అది దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్. అందులోని ఓ గదిలో సుకేష్ చంద్రశేఖర్ చాలా తాపీగా కూర్చున్నాడు. అంతలో ఉన్నట్టుండి అక్కడకు పోలీసులు వచ్చారు. వాళ్లు వచ్చే సమయానికి అతడి చేతికి రూ. 6.5 కోట్ల విలువైన బ్రేస్లెట్ ఉంది. దాదాపు 7 లక్షల రూపాయల విలువైన బూట్లు, 1.3 కోట్ల రూపాయల నగదు, ఇంకా చాలా చాలా విలాసవంతమైన వస్తువులున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన టీటీవీ దినకరన్ తరఫున ఎన్నికల కమిషన్కు లంచం ఇచ్చేందుకు బెంగళూరుకు చెందిన చంద్రశేఖర్ ఢిల్లీకి వచ్చాడని ఆ తర్వాత విచారణలో తేలింది. తమ పార్టీకి రెండాకుల గుర్తు వచ్చేందుకు 50 కోట్ల వరకు ఇవ్వడానికి తాను సిద్ధమని దినకరన్ చంద్రశేఖరన్కు చెప్పినట్లు తెలిసింది.
నగరంలో నల్లధనం గురించి తమకు సమాచారం రావడంతో తాము సోదాలు చేసి, చంద్రశేఖర్ను అరెస్టు చేశామని, కానీ ఇది ఇంత పెద్ద కేసన్న విషయం ఆ తర్వాత తెలిసిందని పోలీసులు కూడా అంటున్నారు. ఢిల్లీలో పని మొదలుపెట్టడానికి ముందుగా రూ. 10 కోట్లు సుకేష్కు ఇచ్చారని సమాచారం. అయితే, ఎన్నికల కమిషన్ అధికారుల వద్దకు ఈ లంచం ప్రతిపాదన ఏమైనా వెళ్లిందా లేదా అనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. ఢిల్లీలో పోలీసులు పట్టుకునేసరికి సుకేష్ లూయిస్ విట్టన్ చెప్పులు వేసుకున్నాడు. అతడి మీద చెన్నై, బెంగళూరు నగరాల్లో 12 కేసులున్నాయి. వాటిలో మోసం, ఫోర్జరీ.. ఇలా రకరకాలవి ఉన్నాయి. ఢిల్లీలో చాలా ఫ్యాన్సీ ఫాంహౌస్లు ఉన్నాయి. అతడి నెట్వర్క్ చాలా పెద్దదని, దినకరన్కు ఇతడు నాలుగేళ్లుగా తెలుసని పోలీసుల సమాచారం.
సుకేష్ చంద్రశేఖర్ ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేశాడు. 17 ఏళ్ల యవసులో తొలిసారిగా ఒక స్కాంలో ఇతగాడి పేరు బయటకు వచ్చింది. తన సొంత ఊళ్లో బ్రోకర్గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులను అమ్మేసేవాడు. అప్పటికి మైనర్ కావడంతో అరెస్టు చేయలేకపోయారు. కానీ ఏడాది తర్వాత సరిగ్గా అదే పద్ధతిలో చెన్నైలో పెద్ద వ్యవహారం చేస్తూ దొరికేసి, కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత ఉత్తరాదికి వ్యాపారాన్ని విస్తరించాడు. నకిలీ బీమా పాలసీలు అమ్ముతూ అతి తక్కువ కాలంలో 3 వేల కోట్లు సంపాదించాడు. తనను తాను ఎంపీగా చెప్పుకోడానికి నకిలీ ఐడీ కార్డులు కూడా వాడేవాడట! అతడి దగ్గర సీజ్ చేసిన ఒక బీఎండబ్ల్యు, ఒక మెర్సిడిస్ కార్ల మీద 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' అనే స్టిక్కర్లు లైసెన్సు ప్లేట్ల మీద ఉన్నాయి.
తమిళ నటిని పెళ్లాడి...
మద్రాస్ కేఫ్, బిర్యానీ లాంటి సినిమాల్లో నటించిన లీనా మేరీ పాల్ను చంద్రశేఖర్ పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీళ్లిద్దరినీ 2015 సంవత్సరంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కారణం మోసం చేయడమే. తనకు కేంద్రంలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయని, తాను తలచుకుంటే బెంగళూరు జైలు నుంచి శశికళను కూడా బయటకు రప్పించగలనని చెప్పుకొనేవాడట.
సుకేష్.. చాలా సుఖ పురుషుడు!
Published Mon, Apr 17 2017 7:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement