పాలనలో టీఆర్‌ఎస్‌ విజయవంతమైంది: ఈటల | Sakshi
Sakshi News home page

పాలనలో టీఆర్‌ఎస్‌ విజయవంతమైంది: ఈటల

Published Thu, Apr 13 2017 11:44 AM

పాలనలో టీఆర్‌ఎస్‌ విజయవంతమైంది: ఈటల

వరంగల్: దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉద్యమ పార్టీలు పాలనలో విఫలమయ్యాయి.కానీ తెలంగాణలో ఉద్యమాన్ని నడిపిన టీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో సఫలమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, ఎన్నికల హామీల అమలుపై మంత్రి మాట్లాడుతూ..‘‘ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సఫలమైంది.
 
రాష్ట్రంలోని ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశంలో మరెక్కడా ఉద్యమ పార్టీలు పాలనలో మంచి పేరు సాధించిన దాఖలాలు లేవు మన రాష్ట్రంలో మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలనలో సఫలమైంది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో టీఆర్‌ఎస్‌ తీరు ఎలా ఉంటుందోనని అందరు సంశయించారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందజేయడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవెర్చన పార్టీ దేశం మొత్తంలో టీఆర్‌ఎస్‌ మాత్రమే. మనం అమలు చేస్తున్న పథకాలు అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని’’ ఈటల రాజేందర్ అన్నారు. 

Advertisement
 
Advertisement