ఏపీ కొత్త రాజధానికి కేంద్రం నిధుల ప్రకటన | Central Government announced funds to AP new capital | Sakshi
Sakshi News home page

ఏపీ కొత్త రాజధానికి కేంద్రం నిధుల ప్రకటన

Mar 30 2015 8:17 PM | Updated on Aug 20 2018 9:16 PM

ఏపీ కొత్త రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఏపీ కొత్త రాజధాని నిర్మాణం కోసం  1500 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నట్లు  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నిధులు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులు ఇస్తున్నట్లు పేర్కొంది.

రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ఇతర అత్యవసర భవనాల నిర్మాణానికి ఈ నిధులు కేటాయించినట్లు కేంద్రం వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement