీకరించలేమన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలు కొత్త దౌత్య చర్చలకు తెరతీశాయి.భారత్పై ప్రశంసలుఇదే సందర్భంగా భారత్ పాత్రను కూడా రూవెన్ అజర్ ప్రశంసించారు. పశ్చిమాసియాలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్కు కీలక పాత్ర ఉందని, ప్రాంతీయ శాంతి ప్రయత్నాల్లో న్యూఢిల్లీ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్తో ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.78 ఏళ్లుగా దూరంగానే పాక్–ఇజ్రాయెల్పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో సంక్లిష్టంగానే ఉన్నాయి. 1947లో పాకిస్థాన్, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామాబాద్ ఆ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా నిలుస్తూ, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్ను గుర్తించబోమనే వైఖరిని కొనసాగిస్తోంది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా కూడా పాలస్తీనా అంశంలో అరబ్ దేశాలకు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ విధానం పాకిస్థాన్ విదేశాంగ విధానంలో కీలక భాగంగా కొనసాగుతోంది. అధికారిక సంబంధాలు లేకపోయినా, గతంలో రెండు దేశాల మధ్య పరోక్ష స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాలు లేవు. దౌత్య సంబంధాలు కూడా నెలకొనలేదు.ఇక రూవెన్ అజర్ తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యం, ఇరాన్ అంశంలో దాని పాత్ర, అలాగే మధ్యప్రాచ్య దౌత్య సమీకరణాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందన కోసం అంతర్జాతీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. -
భారత్ను దెబ్బకొట్టే ప్లాన్.. పాక్ కొత్త వ్యూహం!
ఇస్లామాబాద్: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ తన వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కొత్త ఆయుధాలను సమీకరించాలనే వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చైనా తయారీ క్షిపణులు, టర్కీ డ్రోన్లపై మరింత ఆధారపడాలని పాకిస్థాన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యూహం ద్వారా భారత్తో భవిష్యత్తులో జరిగే వైమానిక ఉద్రిక్తతలకు ఎదురుదెబ్బ ఇవ్వగల సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నది పాకిస్థాన్ ఉద్దేశంగా విశ్లేషకులు చెబుతున్నారు.కాగా, భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు దక్షిణాసియా భద్రతా సమీకరణాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. పాకిస్థాన్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కొత్త సైనిక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా చైనా తయారీ క్షిపణులు మరియు టర్కీ డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడే దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వినియోగించిన బహుళ-స్థాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, డ్రోన్ డిటెక్షన్ నెట్వర్క్లు మరియు రియల్ టైమ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసినట్లు రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పరిణామం పాకిస్థాన్ సైనిక వ్యూహకర్తలకు తమ ప్రస్తుత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించేందుకు దారి తీసిందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో భవిష్యత్ వైమానిక ఉద్రిక్తతలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవడం పాకిస్థాన్కు అత్యవసరంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. తాజా నివేదికల ప్రకారం, పాకిస్థాన్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో చైనా పాత్రను మరింత పెంచాలని యోచిస్తోంది. ఇప్పటికే పలు రకాల చైనా తయారీ రాడార్ వ్యవస్థలు మరియు క్షిపణులను ఉపయోగిస్తున్న పాకిస్థాన్, ఇప్పుడు మరింత అధునాతన సర్ఫేస్-టు-ఎయిర్ మరియు ఎయిర్-టు-ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ను పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వీటి ద్వారా శత్రు వైమానిక దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.టర్కీ డ్రోన్ టెక్నాలజీపై ఫోకస్ఇక, టర్కీతో ఉన్న రక్షణ సహకారాన్ని మరింత విస్తరించాలనే దిశలో పాకిస్థాన్ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యుద్ధ డ్రోన్లు, కమికాజ్ డ్రోన్లు, లాంగ్-రేంజ్ UAVలు మరియు స్వార్మ్ డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ డ్రోన్లను భవిష్యత్ యుద్ధ పరిస్థితుల్లో రికానైసెన్స్ (గూఢచర్యం), లక్ష్య నిర్ధారణ మరియు దాడి సామర్థ్యాల కోసం ఉపయోగించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.ఆయుధ పోటీ?విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చూపిన సామర్థ్యం పాకిస్థాన్ వ్యూహాత్మక ప్రణాళికలో మార్పులకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. డ్రోన్లు మరియు క్షిపణి దాడులు అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో, రక్షణ మరియు దాడి సామర్థ్యాలను రెండింటినీ సమానంగా మెరుగుపరచాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు. ఈ కొత్త వ్యూహం అమలులోకి వస్తే దక్షిణాసియాలో ఆయుధ పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
High Alert In India : యుద్ధంలోకి భారత్
-
తాలిబాన్ సర్కార్కు రష్యా బంపరాఫర్.. పాక్కు కొత్త టెన్షన్!
రష్యా, తాలిబాన్ల సర్కార్ పాలిత ఆఫ్ఘనిస్థాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాల మధ్య తొలి సైనిక-సాంకేతిక సహకార(Military-Technical Cooperation Agreement) ఒప్పందానికి గ్రీన్సిగ్నల్ పడింది. అయితే, ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో పెద్ద మార్పుగా విశ్లేషకులు చూస్తున్నారు. కీలక ఒప్పందం కారణంగా దాయాది దేశం పాకిస్తాన్కు టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో భారత్కు ఇది సానుకూల అంశం కానున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.2026 మే 27న మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సమావేశం సందర్భంగా అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీయి షోయిగూ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. అయితే సాధారణంగా ఇటువంటి మిలిటరీ-టెక్నికల్ ఒప్పందాల్లో ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, శిక్షణ, నిర్వహణ, లైసెన్సింగ్,ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు ఉంటాయి.ఎందుకు ముఖ్యమైనది?ఆప్ఘనిస్తాన్లో 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. కానీ రష్యా 2025లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా నిలిచింది. అప్పటి నుంచి భద్రత, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, ఇప్పుడు రక్షణ రంగాల్లో కూడా సంబంధాలను వేగంగా పెంచుతోంది.రష్యా ఎందుకు తాలిబాన్కు దగ్గరవుతోంది?1. ISIS-K ముప్పురష్యా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న Islamic State–Khorasan Provinceను పెద్ద భద్రతా ముప్పుగా చూస్తోంది.2024లో మాస్కోలో జరిగిన Crocus City Hall ఉగ్రదాడి తర్వాత రష్యా ఆఫ్ఘనిస్థాన్లోని ఉగ్రవాద నెట్వర్క్లపై మరింత అప్రమత్తమైంది. తాలిబాన్తో సహకారం ద్వారా ISIS-Kను నియంత్రించవచ్చని మాస్కో భావిస్తోంది.2. మధ్య ఆసియాలో ప్రభావంఆఫ్ఘనిస్థాన్కు ఆనుకుని ఉన్న మధ్య ఆసియా దేశాలు రష్యా భద్రతా వ్యూహంలో కీలకమైనవి. ఆఫ్ఘనిస్థాన్లో స్థిరత్వం లేకపోతే ఆ ప్రభావం నేరుగా మధ్య ఆసియాపై పడుతుంది. 2021లో ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా ఉపసంహరణ తర్వాత ఏర్పడిన వ్యూహాత్మక ఖాళీని రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఈ ఒప్పందాన్ని ఆ దిశలో మరో అడుగుగా చూస్తోంది.పాకిస్తాన్కు టెన్షన్?ఇదే ఈ పరిణామంలో అత్యంత కీలక అంశం. రష్యా నేరుగా తాలిబాన్తో సంబంధాలు బలోపేతం చేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్థాన్లో పాకిస్థాన్ ప్రభావశీల దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు తాలిబాన్–పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించాయి. ఇటీవలి కాలంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం కూడా జరిగింది. పాక్ ఆరోపణ ప్రకారం టీటీపీ Tehrik-i-Taliban Pakistan (TTP) యోధులు ఆఫ్ఘనిస్థాన్లో ఆశ్రయం పొందుతున్నారు. తాలిబాన్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు రష్యాతో కుదిరిన ఒప్పందం కారణంగా తాలిబాన్లకు ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, తాలిబాన్లు.. పాకిస్తాన్కు పక్కలో బల్లెంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకే పాక్ ఆందోళనకు గురవుతోంది. భారత్ సంగతేంటి? భారత్ అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా ఆఫ్ఘనిస్థాన్తో పరిమిత దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది. ఇటు రష్యాతోనూ మంచి స్నేహం ఉంది. దీంతో, భారత్పై పాక్ అనుసరించే చర్చకు చెక్ పడే అవకాశం ఉంది. అయితే, ఈ ఒప్పందం తాలిబాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందే ప్రయత్నంలో పెద్ద ముందడుగుగా అనేక దేశాలు భావిస్తున్నాయి. రష్యా మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని విస్తరించే వ్యూహంగా విశ్లేషించుకుంటున్నాయి.చైనా పాత్ర.. డ్రాగన్ కంట్రీ చైనా కూడా తాలిబాన్తో సంబంధాలు పెంచుకుంటోంది. అక్కడి ఖనిజ సంపదపై చైనా కన్నేసిందని వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్లోని లిథియం, రాగి వంటి ఖనిజాలపై చైనా, రష్యా రెండింటికీ ఆసక్తి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రష్యా–చైనా–తాలిబాన్ సమీకరణం బలపడితే కొత్త వ్యూహాత్మక సవాళ్లు ఎదురుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో యుద్ధం చేసిన రష్యా, ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంతో భద్రతా భాగస్వామిగా మారుతోంది. రష్యా–తాలిబాన్ ఒప్పందం ఇప్పటికైతే సాంకేతిక-సైనిక సహకారానికి పరిమితమైనా, దీని అసలు ప్రాధాన్యం ఆఫ్ఘనిస్థాన్ను అంతర్జాతీయ రాజకీయాల్లో తిరిగి స్థాపించడం, రష్యా ప్రభావాన్ని పెంచడం, దక్షిణాసియా శక్తి సమీకరణాలను మార్చడమేనని తెలుస్తోంది. -
జపాన్లో మసీదు.. పాక్ పరువు పాయె!
పరాయి దేశంలో పాకిస్థాన్కు పరువు పొగొట్టుకుంది. ఆ దేశ పౌరులు అక్కడ ఓ మసీదును నిర్మించడమే అందుకు కారణం. పైగా దానిని ఆ దేశ రాయబారితోనే అట్టహాసంగా ప్రారంభించింది. అయితే వారం తిరగకుండానే స్థానిక అధికారులు మసీదు నిర్వాహకులకు షాకిచ్చారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జపాన్లోని సైతామా ప్రిఫెక్చర్లో ఉన్న కవగోయే నగరంలో నిర్మించిన ఓ మసీదు వివాదాస్పదంగా మారింది. నగర ప్రణాళిక చట్టాల ప్రకారం ప్రత్యేక అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాని ప్రాంతంలో ఈ మసీదును నిర్మించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. సుమారు 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం పర్వత అటవీ భూమిగా నమోదై ఉంది. ఇది అర్బనైజేషన్ కంట్రోల్ ఏరియా పరిధిలోకి వస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడం నిషేధం.అయితే మసీదు నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోలేదని కవగోయే మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ Abdul Hameed ఈ ఏప్రిల్లో జరిగిన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడమే. దీంతో ఈ నిర్మాణానికి పాకిస్థాన్ ప్రభుత్వ మద్దతు ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.అయితే వివాదం ముదరడంతో పాకిస్థాన్ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. మసీదు నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకున్నామని హామీ ఇవ్వడంతోనే రాయబారి కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంది. స్థానిక చట్టాలను ఉల్లంఘించే ఏ ప్రాజెక్టుతోనూ తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే జపాన్లో నివసిస్తున్న పాకిస్థానీ కమ్యూనిటీకి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, ప్రార్థనా మందిరాల నిర్మాణం సహా అన్ని అంశాల్లో స్థానిక చట్టాలను పూర్తిగా పాటించాలని కోరింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని హెచ్చరించింది.ఇదే సమయంలో జపాన్లో చాలాకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాషియో మసీదు ప్రతినిధి షకీల్ షేక్ మహ్మద్ కూడా ఈ నిర్మాణాన్ని తప్పుబట్టారు. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ, చట్టబద్ధంగా అనుమతులు తీసుకుని మాత్రమే మసీదులు నిర్మించాలని సూచించారు.మొత్తంగా మసీదు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన కొద్ది రోజులకే అది అక్రమ నిర్మాణంగా మారడం పాకిస్థాన్కు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. జపాన్ వంటి చట్టాల అమలులో కఠినంగా వ్యవహరించే దేశంలో ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
గ్రూమింగ్ గ్యాంగ్స్.. మైనర్ బాలికపై వందల మంది అత్యాచారం..?
లండన్: బ్రిటన్లో సంచలనం సృష్టించిన గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలను అక్కడి పార్లమెంటులో ఎంపీ రూపెర్ట్ లోవ్ బహిర్గతం చేశారు. యూకే వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఈ గ్యాంగులు యాక్టివ్గా ఉన్నాయని వారిలో అధికంగా పాకిస్థానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు.గ్రూమింగ్స్ గ్యాంగ్స్ ఆగడాలకు సంబంధించి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు మైనర్ బాలికలపై రాక్షసత్వంతో ముఠా అత్యాచారాలు చేసినట్లు నివేదిక తేల్చింది. ఈ కేసులో పలువురు బాధితురాలను స్వతంత్ర కమిటీ విచారించింది. అందులో మైనర్ బాలికలను అత్యంత క్రూరంగా బోనులో బంధించి అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఒక బాధితురాలు చెప్పినట్లు నివేదిక పేర్కొంది.ఒక బాధిత బాలిక మాట్లాడుతూ.. 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తనపై దాదాపు 600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని ఆ బాధితురాలు తెలిపింది. మరో బాధితురాలు .. 15 నుండి 20 మంది అమ్మాయిలను బోనుల్లో బంధించి ఉంచడం చూశానని, వారిపై అమానవీయంగా, క్రూరంగా లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొంది. ఇవే కాక మరెన్నో మైనర్లపై మరెన్నో ఆగడాలు బ్రిటన్ వ్యాప్తంగా గ్రూమింగ్ గ్యాంగ్స్ చేశాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ ముఠాలలో ప్రధానంగా పాకిస్తానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఈ దారుణాలపై ఇక మాటలు చాలు, చేతల్లో కఠిన చర్యలు కావాలి. రాబోయే రోజుల్లో విడుదల కాబోయే మా 'రేప్ గ్యాంగ్ ఇంక్వైరీ రిపోర్ట్' బ్రిటన్ భవిష్యత్తును మారుస్తుంది అని ఎంపీ రూపెర్ట్ లోవ్ స్పష్టం చేశారు.ఈ దారుణాలను అణచడంలో స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఘోరంగా విఫలమయ్యారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే..?'గ్రూమింగ్ గ్యాంగ్స్' అంటే... ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసి, వారిని మభ్యపెట్టి, నమ్మించి, ఆపై క్రూరంగా లైంగికంగా వాడుకునే వ్యవస్థీకృత నేర ముఠాలు 'గ్రూమింగ్' అంటే ఒకరిని నమ్మించి, లొంగదీసుకోవడం. ఈ ముఠాలు సాధారణంగా పేదరికం, కుటుంబ సమస్యలు లేదా ఒంటరితనంతో బాధపడుతున్న 11 నుండి 16 ఏళ్ల లోపు బాలికలను (ఎక్కువగా తెల్లజాతి బాలికలను) టార్గెట్ చేస్తాయి. -
రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్ బౌలర్లు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్లో ఆసీస్ను 200 పరుగులకే ఆలౌట్ చేసి, ఆతర్వాత సునాయాస విజయం సాధించిన పాక్ జట్టు.. ఇవాళ (జూన్ 2) జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్పై పట్టు బిగించింది.లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. ఆసీస్ను 231 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. తొలి వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అరాఫత్ మిన్హాస్ (10-2-27-2) ఈ మ్యాచ్లోనూ సత్తా చాటాడు.అరాఫత్తో పాటు మరో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (10-1-34-2), పేసర్లు షాహీన్ అఫ్రిది (8-1-36-3), హరీస్ రౌఫ్ (10-1-49-2) కూడా రాణించడంతో ఆసీస్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఇంగ్లిస్ (51), కెమరూన్ గ్రీన్ (53), మ్యాట్ రెన్షా (43), ఒలివర్ పీక్ (31) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్గా బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ 15, లబూషేన్ 5, కుహ్నేమన్ 5, నాథన్ ఇల్లిస్ 5 పరుగులకు ఔటయ్యారు. -
రికార్డు ఛేదన.. పాక్కు ఊహించిన షాక్
మహిళల క్రికెట్లో సంచలనం నమోదైంది. పసికూన ఐర్లాండ్ తమ టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి, పటిష్టమైన పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. ఐర్లాండ్ ట్రై సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో పాక్ నిర్దేశించిన 176 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ జట్టు మరో 5 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత భారీ ఛేదనగా (7 వికెట్ల తేడాతో) రికార్డైంది. ఆమీ హంటర్ (56), రెబెకా స్టాకెల్ (60 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో ఐర్లాండ్కు ఈ చారిత్రక విజయాన్ని అందించారు. అంతకుముందు మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఐరిష్ మహిళలు, ఈ మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకొని సంచలన విజయం సాధించారు. మరోవైపు పాక్ దీనికి ముందు మ్యాచ్లో విండీస్ చేతిలో, ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఓడి నిష్క్రమణకు దగ్గర్లో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మునీబా అలీ (65) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మిగతా పాక్ బ్యాటర్లలో గుల్ ఫెరోజా (32), సైరా జబీన్ (36), కెప్టెన్ ఫాతిమా సనా (21) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమీ హంటర్, స్టోకెల్ అర్ద సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ ఓర్లా ప్రెండర్గాస్ట్ (33) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించింది. ఇవాళే జరిగే (జూన్ 1) తదుపరి మ్యాచ్లో ఐర్లాండ్ మరోసారి విండీస్తో తలపడనుంది. -
ప్రియురాలి కోసం ప్రియుడి సాహసం.. కట్ చేస్తే
ప్రియురాలి కోసం సరిహద్దులు దాటే సాహసం చేసిన ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్లో పరిచయమైన జమ్మూ కాశ్మీర్ యువతిని కలవడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ముజఫ్ఫరాబాద్కు చెందిన యువకుడు జీషాన్ మిర్ (22)ని నియంత్రణ రేఖ (LoC) భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం చెప్పాడు. దీంతో ఈ స్టోరీ నెట్టింట్ వైరల్గా మారింది.జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్కు చెందిన ప్రియురాల్ని కలవాలన్న అతని కోరికకు సరిహద్దు గీత వద్దే ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ పరిధిలోని 'సిలికోట్' ప్రాంతంలో ఒక వ్యక్తి నియంత్రణ రేఖ దాటి రావడాన్ని సైనికులు గమనించారు. అతను భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను పీఓకేలోని ముజఫరాబాద్కు చెందిన పెయింకాడి నివాసి జీషాన్ అహ్మద్ మీర్ (తండ్రి లాల్ దిన్ మీర్) గా గుర్తించారు. అతని వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డు (ID Card)ద్వారా అతని వివరాలను ధృవీకరించారు. సోషల్ మీడియా ద్వారా ఉరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆమెను కలుసుకోవడానికే తాను ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటానని జీషాన్ భద్రతా సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం జీషాన్తో పాటు అతను చెప్పిన యువతిని కూడా భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. వారి మధ్య జరిగిన డిజిటల్ సంభాషణలను (చాట్స్) అధికారులు పరిశీలిస్తున్నారు.సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు సోపోర్ యువకుల అరెస్ట్మరొక ఘటనలో, శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి హత్లంగా-నంబ్లా మార్గం ద్వారా పీఓకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సోపోర్ నివాసితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ (TA-161) సిబ్బంది కావడం గమనార్హం.వారు నియంత్రణ రేఖను చేరుకోవడానికి ముందే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ వారిని పట్టుకుంది. వీరు సరిహద్దు దాటడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్ -
పాక్ మాజీ కెప్టెన్కు అవమానం..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావల్పిండి వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 1000వ వన్డేను మధురానుభూతిగా మల్చుకుంది. మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన బాబర్ ఆజంకు అవమానం జరిగింది. పాక్ వెయ్యి వన్డేలు పూర్తి చేసుకున్న క్రమంలో ఆ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ జట్టులో ఉండే నాలుగు స్లాట్లకు (బ్యాటర్, బౌలర్, ఆల్రౌండర్, వికెట్ కీపర్) సంబంధించి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఈ జాబితాలో బాబర్ ఆజంకు చోటు దక్కలేదు. 1992 వన్డే వరల్డ్కప్ సాధించిన పాక్ జట్టుకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ఖాన్ను కెప్టెన్, ఆల్రౌండర్ స్లాట్కు ఎంపిక చేశాడు. ఇక బ్యాటర్గా బాబర్ ఆజం కాకుండా సయీద్ అన్వర్ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్గా రషీద్ లతీఫ్ను, ఫాస్ట్ బౌలర్ కోటాలో వసీమ్ అక్రమ్ను, స్పిన్నర్ కోటాలో సక్లెయిన్ ముస్తాక్ను ఎంపిక చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. మాట్ రెన్షా (61), మాథ్యూ షార్ట్ (55) అర్థసెంచరీలు సాధించారు. అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టగా, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్తాన్ 42.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బాబర్ ఆజం (69), గాజీ గోరి (65) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీయగా, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, మార్నస్ లబుషేన్ తలా ఒక వికెట్ తీశారు.చదవండి: ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ! -
అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్
రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఆసీస్తో జరుగుతున్న తొలి వన్డే పాకిస్తాన్కు 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో వెయ్యి మ్యాచ్లు పూర్తి చేసుకున్న మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 1075 వన్డే మ్యాచ్లతో భారత్ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, 1020 మ్యాచ్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల సరసన పాకిస్తాన్ చోటు సంపాదించింది. ఇక 1000వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగ2ఆ ప్రత్యేక మెమొంటో అందుకున్నాడు. ఇక పాక్ ఆడుతున్న 1000వ మ్యాచ్ ద్వారా అరాఫత్ మిన్హాస్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం మరో విశేషం. వెయ్యి వన్డేలు ఆడిన మూడు జట్లు విజయాల శాతాన్ని పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1019 మ్యాచ్ల్లో 617 విజయాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండగా, టీమిండియా (1075 మ్యాచ్ల్లో 571 విజయాలు), పాకిస్తాన్ (999 మ్యాచ్ల్లో 527 విజయాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 23 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (49), మాట్ రెన్షా (21) పరుగులతో ఆడుతున్నారు. Josh Inglis presented a souvenir to Shaheen Afridi on Pakistan’s 1000th ODI match. ❤️ - A lovely gesture by Inglis. 🇵🇰🇦🇺pic.twitter.com/T1SzeQH8PV— Sheri. (@CallMeSheri1_) May 30, 2026చదవండి: వినేశ్కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్! -
ప్రపంచం దూరమవుతున్నా.. భారత్ మా వెంటే
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. మరోసారి భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇజ్రాయెల్పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నా.. భారత్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇండియాలో ఇజ్రాయెల్కు అసాధారణమైన ఆదరణ ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.వెస్ట్ బ్యాంక్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు.. భారత్తో ఇజ్రాయెల్కు ప్రత్యేక సంబంధం ఉందన్నారు. “ప్రపంచంలో చాలా చోట్ల మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ భారత్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఇజ్రాయెల్కు విపరీతమైన మద్దతు ఉంది” అని పేర్కొన్నారు. అంతేకాదు.. “నాకు ప్రపంచంలో ఎక్కడా లేనంత భారత్లోనే ఎక్కువ ఫాలోవర్లు ఉండొచ్చు” అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.నెతన్యాహు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా భారత్పై నెతన్యాహు ఇదే తరహాలో స్పందించారు. 2018లో తన భార్యతో కలిసి భారత్ పర్యటనకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. “అది లవ్ ఫెస్ట్లా అనిపించింది” అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ప్రజల్లో ఇజ్రాయెల్పై అపార గౌరవం ఉందని కూడా వ్యాఖ్యానించారు.Netanyahu:I’ll say this: we face delegitimization in much of the world — but not in India. In India, there is an absolutely crazy love for Israel, truly crazy. I think I have more followers from India than from anywhere else. pic.twitter.com/FRIo2cdVb3— Clash Report (@clashreport) May 28, 2026ఇదిలా ఉండగా.. అమెరికాలో మాత్రం ఇజ్రాయెల్పై వ్యతిరేక భావనలు పెరుగుతున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. తాజా ప్యూ రీసెర్చ్ సర్వే ప్రకారం అమెరికన్లలో 60 శాతం మంది ఇజ్రాయెల్పై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారని నెతన్యాహుపై నమ్మకం లేదని చాలామంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. అమెరికాలో ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలు పెరగడానికి పాకిస్థాన్కు చెందిన సోషల్ మీడియా బాట్ నెట్వర్క్లు కారణమని ఆరోపించారు. “అమెరికన్లలా నటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ పరిశీలిస్తే వాళ్లు పాకిస్థాన్లోని బేస్మెంట్ల్లో కూర్చున్నవాళ్లని తేలుతోంది” అంటూ వ్యాఖ్యానించారు. -
చైనా షాడో గేమ్లో పాక్.. కశ్మీర్పై హైవోల్టేజ్ డ్రామా!
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటన తర్వాత మళ్లీ కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాక్, చైనా కశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించాయి. ‘చరిత్రలో మిగిలిన సమస్య(left over from history)’ అంటూ UN తీర్మానాల ప్రకారం పరిష్కారం కావాలని పేర్కొన్నాయి. అయితే, షరీఫ్.. చైనా పర్యటనలో ఏం జరిగిందనే అంశాలపై చర్చ మొదలైంది. భారత్పై కుట్రతో రెండు దేశాలు ఏం ప్లాన్ చేశాయనే చర్చ జోరందుకుంది. మరోవైపు.. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జమ్ముకశ్మీర్, లడఖ్ భారత్లో అంతర్భాగాలని స్పష్టం చేసింది.పాక్ పీఎం షరీఫ్ నాలుగు రోజుల చైనా పర్యటనలో అధ్యక్షుడు షీ జిన్పింగ్తో పాటు ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరిపారు. అధికారికంగా ఈ భేటీల్లో CPEC (చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్) విస్తరణ, గ్వాదర్ పోర్ట్ను ప్రాంతీయ ట్రేడ్ హబ్గా అభివృద్ధి చేయడం, రక్షణ సహకారం, ఆర్థిక పెట్టుబడులు ప్రధాన అంశాలుగా ఉన్నప్పటికీ అసలు వ్యూహాత్మక చర్చలు భిన్నంగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రకటనలో కశ్మీర్ను మళ్లీ ప్రస్తావించడం వెనుక చైనా–పాక్ ఉమ్మడి వ్యూహం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ దీర్ఘకాలంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. చైనా మద్దతుతో ఆ ప్రయత్నానికి కొత్త ఊపొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్ పెరుగుతున్న ఆర్థిక, సైనిక ప్రభావాన్ని కట్టడి చేయడం ఈ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది.ఇక చైనా వైపు నుంచి చూస్తే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కీలక భాగమైన CPEC భద్రత అత్యంత ప్రాధాన్యం. గిల్గిట్–బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే ఈ కారిడార్పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ బీజింగ్ ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు పెంచుతూ, గ్వాదర్ పోర్ట్ను అరేబియా సముద్రంలో వ్యూహాత్మక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ పరిణామాల వెనుక “కనిపించని ఒత్తిడి వ్యూహం” ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కశ్మీర్ అంశాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తడం ద్వారా భారత్పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచడం, అంతర్జాతీయ వేదికల్లో చర్చను కొనసాగించడం పాక్ లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా ఈ అంశాన్ని నేరుగా రాజకీయంగా కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యం రూపంలో ఉపయోగిస్తోందని భావిస్తున్నారు.India has firmly rejected Pakistan-China references on Jammu & Kashmir. 🇮🇳“No other country has the locus standi to comment.”MEA makes it crystal clear: Jammu & Kashmir and Ladakh “have been, are and will always remain integral and inalienable parts of India.” https://t.co/NTzHeyiCGh pic.twitter.com/ZJs2lpnW15— India First Post (@ifpost47) May 26, 2026అయితే, భారత్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా తిరస్కరించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ దేశానికి అంతర్భాగాలని స్పష్టం చేస్తూ, ఇతర దేశాలు ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి ఎలాంటి హక్కు లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. అంతేకాకుండా CPEC ప్రాజెక్ట్ను భారత సార్వభౌమాధికారానికి విరుద్ధంగా పేర్కొంటూ దీర్ఘకాల అభ్యంతరాన్ని పునరుద్ఘాటించింది. మొత్తం పరిణామాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ప్రకటన స్థాయిలో జరిగిన వ్యాఖ్యల కంటే ఎక్కువగా చైనా–పాక్ వ్యూహాత్మక సమన్వయాన్ని సూచిస్తోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఆర్థిక కారిడార్ విస్తరణ, మరోవైపు దౌత్య వేదికలపై కశ్మీర్ ప్రస్తావన ద్వారా భారత్పై “డబుల్ ప్రెషర్ స్ట్రాటజీ” అమలు చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని, భారత్–చైనా–పాక్ మధ్య సంబంధాలు మరింత సంక్లిష్ట దశలోకి వెళ్లినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.UN తీర్మానాల చరిత్ర👉1948లో UNSC Resolution 47 ద్వారా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చారు. ఆ తీర్మానం ప్రకారం, పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి, భారత్ సైన్యం తగ్గించుకోవాలి. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ (plebiscite) జరగాలి. కానీ, అమలు జరగలేదు. అప్పటి నుంచి కాశ్మీర్ అంశం UNలో పునరావృతమవుతూ వస్తోంది.భారత్ ఆందోళనలు👉China–Pakistan Economic Corridor (CPEC) ప్రాజెక్టులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మీదుగా వెళ్తున్నాయి. భారత్ దీన్ని సార్వభౌమత్వానికి విరుద్ధంగా భావిస్తోంది. గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు అన్నీ చైనా–పాకిస్తాన్ సంబంధాలను బలపరుస్తున్నాయి. దీని వల్ల భారత్కి వ్యూహాత్మకంగా ఒత్తిడి పెరుగుతోంది. చైనా–పాకిస్తాన్ కశ్మీర్ను అంతర్జాతీయ వేదికల్లో మళ్లీ ప్రస్తావించడం భారత్ను ఇరకాటంలో పడేస్తోంది.ఎందుకు మళ్లీ కశ్మీర్?పాకిస్తాన్ లాభం: చైనా సంయుక్త ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావన రావడం పాకిస్తాన్కి దేశీయంగా చూపించుకునే రాజకీయ విజయంగా ఉంటుంది.చైనా వ్యూహం: పాకిస్తాన్ One China Policy (తైవాన్, హాంకాంగ్, జిన్జియాంగ్)కి మద్దతు ఇస్తుంది.CPEC (China–Pakistan Economic Corridor), గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు పాకిస్తాన్ సహకారం కొనసాగుతుంది.కశ్మీర్ ప్రస్తావన చైనాకు తక్కువ ఖర్చుతో పాకిస్తాన్ అనుకూలతను పొందే మార్గం.ఈ భాగస్వామ్యం భారత్కి భౌగోళిక–రాజకీయ సవాలుగా మారింది.చైనా వ్యూహం ఏంటి?భారత్ ఎదుగుదలను అడ్డుకోవడమే డ్రాగన్ అసలు లక్ష్యంCPEC ద్వారా అరేబియా సముద్రానికి ప్రత్యక్ష మార్గం పొందాలని ప్లాన్గ్వాదర్ పోర్ట్ను మిలిటరీ & ట్రేడ్ హబ్గా మార్చే ప్రయత్నంభారత్ను రెండు వైపులా ఒత్తిడిలో పెట్టేందుకు పాక్కు మద్దతుక్వాడ్, ఇండో–పసిఫిక్ కూటములకు కౌంటర్గా దక్షిణాసియాలో ప్రభావం పెంపు -
ఒక సాధారణ మోడల్ ఎలా ‘కోకైన్ క్వీన్’ అయ్యింది?
పాకిస్తాన్ డ్రగ్స్ సామ్రాజ్యంలో ప్రస్తుతం ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది. అదే అన్మోల్ అలియాస్ ‘పింకీ’. మోడలింగ్ రంగంలో మెరిసిపోవాలని ఆశపడిన ఒక సాధారణ యువతి, ఎలా కోకైన్ సిండికేట్కు రాణిగా మారింది? పోలీసుల కళ్లు గప్పి 17 ఏళ్ల పాటు డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఎలా ఏలింది? ఇప్పుడు రాజకీయ నేతల పేర్లను బయటపెడుతూ పాక్ వ్యవస్థను ఎలా షేక్ చేస్తోంది?కలల ప్రపంచం నుండి ‘చీకటి’ లోకానికి..బలూచిస్థాన్కు చెందిన అన్మోల్, తన అందంతో మోడలింగ్ రంగంలో నిలదొక్కుకోవాలని కరాచీకి చేరుకుంది. గ్లామర్ ప్రపంచంలో రాణించాలని ప్రయత్నించిన ఆమెకు, కరాచీలోని హై-ప్రొఫైల్ పార్టీలు, డ్రగ్స్ సంస్కృతితో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ, హంగులతో కూడిన జీవనశైలిపై ఏర్పడిన వ్యామోహం ఆమెను మెల్లమెల్లగా మాదకద్రవ్యాల వైపు నెట్టాయి. ఒక మోడల్గా ప్రయత్నించి విఫలమైన ఆమె, ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది.సామ్రాజ్య విస్తరణ: రహస్య నెట్వర్క్పింకీ డ్రగ్స్ నెట్వర్క్ కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ తదితర నగరాల్లో వేళ్లూనుకుంది. తన గ్యాంగ్లో మహిళలను క్యూరియర్లుగా వాడుకుంటూ, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేది. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, నేరుగా డెలివరీ చేసే అధునాతన పద్ధతిని ఆమె అనుసరించింది. పింకీ స్వయంగా డ్రగ్స్ తయారీలోనూ, వాటి నాణ్యతను పరీక్షించడంలోనూ శిక్షణ పొందిందని, తన వద్ద ఉన్న ‘వైట్’, ‘గోల్డెన్ స్టఫ్’ అత్యుత్తమమైనవని ఆమె గర్వంగా చెప్పుకునేదని పోలీసులు తెలిపారు.అరెస్టు: సంచలన నిజాల వెల్లడి2026, మే 12న కరాచీ పోలీసులు నిర్వహించిన మెరుపు దాడిలో పింకీ అరెస్టయింది. ఆమె వద్ద కోకైన్ హైడ్రోక్లోరైడ్, కెటామైన్, వివిధ రసాయనాలు భారీ మొత్తంలో దొరికాయి. విచారణలో ఆమె గత 17 ఏళ్లుగా ఈ అక్రమ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించగలిగిందని తేలింది. ఆమె వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే దానిపై ఇప్పుడు విచారణ ముమ్మరంగా సాగుతోంది.కోర్టులో వీఐపీ వేషధారణఅరెస్టు తర్వాత పింకీ ప్రవర్తన, పోలీసుల పనితీరు తీవ్ర చర్చకు దారితీసింది. కోర్టులో ఆమె సంకెళ్లు లేకుండా, నల్ల కళ్ళద్దాలతో ఫోన్ వాడుతూ కనబడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక డ్రగ్స్ కేసులో అరెస్టయిన వ్యక్తికి ఇంతలా వీఐపీ ట్రీట్మెంట్ ఎలా లభిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో, ఆమెకు సహకరించిన ముగ్గురు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.మాజీ ప్రధాని పేరుతో రాజకీయ ప్రకంపనలుపింకీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. విచారణ సందర్భంగా మాజీ ప్రధాని రాజా పర్వేజ్ అష్రఫ్ పేరును ఆమె ప్రస్తావించడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం దేశ రాజకీయాలను కుదిపేసింది. అష్రఫ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించినప్పటికీ, కేసు దర్యాప్తులో పింకీ వెల్లడించే మరిన్ని పేర్లు ఎవరికి చిక్కులు తెచ్చిపెడతాయోనన్న భయం రాజకీయ వర్గాల్లో మొదలైంది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు పింకీ కేసులో ఉన్న రాజకీయ, ఆర్థిక సంబంధాలను వెలికితీసే పనిలో ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా, వీఐపీ సంస్కృతి, రాజకీయ అధికారం ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటున్నాయనేది పింకీ ఉదంతం మరోసారి నిరూపించింది.ఇది కూడా చదవండి: శ్రీనగర్లో ఎనిమిదో ఏటా ఈద్ ప్రార్థనలకు నో ఎంట్రీ -
ట్రంప్ ప్లాన్తో పాక్ పాస్పోర్ట్ చెల్లదా?
“ఈ పాస్పోర్ట్ ఇజ్రాయెల్కు చెల్లదు”.. అని పాకిస్థాన్ పాస్పోర్ట్పై కనిపిస్తున్న వాక్యం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కారణం… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదనే. పశ్చిమాసియా శాంతి ఒప్పందాల్లో భాగంగా పాకిస్థాన్ కూడా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండటంతో… “పాకిస్థాన్ తన పాస్పోర్ట్ నిబంధనలనే మార్చాల్సి వస్తుందా?” అనే చర్చ మొదలైంది.ట్రంప్ తాజాగా “అబ్రహామ్ అకార్డ్స్” విస్తరణపై మాట్లాడారు. సౌదీ అరేబియా, ఖతర్, టర్కీతో పాటు పాకిస్థాన్ కూడా ఈ ఒప్పందాల్లో చేరాలని ఆయన సూచించారు. మిడిల్ ఈస్ట్లో శాంతి, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఇజ్రాయెల్తో ముస్లిం దేశాలు సంబంధాలు ఏర్పరచుకోవాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. “ఈ ఒప్పందంలో భాగం కావాలనుకోని దేశాలు భవిష్యత్తు డీల్లో ఉండకూడదు” అంటూ ఆయన స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్ మాత్రం వెంటనే ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ… “ఇజ్రాయెల్పై నమ్మకం లేదు. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకుండా మేం గుర్తింపు ఇవ్వం” అని స్పష్టం చేశారు. మరోవైపు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ కూడా అదే మాట చెప్పారు. 1967 సరిహద్దుల ప్రకారం స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడితేనే ఇజ్రాయెల్ను గుర్తించే అంశం పరిశీలిస్తామని పాకిస్థాన్ చెబుతోంది.అబ్రహం అకార్డ్స్అబ్రహం అకార్డ్స్.. 2020లో అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్–అరబ్ దేశాల మధ్య కుదిరిన సంబంధాల సాధారణీకరణ ఒప్పందాల పేరు. యూదులు, ముస్లింలు, క్రైస్తవులందరికీ సామాన్య పితామహుడిగా భావించే “అబ్రహాం” పేరు మీద ఈ ఒప్పందాలకు పేరు పెట్టారు. వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత, భద్రతా సహకారాన్ని పెంచడం వీటి ప్రధాన లక్ష్యం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలు ఇందులో చేరి ఇజ్రాయెల్తో నేరుగా దౌత్య, వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. విమాన సర్వీసులు, టూరిజం, వ్యాపారం, సాంకేతిక సహకారం వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. అయితే.. పాలస్తీనా సమస్య పరిష్కారం కాకముందే అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో చేతులు కలపడం వల్ల ఇవి మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్లో చారిత్రక మలుపుగా భావించబడ్డాయి.నిబంధనల దాకా..ఇక్కడే పాకిస్థాన్కు పెద్ద చిక్కు ఎదురవుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పాస్పోర్ట్పై స్పష్టంగా ఇజ్రాయెల్కు మినహాయింపు(Israel excepted) అనే నిబంధన ఉంది. అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్పోర్ట్ చెల్లుబాటు అవుతుందిగానీ… ఇజ్రాయెల్కు మాత్రం కాదు. ఒకవేళ పాకిస్థాన్ ఇజ్రాయెల్తో అధికారిక సంబంధాలు ఏర్పరచుకుంటే… అదే సమయంలో తమ పౌరులు అక్కడికి వెళ్లకూడదని చెప్పే పాస్పోర్ట్ కొనసాగించడం చట్టపరంగా విరుద్ధంగా మారుతుంది. దౌత్య సంబంధాలు, వీసాలు, ట్రేడ్, ఎంబసీ వ్యవస్థ అన్నీ అమల్లోకి రావాలంటే ఈ నిబంధనను తొలగించాల్సిందే.ఇలాంటి పరిణామం ఇప్పటికే బంగ్లాదేశ్లో జరిగింది. ఆధునిక ఈ-పాస్పోర్ట్లను ప్రవేశపెట్టే సమయంలో “except Israel” అనే వాక్యాన్ని అక్కడి ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో కూడా అదే ప్రశ్న ముందుకొస్తోంది. అందుకే… ట్రంప్ ప్రతిపాదన కేవలం విదేశాంగ రాజకీయాల మార్పు మాత్రమే కాదు… పాకిస్థాన్ జాతీయ గుర్తింపులో భాగమైన పాస్పోర్ట్ నిబంధనల వరకూ వెళ్లే పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాక్తో పాటు సౌదీ అరేబియా, ఖతర్, టర్కీ వంటి దేశాలు కూడా చేరాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి, ఆర్థిక భాగస్వామ్యం, ఇజ్రాయెల్తో సహకారం కోసం ఈ ఒప్పందాల్లో చేరడం అవసరమని ట్రంప్ భావిస్తున్నారు.ఏయే దేశాలంటే.. ప్రపంచ దేశాల పాస్పోర్ట్లలో సాధారణంగా.. “ఈ పాస్పోర్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలకు చెల్లుతుంది” అనే వాక్యం కనిపిస్తుంది. కానీ పాకిస్థాన్ పాస్పోర్ట్పై మాత్రం దశాబ్దాలుగా .. “ఇజ్రాయెల్కు మినహా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ పాస్పోర్ట్ చెల్లుతుంది” అనే వాక్యం ముద్రించబడుతోంది. పాకిస్థాన్ ఈ నిబంధనను ఎందుకు తీసుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలి. 1947లో భారత విభజన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక దేశంగా పాకిస్థాన్ ఏర్పడింది. ఆ తర్వాత ఏడాది, అంటే 1948లో ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచే పాలస్తీనా భూభాగాలపై వివాదం మొదలైంది. పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్… ఇజ్రాయెల్ను అధికారిక దేశంగా గుర్తించబోమని స్పష్టం చేసింది. ఈ విధానంలో భాగంగానే పాకిస్థాన్ పాస్పోర్ట్లపై “ఇజ్రాయెల్కు చెల్లదు” అనే నిబంధనను ముద్రించడం ప్రారంభించింది. 1950ల చివరి దశ నుంచి 1960ల నాటికి ఈ వాక్యం అధికారికంగా పాస్పోర్ట్లలో స్థిరపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఇది కేవలం పాకిస్థాన్కే పరిమితమైన విషయం కాదు. ఒకప్పుడు అనేక ముస్లిం దేశాలు ఇలాంటి విధానాలనే పాటించాయి. అరబ్–ఇజ్రాయెల్ యుద్ధాల తర్వాత ఇజ్రాయెల్ను వ్యతిరేకించిన దేశాలు తమ పౌరులు అక్కడికి వెళ్లకుండా పాస్పోర్ట్లపైనే నిషేధాలను ముద్రించేవి. బంగ్లాదేశ్, మలేషియా, బ్రూనై, ఇరాన్, సిరియా, లెబనాన్, కువైట్ వంటి దేశాలు కూడా ఇలాంటి ఆంక్షలను అమలు చేశాయి. కాలక్రమేణా ప్రపంచ రాజకీయాలు మారాయి. అనేక దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకున్నాయి. దీంతో కొన్ని దేశాలు పాస్పోర్ట్లలోని ఆ నిబంధనలను తొలగించాయి. బంగ్లాదేశ్ ఇందుకు ముఖ్య ఉదాహరణ. అక్కడ కూడా చాలాకాలం పాటు “ఇజ్రాయెల్కు మినహా” అనే వాక్యం ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా కొత్త పాస్పోర్ట్లను ప్రవేశపెట్టేటప్పుడు ఆ వాక్యాన్ని తొలగించారు. అయితే ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించలేదనే తమ వైఖరి మాత్రం మారలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం కూడా పాకిస్థాన్, ఇరాన్ వంటి కొన్ని దేశాలు ఇజ్రాయెల్పై కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. పాకిస్థాన్ స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే… పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా లభించే వరకు ఇజ్రాయెల్ను గుర్తించే ప్రసక్తే లేదని. బంగ్లా బాటలో వెళ్తే.. మొదటిగా పాస్పోర్ట్లను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న “ఇజ్రాయెల్కు మినహా” అనే నిబంధనను తొలగించాలంటే కొత్త నమూనా పాస్పోర్ట్లు ముద్రించాలి. లక్షలాది పాస్పోర్ట్లను దశలవారీగా మార్చాల్సి రావచ్చు. ఇది ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అదే సమయంలో వీసా విధానాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, విమాన సర్వీసులు, రాయబార కార్యాలయాల ఏర్పాట్లు వంటి అనేక వ్యవస్థల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య అధికారిక ప్రయాణాలు ప్రారంభమైతే చట్టపరమైన మార్పులు కూడా తప్పవు.అయితే అసలు భారమంతా రాజకీయంగానే ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్థాన్లో పాలస్తీనా అంశం భావోద్వేగానికి సంబంధించినది. ఇజ్రాయెల్ను గుర్తించడం అంటే “దశాబ్దాల వైఖరికి విరుద్ధం” అని మతపరమైన, రాజకీయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ముఖ్యంగా మతపరమైన పార్టీలు, కఠినవాద సంస్థలు దీన్ని పెద్ద రాజకీయ అంశంగా మార్చవచ్చు. మరోవైపు సైన్యం, విదేశాంగ వ్యవస్థ కూడా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ లాంటి దేశాలతో సంబంధాలపై కూడా దాని ప్రభావం పడొచ్చు.ఇక మద్దతుదారులు మాత్రం వేరే వాదన చేస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పడితే సాంకేతికత, వ్యవసాయం, భద్రత, వాణిజ్య రంగాల్లో లాభాలు రావచ్చని అంటున్నారు. మధ్యప్రాచ్య దేశాలతో ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే… ఇది కేవలం పాస్పోర్ట్పై ఒక లైన్ మార్చడం కాదు. పాకిస్థాన్ దశాబ్దాల రాజకీయ సిద్ధాంతాన్ని మార్చే నిర్ణయంగా మారే అవకాశం ఉంది. -
ట్రంప్ పోస్ట్ బాంబ్.. పాక్ ప్రధానికి ఘోర అవమానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అబ్రహం అకార్డ్స్ విస్తరణపై మాట్లాడిన ట్రంప్.. తన సోషల్ మీడియా సందేశంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించలేదు. బదులుగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను పేర్కొనడం ఇస్లామాబాద్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.అబ్రహం అకార్డ్స్ విస్తరణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త ఒత్తిడిని సృష్టించాయి. ఇజ్రాయెల్తో సంబంధాలను విస్తరించే ప్రయత్నంలో పాకిస్తాన్ పేరు కూడా చర్చలోకి రావడం ఇస్లామాబాద్కు అత్యంత సున్నితమైన పరిణామంగా మారింది. ఇజ్రాయెల్ను గుర్తించే అంశం దేశంలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదన పాకిస్తాన్ ప్రభుత్వానికి రాజకీయంగా కఠిన పరీక్షగా మారింది.ఈ పరిస్థితుల్లో ట్రంప్ వ్యాఖ్యలు మరింత సంక్లిష్టతను తెచ్చాయి. ఆయన తన పోస్టులో సౌదీ అరేబియా, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాల నాయకులను ప్రస్తావించినప్పటికీ.. పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ను పక్కన పెట్టి అసిమ్ మునీర్ను మాత్రమే పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ రాజకీయ నిర్మాణంలో సైనిక వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యంపై అంతర్జాతీయ దృష్టిని మరింత బలపరిచినట్టుగా కనిపిస్తోంది.మిగిలిన దేశాల నాయకులను వారి రాజ్యాంగ పదవుల ద్వారా గుర్తించగా, పాకిస్తాన్ను మాత్రం దాని సైనిక అధిపతి ద్వారా గుర్తించారు. అక్కడ షరీఫ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతర్జాతీయ సంప్రదాయానికి భిన్నంగా.. ఈసారి ట్రంప్ చేసిన ఎంపిక పాకిస్తాన్లో అధికార కేంద్రం ఎక్కడ ఉందన్న చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా పాకిస్తాన్లో విదేశాంగ విధానాలు, భద్రతా నిర్ణయాల్లో సైన్యం ప్రభావం పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రస్తావన ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లు భావిస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పటికీ కీలక నిర్ణయాల్లో సైన్యం ప్రభావమే ఎక్కువగా ఉందన్న పాత చర్చను ఇది మళ్లీ వేడెక్కించింది.ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ అవగాహన లోపం కాదని.. దేశంలో సివిలియన్ ప్రభుత్వం కంటే సైనిక వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉందన్న వాస్తవాన్ని మరోసారి బయటపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అబ్రహం అకార్డ్స్ అంశం పాకిస్తాన్కు మరో దౌత్యపరమైన చిక్కును తెచ్చిపెట్టింది. ఒకవైపు అమెరికాతో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం, మరోవైపు దేశంలో ఉన్న తీవ్ర భావోద్వేగ రాజకీయ వాతావరణం మధ్య ఇస్లామాబాద్ సున్నితమైన సమతుల్యతను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు ఒత్తిడుల మధ్య ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయ స్థిరత్వంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. -
పాకిస్తాన్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు ఉగ్రముప్పు
ఈ నెల 30వ తేదీ నుంచి పాకిస్తాన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మే 30న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరగనున్న తొలి వన్డే కోసం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది.ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం ఆస్ట్రేలియా జట్టుకే కాదు, భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందికి సైతం రక్షణ కల్పించేందుకు ప్రత్యేక "సెక్యూరిటీ అండ్ డిసిప్లిన్ యూనిట్"ను ఏర్పాటు చేశారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు.కాగా, రావల్పిండి, లాహోర్ వేదికలుగా మే 30, జూన్ 2, 4 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మూడు మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. ఐపీఎల్ కారణంగా చాలామంది ఆసీస్ ఆటగాళ్లు ఈ సిరీస్కు అందుబాటులో లేరు.జట్ల వివరాలు..పాకిస్తాన్: అబ్దుల్ సమద్, బాబర్ ఆజం, సాహిబ్జాదా ఫర్హాన్, షమిల్ హుసేన్, సల్మాన్ అఘా, మాజ్ సదాకత్, షాదాబ్ ఖాన్, ఘాజీ ఘోరీ, రోహైల్ నజీర్, షాహీన్ అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ దనియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రౌఫ్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్ఆస్ట్రేలియా: మార్నస్ లబూషేన్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్షా, మిచెల్ మార్ష్ (కెప్టెన్), కెమరూన్ గ్రీన్, లియామ్ స్కాట్, ఒలివర్ పీక్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, రిలే మెరిడిత్, తన్వీర్ సంఘా, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపా -
ఉగ్రదేశంలో ఊరట!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ పొరుగు దేశం పాకిస్థాన్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పాక్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా సవరణ ప్రకారం, పెట్రోల్ ధర లీటరుకు రూ.6, హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ) ధర లీటరుకు రూ.6.80 మేర తగ్గాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించడం ఇది వరుసగా రెండో వారం కావడం గమనార్హం. గత వారం కూడా అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 మేర తగ్గించారు.సవరించిన కొత్త ధరల పట్టికప్రభుత్వ తాజా నిర్ణయం తర్వాత పాకిస్థాన్లో లీటర్ ఇంధన ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.ఇంధనం రకంపాత ధర (లీటరుకు)తగ్గిన ధరప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 409.78రూ. 6.00రూ. 403.78హై-స్పీడ్ డీజిల్రూ. 409.58రూ. 6.80రూ. 402.78గమనిక: విలువ ఆధారంగా భారత రూపాయి, పాకిస్థాన్ రూపాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి.(మే 25న 1 భారత రూపాయి=రూ.2.91 పాకిస్థాన్ రూపాయి)అంతకుముందు ఆకాశాన్నంటిన ధరలుఫిబ్రవరిలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ ఇంధన మార్కెట్ తీవ్ర అస్థిరతకు గురైంది. అప్పటి నుంచి పాక్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ధరలను సమీక్షిస్తోంది. గత కొన్ని నెలలుగా అక్కడ ధరలు ఏ స్థాయిలో పెరిగాయంటే..మార్చి 6: ఇరాన్ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.55 పెంచారు.ఏప్రిల్ 2: అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా పెట్రోల్ ధరల్లో 43 శాతం, డీజిల్ ధరల్లో 55 శాతం మేర భారీ వృద్ధిని ప్రకటించారు.ఈ వరుస పెంపుదల కారణంగా ఒకానొక దశలో ఇంధన ధరలు దాదాపు మూడు రెట్లు(గరిష్టంగా రూ.445 వరకు) పెరిగి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపాయి.భారత్లో పరిస్థితి ఏంటి?అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం భారతదేశంపై కూడా పడింది. అయితే, పాకిస్థాన్తో పోలిస్తే భారత్లో ఈ ధరల పెరుగుదల చాలా స్వల్పంగా, నియంత్రణలోనే ఉంది. ఇటీవలి కాలంలో నాలుగు విడతల సవరణల ద్వారా ఇంధన ధరలను మొత్తంగా సుమారు రూ.7 మేర పెంచారు. సోమవారం జరిగిన తాజా సవరణలో పెట్రోల్ ధరపై రూ.2.61, డీజిల్ ధరపై రూ.2.71 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులను బట్టి రానున్న రోజుల్లో దేశీయ చమురు కంపెనీలు మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
మిడిల్ ఈస్ట్పై ట్రంప్ బిగ్ ప్లాన్.. పాక్, గల్ప్ దేశాల బ్రేక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇజ్రాయెల్కు అనుకూలంగా అరబ్, ముస్లిం మెజారిటీ దేశాలపై మరో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్కు మేలు చేసే విధంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని పాకిస్తాన్ సహా అరబ్ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒప్పందంలో చేరిన దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాలన్నదే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ ఒప్పందంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అమెరికాకు లాభమేంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ ఈ అబ్రహం ఒప్పందం ఏంటి? పాకిస్తాన్ ఎందుకు టెన్షన్ పడుతోంది అనే విషయాలు తెలుసుకుందాం..అబ్రహాం ఒప్పందం అనేది 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ మరియు కొన్ని అరబ్ దేశాల మధ్య కుదిరిన సాధారణీకరణ ఒప్పందం. దీని ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించి, దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను ప్రారంభించడం. ఈ ఒప్పందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకోలతో సహా పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు అధికారిక సంబంధాలను ప్రారంభించింది. ఇజ్రాయెల్ను దేశంగా గురిస్తూ మధ్యప్రాచ్యంలో ఒక చారిత్రాత్మక నమూనా మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా పాలస్తీనా సమస్య పరిష్కారమయ్యే వరకు చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి. కానీ, అబ్రహం ఒప్పందంతో ఇజ్రాయెల్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఒప్పందంలో చేరిన అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.అబ్రహాం ఒప్పందం లక్ష్యందౌత్య సంబంధాలు: ఇజ్రాయెల్తో అధికారిక రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాలు ఏర్పరచడం.ఆర్థిక సహకారం: వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వ్యూహాలు.ఒప్పందంలోని దేశాలు..యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజికిస్తాన్: ఈ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.సౌదీ అరేబియా, పాకిస్తాన్: ఇంకా గుర్తించలేదు. వీరి ప్రజాభిప్రాయం పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై బలంగా ఉంది.పాలస్తీనా సమస్య: ఇజ్రాయెల్ను గుర్తించడం. పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం. అందుకే కొన్ని దేశాలు వెనుకంజ వేస్తున్నాయి.అబ్రహాం ఒప్పందం ఇజ్రాయెల్కు వ్యూహాత్మకంగా లాభదాయకం. కానీ పాలస్తీనా సమస్య పరిష్కారం లేకపోవడం వల్ల రాజకీయంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. అమెరికాకు ఇది మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచే ముఖ్యమైన వ్యవహారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్.. అరబ్ దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కానీ పాలస్తీనా సమస్యపై ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది.ఇజ్రాయెల్కు లాభాలుఅరబ్ గుర్తింపు: UAE, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలతో అధికారిక సంబంధాలు ఏర్పడటం వల్ల ఇజ్రాయెల్కు అరబ్ ప్రపంచంలో గుర్తింపు పెరిగింది.ఆర్థిక ప్రయోజనాలు: వాణిజ్యం, టెక్నాలజీ, పర్యాటకం రంగాల్లో కొత్త అవకాశాలు. ఉదాహరణకు, UAE–ఇజ్రాయెల్ మధ్య బిలియన్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయి.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలతో రక్షణ సహకారం పెరిగింది.ప్రాంతీయ స్థానం: ఇజ్రాయెల్ CENTCOM (US Central Command)లో చేరడం వల్ల ప్రాంతీయ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర.ఇజ్రాయెల్కు నష్టాలుపాలస్తీనా సమస్య: ఒప్పందంలో పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం వల్ల అరబ్ ప్రజల్లో వ్యతిరేకత.ప్రజాభిప్రాయం: గాజా యుద్ధం తర్వాత అరబ్ దేశాల్లో ప్రజలు ఇజ్రాయెల్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సౌదీ ఆలస్యం: పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా సౌదీ అరేబియా ముందుకు రావడం లేదు.అమెరికాకు లాభాలుప్రభావం పెరుగుదల: మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావం మరింత బలపడింది.భద్రతా నిర్మాణం: US మిత్రదేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది, ఇరాన్ను ఎదుర్కోవడంలో సమన్వయం సాధ్యమైంది.ఆర్థిక అవకాశాలు: అమెరికా కంపెనీలకు గల్ఫ్–ఇజ్రాయెల్ మార్కెట్లలో కొత్త అవకాశాలు.వ్యూహాత్మక విజయం: దశాబ్దాల తర్వాత అరబ్–ఇజ్రాయెల్ సంబంధాలను తెరవడం ద్వారా అమెరికా తన దౌత్య విజయాన్ని ప్రదర్శించింది.పాలస్తీనా సమస్యలో మార్పులుఅరబ్ ఐక్యతలో విరుగుడు: ఇంతకాలం అరబ్ దేశాలు పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై ఒకే విధమైన మద్దతు చూపేవి. కానీ UAE, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్ను గుర్తించడం వల్ల ఆ ఐక్యత బలహీనపడింది.పాలస్తీనా నాయకత్వం నిరాశ: పాలస్తీనా అథారిటీ మరియు హమాస్ ఈ ఒప్పందాలను “వంచన”గా పేర్కొన్నాయి.ప్రజాభిప్రాయం: అరబ్ ప్రజల్లో చాలా మంది పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఇరాన్ అంశంఇరాన్ అబ్రహాం ఒప్పందంలో చేరడం సిద్ధాంతపరంగా అసాధ్యం. ఎందుకంటే, ఇజ్రాయెల్ను గుర్తించడం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకం. కానీ, ఒప్పందం వల్ల ఇరాన్పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో కలిసి పనిచేయడం వల్ల ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి మరింతగా ప్రాక్సీ యుద్ధాలు మరియు హోర్ముజ్ జలసంధి నియంత్రణపై ఆధారపడుతోంది.పాకిస్తాన్ ఇలా..పాకిస్తాన్ ఇప్పటివరకు అబ్రహాం ఒప్పందంలో చేరలేదు. ఎందుకంటే దేశీయ ప్రజాభిప్రాయం, పాలస్తీనా సమస్యపై కఠినమైన వైఖరి ఉంది. అలాగే ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించలేదు. పాలస్తీనా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించవచ్చు అని గతంలోనే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. పాకిస్తాన్ ప్రజలు పాలస్తీనా రాష్ట్రానికి బలమైన మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడమంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపే అవకాశం ఉంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ను అబ్రహాం ఒప్పందంలో చేరమని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షరీఫ్కు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ, ప్రజాభిప్రాయాన్ని సమతుల్యం చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తే.. ఇటు ఇరాన్తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో, ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. -
బలూచిస్తాన్లో మళ్లీ రక్తపాతం
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో మళ్లీ రక్తపాతం చోటుచేసుకుంది. షటిల్ రైలులో శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం 24 మంది మరణించారు. దాదాపు 70 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి బయలుదేరి సిటీ రైల్వే స్టేషన్కు వెళ్తున్న ఈ రైలును చమన్ ఫాటక్ సమీపంలో ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. కంటోన్మెంట్ ప్రాంతం నుంచి మిలటరీ జవాన్లను రైలులో తరలిస్తుండగా తాము దాడికి దిగామని బీఎల్ఏ ప్రతినిధి తెలిపారు. అయితే, ఇప్పటిదాకా 14 మంది మరణించారని, వీరిలో ముగ్గురు సైనికులు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా, కనీసం 24 మంది మృతిచెందారని స్థానిక పోలీసులు స్పష్టంచేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. షటిల్ రైలులో సాధారణ ప్రయాణికులే ఎక్కువ మంది ఉన్నారని, పేలుడు ప్రభావంతో ఇంజన్, మూడు కోచ్లు దెబ్బతిన్నాయని పాకిస్తాన్ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ ప్రకటించారు. పేలుడు శబ్దాలు చాలా దూరం వినిపించాయి. సమీపంలోని వాహనాల అద్దాలు, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయంటే పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈద్ పండుగ కోసం పెద్ద సంఖ్యలో జనం స్వస్థలాలకు వెళ్తుండగా పేలుడు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బీఎల్ఏ ముష్కరుల దుశ్చర్యను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికిపంద ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్ ప్రజల సంకల్పాన్ని బలహీనపర్చలేవని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించివేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు షటిల్ రైలులో పేలుడుతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. పెషావర్కు చేరాల్సిన జాఫర్ ఎక్స్ప్రెస్ను ముందుజాగ్రత్త చర్యగా క్వెట్టా రైల్వేస్టేషన్లోనే నిలిపివేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లో 2024 నవంబర్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 32 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ని చూస్తుంటే జాలేస్తోంది : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
సాక్షి,ఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల జరిగిన సభలో మాట్లాడుతూ..‘కాక్రోచ్ జనతా పార్టీ’కి పాకిస్థాన్, బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్వర్క్ల నుంచి మద్దతు లభిస్తోంది అని వ్యాఖ్యానించారు.అయితే, ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీకి పాకిస్థాన్తో ఎలాంటి సంబంధం లేదు. రిజిజు చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారం. మా పార్టీ ఉద్దేశ్యం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడమే” అని స్పష్టం చేశారు. అభిజీత్ దిప్కే తమ పార్టీకి భారత్లోనే 94 శాతం మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారని గుర్తు చేశారు.దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పాకిస్థాన్, జార్జ్ సోరోస్ నెట్వర్క్ల నుండి ఫాలోవర్స్ సంపాదించుకునే వారిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మన దేశంలో తగినంత జనాభా, అత్యంత చురుకైన యువత ఉన్నారు. వారు నిజమైన, విలువైన ఫాలోవర్స్. భారత్ వ్యతిరేక నెట్వర్క్ల నుంచి గుర్తింపు కోరాల్సిన అవసరం లేదు” అని అన్నారు.I pity those who seek their followers in social media from Pakistan & George Soros gang.— Kiren Rijiju (@KirenRijiju) May 23, 2026 -
ఇరాన్ను ఒప్పించడానికి పాక్ యత్నాలు ముమ్మరం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించడమే లక్ష్యంగా పాకిస్తాన్ తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకున్నారు. అమెరికాతో శాంతి ఒప్పందం దిశగా ఇరాన్ను ఒప్పించడానికి ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఆయన కొనగిస్తున్నారని తెలిపాయి. టెహ్రాన్ ఎయిర్పోర్టులో అసిమ్ మునిర్కు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మొమెనీ స్వాగతం పలికారు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ బుధవారమే ఇరాన్కు చేరుకున్నారు. అసిమ్ మునిర్ ఇరాన్ ముఖ్య నాయకులతో భేటీ కాబోతున్నారు. అబ్బాస్ అరాగ్చీతో నఖ్వీ భేటీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ శుక్రవారం సమావేశమయ్యారు. వారిద్దరూ భేటీ కావడం గత 24 గంటల వ్యవధిలో ఇది రెండోసారి. అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చేసిన ప్రతిపాదనలను వారు సమీక్షించారు. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య విభేదాలను తొలగిండమే ధ్యేయంగా నఖ్వీ ఇరాన్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా కీలక నేతలతో సమావేశమయ్యారు. -
పాక్లో ‘బొద్దింకల’ తుఫాన్
ఇస్లామాబాద్: భారత్లో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్లోకి ప్రవేశించింది. అక్కడి యువత కూడా కొత్త కొత్త పేర్లతో అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.పాకిస్థాన్లో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తాహిదా కాక్రోచ్ మూవ్మెంట్ వంటి పేర్లతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు వెలుగులోకి వచ్చాయి. ‘సిస్టమ్ మనల్ని కాక్రోచ్లుగా భావించింది. మేమే ప్రజల స్వరం అని అకౌంట్ల బయోలో పేర్కొనడం గమనార్హం.లోగోలు,బ్రాండింగ్పాకిస్థాన్లోని ఈ అకౌంట్ లోగోలు భారతీయ వెర్షన్లను పోలి ఉన్నప్పటికీ అవి పచ్చ,తెలుపు రంగు ఉపయోగిస్తున్నాయి. ఇది స్థానిక రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమను చూపించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ,పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.యువతలో ప్రభావంఈ ఉద్యమం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మారింది. నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి, యువతలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఇది ఒక కొత్త మార్గంగా నిలుస్తోంది. భారత్లో ప్రారంభమైన ఈ వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు పాకిస్థాన్ యువత కూడా ఆకర్షితులవుతున్నారు. -
సీసీటీవీతో పాక్కు కీలక సమాచారం.. గుట్టురట్టు
చండీగఢ్: పంజాబ్ పోలీసులు పాకిస్థాన్ కుతంత్రాన్ని తిప్పికొట్టారు. పఠాన్కోటలో భారత సైన్యం, పారామిలటరీ దళాల సమాచారాన్ని సీసీటీవీ నిఘాచిత్రాల ద్వారా లాహార్కు చేరవేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు.పంజాబ్లోని చక్ ధరివాల్ గ్రామానికి చెందిన బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు అనే వ్యక్తి భారత సైన్యం, పారామిలిటరీ దళాల కదలికలపై నిఘా పెట్టేందుకు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారి-44లోని పఠాన్కోట్-జమ్మూ మార్గంలో ఒక వంతెన సమీపంలోని దుకాణంలో రహస్యంగా సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. దానిలోని నిఘా సమాచారాన్ని పాకిస్థాన్, విదేశాల్లోని ఆపరేటివ్లకు ఎలక్ట్రానిక్గా పంపినట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిందితుడు దీనిని ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఇందుకు గానూ దుబాయ్లోని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి రూ. 40 వేల అందుకున్నాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి ఒక సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో అతనితో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశామని వారందరూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణ తేలిందన్నారు. ఈ నెట్వర్క్ సరిహద్దు సంబంధాలను గుర్తించడానికి గూఢచర్యాన్ని గుర్తించడానికి విచారణ వేగవంతం చేశామని పోలీసులు పేర్కొన్నారు.కాగా గత నెలలో పాకిస్థాన్ మద్దతు ఉన్న రెండు గూఢచార ముఠాలను పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలు, చైనాలో తయారైన అత్యాధునిక సౌరశక్తితో పనిచేసే సీసీటీవీ కెమెరాలను ఉపయోగించి, కీలకమైన సైనిక స్థావరాల లైవ్ విజువల్స్ను పాకిస్తాన్లోని తమ హ్యాండ్లర్లకు ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. దేశ భద్రతకు ఎంతో కీలకమైన సమాచారం పాక్కు చేరడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. -
పాక్ ప్రధాని చైనా పర్యటన.. మతలబు ఏంటి?
బీజింగ్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆయన బీజింగ్లో అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధానమంత్రి లి క్వియాంగ్తో భేటీ అవుతారు. చైనా విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా వెళ్లిన కొద్ది రోజులకే పాక్ ప్రధాని అక్కడి వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, లి క్వియాంగ్ ఆహ్వానం మేరకు షెహబాజ్ ఈ పర్యటన చేపడుతున్నారని తెలిపింది. ఉమ్మడి ప్రయోజనాలు, ప్రాంతీయ శాంతి సుస్థిరతల సాధన, అభివృద్ధికోసం రెండు దేశాలు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై సన్నిహితంగా, సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. అలాగే, 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాల సందర్భంగా ఆర్థిక, రాజకీయ, భద్రతా అంశాలపై చర్చలు జరుపనున్నారు.పర్యటన ప్రాముఖ్యతఆర్థిక సహకారం: చైనా పెట్టుబడులు పాకిస్తాన్లో విద్యుత్ లోటు తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.రాజకీయ సంకేతం: బహుళ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి బృందం కూడా పాల్గొనడం, పాకిస్తాన్లో విస్తృత రాజకీయ మద్దతు ఉందని సూచిస్తుంది.ప్రాంతీయ భద్రత: రెండు దేశాలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం సమన్వయం కొనసాగిస్తున్నాయి.CPEC ప్రాజెక్టుల ప్రభావం: China–Pakistan Economic Corridor (CPEC) పాకిస్తాన్లో ఆర్థిక, మౌలిక సదుపాయ, సామాజిక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఇది చైనా నిర్మిస్తున్న Belt and Road Initiative (BRI)లో అత్యంత కీలక భాగం.మౌలిక సదుపాయాల అభివృద్ధి: రహదారులు, రైల్వేలు, పోర్టులు (గ్వాదర్ పోర్ట్) నిర్మాణం ద్వారా పాకిస్తాన్లో రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. -
పాక్ అనాగరిక చర్యలను కడిగేసిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) వేదికగా భారత్ పొరుగుదేశమైన పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పౌరుల సామూహిక హత్యలు, సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ చరిత్ర మొత్తం రక్తసిక్తమయమేనని భారత్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన అనాగరిక దాడులను ప్రపంచం ముందు పెట్టారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు.కాబూల్ ఆస్పత్రిపై పాశవిక దాడిసరిహద్దుల్లో పాకిస్తాన్ సృష్టిస్తున్న సాయుధ హింస కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో 750 మంది పౌరులు మరణించడం లేదా గాయపడటం జరిగిందని పలు నివేదికలను ఉదహరిస్తూ హరీష్ పర్వతనేని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో పవిత్ర రంజాన్ మాసంలో, ప్రజలంతా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న సమయంలో కాబూల్లోని ‘ఓమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్’ పై పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ అత్యంత క్రూరమైన, అనాగరిక దాడిలో 269 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. సైనిక లక్ష్యం కాని ఒక వైద్యశాలపై దాడి చేయడాన్ని ఏ రకంగానూ సమర్థించుకోలేమని భారత్ తేల్చిచెప్పింది.అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనఆఫ్ఘన్ పౌరులను రక్షించాలన్న అంతర్జాతీయ పిలుపులను, మానవతా నిబంధనలను పాకిస్తాన్ పూర్తిగా కాలరాసిందని భారత్ ఆరోపించింది. చీకటి పడ్డాక అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడటం పాక్ కపటత్వానికి నిదర్శనమని పర్వతనేని మండిపడ్డారు. పౌరుల రక్షణకు సంబంధించిన 'నాన్-రిఫౌల్మెంట్' సూత్రాన్ని పాటించాలని ‘సమితి’ సెక్రటరీ జనరల్ చేసిన విజ్ఞప్తిని కూడా పాకిస్తాన్ బేఖాతరు చేసిందని ఆయన విమర్శించారు. పౌర నష్టాలకు కారణమైన 95 సంఘటనలలో 94 ఘటనలకు పాక్ భద్రతా దళాలే బాధ్యులని సమితి సహాయక మిషన్ నిర్ధారించిందని గుర్తుచేశారు.సొంత ప్రజలనే బాంబులతో చంపే దేశంపాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, సరిహద్దు వెంబడి అది సాగిస్తున్న హింస కారణంగా 94,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను అంతర్జాతీయ సమాజం తప్పకుండా జవాబుదారీ చేయాలని డిమాండ్ చేసింది.ఇది కూడా చదవండి: భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా -
పాక్ మాజీ క్రికెటర్కు బంపరాఫర్.. ఐపీఎల్కు అర్హత!
ముంబై ఉగ్రదాడులు (2008) తర్వాత భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు నిలిచిపోయాయి. ఐసీసీ, ఆసియాకప్ వంటి మేజర్ టోర్నీల్లో మాత్రమే ఇరుజట్లు ముఖాముఖి తలపడుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి లేదు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన పాక్ మాజీలకు కూడా అవకాశం లేదు.అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్కు మాత్రం ఐపీఎల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశముంది. ఇటీవలే మహ్మద్ ఆమిర్ బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందడంతో అధికారికంగా బ్రిటన్ జాతీయతను కలిగి ఉన్నాడు. దీనివల్ల ఆమిర్ పాకిస్తాన్లో జన్మించి నప్పటికీ తాజాగా బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందడంతో ఐపీఎల్లో ఆడేందుకు అర్హత సాధించాడు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత బీసీసీఐతో పాటు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పాస్పోర్టులు కలిగిన క్రికెటర్లను ఐపీఎల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. అయితే బ్రిటీష్ పాస్పోర్టు అందుకున్న తర్వాత బ్రిటన్కు చెందిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఆమిర్ పాల్గొన్నాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ఆటగాళ్లు వేలంలో పాల్గొనాలనుకుంటే తమ పాస్పోర్టు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. బౌగోళిక ఆంక్షల నేపథ్యంలో కేవలం పాకిస్తాన్లో జన్మించిన ఆటగాళ్లను మాత్రమే తీసుకోకూడదనే నిబంధన ఐపీఎల్లో ఉంది. మహ్మద్ పాకిస్తాన్ దేశానికి చెందిన వాడైనప్పటికీ తన వద్ద యూకే పాస్పోర్ట్ ఉన్నందున, బ్రిటీష్ పౌరుడిగా వేలంలో పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఆమిర్కు అవకాశమెంత?అయితే గతంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అజర్ మహ్మూద్ బ్రిటన్ మహిళను పెళ్లి చేసుకొని ఆ దేశ పౌరసత్వాన్ని పొందాడు. ఆ తర్వాత యూకే పౌరసత్వంతో ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకోవడమే గాక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే టీ20 క్రికెట్లో స్టార్ క్రికెటర్గా గుర్తింపు పొందిన మహ్మద్ ఆమిర్ ఐపీఎల్ 2027 సీజన్లో ఆడుతాడా లేదా అన్నది ప్రశ్నగానే ఉంది. ఇటీవలే ది హండ్రెడ్, ఎస్ఏ20 టోర్నీల్లో పాక్లో జన్మించిన ఆటగాళ్లను చేర్చడంపై వివాదం చెలరేగింది. దీంతో మహ్మద్ ఆమిర్ ఐపీఎల్లో ఆడుతాడా అన్నది అనుమానమే. అయితే ఆమిర్కు ఇంగ్లండ్ దేశం హోదా కింద ఐపీఎల్ ఆటగాళ్ల వేలం పూల్లో తన పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. అతడు డ్రాఫ్ట్ చేయడానికి అర్హుడైనప్పటికీ, వేలంలో ఫ్రాంచైజీలు అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఐపీఎల్లో ఆడేందుకు అధికారికంగా ఆమిర్కు అర్హత ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం సున్నితత్వ అంశానికే ప్రాధాన్యం ఇస్తే మాత్రం అతడు వేలంలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లపై కఠిన ఆంక్షలను జారీ చేసింది. ఈ లెక్కన మహ్మద్ ఆమిర్ ఐపీఎల్ ఎంట్రీ జరగడం అనుమానమే.స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంస్వతహగా ఫాస్ట్ బౌలర్ అయిన మహ్మద్ ఆమిర్ తన స్వింగ్తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే 2010లో ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మహ్మద్ ఆమిర్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది. చాలాకాలం పాటు అతడిపై నిషేధం కొనసాగింది. 2015లో ఐసీసీ అతడిపై నిషేధం తొలగించిన తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక 2009లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమిర్ పాక్ తరఫున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అంతర్జాతీయ క్రికెట్కు ఆమిర్ వీడ్కోలు పలికాడు.అయితే గతేడాది పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గతేడాది టీ20 ప్రపంచకప్కు ముందు బంగ్లాదేశ్ భారత్లో ఆడేందుకు నిరాకరించిన సమయంలో పాకిస్తాన్ హైడ్రామా చేసిన సంగతి కూడా ఎవరు మరిచిపోలేరు. చదవండి: 'కశ్మీరీ అని చులకన.. అందుకే ఎంపిక చేయలేదా?' -
పాక్, ఇమ్రాన్ ఆరోపణలు.. అమెరికా రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఆరోపణలపై ఎట్టకేలకు అమెరికా విదేశాంగశాఖ స్పందించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను పదవి నుంచి తొలగించిన విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. పాక్ రాజకీయాలు అక్కడి ప్రజలకు సంబంధించినవే అంటూ ట్విస్ట్ ఇచ్చింది.కాగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను పదవి నుంచి తొలగించడం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోపణలపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పందిస్తూ..‘పాకిస్తాన్ రాజకీయాలతో అమెరికాకు సంబంధం లేదు. పాకిస్తాన్, అమెరికా కేవలం మిత్ర దేశాలు మాత్రమే. ఇమ్రాన్ను పదవి నుంచి తొలగించిన విషయంలో మాకు ఎలాంటి ప్రమేయం లేదు. పాక్ రాజకీయాలు ఆ దేశ ప్రజలకు మాత్రమే సంబంధించినవి’ అని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. 2022, ఏప్రిల్లో ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు అమెరికాలోని పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్తో అమెరికా హోంశాఖలోని దక్షిణ- మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ సమావేశమయ్యారు. అందులో వారు ఇమ్రాన్ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టాలని.. అప్పుడే ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మాట్లాడుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్ తటస్థ వైఖరిని అవలంభించడం వల్లే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని యూఎస్ నిర్ణయించినట్లు పాక్లో లీకైన దౌత్య సమాచారం వెల్లడించింది.డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. యాదృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థ వైఖరి ప్రదర్శించారు. అనంతరం 2022 మార్చి 7న, వాషింగ్టన్లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.ఇమ్రాన్ తొలగింపు అనంతర పరిణామాలుఏప్రిల్ 2022, ఇమ్రాన్ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం కొద్ది నెలలకు నవంబర్లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అమెరికా-పాక్ సంబంధాలుఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి. పాక్లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. -
సరిహద్దుల్లో డ్రోన్ కలకలం: పాక్ జారవిడిచిన హెరాయిన్ స్వాధీనం
బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోసారి తన కుయుక్తులను ప్రదర్శించింది. జమ్ము కశ్మీర్లోని బిష్ణ పరిధిలో గల బహదూర్పూర్ పంచాయతీలో డ్రోన్ సాయంతో హెరాయిన్ తరలించేందుకు జరిగిన సరిహద్దు అక్రమ రవాణా యత్నం తాజాగా వెలుగుచూసింది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన ఒక అనుమానాస్పద డ్రోన్, భారత భూభాగంలోకి హెరాయిన్ ప్యాకెట్లను జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు.స్థానికుల అప్రమత్తత.. పోలీసుల రంగప్రవేశంబహదూర్పూర్ పంచాయతీ పరిధిలోని స్థానికులు అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న కొన్ని ప్యాకెట్లను గమనించారు. ఆ ప్రాంతంలో డ్రోన్ సంచరించినట్లు అనుమానం రావడంతో, వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు చూపిన చొరవతో భారీ అక్రమ రవాణా నెట్వర్క్ గుట్టు రట్టయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, అక్కడ లభ్యమైన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాయి. ప్రాథమిక తనిఖీల్లో ఆ ప్యాకెట్లలో ఉన్నది నిషేధిత మత్తుపదార్థం ‘హెరాయిన్’ అని తేలింది.దర్యాప్తు ముమ్మరంఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఈ డ్రోన్ పాకిస్థాన్ లోని ఏ ప్రాంతం నుండి వచ్చింది? ఏ సమయంలో సరిహద్దు దాటింది? అనే విషయాలపై సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. సరిహద్దు అవతల నుంచి డ్రోన్ ద్వారా డ్రాప్ చేసిన ఈ మత్తుపదార్థాలను ఇక్కడ అందుకోవడానికి స్థానికంగా ఎవరైనా సహకరించారా? ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారులు ఎవరు? అనే కోణంలో నిఘా విభాగం వివరాలు సేకరిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, స్వాధీనం చేసుకున్న హెరాయిన్ బరువు, దాని అంతర్జాతీయ మార్కెట్ విలువ వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇది కూడా చదవండి: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ vs ‘నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్’? -
పాక్కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్
పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. తొలిసారి ఈ జట్టు బంగ్లాదేశ్ చేతిలో వైట్వాష్కు గురైంది. సిల్హెట్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 78 పరుగుల తేడాతో ఓడటంతో 0-2తో క్లీన్ స్వీప్ అయ్యింది. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆ జట్టు భారత్ను సైతం కిందకు (ఆరో స్థానానికి) నెట్టింది. ఆసీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక టాప్-4 జట్లుగా కొనసాగుతున్నాయి. ఈ ఓటమితో పాక్ మరింత పతనమై ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ గెలుపు బంగ్లాదేశ్కు పాక్పై వరుసగా నాలుగవది. అంతకుముందు రెండు టెస్ట్లకు బంగ్లాదేశ్ పాక్ గడ్డపైనే గెలిచింది. ఈ ఏడాది మార్చిలో బంగ్లా జట్టు పాక్ను వన్డే సిరీస్లోనూ ఓడించింది. రిజ్వాన్ పోరాటం వృధా437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ (94) పాక్ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్ పతనాన్ని శాశించాడు.ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (126) సెంచరీతో కదంతొక్కాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ (17-1-81-4), మొహమ్మద్ అబ్బాస్ (16-3-45-3) రాణించారు. అనంతరం పాక్ కూడా తొలి ఇన్నింగ్స్లో తడబడింది. బాబర్ ఆజం (68) ఒక్కడే రాణించడంతో అతి కష్టంమీద 232 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తైజుల్, నహిద్ రాణా తలో 3, తస్కిన్, మెహిది హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లతో పాక్ ఆట కట్టించారు.కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఈ ఇన్నింగ్స్లోనూ తొలుత తడబడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ముష్ఫిఫర్ రహీం (137) సూపర్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 390 పరుగుల భారీ స్కోర్ చేసి పాక్కు 437 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. ఛేదనలో రిజ్వాన్ సహా షాన్ మసూద్ (71), సల్మాన్ అఘా (71) అర్ద సెంచరీతో రాణించినా పాక్ను గట్టెక్కించలేకపోయారు. -
ఉగ్రవాదులతో పాక్ ప్రభుత్వం భేటీ.. బయటపడ్డ సంచలన వీడియో
-
పాకిస్తాన్ను చిత్తు చేసే దిశగా బంగ్లాదేశ్ అడుగులు
సిల్హెట్: బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో... పాకిస్తాన్పై టెస్టు సిరీస్ క్లీన్స్వీప్ చేసేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో పరాజయం పాలైన పాకిస్తాన్... రెండో మ్యాచ్లో కాస్త పోరాడినా ప్రస్తుతం పరాజయం అంచునే ఉంది. 437 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్... మంగళవారం ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. సిరీస్ సమం చేయాలంటే... బుధవారం చివరి రోజు చేతిలో మూడు వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఇంకా 121 పరుగులు చేయాల్సి ఉంది. సల్మాన్ ఆఘా (102 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (134 బంతుల్లో 75 బ్యాటింగ్; 8 ఫోర్లు), కెపె్టన్ షాన్ మసూద్ (116 బంతుల్లో 71; 8 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు. ఓపెనర్లు అజాన్ అవైస్ (21), అబ్దుల్లా ఫజల్ (6) ఎక్కువసేపు నిలవలేకపోడంతో ఛేదనలో పాకిస్తాన్కు శుభారంభం దక్కలేదు. 41/2తో కష్టాల్లో పడ్డ జట్టును బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షాన్ మసూద్ కాపాడే ప్రయత్నం చేశాడు. మూడో వికెట్కు 92 పరుగులు జోడించిన అనంతరం బాబర్ అవుట్ కాగా... ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. సౌద్ షకీల్ (6) విఫలమయ్యాడు. దీంతో ఒకదశలో 133/2తో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్ కాసేపటికి 162/5తో కష్టాల్లో పడింది. ఇక పాక్ పని అయిపోయినట్లే అనుకుంటున్న దశలో సల్మాన్, రిజ్వాన్ చక్కటి పోరాటం కనబర్చారు. బంగ్లా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఈ జంట ఆరో వికెట్కు 134 పరుగులు జోడించింది. దీంతో కోలుకున్న పాకిస్తాన్ 296/5తో మ్యాచ్ను ముగించే స్థితికి చేరింది. అయితే పట్టు వదలకుండా ప్రయత్నించిన బంగ్లా బౌలర్ తైజుల్ ఇస్లాం చివర్లో సల్మాన్తో పాటు హసన్ అలీ (0)ని తన వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... రిజ్వాన్తో పాటు సాజిద్ ఖాన్ (8 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో ఎడమ చేతివాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4, నహీద్ రాణా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులు చేయగా... పాకిస్తాన్ 232 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులు చేసిన బంగ్లాదేశ్... పాక్ ముందు రికార్డు లక్ష్యాన్ని నిలిపింది. -
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొంగొత్త ఆవిష్కరణలు, రోజుకో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది యువత. అలాంటి ఈ కాలంలో వెట్టిచాకిరి వ్యవస్థ, బానిసలు అనేవి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా?. పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో చదివిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడటమే కాదు, ఆ దురాగతలకే బలి అవుత్ను వాళ్లు ఇంకా మన మధ్యే ఉన్నారు. అలాంటి భావోద్వేగ ఘటనే పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఓ కుటుంబం అప్పులో ఊబిలో చిక్కుకుని, తరతరాలు వెచ్చిచాకిరిలో మగ్గిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఆధునిక బానిసలు. బాధలనే చీకట్లో మగ్గిపోతున్న వాళ్ల బతుకుల్లోకి ఓ విదేశీయుడి కారణంగా వెలుగు సంతరించుకుంది. అసలేం జరిగిందంటే..పాకిస్తాన్లోని పంజాబ్లోని కసూర్ ప్రాంతంలో ఇటుక బట్టీలలో దాదాపు 130 ఏళ్లుగా వెట్టిచాకిరిలో చిక్కుకుంది ఓ కుటుంబం. ఆ ఫ్యామిలీని విడిపించేందుకు ఓ మానవతావాది ముందుకొచ్చారు. నివేదికల ప్రకారం..తరతరాల క్రితం వారి పూర్వీకులు తీసుకున్న 'పేష్కి' అనే అప్పు భారంతో పనిచేస్తూ ఉండేది. ఆ అప్పు ఎన్నడూ తీరకపోవడంతో తర్వాత తరాలు వేతనాలు లేకుండా పనిచేస్తూ జీవితాంత బానిసలుగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు విముక్తి కలిగించే రక్షణ చర్యను ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు చేపట్టారు. 'జూబ్లీ క్యాంపెయిన్' అనే మానవహక్కుల సంస్థ సభ్యుడైన ఆరోన్ వారి జీవితాలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ 'జూబ్లీ క్యాంపెయిన్' సంస్థ పలు దేశాలలో బానిసత్వం, మతపరమైన హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక మానవ హక్కుల సంఘం. హచింగ్స్ ఆ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలుసుకుని ఎలా భావోద్వేగంగా స్పందించారో రికార్డు చేసి మరీ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు ఆ వీడియోకి ఐదో రోజు గుడ్న్యూస్ తెలుసుకున్న ఆ కుటుంబం..కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అనే క్యాప్షన్ జోడించి మరి పోస్టు చేశారు. కాగా, ఈ జూబ్లీ క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా జాతి, మత మైనారిటీల కోసం మానవ హక్కులు, మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలలో బలవంతపు చాకిరీ, వెట్టిచాకిరి,మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై పనిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఆ విదేశీయుడు హచింగ్స్ని ప్రశంసించగా, ఇంకా ఇలాంటివి కొనసాగుతున్నాయా అని విస్తుపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aaron Hutchings (@aaronhutchings77) (చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!) -
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీకి తోడుగా పాక్ సైన్యం భారీ మోహరింపు
ఇస్లామాబాద్:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఏ క్షణమైనా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనిక బలగాలను పంపింది. సైనికులతో పాటు ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే, ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇరాన్తో సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం, ఇరాన్ దాడులు చేస్తే తిప్పికొట్టేలా సైన్యం, యుద్ధ విమానాలను సౌదీకి పంపినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రత్యర్థి దేశాల దాడుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిబంధనలు ఉన్నాయి. పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు రావాల్సి ఉంటుందని ప్రకటించారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు కవచం కింద ఉంచుతుందని సూచించారు.సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఏప్రిల్ ప్రారంభంలో 16 జేఎఫ్-17 యుద్ధ విమానాలు, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లు, హెచ్క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సౌదీకి పంపింది. ఈ మోహరింపులో 8,000 సైనికులు ఉన్నారు. అవసరమైతే మరిన్ని సైనికులను పంపుతామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.ఘర్షణ సమయంలో పంపిన సైనికులు, వైమానిక దళ సిబ్బంది ప్రధానంగా సలహా, శిక్షణ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 80,000 పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపే అవకాశం ఉంది. అదనంగా యుద్ధ నౌకలు పంపే అంశం కూడా ఒప్పందంలో ఉంది.ఈ మోహరింపు ప్రతీకాత్మకంగా కాకుండా, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వేలాది సైనికులతో కూడిన పెద్ద స్థాయి చర్య అని వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సౌదీ ఇరాన్పై గోప్య దాడులు జరిపింది. పాకిస్థాన్ గతంలో కూడా సౌదీకి సైనిక శిక్షణ, సలహా అందించింది. మరోవైపు, సౌదీ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందించింది. -
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్కు రహస్యంగా..
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్ భయపడుతుంది. భారత్లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్. ఇక ఇజ్రాయెల్ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్ ప్రయత్నాలు జరిపింది.చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.పాక్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.ఇమ్రాన్ ఖాన్ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్కు చైనా విక్రయించింది.ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది. -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2020 దశకంలో అంతర్జాతీయ క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు.ఈ దశకంలో (2020 నుంచి) బాబర్ ఇప్పటివరకు 212 మ్యాచ్లు ఆడి 231 ఇన్నింగ్స్ల్లో 9060 పరుగులు చేశాడు. అతని సగటు 42.53 కాగా, 17 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ ఉన్నాడు. రూట్ 120 మ్యాచ్ల్లో 8305 పరుగులు చేశాడు. రూట్ వన్డేలు, టీ20లు తక్కువగా ఆడటం వల్ల బాబర్ కంటే వెనుకబడ్డాడు.ఈ దశకంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ వికెట్కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 7779 పరుగులు చేశాడు. శ్రీలంక ఆటగాళ్లు కుసాల్ మెండిస్, పథుమ్ నిస్సంక వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.భారత్ తరఫున తొలి ఐదుగురిలో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లి 6771 పరుగులతో ఆరో స్థానంలో ఉండగా, శుభ్మన్ గిల్ 6649 పరుగులతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 6391 పరుగులతో టాప్-10లో (పదో స్థానం) చోటు దక్కించుకున్నాడు.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో పాక్ తడబడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయిన ఆ జట్టు మరో ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్లో నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి 156 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ తొలి ఇన్నింగ్స్లో 232 పరుగులకే కుప్పకూలింది. -
బాబర్ ఆజం పోరాటం వృధా.. స్వల్ప స్కోర్కే కుప్పకూలిన పాక్
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పాక్ వెనుకపడింది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ మరింత తీసికట్టుగా 232 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బంగ్లాకు 46 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 8 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. తంజిద్ హసన్ (4) ఔట్ కాగా.. మహ్మదుల్ హసన్ జాయ్ (26), మొమినుల్ హక్ (2) క్రీజ్లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లాదేశ్ 89 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం రెండో రోజు ఆట మూడో సెషన్ కొనసాగుతుంది.బాబర్ పోరాటం వృధాబంగ్లాదేశ్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేసిన ఆనందం పాక్కు ఎంతో సేపు నిలబడలేదు. ఆ జట్టు బంగ్లా కంటే తక్కువ స్కోర్కే ఆలౌటై ఉసూరుమనిపించింది. బాబర్ ఆజం అద్భుతైన అర్ద సెంచరీతో (68) పోరాడినా పాక్ను గట్టెక్కించలేకపోయాడు. ఆఖర్లో సాజిద్ ఖాన్ (38) బ్యాట్ ఝులిపించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్లో అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 9, కెప్టెన్ షాన్ మసూద్ 21, సౌద్ షకీల్ 8, సల్మాన్ అఘా 21, మొహమ్మద్ రిజ్వాన్ 13, హసన్ అలీ 18, ఖుర్రమ్ షెహజాద్ 10 పరుగులకు ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలో 3 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.దాస్ శతకంతొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లిట్టన్ దాస్ (126) వీరోచిత శకతం సాధించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. పాక్ బౌలర్లు అబ్బాస్ (3 వికెట్లు), ఖుర్రమ్ షెహజాద్ (4), హసన్ అలీ (2), సాజిద్ ఖాన్ (1) సత్తా చాటారు. వాస్తవానికి బంగ్లాదేశ్ ఈపాటి స్కోర్ చేయడం కూడా చాలా గొప్పే. దాస్కు మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ ఊహించని విధంగా 104 పరుగుల తేడాతో పాక్కు షాకిచ్చింది. -
పాక్ లో ధురంధర్ ఫీవర్.. సినిమా విడుదలైన కొద్ది నిమషాల్లోనే సర్వర్ క్రాష్
-
దిగ్గజాల సరసన చేరిన పాక్ వెటరన్ పేసర్
పాక్ వెటరన్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ తన దేశ దిగ్గజ పేసర్లైన వసీం అక్రమ్, వకార్ యూనిస్ సరసన చేరాడు. బంగ్లాదేశ్తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్లో 3 వికెట్లు తీసిన అతడు.. విదేశీ గడ్డపై 100 టెస్ట్ వికెట్లు పూర్తి చేసుకున్న ఆరో పాకిస్తాన్ పేసర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్ (260) టాప్ ప్లేస్లో ఉండగా.. వకార్ యూనిస్ (211), ఇమ్రాన్ ఖాన్ (199), మొహమ్మద్ ఆమిర్ (119), ఉమర్ గుల్ (111) మొహమ్మద్ అబ్బాస్ కంటే ముందున్నారు.2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అబ్బాస్ ఇప్పటివరకు కేవలం 28 టెస్టులే ఆడినా, 51 ఇన్నింగ్స్ల్లో 109 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 22.84గా ఉండటం విశేషం. అందులో 100 వికెట్లు విదేశీ పిచ్లపైనే రావడం అతని విదేశీ ప్రదర్శన ఎంత ప్రభావవంతంగా ఉందో చూపిస్తోంది.మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సిల్హెట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో పాక్ బౌలర్లు చెలరేగారు. అబ్బాస్తో (3 వికెట్లు) పాటు ఖుర్రమ్ షెహజాద్ (4), హసన్ అలీ (2), సాజిద్ ఖాన్ (1) సత్తా చాటారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకే ఆలౌటైంది. వాస్తవానికి బంగ్లాదేశ్ ఈపాటి స్కోర్ చేయడం కూడా చాలా గొప్పే. మిడిలార్డర్ బ్యాటర్ లిట్టన్ దాస్ (126) వీరోచిత శతకంతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అతనికి మిగతా ఆటగాళ్ల నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా ఒంటరిపోరాటం చేశాడు.తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు పాక్ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ పాక్పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
పాక్తో రెండో టెస్ట్.. లిట్టన్ దాస్ వీరోచిత శతకం
సిల్హెట్ వేదికగా పాకిస్తాన్తో ఇవాళ (మే 16) మొదలైన రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ జట్టు తడబడి నిలబడింది. లిట్టన్ దాస్ వీరోచితమైన పోరాటం చేయడంతో తొలి ఇన్నింగ్స్లో గౌరవప్రదమైన స్కోర్ (278 పరుగులు) చేయగలిగింది. పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలగా.. దాస్ ఒంటరిపోరాటం చేసి సూపర్ శతకంతో మెరిశాడు. ఓ పక్క సహచరులు పెవిలియన్కు క్యూ కడుతున్నా, దాస్ బాధ్యతాయుతంగా ఆడి జట్టు పతనాన్ని అడ్డుకున్నాడు. దాస్ 159 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 126 పరుగులు చేసి 9వ వికెట్గా వెనుదిరిగాడు. దాస్ మినహా బంగ్లా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తంజిద్ హసన్ (26), మొమినుల్ హక్ (22), కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (23), తైజుల్ ఇస్లాం (16), ఫోరిఫుల్ ఇస్లాం (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లలో మెహిద్ హసన్ మిరాజ్ 4, తస్కిన్ అహ్మద్ 7 పరుగులు చేయగా.. మహ్మదుల్ హసన్ జాయ్, నహిద్ రాణా డకౌట్లయ్యారు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 4, మొహమ్మద్ అబ్బాస్ 2, హసన్ అలీ 2, సాజిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అజాన్ అవైస్ 13, అబ్దుల్లా ఫజల్ 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోర్కు పాక్ ఇంకా 257 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ పాక్పై 104 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. -
త్వరలో భారత్-పాక్ టెస్ట్ సిరీస్..?
క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్-పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్లు మళ్లీ మొదలుకానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ దిశగా ఐసీసీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఐసీసీ నిర్వహించబోయే కీలక సమావేశాల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ భవిష్యత్ నిర్మాణంపై చర్చించేందుకు ఐసీసీ ఈ నెలాఖర్లో (మే 30, 31) అహ్మదాబాద్లో బోర్డు సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో టెస్టు క్రికెట్ విస్తరణతో పాటు భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ పునరుద్ధరణ అంశం ప్రధాన చర్చగా మారే అవకాశముంది. ఈ సమావేశాలకు బీసీసీఐ, పీసీబీ అధ్యక్షులు హాజరవుతారు. పీసీబీ చీఫ్ నఖ్వీ ఈ మీటింగ్కు వర్చువల్గా అటెండ్ అవుతాడని తెలుస్తుంది.కాగా, భారత్, పాక్ మధ్య మళ్లీ టెస్టు సిరీస్ జరగొచ్చన్న చర్చ ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో నక్వీ మాట్లాడుతూ.. తదుపరి ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్లో అన్ని దేశాలతో టెస్టులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. దీంతో భారత్తో టెస్టు సిరీస్పై ఊహాగానాలు మరింత పెరిగాయి.భారత్, పాక్ చివరిసారిగా 2007-08లో టెస్టు సిరీస్ ఆడాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక టెస్టు క్రికెట్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఐసీసీ సమావేశాల్లో దీనిపై ప్రత్యక్ష నిర్ణయం వచ్చే అవకాశం లేకపోయినా, భవిష్యత్ చర్చలకు ఇది బాటలు వేయొచ్చని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.12 జట్లుటెస్టు క్రికెట్ భవిష్యత్పై అధ్యయనం చేసేందుకు ఐసీసీ గతేడాదే మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ రోజర్ ట్వోస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను ప్రస్తుతం ఉన్న 9 జట్ల నుంచి 12 జట్లకు విస్తరించాలని సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి జట్లకు కూడా డబ్ల్యూటీసీలో చోటు దక్కే అవకాశం ఉంటుంది.ఒకే టెస్ట్తో సిరీస్ఈ సమావేశాల్లో ఒకే టెస్టుతో సిరీస్ నిర్వహించే ప్రతిపాదన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి డబ్ల్యూటీసీ సిరీస్లో కనీసం రెండు టెస్టులు తప్పనిసరి. అయితే చిన్న క్రికెట్ బోర్డుల ఆర్థిక భారం తగ్గించేందుకు, మరిన్ని జట్లకు టెస్టు అవకాశాలు కల్పించేందుకు ఒకే టెస్టు సిరీస్ మోడల్పై ఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
శత్రుదేశంలో ఓటీటీ నం.1 ట్రెండింగ్లో 'ధురంధర్ 2'
విదేశాల్లో 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో మాత్రం జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానుందని అధికారికంగానే ప్రకటించారు. అయితే ఈ మూవీ అంతా పాక్లోని లయరీ ప్రాంతంలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలు, ఉగ్రవాద చర్యలు తదితర అంశాల ఆధారంగా తీశారు. దీంతో పాక్తో పాటు అరబ్ దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఎవరూ ఈ చిత్రాన్ని చూడలేకపోయారు.(ఇదీ చదవండి: నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి)అయితే 'ధురంధర్ 2' థియేటర్లలో రిలీజైన తర్వాత పైరసీని పాక్లో విపరీతంగా చూశారు. అక్కడి కరెన్సీలో రూ.50కే ప్రింట్ అమ్మారు. ఇప్పుడు అధికారికంగా దాయాది దేశంలో ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిన మరుక్షణం నుంచే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని, అలానే గడిచిన 24 గంటల నుంచి తమ దేశంలో నం.1 ట్రెండింగ్లో ఉందని పాక్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.'ధురంధర్ 2 పాకిస్తాన్లో ఇప్పుడే రిలీజైంది. సర్వర్స్ క్రాష్ అయ్యాయి. పాకిస్థానీలు అర్థరాత్రి ఎప్పుడవుతుందా? నెట్ఫ్లిక్స్లోకి ఎప్పుడొస్తుందా అని చూశారు. రాగానే క్లిక్ చేశారు. అందుకే మూవీ ప్లే కావడానికి టైమ్ పడుతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాలో చూపించింది నిజమా అబద్దమా అనేది వేరే విషయం. కానీ పాకిస్థానీలు మాత్రం మూవీ ఎలా తీసుంటారా అని చూసేందుకు ఎగబడుతున్నారు. రణ్వీర్ సింగ్ పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. లయరీలో అలా జరిగింది లేదా అనేది తర్వాత మాట్లాడుదాం' అని సదరు ఇన్ఫ్లూయెన్సర్ చెప్పుకొచ్చాడు.'ధురంధర్' రెండు భాగాలుగా రిలీజైంది. తొలి పార్ట్ గతేడాది డిసెంబరులో, సీక్వెల్ ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోక వచ్చింది. మొత్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. జస్కీరాత్ సింగ్ అనే వ్యక్తి.. హంజా అలీ మజారీ అనే మారుపేరుతో పాకిస్తాన్లోకి గూఢచారిగా వెళ్లి.. అక్కడ మాఫియాని, భారత్కి చేటు చేసిన పలువురు ఉగ్రవాదుల్ని ఎలా అంతం చేశాడనే స్టోరీతో ఈ సినిమా తీశారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) View this post on Instagram A post shared by maviya umer farooqui (@kaam_wali_baat) -
టీ20 ప్రపంచకప్కు పాక్ జట్టు ప్రకటన
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 సభ్యుల పాకిస్తాన్ జట్టును ఇవాళ (మే 16) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా ఫాతిమా సనాను నియమించారు. వరుసగా రెండోసారి సనానే టీ20 ప్రపంచకప్లో పాక్ జట్టును నడిపించనుంది.ఈ పాక్ జట్టులో పలువురు ప్లేయర్లు తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్నారు. ఎమాన్ ఫాతిమా, నతాలియా పర్వేజ్, రమీన్ షమీమ్, సైరా జబీన్, తస్మియా రుబాబ్కు ఇదే తొలి వరల్డ్కప్.మెగా టోర్నీలో పాక్ గుల్ ఫిరోజా, మునీబా అలీ, అయేషా జాఫర్పై భారీ ఆశలు (బ్యాటింగ్లో) పెట్టుకుంది. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్లో ఆయేషా జాఫర్, ఫాతిమా సనా మంచి ఫామ్లో ఉండటం పాక్కు అదనంగా కలిసొచ్చే అంశం.స్పిన్ విభాగంలో సదియా ఇక్బాల్, నష్రా సంధు, తుబా హసన్ కీలక పాత్ర పోషించనుండగా.. పేస్ విభాగాన్ని ఫాతిమా సనా, డయానా బేగ్ ముందుండి నడిపించనున్నారు.ఈ ప్రపంచకప్లో పాక్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్లో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లు ఉన్నాయి.పాక్ జట్టు జూన్ 14న బర్మింగ్హామ్లో చిరకాల ప్రత్యర్థి భారత్తో జరిగే మ్యాచ్తో వరల్డ్కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్తో గ్రూప్ దశ మ్యాచ్లు ఆడనుంది.గ్రూప్ దశ మ్యాచ్లకు ముందు పాక్ రెండు వార్మప్ మ్యాచ్లు కూడా ఆడనుంది. జూన్ 6న శ్రీలంకతో, జూన్ 9న స్కాట్లాండ్తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లు డెర్బీ వేదికగా జరుగనున్నాయి.ప్రపంచకప్కు ముందు పాక్..వెస్టిండీస్తో కలిసి ఐర్లాండ్లో జరిగే టీ20 ట్రై సిరీస్లో పాల్గొననుంది. ఈ టోర్నీలో మే 29న వెస్టిండీస్తో తొలి మ్యాచ్ ఆడనున్న పాక్, మే 31న ఐర్లాండ్ను ఎదుర్కొంటుంది. అనంతరం జూన్ 3న మళ్లీ వెస్టిండీస్తో, జూన్ 4న ఐర్లాండ్తో తలపడుతుంది. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టే ఈ టోర్నీలోనూ కొనసాగనుంది. కాగా, తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే, టీ20 సిరీస్ల్లో పాక్ ఘన విజయాలు సాధించింది. ఈ రెండు సిరీస్లను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.పాక్ జట్టు: ఫాతిమా సనా (సి), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (WK), నష్రా సంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీ, సాదియా ఇక్బాల్, సైరా జబీన్, తస్మియా రుబాబ్, తస్మియా రుబాబ్రిజర్వ్లు: అంబర్ కైనాట్, మోమినా రియాసత్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా మరియు ఉమ్-ఎ-హని -
ఉంటారో, చరిత్రలో కలిసిపోతారో తేల్చుకోండి
న్యూఢిల్లీ: పహల్గాం పచ్చికమైదానంలో పాశవిక దాడి మొదలు తరచూ సరిహద్దు వెంట ఉగ్ర చొరబాట్లకు పాల్పడుతున్న దాయాది పాకిస్తాన్ను భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం ఢిల్లీలోని మాణిక్షా సెంటర్లో యూనిఫాం అన్వీల్డ్ సంస్థ చేపట్టిన ‘సేనా సంవాద్’కార్యక్రమంలో పాక్నుద్దేశించి ద్వివేది వ్యాఖ్యలుచేశారు. ‘‘తీరు మార్చుకోకుండా ఇలాగే ముష్కర మిన్నాగులకు పాలు పోసి పెంచినా, ఉగ్ర చొరబాట్లను ప్రోత్సహించినా మీ అంతుచూస్తాం. భౌగోళిక పటంలో ఉండాలనుకుంటున్నారో, సర్వనాశనమై చరిత్రలో కలిసిపోతారో తేల్చుకోండి. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోతే మీ పుట్టి ముంచేస్తాం. మిమ్మల్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తాం’’అని హెచ్చరించారు. అలాంటి కేఫ్.. నా కల ఆర్మీ చీఫ్ యువతతో కొద్దిసేపు సరదాగా మాట్లాడారు. ‘‘ఆర్మీ చీఫ్గా రిటైర్ అయ్యాక నచ్చిన పనిచేస్తా. ముఖ్యంగా నా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో దైనందిన జీవితంలో అలసిపోయిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక కేఫ్ను ఆరంభిస్తా. జీవితాన్ని నెమ్మదిగా సాగిపోనీ అనే అర్థం వచ్చేలా కేఫ్కు ‘ఆహిస్తా జిందగీ’అని పేరు పెడతా. ఎందుకంటే ఉరుకులు పరుగుల జీవితంలో ఇప్పుడు ఎవరికీ కాసింత ఖాళీ సమయం దొరకట్లేదు. ఒక్కచోట కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ఒక మంచి ఆలోచన చేసే తీరికే లేదు. కేఫ్లో అయితే జనం కొద్దిసేపు కూర్చుని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్లకు కెరీర్, ఇతర అంశాల్లో ఉచితంగా సలహాలు, సూచనలు చేసే ఏర్పాట్లుచేస్తా. అందులో ఒక గ్రంథాలయం సైతం అందుబాటులోకి తెస్తా. ఆలోచనల కూడలిగా ఆ కేఫ్ నిలిచిపోవాలి’’అని అన్నారు. India's Army Chief just said Pakistan must decide whether it wants to "be part of geography and history"General Upendra Dwivedi, speaking at Sena Samvad in Delhi, delivered the sharpest public warning from the Indian military establishment in recent memory pic.twitter.com/XM8yARg69j— Nabila Jamal (@nabilajamal_) May 16, 2026 -
టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి.. పాక్ కెప్టెన్ ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా టీ20 క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నిన్న (మే 15) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆమె.. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన అర్ద సెంచరీ నమోదు చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్కు చెందిన సోఫీ డివైన్, ఆస్ట్రేలియాకు చెందిన ఫోబ్ లిచ్ఫీల్డ్, భారత్కు చెందిన రిచా ఘోష్ పేరిట సంయుక్తంగా ఉండేది. ఈ ముగ్గురు 18 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. తాజాగా ఫాతిమా సనా వీరి రికార్డును బద్దలు కొట్టి సింగిల్గా ప్రపంచ రికార్డు సెట్ చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో పాక్ 133 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ 3-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు వన్డే సిరీస్ను కూడా పాక్ 3-0తో ఊడ్చేసింది. ఈ వైట్బాల్ సిరీస్ల కోసం జింబాబ్వే తొలిసారి పాక్లో పర్యటించింది.నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఫాతిమా సనా 19 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి పాక్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడింది. ఫాతిమాకు ముందు సైరా జబీన్ (50 నాటౌట్), అయేషా జాఫర్ (45) కూడా సత్తా చాటారు. మిగతా బ్యాటర్లలో మునీబా అలీ 22, నతాలియా పర్వేజ్ 1, ఇరామ్ జావెద్ 29 పరుగులు చేశారు. ఈ సిరీస్లో జింబాబ్వే 200 పరుగుల మార్కు దాటడం ఇది రెండోసారి.224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఎప్పటిలాగే తడబడింది. 17.1 ఓవర్లలో 90 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా భారీ తేడాతో పరాజయంపాలైంది. సదియా ఇక్బాల్ 3, నష్రా సంధు 2, ఫాతిమా సనా, రమీన్ షమీమ్, తుబా హస్సన్ తలో వికెట్ తీసి జింబాబ్వే ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో కెలిస్ (32), అదెల్ జిమును (18), మిచెల్ మవుంగా (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
అప్పుల ఊబిలో.. చమురు మంటల్లో..
న్యూఢిల్లీ: ఒకవైపు అప్పుల భారం సరికొత్త రికార్డుకు చేరుకోవడం, మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతుండటం, ద్రవ్య లభ్యత కఠినతరం కావడం.. ఇవన్నీ దాయాది దేశం పాకిస్తాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తీవ్రమైన ఆర్థిక మాంద్యం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ తాజా పరిణామాలు పెను ముప్పుగా పరిణమించాయి. అప్పుల ఊబిలో నిండా కూరుకుపోయిన పాక్కు ఇక భవిష్యత్తు ఉందా? అనే అనుమానాలు ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్నాయి.రికార్డు స్థాయిలో ప్రపంచ అప్పులుప్రముఖ ‘బిజినెస్ రికార్డర్’ పత్రిక ప్రచురించిన తాజా ఆర్థిక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు నిరంతరాయంగా, భారీగా రుణాలు తీసుకుంటుండటంతో గ్లోబల్ డెట్ (ప్రపంచ అప్పులు) మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకుంది. ఈ ఊహించని అప్పుల గమనం అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తూ, చిన్న దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.పాకిస్తాన్కు ముంచుకొస్తున్న ముప్పుఅభివృద్ధి చెందిన దేశాలు భారీ స్థాయిలో అప్పులు చేస్తున్నప్పటికీ, మార్కెట్లో తక్షణమే ఎలాంటి పెద్ద అంతరాయాలు రాకుండా ఆ రుణాలను సులభంగా తట్టుకోగలుగుతున్నాయి. కానీ ఆర్థికంగా అత్యంత బలహీనంగా ఉండి, పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే పాకిస్తాన్ లాంటి దేశాలపై ఈ పరిణామాల ప్రతికూల ప్రభావం స్పష్టంగా పడుతోందని నివేదిక హెచ్చరించింది. ఈ ప్రపంచ అప్పుల పెరుగుదల పాక్ పాలిట శాపంగా మారి, ఆ దేశపు బలహీనమైన రికవరీకి అడ్డంకిగా నిలుస్తోంది.ద్రవ్యోల్బణం, కమ్ముకొస్తున్న చమురు సెగభౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. పెరిగిన ఇంధన ఖర్చుల కారణంగా రవాణా చార్జీలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతూ, సుదీర్ఘకాలంగా రోజువారీ జీవన వ్యయం పెరిగి సతమతమవుతున్న పాకిస్తాన్ సామాన్యులపై ఈ పరిణామాలు మరింత భారాన్ని మోపుతున్నాయి.విధానపరమైన నిర్ణయాలపై తీవ్ర ఒత్తిడిపాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మనుగడ ప్రధానంగా విదేశీ నిధులు, అంతర్జాతీయ కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ప్రపంచ ద్రవ్య పరిస్థితులు కఠినంగా మారడం, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం లాంటివి ఆ దేశ ఆర్థిక విధానాల సరళతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దేశీయంగా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు స్వేచ్ఛగా, అనుకూలమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం పాక్ ప్రభుత్వానికి ఇప్పుడు కత్తిమీద సాములా మారింది.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో లోపాలుఅంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాగిన నిర్మాణాత్మక అసమానతలను ఈ నివేదిక ప్రముఖంగా ఎత్తిచూపింది. పెద్ద దేశాలు నిరంతరం అప్పులు చేస్తూ కూడా ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సుస్థిరంగా కొనసాగుతుంటే, పాకిస్తాన్ లాంటి వర్ధమాన దేశాలు మాత్రం మూలధన ప్రవాహంలో అస్థిరత, అధిక రీఫైనాన్సింగ్ ఖర్చులు వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వాతావరణం కఠినంగా మారినప్పుడు చిన్న దేశాలు అత్యంత వేగంగా ఈ సర్దుబాటు ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది.ఆర్థిక స్థిరీకరణ మార్గంలో సవాళ్లుపాకిస్తాన్ చేపడుతున్న ఆర్థిక స్థిరీకరణ ప్రయత్నాలు, సంస్కరణలు ప్రధానంగా మల్టీలేటరల్ సపోర్ట్ (బహుపాక్షిక మద్దతు), బాహ్య ఆర్థిక ప్రవాహాలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ సున్నితమైన పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ పెరిగినా, కమోడిటీ సైకిల్స్లో ఏ చిన్న మార్పు వచ్చినా పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఈ తాజా అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లతో పాకిస్తాన్కు ఇక భవిష్యత్ ఉంటుందా? అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.ఇది కూడా చదవండి: మూడు రోజులు తిండి మానేస్తే ఏమవుతుంది? -
నవ భారత యుద్ధ తంత్రం
భారతదేశ భద్రత, విదేశాంగ విధానా లలో ‘ఆపరేషన్ సిందూర్’ కీలక మలుపును సూచిస్తుంది. 1965, 1971 యుద్ధాలలో ఓడిపోయి, ప్రత్యక్షయుద్ధంలో భారత్ను ఎదుర్కోవటం అసాధ్యమని గ్రహించిన పాకిస్తాన్, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని తన విధానంగా మలుచుకున్నది. జియా ఉల్హక్ ‘బ్లీడ్ ఇండియా బై థౌజండ్ కట్స్’ (వెయ్యి గాట్లతో భారత్ను గాయపరచటం) అనే సిద్ధాంతాన్ని అమలు పరిచాడు. అణ్వస్త్రాలను సమకూర్చుకున్నాక పాకిస్తాన్ ‘కత్తి–డాలు’ వ్యూహంలో భాగంగా ఒకవైపు ఉగ్రవాద మూకలను పెంచి పోషించి భారత్లో ఉగ్రవాద చర్యల ద్వారా అస్థిరతను కలుగజేస్తూ అణ్వస్త్ర ఛత్రం కింద రక్షణ తీసుకొన్నది. పాక్పై సైనిక చర్య/యుద్ధం ప్రారంభించాలంటే పాక్ అణ్వాయుధ దాడికి ఒడిగడుతుందా అన్న సందేహం, భారత్ను క్రమంగా ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు విరుగుడు చర్యలు తీసు కునేలా చేసింది. భారత్ బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరా లను లక్ష్యంగా చేసుకొని ఎల్ఓసీ దాటి ఉరి, బాలాకోట్లలో ఆప రేషన్లను సమర్థవంతంగా పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో పహల్ గామ్ దాడితో పాక్ నేరుగా భారత్కు సవాలు విసిరింది. పర్యవసా నంగా 2025 మే 7 తెల్లవారుఝామున 1 గంటకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీకారం చుట్టింది. ఈ 88 గంటల దాడి ద్వారా పాకి స్తాన్కే కాకుండా యావత్ ప్రపంచానికీ ‘భారత్ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదనే’ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చి నట్లయింది. డీఆర్డీఓ, ఇస్రోలతో సమన్వయం!ఆపరేషన్ సిందూర్ మొదటి రోజున భారత వాయుసేన, సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు; పాకిస్తాన్లో నాలుగు; మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడి చేసింది. మురిడికేలోని లష్కర్ ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యా లయాలను నేలమట్టం చేసింది. భారత్ దాడులకు ప్రతిగా కశ్మీర్ నుండి కచ్ వరకు పాక్ భారీ స్థాయిలో దాడులు చేసింది. మే 9న ఢిల్లీ లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఫత్తా క్షిపణితో దాడి చేయటం ద్వారా దుస్సాహసానికి ఒడిగట్టింది. దాంతో పాక్ న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత్ వ్యూహకర్తలు నిశ్చయించారు. మే 10న పాక్లోని 12 సైనిక స్థావరాలలో 20కి పైగా లక్ష్యాలపై ఏకకాలంలో దాడి చేయటంతో పాక్ దిక్కు తోచని పరిస్థితుల్లో సంధిని కోరటంతో ఆపరేషన్ సిందూర్ ముగిసింది. రావల్పిండిలో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం, సిం«ద్ ప్రావిన్స్లోని భోలారి వైమానిక స్థావరం, ఎఫ్–16 యుద్ధ విమానాలుండే జాకోబాబాద్ వైమానిక స్థావరం, రహీమ్ యార్ ఖాన్ సైనిక స్థావరాలతో సహా పాక్లోని అన్ని ప్రధాన సైనిక స్థావరాలపై భారత్ కచ్చితత్వంతో దాడి చేసింది. రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ల నుండి దిగుమతి చేసుకున్న సైనిక సామగ్రి, సైనిక పరిజ్ఞానాన్ని దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించటంలో డీఆర్డీఓ, ఇస్రో, భారత త్రివిధ దళాలు విజయవంతమయ్యాయి. భారత సైన్యం, వాయు సేన, నౌకా బలాలు పూర్తి స్థాయిలో సమీకృతం అయి ఆపరేషన్ సిందూర్ను సమర్థవంతంగా నడిపించాయి.ఆపరేషన్ సిందూర్లో తెరవెనుక కథ నడిపిన ఇస్రో పాత్రను ప్రత్యేకంగా పేర్కొనాలి. ఈ 88 గంటల దాడిలో మన సైనిక, గూఢచార ఉపగ్రహాలు కీలకమైన పాత్ర వహించాయి. కార్టోశాట్ ఛాయా చిత్రాల ద్వారా దాడుల కచ్చితత్వం నిర్ధారణ అయింది. వీటికి తోడు పాక్లో ప్రజలు సామాజిక మాధ్యమాలలో ఉంచిన వీడియోలు దాడులకు మానవ నేత్రాన్నందించాయి. రిశాట్ ఉప గ్రహాలు శత్రువుల కదలికలపై రాత్రీ పగలు సమాచారాన్ని అందించాయి. జీశాట్ 7, 7ఏ ఉపగ్రహాలు... సైన్యం, వాయుసేన, నౌకా సేనల మధ్య సమాచారం, సమన్వయానికి సహకరించాయి. నావిక ఉపగ్రహ వ్యవస్థ, క్షిపణులను నేరుగా లక్ష్యాల వైపు మరల్చింది. సిందూర్ 2.0కు సిద్ధమా?పాక్, ఉగ్రవాద పంథాని వీడుతుందనుకోవటం భ్రమ. పాక్కు చైనా ఇంతవరకు క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమా నాలను సరఫరా చేసింది. ఆపరేషన్ సిందూర్లో చైనా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా అందించింది. కానీ పూర్తి స్థాయిలో చైనా–పాక్ రక్షణ సైనిక వ్యవస్థలు ఒక్కటిగా పనిచేయలేదు. భవిష్యత్తులో చైనా–పాక్లను సమష్టిగా ఒకేసారి ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. పాక్ పెద్ద మొత్తంలో టర్కీ నుండి డ్రోన్ల కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నది. టర్కీ కొద్ది రోజుల క్రితం ఆధునిక ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని ఆవిష్కరించింది. పాక్–టర్కీల మధ్య సైనిక వ్యవహారాలపై నిఘా ఉంచాలి. ఇరాన్ యుద్ధంలో గల్ఫ్ దేశాలు, యూఎస్ఏ, ఇజ్రాయెల్లు డ్రోన్లు, క్షిపణుల కొరతను ఎదుర్కొంటు న్నాయి. ఇరాన్ ముందుచూపుతో పెద్ద మొత్తంలో డ్రోన్లు, క్షిప ణులను భూగర్భ బంకర్లలో నిలువ చేసుకొని అమెరికాను సవాలు చేయగలుగుతున్నది. చైనా–పాక్లతో యుద్ధం 88 గంటలు కాదు 88 రోజులుండవచ్చు. దీనికి సరిపడా డ్రోన్లు, క్షిపణుల తయారీ వ్యవస్థలను భారత్ ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో భాగంగా నిజానిజాలు తెలియజేయటానికి సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇల్లు కాలుతుంటే మంటలు ఆర్పటం కోసం బావి తవ్వటం లాగా సమాచారాన్ని అందించ టానికి అప్పటికప్పుడు ఎవరినో నియమించకూడదు. మన నిజం, శత్రువు అబద్ధాని కంటే ముందు ప్రపంచానికి తెలియాలి. వ్యూహంలో భాగమే ‘రింగ్’ అలర్ట్దీర్ఘకాల యుద్ధంలో జాతి మానసిక స్థితి కీలక పాత్రను పోషి స్తుంది. 1971 తరువాత ఇంతవరకు భారతదేశం గట్టి యుద్ధం చేయలేదు. 140 కోట్ల మంది భారతీయులలో సుమారు 88 శాతం మంది 1971 యుద్ధం తర్వాత జన్మించినవారే. వీరికి యుద్ధ పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, యుద్ధం సందర్భంగా ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన గానీ, అంచనా గానీ లేవు. అందుకే గ్రామాలు, పట్టణాలు, నగరాలలో యుద్ధ సమయంలో పౌర రక్షణకు సామాన్య పౌరులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలి. క్షిపణి, డ్రోన్, వైమానిక దాడుల సైరన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇటీవల భారత ప్రభుత్వం పరీక్షించిన ‘సెల్ఫోన్ రింగ్ అలర్ట్’ ఈ వ్యూహంలో భాగమే. స్థానికంగా రక్షిత ప్రదేశాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. శత్రువుల కదలి కల సమాచారాన్ని ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి అందజేయ గలగాలి. ఉక్రెయిన్లో పౌరులకు డ్రోన్లను ఆపరేట్ చేయటంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధంలో సంభవించే నష్టానికి, కష్టాలకు ఓర్చు కొనే స్థైర్యాన్ని కూడా ప్రజలలో పెంపొందించాలి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
పాక్ను చిత్తుగా ఓడించిన బంగ్లా ప్లేయర్లకు భారీ లబ్ది
పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్న్యూస్ చెప్పింది. మిర్పూర్ టెస్టులో 104 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఈ మ్యాచ్లో షాంటో విశేషంగా రాణించాడు.తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (101), రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (87) (మొత్తం 188 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు ప్రతిఫలంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అతడు.. ర్యాంకింగ్స్లో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇదే స్థానంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కూడా కొనసాగుతున్నాడు.ఇదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్లో వికెట్ తీసి జట్టు విజయంలో మరో కీలక పాత్రధారుడిగా నిలిచిన నహిద్ రాణా కూడా ర్యాంకింగ్స్లో భారీ జంప్ కొట్టాడు. ఒకేసారి ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరుకున్నాడు.ఇదే మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 91, రెండో ఇన్నింగ్స్లో 56 పరుగులు చేసిన మొమినుల్ హక్ 12 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్కి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 71, రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 26వ ర్యాంక్లో నిలిచాడు.నాలుగు వికెట్లతో సత్తా చాటిన తైజుల్ ఇస్లాం మూడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్ చేరుకోగా, తస్కిన్ అహ్మద్ 48వ స్థానంలో నిలిచాడు.ఇక పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ఈ టెస్ట్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. సౌద్ షకీల్, షాన్ మసూద్ ఇద్దరూ ఆరు స్థానాలు దిగజారారు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన మొహమ్మద్ అబ్బాస్ మాత్రం 28వ స్థానానికి ఎగబాకి కొంత ఊరటనిచ్చాడు. -
పాపం పాకిస్తాన్.. 'ధురంధర్'పై ప్రతీకారంతో సినిమా తీసి
'ధురంధర్' సినిమాలు ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రూ.1300 కోట్లు వసూలు చేయగా.. ఈ మార్చిలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన బీభత్సం చేసింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గరున్న అన్ని రికార్డులు కొల్లగొట్టింది. పుష్ప, బాహుబలి.. దేన్ని వదల్లేదు. చాలామంది ఈ మూవీస్ నచ్చాయి గానీ కొందరు మాత్రం ప్రొపగాండా అని విమర్శించారు. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది.(ఇదీ చదవండి: సీఎం విజయ్ కొత్త నిర్ణయం.. త్రిష సినిమాతోనే మొదలు)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడే పాక్ నాయకుల్లో అలజడి రేగింది. తన దేశంలోని లయరీ ప్రాంతం గురించి తప్పుతప్పుగా చూపించారని మండిపడ్డారు. అసలు లయరీ ఎలా ఉంటుందో చూపిస్తామని చెబుతూ 'మేరీ లయరీ' అనే సినిమాని కూడా ప్రకటించారు. గత వీకెండ్ అంటే మే 08న థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందు కాస్తోకూస్తో బజ్ ఉన్నప్పటికీ థియేటర్లలోకి వచ్చిన ఘోరాతీ ఘోరంగా పరిస్థితి తయారైంది.ఆజ్ తక్ కథనం ప్రకారం.. 'మేరీ లయరీ' సినిమాకు పాక్లోని కొన్ని థియేటర్లలో మరీ 22 టికెట్లే అమ్ముడుపోయాయట. ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో తొలిరోజే చాలా థియేటర్లలో నుంచి సినిమాని తీసేశారట. అబూ అలీహా దర్శకత్వం వహించిన 'మేరీ లయరీ' మూవీలో ఆయేషా ఒమర్, దననీర్ మొబీన్, సామియా ముంతాజ్ ప్రధాన పాత్రలు చేశారు.'ధురంధర్' రెండు భాగాలు కూడా గూఢచర్యం, పాక్ ఉగ్రవాదం నేపథ్యంగా తీశారు. 'మేరీ లయరీ' మాత్రం లయరీ ప్రాంతంలో ఫుట్బాల్, సమాజ జీవనం, మహిళల ఆత్మవిశ్వాసం బ్యాక్డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. గతంలోనే ఓ సందర్భంలో మాట్లాడిన సింధ్ సమాచార శాఖ మంత్రి షర్జీల్ ఇనామ్.. భారతీయ సినిమాల్లో లయరీ ప్రాంతాన్ని తప్పుగా చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్లే మూవీ తీస్తే సొంత ప్రేక్షకుల నుంచే తిరస్కరణ ఎదురైంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ) -
పాక్ వైమానిక స్థావరంలో ఇరాన్ యుద్ధ విమానాలు
వాషింగ్టన్: పశ్చిమాసియా సంఘర్షణల నేపథ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య దౌత్య మధ్యవర్తిగా పాకిస్తాన్ ప్రదర్శించుకున్న తీరు అందరికీ తెలిసిందే. అయితే, ఈ సమయంలో ఇరాన్ సైనిక విమానాలను నిలిపి ఉంచడానికి పాకిస్తాన్ తన కీలక వైమానిక స్థావరాల్లో ఒకదానిలో అనుమతించిందని ఓ నివేదిక వెల్లడించింది. రావల్పిండికి కొద్ది దూరంలో ఉన్న నూర్ ఖాన్లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరానికి ఇరాన్ అనేక కీలక రక్షణ ఆస్తులను తరలించిందని పేర్కొంది. అధికారికంగా కాల్పుల విరమణ ప్రయత్నాలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న సమయంలో, ఇరాన్ తన సైనిక, విమానయాన ఆస్తులను రక్షించుకోవడానికి ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన సైనిక స్థావరం ఆశ్రయాన్ని కల్పించింది.ఈ సైనిక పరికరాలలో, లాక్హీడ్ సంస్థ తయారు చేసిన సి–130 హెర్క్యులస్ వ్యూహాత్మక రవాణా విమానానికి చెందిన నిఘా, గూఢచార సేకరణ వేరియంట్ అయిన ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్సి–130 కూడా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఇరాన్–అమెరికా సంక్షోభ సమయంలో అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, ఇరాన్కు గానీ, దాని మిత్రదేశం, పాకిస్తాన్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయిన చైనాను గానీ దూరం చేసుకునే చర్యలకు పాక్ దూరంగా ఉండటాన్ని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాన్ వద్ద మిగిలి ఉన్న వైమానిక, సైనిక ఆస్తులను అమెరికా దాడుల నుంచి రక్షించుకోవడానికే ఈ తరలింపునకు కారణమై ఉంటుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. నివేదికపై తీవ్ర వ్యతిరేకత.. ఈ నివేదిక అమెరికాలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాక్ తటస్థతను అమెరికా చట్టసభ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహిత మిత్రుడు, సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ నివేదికపై ఎక్స్లో స్పందించారు. ఈ సంక్షోభంలో పాకిస్తాన్ దౌత్య పాత్రను పునఃసమీక్షించాలని పిలుపునిచ్చారు.‘ఈ నివేదిక కచ్చితమైనదైతే, ఇరాన్–అమెరికా మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇజ్రాయెల్పై పాకిస్తాన్ రక్షణ అధికారులు గతంలో చేసిన కొన్ని ప్రకటనలను గమనిస్తే, ఇది నిజమైనా నేను ఆశ్చర్యపోను’అని గ్రాహం పేర్కొన్నారు. అయితే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు సంబంధించిన ఆరోపణలను పాకిస్తాన్ సీనియర్ అధికారి ఖండించారు. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతంలో ఆ బేస్ ఉన్నందున అటువంటి కార్యకలాపాలు రహస్యంగా ఉండటం సాధ్యం కాదని తెలిపారు. కాబూల్లోనూ.. అంతేకాదు, ఇరాన్ పౌర విమానాలను పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు కూడా తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ విమాన ప్రయాణాల్లో సైనిక విమానాలు ఉన్నాయో, లేదో స్పష్టంగా తెలియదని అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే, ఘర్షణలు ప్రారంభం కావడానికి కొద్ది ముందే మహాన్ ఎయిర్ విమానం ఒకటి కాబూల్లో దిగిందని, ఇరాన్ గగనతలం మూసివేయడంతో అది అక్కడే ఉండిపోయిందని ఆఫ్ఘన్ పౌర విమానయాన అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడుల తర్వాత కాబూల్ విమానాశ్రయాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవచ్చనే భయాలు పెరగడంతో, ఆ విమానాన్ని ఇరాన్ సరిహద్దు సమీపంలోని హెరాత్ విమానాశ్రయానికి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇరాన్ విమానాలు ఉన్నాయన్న వార్తలను తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిడ్ తోసిపుచ్చారు. -
బంగ్లాదేశ్ చేతిలో పాక్ బోల్తా
మిర్పూర్: బంగ్లాదేశ్తో జరిగిన మొదటి 13 టెస్టుల్లో పాకిస్తాన్ 12 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. ఆ తర్వాత పాకిస్తాన్ విజయపరంపరకు 2024లో రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ తెరదించింది. ఆనాడు రెండు వారాల్లో వరుసగా రెండు టెస్టుల్లో పాకిస్తాన్ను వారి సొంతగడ్డపైనే ఓడించి బంగ్లాదేశ్ భళా అనిపించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ పాకిస్తాన్తో జరిగిన టెస్టులో వరుసగా మూడోసారి బంగ్లాదేశ్ జట్టే పైచేయి సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మిర్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 103 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఈనెల 16 నుంచి సిల్హెట్లో జరుగుతుంది. ఆట చివరిరోజు ఓవర్నైట్ స్కోరు 152/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 70.3 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ కెపె్టన్ నజు్మల్ హుస్సేన్ షంటో (87; 7 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు. మోమినుల్ హక్ (56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, నోమన్ అలీ 3 వికెట్ల చొప్పున తీశారు.అనంతరం బంగ్లాదేశ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన పాకిస్తాన్ 52.5 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా ఫజల్ (66; 11 ఫోర్లు) ఒక్కడే క్రీజులో నిలబడి అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. తస్కిన్ అహ్మద్, తైజుల్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. ఆఖరి రోజు 16 వికెట్లు పడటం విశేషం. మ్యాచ్లో 188 పరుగులు చేసిన షంటోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 413 పరుగులు... పాకిస్తాన్ 386 పరుగులు చేశాయి. -
పాకిస్థాన్లో భారీ పేలుడు, ఏడుగురి మృతి
లక్కీ మార్వాట్: పాకిస్థాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురి మృతి చెందారు. వాయువ్య పాకిస్థాన్లోని లక్కీ మార్వాట్ ప్రాంతంలోని ఓ మార్కెట్లో జరిగిన శక్తిమంతమైన పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.కాగా, గత శనివారం రాత్రి.. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే. బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. ఈ భారీ పేలుడుతో పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడి చేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా ఇరాన్కు పాక్ ఆశ్రయం
ఇస్లామాబాద్: అమెరికా-ఇరాన్ యుద్ధంలో శాంతిదూతగా, మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్తాన్ భారీ మోసానికి పాల్పడిందా? అమెరికా వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇరాన్ యుద్ధ విమానాలకు పాకిస్తాన్ తన గడ్డపై రహస్యంగా ఆశ్రయం కల్పించిందని తాజాగా అమెరికన్ అధికారులు వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. సీబీఎస్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.నూర్ ఖాన్ బేస్లో ఇరాన్ విమానాలుఏప్రిల్ ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది రోజులకే, ఇరాన్కు చెందిన పలు విమానాలు పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయని అమెరికన్ అధికారులు వెల్లడించారు. ఇందులో నిఘా సమాచారాన్ని సేకరించే ఇరాన్ వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ఆర్సీ-130 (ఆర్సీ-130) విమానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించారు. నగరానికి నడిబొడ్డున ఉండే నూర్ ఖాన్ బేస్లో ఇన్ని విమానాలను దాచడం ప్రజల కళ్లుగప్పి సాధ్యం కాదని వారు ఈ వార్తలను కొట్టిపారేశారు.ఆఫ్ఘనిస్తాన్లోనూ రహస్య ఆశ్రయం?కేవలం పాకిస్తాన్లోనే కాకుండా పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఇరాన్ తన పౌర విమానాలను తరలించినట్లు ఈ నివేదిక పేర్కొంది. యుద్ధం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానం కాబూల్లో దిగిందని ఆఫ్ఘన్ ఏవియేషన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ఇరాన్ విమానాలు లేవని, ఇరాన్కు అలా చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.పాక్ ద్వంద్వ వైఖరిపై అమెరికా సెనేటర్ ఫైర్ఈ సంచలన నివేదికపై రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలు నిజమైతే, అమెరికా-ఇరాన్ మధ్యవర్తిగా పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రను పూర్తిగా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ పట్ల పాక్ గతంలో చేసిన వ్యాఖ్యల దృష్ట్యా, ఈ ఆరోపణలు నిజమైనా తాను ఆశ్చర్యపోనని ఆయన అన్నారు. ఇటు అమెరికాతో సంబంధాలు నెరపుతూనే, అటు ఇరాన్కు, దాని మిత్రదేశమైన చైనాకు దూరం కాకుండా పాకిస్తాన్ అత్యంత చాకచక్యంగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు? -
చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది
పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 100 వికెట్లు తీసిన తొలి పాకిస్తాన్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో షాహీన్ ఇప్పటికే 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ఇంకా జరుగుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో షాహీన్ వికెట్ల సంఖ్య 103కు చేరింది.పాకిస్తాన్ తరఫున WTCలో అత్యధిక వికెట్లు:* షాహీన్ అఫ్రిది – 103* నౌమన్ అలీ – 89* సాజిద్ ఖాన్ – 63* నసీం షా – 60ఇదే మ్యాచ్లో షాహీన్ మరో ఘనత కూడా సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల చారిత్రక మైలురాయిని తాకాడు. మొమినుల్ హక్ వికెట్ షాహీన్కు 400వ వికెట్. కేవలం 26 ఏళ్ల వయసులోనే 211 అంతర్జాతీయ మ్యాచ్ల్లో షాహీన్ ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో వన్డేల్లో 139, టీ20ల్లో 136, టెస్ట్ల్లో 125 వికెట్లు ఉన్నాయి.తొమ్మిదో బౌలర్షాహీన్ 400 వికెట్ల క్లబ్లో చేరిన తొమ్మిదో పాకిస్తాన్ బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్ 916 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, వకార్ యూనిస్ 789 వికెట్లు, ఇమ్రాన్ ఖాన్ 544 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.పాకిస్తాన్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు:* వసీం అక్రమ్ – 916* వకార్ యూనిస్ – 789* ఇమ్రాన్ ఖాన్ – 544* షాహిద్ అఫ్రిది – 538* సక్లెయిన్ ముస్తాక్ – 496* సయీద్ అజ్మల్ – 447* షోయబ్ అక్తర్ – 438* ఉమర్ గుల్ – 427* షాహీన్ అఫ్రిది – 400*కాగా, బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో పాక్ వెనుకపడింది. తొలి ఇన్నింగ్స్లో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు తీసి పాక్ను కట్టడి చేయగా, రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 152/3 స్కోరుతో 179 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన బంగ్లా కెప్టెన్ షాంటో, రెండో ఇన్నింగ్స్లో 58 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం చివరి రోజు ఆట కొనసాగుతుంది. -
ఇరాన్ యుద్ధంలో పాక్ దొంగ నాటకాలు?
పశ్చిమాసియా యుద్ధంలో తమది శాంతిదూత పాత్ర అని పాకిస్తాన్ మొదటి నుంచి చెబుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్ మాత్రం కేవలం మధ్యవర్తిగానే చూస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే ఓ అడుగు ముందుకేసి పాక్ పాత్రపై అనుమానాలు సైతం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.యుద్ధంలో ఇరాన్కు పాకిస్తాన్ సహాయం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఇందుకోసం తన కీలక ఎయిర్బేస్ నూర్ ఖాన్ను ఇరాన్ సైనిక విమానాలకు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చిందని ఓ సంచలనాత్మక కథనం తెరపైకి వచ్చింది. పైగా అమెరికా అధికారులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ ఓ కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ ప్రారంభంలో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్కు చెందిన కొన్ని సైనిక విమానాలను పాకిస్తాన్లోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ (రావల్పిండి)కి తరలించిందని సమాచారం. వాటిలో ఒకటి RC-130 రికానైసెన్స్ విమానం కూడా ఉందని తెలుస్తోంది. ఈ తరలింపులు అమెరికా దాడుల నుంచి మిగిలిన ఇరాన్ సైనిక ఆస్తులను రక్షించడమే లక్ష్యమని అంచనా వేస్తున్నాం అని అధికారులు వెల్లడించినట్లు సీబీఎస్ న్యూస్ కథనం పేర్కొంది.ఈ సమాచారం వెలుగులోకి రావడంతో ఇస్లామాబాద్ మధ్యవర్తి పాత్రపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి. తాజా నివేదికపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ స్పందించారు. ‘‘ఈ సమాచారం నిజమైతే, పాకిస్తాన్ మధ్యవర్తి పాత్రను మళ్లీ సమీక్షించాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.ట్రంప్ ఊరుకుంటారా?ఇప్పటికే ఇరాన్ పంపిన ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించారు. దీంతో శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇరాన్కు సాయం తేలిందని ట్రంప్ భావిస్తే పాక్కు చిక్కులు తప్పకపోవచ్చనే విశ్లేషణ నడుస్తోంది. ఇరాన్–అమెరికా చర్చల్లో దాని పాత్రను తగ్గించే అవకాశమో లేదంటే ఆంక్షలు విధించడమో చేయొచ్చని భావిస్తున్నారు. పాక్–చైనా సన్నిహిత సంబంధాల కారణంగా.. ట్రంప్ దీనిని వ్యూహాత్మకంగా కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు.పాక్ వివరణ.. పాకిస్తాన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. నూర్ ఖాన్ బేస్ నగర మధ్యలో ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో విమానాలు నిలిపితే ప్రజల కంటికి దూరంగా ఉంచడం అసాధ్యం అని ఓ సైనికాధికారి సీబీఎస్ న్యూస్కు స్పష్టం చేశారు. మరోవైపు.. ఇరాన్ కొన్ని పౌర విమానాలను ఆఫ్ఘానిస్తాన్కు తరలించినట్లు కూడా ఆ కథనం పేర్కొంది. తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వార్తలను కొట్టిపారేశారు. అయితే అఫ్గన్ సివిల్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఒక ఇరాన్ సివిలియన్ విమానం (మహాన్ ఎయిర్) కాబూల్లో నిలిచిందని.. తర్వాత హెరాత్కి తరలించబడిందని చెప్పారు.వ్యూహాత్మక సమీకరణాలుఇరాన్ యుద్ధంలో చైనా కూడా పాక్ తరహాలోనే ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందా? అనే చర్చ జోరందుకుంది. ఒకవైపు చర్చలు జరగాలని అంటూనే.. మరోవైపు ఇరాన్తో ఉన్న వర్తక వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఆయుధాల్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలను చైనా ఎదుర్కొంటోంది. అయితే.. పాకిస్తాన్ మాత్రం అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే.. ఇరాన్–చైనా అనుబంధాన్ని దూరం పెట్టకుండా జాగ్రత్త పడుతోంది.స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. 2020–2024 మధ్య పాకిస్తాన్ ప్రధాన ఆయుధ దిగుమతుల్లో 80% చైనా నుంచే వచ్చాయి. చైనా కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ప్రశంసించింది. అయితే.. ఇరాన్తో మాత్రం సంబంధాలు కొంతకాలంగా చెడిపోతూ వస్తున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం, గ్యాస్ పైప్లైన్ వివాదాలు, సైనిక ఘర్షణలు ఇరాన్-పాక్ సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. అందుకే ఇరాన్ పాక్ మధ్యవర్తిత్వంపై పూర్తి నమ్మకం చూపడం లేదు.నూర్ ఖాన్ ఎయిర్బేస్ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ వార్తలు దక్షిణాసియా భూభౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంలో పాక్ “శాంతిదూత” ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఇరాన్ యుధ్ధం.. ప్రస్తుత పరిస్థితికాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ.. దాడులు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా నుంచి యుద్ధ పరిహారం, హర్ముజ్ జలసంధిపై సార్వభౌమాధికార గుర్తింపు, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లు చేస్తోంది. ట్రంప్ ఈ ప్రతిపాదనలను “అంగీకరించలేనివి” అని తిరస్కరించారు. అణు ఒప్పందానికి దిగి రావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
పాక్ మునీర్ నోటి దురుసు.. భారత్పై అనుచిత వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్.. మరోసారి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకరి తర్వాత ఒకరు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్తో జరిగిన పోరాటం సాధారణ యుద్ధం కాదని, అది రెండు సిద్ధాంతాల మధ్య జరిగిన యుద్ధమని పేర్కొన్నారు. భారత్పై మరోసారి పలు ఆరోపణలు చేశారు.ఆసిమ్ మునీర్ రావల్పిండిలోని జనరల్ హెడ్క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో సైనికాధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా మునీర్.. ఆపరేషన్ సిందూర్ ప్రస్తావన తెచ్చారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్.. పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతను ఉల్లంఘించిందని ఆరోపించారు. దీనికి పాకిస్థాన్ జాతీయ ఐక్యతతో, పూర్తి సైనిక శక్తితో సమాధానం ఇచ్చిందన్నారు. మార్కా-ఎ-హక్ కేవలం రెండు దేశాల మధ్య జరిగిన సంప్రదాయ యుద్ధం కాదని, అది రెండు భిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన నిర్ణాయక పోరాటమని వ్యాఖ్యానించారు. ఘర్షణ సమయంలో పాకిస్తాన్ 26 లక్ష్యాలపై దాడులు నిర్వహించిందని మునీర్ తెలిపారు.అయితే ఆ దాడులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అలాగే యుద్ధ విరమణ కోసం అమెరికా ద్వారా భారత్ ముందుకొచ్చిందని కూడా ఆరోపించారు. శాంతి ప్రయోజనాల దృష్ట్యా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అన్నారు. భవిష్యత్ యుద్ధాల స్వరూపం పూర్తిగా మారబోతుంది. భూమి, గగనం, సముద్రం, సైబర్, అంతరిక్ష రంగాలను కలుపుకుని మల్టీ డొమైన్ వార్ఫేర్ రూపంలో యుద్ధాలు సాగుతాయని చెప్పారు. అందుకే పాక్ సైన్యం సాంకేతికత, ఆధునిక ఆయుధాలు, శిక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, హంగోర్ క్లాస్ జలాంతర్గాములు, కొత్త రాకెట్ ఫోర్స్, ఆధునిక యుద్ధవిమానాల కొనుగోళ్ల ద్వారా సైనిక సామర్థ్యాన్ని పెంచుతున్నామని మునీర్ తెలిపారు.మరోవైపు భారత్ మాత్రం ఆ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తోంది. కాల్పుల విరమణపై ఎలాంటి మూడో దేశం జోక్యం లేదని, రెండు దేశాల సైనికాధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ద్వారానే అవగాహన కుదిరిందని భారత ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన హక్కును వినియోగించుకుందని, సరిహద్దు దాటి జరిగే ఉగ్రచర్యలను ఇక సహించబోమని కూడా భారత్ పునరుద్ఘాటిస్తోంది. ఇక, భారత్ కూడా.. ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తయిన సందర్భంగా ఉగ్రవాదంపై తన వైఖరిని ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. పాక్ మద్దతుతో జరుగుతున్న సరిహద్దు ఉగ్ర చర్యలకు తగిన సమాధానం ఇస్తామని, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని భారత్ పేర్కొంది. -
జాతీయ విధులకు ఆసీస్ స్టార్లు డుమ్మా
ఐపీఎల్ 2026 కారణంగా పలువురు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు జాతీయ విధులకు డుమ్మా కొట్టారు. త్వరలో జరుగబోయే పాక్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్లకు జట్లను ప్రకటించగా.. అందులో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ తదితరుల పేర్లు కనిపించలేదు.అండర్-19 జట్టు సారధి ఓల్లీ పీక్ తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇతను పాకిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు మాత్రమే ఎంపికయ్యాడు. ఐపీఎల్ స్టార్లు రిటర్న్ రావడంతో బంగ్లాదేశ్ సిరీస్కు పీక్ను ఎంపిక చేయలేదు.కమిన్స్ గైర్హాజరీలో మిచెల్ మార్ష్ రెండు సిరీస్లకు (పాక్, బంగ్లాదేశ్) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే ఇంగ్లిస్, గ్రీన్లకు మూడు జట్లలో చోటు దక్కింది. స్టోయినిస్, మ్యాక్స్వెల్ బంగ్లాదేశ్ సిరీస్కు అందుబాటులో ఉన్నా సెలెక్టర్లు పట్టించుకోలేదు. వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్కు కూడా మూడు జట్లలో చోటు దక్కలేదు. ట్రవిస్ హెడ్ బంగ్లాదేశ్ వన్డే, టీ20 సిరీస్లకు మాత్రమే ఎంపికయ్యాడు.ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరే జట్లతో ఉన్న కూపర్ కన్నోల్లీ, డ్వార్షుయిస్, బార్ట్లెట్ను కూడా పాక్ వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాక్ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో మే 30, జూన్ 2, 4 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.పాకిస్తాన్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, రైలీ మెరెడిత్, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపాఅనంతరం ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్కు వెళ్తుంది. ఈ పర్యటనలో వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో.. టీ20లు 17, 19, 21 తేదీల్లో జరుగన్నాయి.బంగ్లాదేశ్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపాబంగ్లాదేశ్ టీ20ల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా -
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. 21 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 21 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. శనివారం రాత్రి బన్ను జిల్లాలోని ఫతే ఖేల్ పోలీస్ పోస్ట్ను ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నింపిన వాహనంతో ఢీకొట్టారు. అనంతరం సంభవించిన భారీ పేలుడుతో పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టమైంది. మొత్తం 21 మంది జవాన్లు చనిపోయారు. బలగాల కాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారన్నారు. దాడిచేసింది తామేనని ఎవరూ ప్రకటించుకోలేదు. కానీ ఇది తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే
దుబాయ్/ఇస్లామాబాద్: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. -
పాకిస్తాన్ ఆలౌట్.. బంగ్లాదేశ్కు ఆధిక్యం
ఢాకా వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పాక్ తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం ఆటగాడు అజాన్ అవైస్ (103) సెంచరీతో కదంతొక్కగా.. అబ్దుల్లా ఫజల్ (60), సల్మాన్ అఘా (58), మొహమ్మద్ రిజ్వాన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో ఇమామ్ ఉల్ హక్ 45, కెప్టెన్ షాన్ మసూద్ 9, సౌద్ షకీల్ డకౌట్, నౌమన్ అలీ 2, షాహీన్ అఫ్రిది 13, హసన్ అలీ 6, మొహమ్మద్ అబ్బాస్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం తలో 2, నహిద్ రాణా ఓ వికెట్ తీశారు.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 413 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (101) సెంచరీతో సత్తా చాటాడు. మొమినుల్ హక్ (91) సెంచరీ మిస్ అయ్యాడు. ముష్ఫికర్ రహీం (71) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ప్లేయర్లలో మహ్మదుల్ హసన్ జాయ్ 8, షద్మాన్ ఇస్లాం 13, లిటన్ దాస్ 33, మెహిద్ హసన్ మిరాజ్ 10, తైజుల్ ఇస్లాం 17, ఎబాదత్ హొసేన్ డకౌట్, తస్కిన్ అహ్మద్ 28, నహిద్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 5 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. కాగా, పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. 34 పరుగుల ఆధిక్యంలో..!27 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 34కు చేరింది. ఓపెనర్లు మహ్మదుల్ జాయ్ 2చ, షద్మాన్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. -
నెత్తురోడిన పోలీస్ చెక్పోస్ట్.. 12 మంది బలి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బన్ను ప్రాంతంలో గల ఓ పోలీస్ చెక్పోస్ట్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. కారు బాంబు, ఆటోమేటిక్ ఆయుధాలు, డ్రోన్ల సహాయంతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 12 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.మృత్యువులా దూసుకొచ్చిన కారు బాంబుఈ దారుణ ఘటన బన్నులోని ఫతే ఖేల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో ఆత్మాహుతి దళానికి చెందిన ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన కారుతో పోలీస్ చెక్పోస్ట్ను వేగంగా వచ్చి ఢీకొట్టాడు. కారు బాంబు పేలుడు ధాటికి చెక్పోస్ట్ ధ్వంసం కాగానే, అప్పటికే పొంచి ఉన్న ఇతర ఉగ్రవాదులు ఒక్కసారిగా లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఊహించని దాడిలో 12 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొక అధికారి ఆచూకీ గల్లంతైంది.దాడిలో డ్రోన్లు, భారీ ఆయుధాలుఈ దాడిని ఉగ్రవాదులు అత్యంత పకడ్బందీగా అమలు చేసినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు కేవలం తుపాకులకే పరిమితం కాకుండా, క్వాడ్కాప్టర్లను (చిన్న డ్రోన్లు), భారీ ఆయుధాలను సైతం వినియోగించడం దాడి తీవ్రతకు అద్దం పడుతోంది. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నారని, వెళ్తూ పోలీసుల ఆయుధాలతో పాటు కొందరు సిబ్బందిని కూడా తమ వెంట తీసుకెళ్లారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ముమ్మరంగా గాలింపు చర్యలుఈ భీకర దాడి నేపథ్యంలో అప్రమత్తమైన పాక్ అధికారులు ఆ ప్రాంతం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్లు, గాలింపు చర్యలు చేపట్టారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భద్రతా బలగాల చెక్పోస్టులు, పెట్రోలింగ్ యూనిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతుండటం సరిహద్దుల్లో అస్థిరతకు దారి తీస్తోంది.


