8 వికెట్లు కోల్పోయి 23 పరుగుల లీడింగ్లో ఆస్ట్రేలియా | Sakshi
Sakshi News home page

8 వికెట్లు కోల్పోయి 23 పరుగుల లీడింగ్లో ఆస్ట్రేలియా

Published Fri, Dec 19 2014 9:32 AM

8 వికెట్లు కోల్పోయి 23 పరుగుల లీడింగ్లో ఆస్ట్రేలియా

బ్రిస్బేన్:   భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు 92.2 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 431 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులకు ఆలౌటయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా 23 పరుగులు, రెండు వికెట్లు లీడింగ్లో ఉంది.

ఆస్ట్రేలియా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాత్ శర్మ బౌలింగ్లో స్మిత్, జాన్సన్ ఇద్దరూ అవుటయ్యారు.  221/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 232 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.  247 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 395 పరుగుల వద్ద ఏడవ వికెట్ కోల్పోయింది. ఈ రోజు మిషెల్ మార్ష్ 11 పరుగులు, హిద్దీన్ 6, స్మిత్ 133, జాన్సన్ 88 పరుగులు చేసి అవుటయ్యారు.
**

Advertisement
 
Advertisement