-
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. -
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
ఐసీసీ మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23 టైటిల్ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్ ర్యాంకు పదిలంగా ఉంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-51. ఆస్ట్రేలియా- 124 రేటింగ్ పాయింట్లు2. ఇండియా- 120 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 105 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 103 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 96 రేటింగ్ పాయింట్లు.మెన్స్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా -122 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్ పాయింట్లు3. సౌతాఫ్రికా- 112 రేటింగ్ పాయింట్లు4. పాకిస్తాన్- 106 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 101 రేటింగ్ పాయింట్లుమెన్స్ టీమ్ టీ20 ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా- 264 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 252 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 250 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 250 రేటింగ్ పాయింట్లుచదవండి: -
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
సాక్షి, చెన్నై : గల్లంతైన వారి పేర్లన్నీ మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్కు అవకాశం కల్పించాలని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ ఓటరు దాఖలు చేసిన పిటిషన్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, కౌంటింగ్ నిలుపుదల కోసం స్టే ఇవ్వలేమని పేర్కొంటూ ఓటరు పిటిషన్ విచారణను ముగించారు. వివరాలు.. ఆస్ట్రేలియా నుంచి వచ్చి తన హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నించిన వైద్యుడు స్వతందిర కన్నన్కు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గంలో నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. ఓటరు జాబితాలో తన పేరు గల్లంతు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు.తన లాంటి వారెందరి పేర్లో జాబితాలో గల్లంతు కావడాన్ని పరిగణించి హైకోర్టులో పిటిషన్ వేశాడు. గల్లంతైన వారి పేర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని, ఓటుహక్కుకలి ్పంచాలని విన్నవించాడు. ఈ పిటిషన్ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ గంగాపూర్వాల, న్యాయమూర్తి చంద్రశేఖరన్ బెంచ్ విచారించింది. ఎన్నికల కమిషన్ తరపున సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచారు. జనవరిలోనే తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరగిందని గుర్తించారు. పిటిషనర్ సంబం«ధిత నియోజకవర్గం లేరని, ఆయన ఆ్రస్టేలియాలో నివాసం ఉన్నారని వివరించారు. 2021లోనే జాబితా నుంచి పిటిషనర్ పేరు తొలగించ బడ్డట్టు, తుది ఓటరు జాబితా ప్రకటించిన సమయంలో ఎందుకు పిటిషనర్ ఆక్షేపన వ్యక్తం చేయలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.తుది ఓటరు జాబితా సమయంలోనే పరిశీలించి ఉండాలని, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి అప్పుడే తీసుకొచ్చి ఉండాలని వాదించారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. పేర్లు మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్కు అవకాశం కల్పించాలన్న పిటిషనర్ వాదనపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్నారు. అలాగే, కోయంబత్తూరు నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ను నిలుపుదల చేయలేమని పేర్కొంటూ, ఈ పిటిషన్ విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడంతో ఓటరుకు మిగిలింది నిరాశే. సర్కారు సినిమాలో తరహా ఏదేని ఉత్తర్వులు వస్తాయన్న ఎదురు చూపులలో ఉన్న వారికి భంగపాటు తప్పలేదు. -
టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్కు ప్రత్యామ్నాయ వికెట్కీపర్గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్లో పసికూన ఒమన్తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
స్టీవ్ స్మిత్కు షాక్.. ఆసీస్ వరల్డ్కప్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!
ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్కప్ జట్టులోకి వస్తాడని సమాచారం. జట్టు ప్రకటనకు మే 1 డెడ్లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్కు జాతీయ జట్టు ఓపెనర్గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్పై ఉండనే ఉంది. స్మిత్కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టులో స్మిత్కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. -
ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్ మహిళా స్టార్ క్రికెటర్..
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్ను నిశ్చితార్థం చేసుకుంది. గత మూడేళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను గార్డ్నర్ సోషల్మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గార్డ్నర్, మోనికాలు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. గార్డ్నర్ను సపోర్ట్ చేసేందుకు మోనికా చాలా సందర్బాల్లో స్టేడియం వచ్చేది. 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది. గార్డనర్ తన కెరీర్లో ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్ల్లో ఆసీస్కు ప్రాతినిథ్యం వహించింది. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తోంది. View this post on Instagram A post shared by Ashleigh Gardner (@ashleigh_gardner97) -
బెయిల్ నిరాకరణ.. కోర్టులో కూప్పకూలిన ఆసీస్ మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేటర్ వివాదంలో చిక్కుకున్నాడు. భార్యపై గృహ హింసకు పాల్పడడం, మహిళల్ని వెంబడించడం, దొంగతనానికి పాల్పడడం వంటి కేసుల్లో భాగంగా స్లేటర్ను క్వీన్స్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఏకంగా 19 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ మధ్యలో అతను ఈ నేరాలకు పాల్పడినట్లు కేసులు రిజిష్టర్ అయ్యాయి. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మైఖేల్ స్లేటర్కు క్వీన్స్లాండ్ మేజిస్ట్రేట్ కోర్టు షాకిచ్చింది. అతడి బెయిల్ ధరఖాస్తును కోర్టు తిరస్కరించింది. అతడికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుపై తదుపరి విచారణను మే 31కు కోర్టు వాయిదా వేసింది. ఈ విషయం తెలిసిన స్లేటర్ కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. కరెక్షనల్ సర్వీసెస్ సిబ్బంది అతడిని తన సెల్కు తీసుకు వెళ్తుండగా స్లేటర్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది. అదేవిధంగా స్లేటర్ ప్రస్తుతం మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గతంలో పలుమార్లు కోర్టు ఆదేశాలను స్లేటర్ ధిక్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా తరపున 74 టెస్టులు, 42 వన్డేలు ఆడిన స్లేటర్ 42.83 సగటుతో 5,312 పరుగులు సాధించాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన స్లేటర్ ఆ తర్వాత టీవీ కామెంటేటర్గా రాణించాడు. ఛానెల్ 9, ఛానల్ 7లలో పనిచేశారు. -
పాట్ కమిన్స్కు ప్రతిష్టాత్మక అవార్డు
సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్కు (ఆస్ట్రేలియా) ప్రతిష్టాత్మక విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను విజ్డెన్ ఈ అవార్డుకు పాట్ను ఎంపిక చేసింది. గతేడాది వ్యక్తిగతంగా, కెప్టెన్గా సాధించిన ఘనతలకు గాను పాట్ను ఈ అవార్డు వరించింది. కమిన్స్ 2023లో కెప్టెన్గా వన్డే వరల్డ్కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, యాషెస్ సిరీస్లను గెలిచాడు. గతేడాది ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సైతం దక్కించుకున్న కమిన్స్.. వ్యక్తిగత ప్రదర్శనల కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్, ఇంగ్లండ్తో బాక్సింగ్ డే టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తదితర అవార్డులు అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని కూడా విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న కమిన్స్.. ఈ సీజన్ వేలంలో 20.5 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. విజ్డెన్.. కమిన్స్తో పాటు ఉస్మాన్ ఖ్వాజా, మిచెల్ స్టార్క్, ఆష్లే గార్డ్నర్ (ఆసీస్ మహిళా క్రికెటర్), హ్యారీ బ్రూక్, మార్క్ వుడ్ లాంటి అత్యుత్తమ ప్రతిభావంతులను కూడా సత్కరించింది. 2015 నుంచి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నవారు.. 2015లో కేన్ విలియమ్సన్ 2016లో విరాట్ కోహ్లి 2017లో విరాట్ కోహ్లి 2018లో విరాట్ కోహ్లి 2019లో బెన్ స్టోక్స్ 2020లో బెన్ స్టోక్స్ 2021లో జో రూట్ 2022లో బెన్ స్టోక్స్ 2023లో పాట్ కమిన్స్ -
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
మేజర్ లీగ్ క్రికెట్లో సన్రైజర్స్ స్టార్ ప్లేయర్
అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్ బరిలో మరో ఆస్ట్రేలియా ఆటగాడు నిలిచాడు. ఐపీఎల్లో సన్రైజర్స్కు హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రవిస్ హెడ్ వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి ఇదివరకే చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆసీస్ లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మోసస్ హెన్రిక్స్ ఈ జట్టుకు సారధ్యం వహిస్తుండగా.. స్టీవ్ స్మిత్, తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ లాంటి ఆసీస్ ప్లేయర్స్ ఆటగాళ్లుగా బరిలోకి దిగనున్నారు. వాషింగ్టన్ ఫ్రీడంతో ఇటీవలే ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాంటింగ్ ఎంఎల్సీ తదుపరి సీజన్ నుంచి ఈ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఈ ఆసీస్ ఆటగాళ్లంతా కలిసి జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్సీ సెకెండ్ ఎడిషన్లో వాషింగ్టన్ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు ఎంఎల్సీలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడనున్నారు. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్రైడర్స్కు.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్కు ప్రాతినిథ్యం వహించనున్నారు. మేజర్ లీగ్ టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ప్రారంభమవుతుంది. ఈ లీగ్లో ఆసీస్ ఆటగాళ్లే కాక చాలామంది విదేశీ ఆటగాళ్లు పాల్గొననున్నారు. న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర కూడా కొత్తగా వాషింగ్టన్ ఫ్రీడంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. సౌతాఫ్రికా మార్కో జన్సెన్, వెస్టిండీస్ అకీల్ హొసేన్ను వాషింగ్టన్ ఫ్రీడం తిరిగి రీటైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో వెల్లడికానుంది. -
Sydney Mall Attack మహిళలపై అంత పగ ఎందుకు? ఎవరీ జోయెల్?
సిడ్నీ వెస్ట్ఫీల్డ్ షాపింగ్ మాల్లో మారణహోం సృష్టించిన నిందితుడిని జోయెల్ కౌచీగా పోలీసులు గుర్తించారు. మహిళలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు సోమవారం వెల్లడించారు. జోయెల్ మొత్తం ఆరుగురిని పొడిచి చంపగా అందులో ఐదుగురు మహిళలే ఉన్నారని చెప్పారు. అలాగే ఈ దుర్మార్గుడి దాడిలో గాయపడిన 12 మందిలో మహిళలే ఎక్కువ ఉండటం గమనార్హం. దీనిపైనే పోలీసులు ఇపుడు దృష్టి సారించారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి మాల్లో పెద్ద కత్తితో తిరుగుతూ అరగంట పాటు హల్ చల్ చేశాడని, ఈ దాడిలో మహిళల్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆస్ట్రేలియా పోలీసులు సోమవారం తెలిపారు. బాధితులను చైనాకు చెందిన విద్యార్థిని యియువాన్ చెంగ్ గుర్తించారు. మిగిలిన వాళ్లలో ఒక డిజైనర్, ఒక స్వచ్ఛంద సేవకురాలు, ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, 9 నెలల పసిబిడ్డ, ఆమె తల్లితోపాటు, పాకిస్థాన్కు చెందిన 30 ఏళ్ల సెక్యూరిటీ గార్డు ఫరాజ్ తాహిర్గా గుర్తించారు. Joel Cauchi’s father: “This crime should never have happened.” @6NewsAU pic.twitter.com/zNEoAveb4E — Roman Mackinnon (@RomanMackinnon6) April 15, 2024 కాబోయే భర్తతో మాట్లాడుతూ ఉండగా ఆరో బాధితురాలు, చైనా విద్యార్థిని తన కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదం. Sydney is a city reeling, in mourning, and desperate for answers to explain Joel Cauchi's heinous knife attack at Bondi Junction. #9News LATEST: https://t.co/BaBiRjwTXk pic.twitter.com/Vd453KKrBU — 9News Sydney (@9NewsSyd) April 15, 2024 ఎవరీ జోయెల్ కౌచి? ♦ జోయెల్ కౌచి సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం, క్వీన్స్లాండ్లోని బ్రిస్బేన్ సమీపంలోని టూవూంబా నుండి వచ్చాడు. స్థానిక ఉన్నత పాఠశాల , విశ్వవిద్యాలయంలో చదివాడు. ♦ జోయెల్ కౌచి తన కుడి చేతిపై పలు రంగుల్లో డ్రాగన్ టాటూ ఉంది. ఇదే అతణ్ణి గుర్తించడంలో కీలకంగా మారింది. ♦ టీనేజ్నుంచి మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాడని కుటుంబం చెబుతోంది. ♦ అడపాదడపా మెసేజ్లద్వారా మాత్రమే టచ్ లో ఉండేవాడని అతని తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు. ♦ దాడికి ఒక నెల ముందు, జోయెల్ కౌచి సిడ్నీకి వెళ్లి ఒక రూం అద్దెకు తీసుకున్నాడు. అక్కడ జోయెల్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సిడ్నీ మాల్లో కత్తిపోట్లు.. అయిదుగురు మృతి
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బిజీగా ఉంటే ఓ షాపింగ్మాల్లో కాల్పులు, కత్తిపోట్ల దాడి జరిగింది. వెస్ట్ఫీల్డ్ బోండీ జంక్షన్లోని మాల్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో అయిదుగురు పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానిక సమయం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3. 40 గంటలకు(భారత కాలమాన ప్రకారం 12.30PM ) వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు మాల్లోకి ప్రవేశించి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళా పోలీసు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కత్తిపోట్లకు గురై మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. కత్తిపోట్లు, కాల్పులతో దద్దరిల్లిన ఆ మాల్ నుంచి వందల సంఖ్యలో జనం పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. UPDATE: Sydney Terrorist Attack It was an 'ISLAMIC TERROR ATTACK' It's 100% confirm now. Terrorist was Pro - Palestine and Hezbollah. This Jihadi stabbed a 9 month old too. Inhuman cult !! pic.twitter.com/8Enj83dOch — Sunanda Roy 👑 (@SaffronSunanda) April 13, 2024 ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి భయానకంగానే ఉంది. మాల్లో ఉన్న వారిని అధికారులు బయటకు పంపించారు. అటువైపు ఎవరూ రావొద్దని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోల్లో ఒక వ్యక్తి పెద్ద కత్తితో మాల్లో తిరగడం కనిపిస్తోంది. గాయపడిన వ్యక్తులు నేలపై పడిపోయారు. వారిలో తల్లీబిడ్డ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి రక్తస్రావాన్ని ఆపేందుకు దుకాణంలోని దుస్తుల్ని ఉపయోగించినట్లు చెప్పారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Officer's heroic actions at Sydney mall saved lives. Deserves highest honor, like Cross of Valour, for bravery and selflessness. #Sydney #bondi #Australia pic.twitter.com/ycdiQlom4u — Rudra 🔱 (@invincible39) April 13, 2024 -
మళ్లీ ఓడిన భారత్
పెర్త్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు ఖాతాలో వరుసగా నాలుగో పరాజయం చేరింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో టీమిండియా 1–3 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (12వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్ (19వ, 47వ ని.లో) రెండు గోల్స్, జేక్ వెల్చ్ (54వ ని.లో) ఒక గోల్ అందించారు. ఈ సిరీస్లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు జరుగుతుంది. -
మేజర్ లీగ్ క్రికెట్లో స్టీవ్ స్మిత్.. వాషింగ్టన్ ఫ్రీడంతో ఒప్పందం
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొననున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీ స్టీవ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్సీ రెండో సీజన్లో స్టీవ్ బరిలోకి దిగనున్నాడు. స్టీవ్ ఎంఎల్సీ అరంగేట్రం సీజన్లో ఇదే వాషింగ్టన్ ఫ్రీడంకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. 𝐒𝐦𝐮𝐝𝐠𝐞 x 𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 = 😍 Welcome the the family, 𝐒𝐭𝐞𝐯𝐞 𝐒𝐦𝐢𝐭𝐡 ❤️#WashingtonFreedom #MLC2024 #SteveSmith pic.twitter.com/bGrzxlsr61 — Washington Freedom (@WSHFreedom) April 11, 2024 వాషింగ్టన్ ఫ్రీడంకు ఆసీస్ ఆటగాడు మోసెస్ హెన్రిక్స్ కెప్టెన్సీ వహిస్తుండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో హెన్రిక్స్తో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నారు. వచ్చే సీజన్ నుంచి స్టీవ్ వీరితో జతకట్టనున్నాడు. ఎంఎల్సీ రెండో సీజన్ కోసం మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్రైడర్స్తో.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, స్టీవ్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. లీగ్ క్రికెట్లో సైతం ఫ్రాంచైజీలు ఇతనికి ఆసక్తి చూపడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో స్టీవ్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. నిదానంగా బ్యాటింగ్ చేస్తాడనే కారణంగా ఏ ఫ్రాంచైజీ స్టీవ్ను సొంతం చేసుకోవడం లేదు. స్టీవ్ టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశం లభించేలా లేదు. ఆసీస్ టాపార్డర్ బెర్తులు ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్లతో భర్తీ అయ్యాయి. -
భారత హాకీ జట్టుకు ‘హ్యాట్రిక్’ ఓటమి
ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. పెర్త్లో బుధవారం జరిగిన మూడో మ్యాచ్లో టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ (41వ ని.లో) ఏకైక గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్ (44వ, 49వ ని.లో) రెండు గోల్స్ అందించి గెలిపించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా 3–0తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ రేపు జరుగుతుంది. -
భారత్కు భారీ ఓటమి
పెర్త్: ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల హాకీ సిరీస్ను భారత జట్టు పరాజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తొలి టెస్టులో ఆ్రస్టేలియా 5–1 గోల్స్ తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. ఆరంభంనుంచి చివరి వరకు తమ పట్టు నిలబెట్టుకున్న కంగారూలు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆసీస్ సాధించిన ఐదు గోల్స్లో నాలుగు ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం. ఆస్ట్రేలియా తరఫున బ్రాడ్ టిమ్ (3వ నిమిషం), వికామ్ టామ్ (20వ ని., 38వ ని.), రింటాలా జోయెల్ (37వ ని.), ఒగిల్వి ప్లయిన్ (57వ ని.) గోల్స్ కొట్టారు. భారత్ తరఫున ఏకైక గోల్ను గుర్జంత్ సింగ్ (47వ ని.) నమోదు చేశాడు. మ్యాచ్ మొదలైన కొద్ది సేపటికే లాంగ్ పాస్ అందుకున్న బ్రాడ్... భారత ఆటగాడు జర్మన్ప్రీత్ను దాటి గోల్ పోస్ట్ను ఛేదించడంలో సఫలమయ్యాడు. 10వ నిమిషంలో భారత్కు పెనాల్టీ దక్కినా అది గోల్గా మారలేదు. ఆ తర్వాత ఆసీస్ భారత డిఫెన్స్పై ఒత్తిడి పెంచింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచిన ఆసీస్ మూడో క్వార్టర్లోనూ దూకుడు సాగించింది. అయితే చివరి క్వార్టర్లో కోలుకున్న భారత్ ప్రతిఘటించింది. రెండు నిమిషాలకే రాహిల్ ఇచి్చన పాస్ను అందుకున్న గుర్జంత్ దానిని గోల్గా మలిచాడు. కొద్ది సేపటికే పెనాల్టీ వచి్చనా భారత్ దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు నేడు జరుగుతుంది. -
టీ20 సిరీస్ కూడా ఆస్ట్రేలియాదే.. మరో క్లీన్ స్వీప్
మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఆసీస్ మహిళా టీమ్ ఇంటాబయటా అన్న తేడా లేకుండా, ఫార్మాట్లకతీతంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా ఆసీస్ ఖాతాలో మరో రెండు సిరీస్లు చేరాయి. ఆసీస్.. బంగ్లాదేశ్ను వారి సొంత దేశంలో మట్టికరిపించి వన్డే, టీ20 సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది. 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటించిన ఆస్ట్రేలియా.. తొలుత వన్డే సిరీస్ను, తాజాగా టీ20 సిరీస్ను 3-0 తేడాతో ఊడ్చేసింది. టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) జరిగిన మూడో మ్యాచ్లో ఆసీస్ 77 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఇదివరకే సిరీస్ కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ ఆల్రౌండ్ షో చేసి గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హీలీ (45), మెక్గ్రాత్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో నహీద అక్తర్ 3 వికెట్లతో సత్తా చాటింది. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తైలా వ్లేమ్నిక్ (3/12), జార్జియా వేర్హమ్ (2/1), సోఫీ మోలినెక్స్ (1/15) ధాటికి 18.1 ఓవర్లలో78 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో నిగార్ సుల్తాన్ (32) టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఆసీస్ భారీ విజయాలు సాధించింది. దీనికి ముందు జరిగిన వన్డే సిరీస్ను సైతం ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. -
హ్యాట్రిక్తో చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్.. కెరీర్లో రెండోది
మహిళల క్రికెట్లో ఇవాళ (ఏప్రిల్ 2) బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్ ఆడుతున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ రెండో టీ20 ఆడుతుంది. ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్ ఫరిహా త్రిస్న హ్యాట్రిక్తో చెలరేగింది. త్రిస్నకు టీ20ల్లో ఇది రెండో హ్యాట్రిక్. 2022లో త్రిస్న తన టీ20లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టింది. త్రిస్న దెబ్బకు నేటి మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులకు త్రిస్న.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్, బెత్ మూనీలను ఔట్ చేసింది. తన కోటా నాలుగు ఓవర్లు వేసిన త్రిస్న.. 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. HAT-TRICK for Fariha Trisna in T20i against Australia women#BCB #Cricket #BANWvAUSW #LiveCrcket #HomeSeries #T20Iseries #womenscricket pic.twitter.com/I00NUVXNg3 — Bangladesh Cricket (@BCBtigers) April 2, 2024 బంగ్లా బౌలర్లలో త్రిస్నతో పాటు నహీద అక్తర్ (4-0-21-2), ఫహీమా ఖాతూన్ (4-0-34-2) కూడా వికెట్లు పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్లో వేర్హమ్ (57), గ్రేస్ హ్యరీస్ (47) మాత్రమే రాణించారు. ఆఖర్లో పెర్రీ (29) వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. తహిల మెక్గ్రాత్ (19) రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా ప్లేయర్స్ అంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమతమయ్యారు. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 9.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్, మోలినెక్స్ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్ను కష్టాల్లోకి నెట్టారు. ముర్షిదా ఖాతూన్ (8), శోభన మోస్తరీ (5), నిగార్ సుల్తాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. దిలారా అక్తర్ (27), ఫహీమా ఖాతూన్ (3) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే 65 బంతుల్లో 115 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఈ సిరీస్లో ఆసీస్ తొలి మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతుంది. -
స్టోయినిస్కు మొండిచెయ్యి.. కొత్తగా నలుగురికి అవకాశం
2024-25 సంవత్సరానికి గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించిన 23 మంది ఆటగాళ్ల జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ (మార్చి 28) ప్రకటించింది. ఈ జాబితాలో లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ మార్కస్ స్టోయినిస్, ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్కు చోటు దక్కలేదు. వీరితో పాటు ఆస్టన్ అగర్, మార్కస్ హ్యారిస్, మైకేల్ నెసర్, మ్యాట్ రెన్షాలకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్ లభించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా నలుగురు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్ కల్పించింది. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మ్యాట్ షార్ట్, ఆరోన్ హార్డీ కొత్తగా కాంట్రాక్ట్ పొందిన వారిలో ఉన్నారు. ఈ నలుగురిలో బార్ట్లెట్ తొలిసారి కాంట్రాక్ట్ పొందగా.. మిగతా ముగ్గురు గతంలో వార్షిక కాంట్రాక్ట్ పొందారు. ఈ వార్షిక కాంట్రాక్ట్ టీ20 వరల్డ్కప్ అనంతరం అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా 2024-25: సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, జే రిచర్డ్సన్, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
బంగ్లాదేశ్ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఖాతాలో మరో సిరీస్ చేరింది. ఇటీవలే న్యూజిలాండ్ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన ఆసీస్.. తాజాగా బంగ్లాదేశ్ను సైతం వారి స్వదేశంలో మట్టికరిపించింది. ఐసీసీ వన్డే ఛాంపియన్షిప్లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (మార్చి 27) జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించింది. తొలి వన్డేలో 118 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. A historic victory for Australian women, they secured a 3-0 win over Bangladesh in their inaugural ODI bilateral series. pic.twitter.com/hvsjzemRWf — CricTracker (@Cricketracker) March 27, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఢాకాలో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 26.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. కిమ్ గార్త్, ఆష్లే గార్డ్నర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఎల్లిస్ పెర్రీ, మోలినెక్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్లో నిగర్ సుల్తానా (16), షోర్ణా అక్తర్ (10), సుల్తానా ఖాతూన్ (10), మరుఫా అక్తర్ (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 18.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అలైసా హీలీ 33, లఫోబ్ లిచఫీల్డ్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. ఎల్లిస్ పెర్రీ 27, బెత్ మూనీ 21 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్ను గెలిపించారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, రబెయా ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. -
IND VS AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ హైఓల్టేజ్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్ల సిరీస్గా మారింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్గా సాగనుంది. పింక్ బాల్తో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన టికెట్లు జూన్ 4 నుంచి ఆన్లైన్లో లభ్యమవుతాయి. ఇటీవలికాలంలో జరిగిన నాలుగు BGT సిరీస్లను వరుసగా కైవసం చేసుకున్న టీమిండియా.. ఐదో సిరీస్పై కన్నేసింది. భారత్ 2017, 2019, 2021, 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్.. నవంబర్ 22-26- పెర్త్ డిసెంబర్ 6-10- అడిలైడ్ ఓవల్ (డే అండ్ నైట్, పింక్ బాల్ టెస్ట్) డిసెంబర్ 14-18- గబ్బా డిసెంబర్ 26-30- మెల్బోర్న్ 2025 జనవరి 3-7- సిడ్నీ -
Sheffield Shield 2024 Final: సెంచరీతో కదంతొక్కిన సామ్
ఫెఫీల్డ్ షీల్డ్ 2023-24 ఎడిషన్ ఫైనల్ ఇవాళ (మార్చి 21) ప్రారంభమైంది. టస్మానియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ వైట్మన్ (104) సెంచరీతో కదంతొక్కగా.. ఆర్కీ షార్ట్ (50), హిల్టన్ కార్ట్వైట్ (55), కూపర్ కొన్నొల్లీ (73 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. మరి కొద్ది సమయంలో తొలి రోజు ఆట ముగుస్తుందనగా.. కూపర్ చెలరేగిపోయాడు. టస్మానియా బౌలర్లపై బౌండీరలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టస్మానియా బౌలర్లలో ఫ్రీమన్ 3 వికెట్లు పడగొట్టగా.. లియాన్ కర్లిసైల్ 2, రిలే మెరిడిత్, గేబ్ బెల్, వెబ్స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో టస్మానియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టోర్నీలో ఈ సారి కూడా ఫైనలిస్ట్ అయిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది. ఈ జట్టు గడిచిన రెండు సీజన్లలో ఛాంపియన్గా కొనసాగుతూ హ్యాట్రిక్పై కన్నేసింది. -
118 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళల టీమ్ 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అలానా కింగ్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి ఆసీస్ గెలుపులో ప్రధానపాత్ర పోషించింది. రాణించిన సదర్ల్యాండ్.. విరుచుకుపడిన అలానా 146 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి 200 పరుగుల మార్కును కూడా దాటలేదనుకున్న ఆస్ట్రేలియాను సదర్ల్యాండ్ (76 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు), అలానా కింగ్ (31 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకున్నారు. ఆఖర్లో అలానా కింగ్ బంగ్లా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ఫలితంగా ఆసీస్ 200 పరుగుల మార్కును దాటింది. సదర్ల్యాండ్, అలానాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్లో హీలీ (24), మూనీ (25), గార్డ్నర్ (32), వేర్హమ్ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, నహిద అక్తెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తెర్, ఫహీమా ఖాతూన్, షోర్ణా అక్తెర్ తలో వికెట్ పడగొట్టారు. గార్డ్నర్, కింగ్ మాయాజాలం.. కుప్పకూలిన బంగ్లాదేశ్ 214 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. గార్డ్నర్ (5-1-22-3), కిమ్ గార్త్ (7-1-26-2), అలానా కింగ్ (10-3-12-1), మెగాన్ షట్ (6-1-5-1) ధాటికి 95 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో సోభన (17), ముర్షిదా ఖాతూన్ (10), నిగర్ సుల్తాన్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 24న జరుగనుంది. -
ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..
ఆస్ట్రేలియా షెగెలోసిస్ వ్యాధి(షిగెల్లా బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి) తీవ్ర కలకలం రేపుతుంది. ఆస్ట్రేలియాలోని స్టేట్ విక్టోరియాలో ఎసోటెరిక్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. దీనికి హాజరైన ప్రజలలో కొంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ ఫెస్టివల్ డోనాల్డ్లో మార్చి8 నుంచి మార్చి12వ తేది వరకు జరిగింది. ఆ ఫెస్టివల్కి హాజరైన వారిలో దాదాపు 230 మంది దాక షిగెలోసిస్కి సంబంధించిన జీర్ణశయాంతర పేగు సంబంధిత లక్షణాలను ఎదుర్కొన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు ఆ ఫెస్టివల్కి హజరైన వారలో ఇంకెవరికైనా అలాంటి లక్షణాలు తలెత్తితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి అతిసారం మాదిరిగా జ్వరం, వికారం, వాంతులు, పొత్తికడుపు తిమ్మిరి వంటి గ్యాస్ట్రో లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఎక్కుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించడంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, సలహదారులు చెప్పేంత వరకు ఆయా బాధితలు ఎలాంటి విధులకు హాజరుకాకుడదని హెచ్చరించింది. యాంటీ బయాటిక్స్ మందులతో ఈ వ్యాధిని అదుపులోకి తీసుకురావొచ్చుగానీ కేసులు పెరిగితే మాత్రం ఈ వ్యాధి వ్యాప్తి సవాలుగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఏంటీ షెగెలోసిస్ వ్యాధి.. ఈ బ్యాక్టీరియా పేరు షింగెల్లా. ఇది సోకడాన్ని షింగెల్లోసిస్ అంటారు. ఇది సోకితే విరేచనాలు (డయేరియా), జ్వరం, కడుపు నొప్పి వస్తాయి. ఇవి కొన్ని రోజులపాటూ ఉంటాయి. చికిత్సలో యాంటీబయోటిక్స్ని వాడుతారు. ఇవి వ్యాధి వ్యాప్తిని తగ్గించగలవు. షింగెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి రకరకాల మార్గాల్లో వ్యాపించగలదు. ఆల్రెడీ సోకిన వ్యక్తికి డయేరియా తగ్గి నయం అయిపోయినా… ఆ వ్యక్తి నుంచి ఈ బ్యాక్టీరియా ఇతరులకు సోకగలదు. అలాగే ఈ వ్యాధి కలుషిత ఆహారం లేదా లైంగిక సంబంధం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పారిశుద్ధ్యం సరిగా లేని ప్రాంతాల్లో నివసించడం లేదా ప్రయాణించడం, పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ: తరచుగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. మంచి పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు ఆహార పరిశుభ్రతను పాటించాలి ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాల మేరకు తీసుకోవాలి. ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట కేవలం పరిశుభ్రంగా ఉండటమే కీలకం (చదవండి: ఇదేం వ్యాధి.. సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్లు తినేస్తోంది..) -
Ind vs Aus 2024: పెర్త్లో తొలి టెస్టు!
మెల్బోర్న్: టెస్టు ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో ఉన్న భారత జట్టు ఈ ఏడాది చివర్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో పోటీపడనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ సిరీస్ జరుగుతుంది. నవంబర్లో మొదలయ్యే ఈ సిరీస్లో ఐదు టెస్టుల వేదికలను క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రెండు మేటి జట్ల మధ్య జరిగే తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యమివ్వనుంది. అనంతరం రెండో టెస్టు అడిలైడ్లో... మూడో టెస్టు బ్రిస్బేన్లో... నాలుగో టెస్టు మెల్బోర్న్లో... చివరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరగనున్నాయి. అడిలైడ్లో జరిగే రెండో టెస్టు డే–నైట్గా జరుగుతుంది. ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నెలాఖరులో అధికారికంగా ప్రకటించనుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement