-
కాంగ్రెస్ను పాతరేస్తేనే బంగరు తెలంగాణ
ప్రాజెక్టులు అడ్డుకుంటూ.. రైతుల నోట్లో మట్టికొడ్తున్నరు ► కాంగ్రెస్ నాయకులకు రాజకీయ నిరుద్యోగ భృతి ఇస్తాం ► జగిత్యాల జనహిత ప్రగతి సభలో కేటీఆర్ సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ను ఉప్పుపాతరేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అపురూపమైన కార్యక్ర మాలు, పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెసోళ్లకు మనసునపట్టక.. మూడేళ్లు కూడా నిండని ముక్కుపచ్చలారని ప్రభుత్వంపై మాటల యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. మేం అధి కారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తమని కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నడు.. కానీ, ‘అన్నా.. పొరపా టున కూడా కేంద్రం కానీ.. రాష్ట్రంలో కానీ మళ్లీ మీరు అధికారంలోకి రారు. రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయే మీకు నిరుద్యో గ భృతి ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీయే’ అన్నారు. ధర్మపురి, కొండగట్టు అభివృద్ధి... ధర్మపురిలోని లక్ష్మీనృసింహస్వామి, కొండ గట్టు ఆంజనేయస్వామి దేవాలయాలను యాదాద్రి, వేములవాడ ఆలయాల స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందు తున్నాయని చెప్పారు. ఎన్నికలు 2018లో వచ్చినా.. దానికి ముందొచ్చినా టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో ఎమ్మెల్యే సీటు కోల్పోయిన జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పాల నను సంక్షేమానికి స్వర్ణయుగంగా.. దేశా నికే ఆదర్శంగా అభివర్ణించారు. సోమవారం జగి త్యాలలో జరిగిన జనహిత ప్రగతి సభలో ఆయన ప్రసంగించారు. కృష్ణా.. గోదావరి నదుల నుంచి న్యాయబద్ధంగా తెలంగాణకు రావల్సిన 1,200 టీఎంసీల జలాల వాటా కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాల శీర్షిక మీద పని చేస్తోన్న సీఎం.. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులపై బ్యారేజీల నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. తద్వారా పూర్వ కరీం నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ఇక్కడి సగం గోదావరి నీళ్లను ఉత్తర తెలంగాణకు తరలించి, సస్యశ్యామలం చేసేం దుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్రెడ్డి చనిపోయిన వారి పేర్లతో కోర్టులో కేసులేస్తూ, ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ.. రైతుల నోట్లో మట్టికొడు తున్నారని చెప్పారు. 2004లో కేంద్రంలో ఉనికిపోయిన కాంగ్రెస్ పార్టీ అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిందన్నారు. నాడు తెలంగాణ ఇస్తామని మాటిచ్చి ముఖం చాటేసిన యూపీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. కేంద్ర పదవిని సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రి పదవికి బేరం కుదుర్చుకున్న జీవన్రెడ్డి 2006 ఎన్నికల్లో కేసీఆర్పై పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2001 వరకు కేవలం రాజమండ్రి వరకే గోదావరి పుష్కరాలు పరిమితమయ్యాయని కేటీఆర్ చెప్పారు. కానీ 2001 ప్రత్యేక ఉద్యమ సమయంలో తెలంగాణలోనూ గోదావరి పారుతుందని చెప్పి... నాటి సీఎం చంద్ర బాబునాయుడిని ధర్మపురికి రప్పించిన ఘనత కేసీఆర్దన్నారు. రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్.. ఎరువుల కోసం ఎకరానికి రూ.4వేల చొప్పున ప్రకటించారన్నారు. పోలీస్ స్టేషన్లలో పెట్టి ఎరువులను పంపిణీ చేసిన ఘనత మీది కాదా అని కాంగ్రెస్ నేతల ను ప్రశ్నించారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, నిరుపేద విద్యార్థులకు సన్నబియ్యం పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఇంటింటికి నల్లానీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన దమ్ము న్న నేత సీఎం కేసీఆర్యే అన్నారు. కాంగ్రెస్ది దుర్మార్గపు పాలన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనను దుర్మర్గపు పాలనగా అభివర్ణించారు. మూడేళ్లలోనే కేసీఆర్ రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించారన్నా రు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నిజామాబాద్, పెద్దపల్లి ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, పాతూరి సుధాకర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
పాలనలో టీఆర్ఎస్ విజయవంతమైంది: ఈటల
వరంగల్: దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉద్యమ పార్టీలు పాలనలో విఫలమయ్యాయి.కానీ తెలంగాణలో ఉద్యమాన్ని నడిపిన టీఆర్ఎస్ పార్టీ పాలనలో సఫలమైందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎన్నికల హామీల అమలుపై మంత్రి మాట్లాడుతూ..‘‘ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో టీఆర్ఎస్ సర్కార్ సఫలమైంది. రాష్ట్రంలోని ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశంలో మరెక్కడా ఉద్యమ పార్టీలు పాలనలో మంచి పేరు సాధించిన దాఖలాలు లేవు మన రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో సఫలమైంది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో టీఆర్ఎస్ తీరు ఎలా ఉంటుందోనని అందరు సంశయించారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందజేయడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవెర్చన పార్టీ దేశం మొత్తంలో టీఆర్ఎస్ మాత్రమే. మనం అమలు చేస్తున్న పథకాలు అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని’’ ఈటల రాజేందర్ అన్నారు. -
విడతలవారీ కరెంటే నయం!
►నిరంతర విద్యుత్ వల్ల బావుల్లో నీరు అడుగంటుతోంది: తుమ్మల ► విడతలవారీగా అంటే సీఎం కేసీఆర్ ఒప్పుకోరు: మంత్రి జగదీశ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘తొమ్మిది గంటలు నిరంత రాయంగా కరెంటు ఇవ్వ డం వల్ల మా ప్రాంతంలో మెట్ట పంటలకు నష్టం జరుగుతోంది. అవసరానికి మించి నీళ్లు ఇవ్వడం వల్ల పామాయిల్ తోటల దిగు బడి కూడా తగ్గుతోంది. అందుకే మా ప్రాంత రైతుల కోరిక మేరకు తొమ్మిది గంటలు కాకుండా రెండు, మూడు విడతల్లో కరెంటు ఇవ్వాలని కోరుతున్నా..’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పందిస్తూ సీఎం ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాల్సిందే. ఒకవేళ రైతులు గట్టిగా డిమాండ్ చేస్తే.. ఒకే ఫీడర్ కింద ఉన్న రెండు, మూడు గ్రామాల రైతులు, గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ఇస్తే విడతలవారీగా సరఫరాకు ఆలోచన చేస్తాం’ అని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలోని మంత్రి ఈటల రాజేందర్ చాంబర్లో ఈ ఇద్దరు మంత్రుల మధ్య విద్యుత్ సరఫరాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ మంత్రులు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల మోటార్లు పూర్తిగా ఆన్లోనే ఉంటున్నాయని, దీంతో అవసరానికి మించి నీటిని తోడేస్తున్నాయని, ఫలితంగా భూగర్భ జలమట్టం పడిపోతోందని తుమ్మల అన్నారు. తెలంగాణలోని చాలాప్రాంతాల్లో నిరంతర కరెంటు వల్ల బావుల్లో నీరు అడుగంటిపోతోందని, తిరిగి ఊరడానికి సమయం పడుతోందని, విడతల వారీగా కరెంటు ఇస్తే రైతు లకు వెసులుబాటు ఉంటుందని తుమ్మల నాగేశ్వర్రావు విశ్లేషించారు. విడతలవారీగా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని, అయినా, రైతులు చెబుతున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతామని జగదీశ్రెడ్డి అన్నారు. కరెంటు కోత పెట్టాల్సిన పరిస్థితులు తెలంగాణలో లేవని చెప్పారు. 2004 మార్చి నాటికి ఇప్పటికీ కరెంటు డిమాండ్ పెరిగినా, ఎలాంటి సమస్య తలెత్తలేదని, ఇక, ఇప్పుడు ఏపీ కరెంటు కూడా అవసరం లేదని, ఇతర ప్రాంతాల కంటే ఏపీ కరెంటు ధర ఎక్కువని అన్నారు. ఇప్పటికీ పది గంటలపాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వగలు గుతామని, వచ్చే ఏడాదయితే ఇరవై నాలుగు గంటలూ పవర్ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని మంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
పేదలకు చదువు భారం దించాం
► రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంథని: గ్రామీణ ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులపై చదువు భారం పడకుండా తమ ప్రభుత్వం కొత్త కళాశాలలు, వసతి గృహాలను ఏర్పాటుచేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంథని, కమాన్ పూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. మంథనిలో రూ.3 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వసతి గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఇంజినీరింగ్ చదివిన వ్యక్తి హోంగార్డు కోసం, ఎంబీఏ చదివినవారు చిన్న ఉద్యోగం కోసం పోటీపడడం చూస్తే బాధేసిందన్నారు. అలాంటి కష్టాలను తీర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మారుమూల గిరిజన తడాల్లో గుడిసెల్లో విద్యార్థులు గొప్పగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే హాస్టళ్లలో సన్నబియ్యం పెడుతూ పేద విద్యార్థుల కడుపు నింపున్నామన్నారు. మంథని బొక్కలవాగుపై రివర్ ప్లాంటు మంథని బొక్కలవాగుపై రివర్ ప్లాంట్ నిర్మిస్తామని తెలిపారు. ఇటీవల నర్మదానదిని సందర్శించామని, అక్కడి మాదిరిగా మంథని బొక్కలవాగును అభివృద్ధి చేసి వేలాది మంది పర్యాటకులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఎన్ని కోట్ల నిధులైనా కేటాయిస్తానని హామీఇచ్చారు. ఒకనాడు హింసను, దుఖాన్ని అనుభవించిన ప్రాంతమని, వారి కష్టాలను తీర్చుతామని తెలిపారు. ఆపద వస్తే నేనున్నానని భరోసా కల్పించేవారే ప్రజాప్రతినిధి అని, అలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంథని నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని చెప్పారు. రూ.4.10కోట్లు స్వశక్తి రుణాలు, కోటి రూపాయల స్త్రీనిధి రుణాల చెక్కును అందజేశారు. సమావేశంలో డీఆర్డీవో పీడీ అంజయ్య, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, మంథని, ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, జెడ్పీటీసీలు మూల సరోజన, రాజిరెడ్డి, శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్ పాల్గొన్నారు. కరెంట్ కష్టాలు తీర్చడానికే సబ్స్టేన్ నిర్మాణం కమాన్ పూర్: లోవోలే్టజీ కరెంట్ కష్టాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ సంకల్పంతో సబ్స్టేన్ ల నిర్మాణాలు చేపడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వ్యవసాయరంగానికి నిరంతరంగా పగలు తొమ్మిదిగంటల విద్యుత్ సరఫరా అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. కమాన్ పూర్ మండలం గుండారంలో నిర్మించిన 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేన్ బీటీ రోడ్డులను ప్రారంభించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలను తీర్చడానికి కృషిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే పుట్ట మధు, ఎంపీపీ ఇనగంటి ప్రేమతల, ఏఎంసీ చైర్మన్ పీట్ల మంజూల. పీఏసీఎస్ చైర్మన్లు బాద్రపు మల్లేష్, మల్క రామస్వామి పాల్గొన్నారు. -
కేంద్ర పథకాల్లో డీబీటీ
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో డీబీటీ (నేరుగా లబ్ధి బదిలీ) పద్ధతిని అమలు చేస్తాం. ఇప్పటికే గ్యాస్ రాయితీ పంపిణీలో డీబీటీ అమలు చేయడంతో ఏటా ప్రభుత్వానికి రూ. 28 వేల కోట్లు ఆదా అవుతుంది. త్వరలో అన్ని పథకాల్లో డీబీటీ అమలు చేస్తే ప్రభుత్వానికి భారీ ఆదాతో పాటు లబ్ధిదారుడి ఖాతాకు రాయితీ నిధులు చేరతాయి. అవకతవకలకు తావుండదు’అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం పీపుల్స్ప్లాజాలో డిజీ ధన్ మేళాను కేంద్ర మంత్రి ఎంజే అక్బర్తో కలసి ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో తీసుకొచ్చిన లక్కీ గ్రాహక్ యోజన పథకం లాటరీని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్తో కలసి తెరిచారు. విజేతలకు బహుమతులను, క్యాష్లెస్ లావాదేవీలను ప్రోత్సహించిన వారికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కార్మికుల వేతనాల చెల్లింపులపై త్వరలో చట్టం తీసుకు వస్తామని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఖాతాల్లో జమయ్యేలా చట్టాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు కొంత ఇబ్బంది పడ్డా ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రూ. 32 వేల కోట్ల కొత్తనోట్లు వచ్చాయి. వీటిని అన్ని బ్యాంకులకు పంపిణీ చేశాం. రెండ్రోజుల్లో మరో 500 కోట్లు బ్యాంకులకు చేరతాయి. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం నోట్ల రద్దుపై గోల చేస్తున్నాయి. ప్రజలు వాటిని విశ్వసించరు’అని అన్నారు. మరో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడుతూ సాంకేతిక విప్లవం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, పేదల జీవనోపాధుల అభివృద్ధికి సాంకేతిక సేవలు దోహదపడుతున్నాయని అన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ.. పలు గ్రామాలను ఇప్పటికే నగదురహిత గ్రామాలుగా రూపొందిస్తోందని అన్నారు. బ్యాంకు ఖాతాకు నగదు ప్రోత్సాహకాలు... నగదు రహిత లావాదేవీలు జరిపిన వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు అమల్లోకి తెచ్చిన లక్కీ గ్రాహక్ యోజన పథకంలో విజేతలకు అన్లైన్ ద్వారా వారి బ్యాంకు ఖాతాకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు నీతి ఆయోగ్ సలహాదారులు అశోక్కుమార్ జైన్ తెలిపారు. లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తామన్నారు. బుధవారం నాటి డ్రాలో 358 బ్యాంకులకు సంబంధించి 15వేల మంది విజేతలను ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, గురువారం కూడా ఈ మేళాను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, మన టీవీ సీఈవో శైలేష్రెడ్డి పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement