గోదావరి పుష్కరాలు ఓ బస్సు డ్రైవర్ కుటుంబంలో విషాదాన్ని నింపాయి.
కొవ్వూరు: గోదావరి పుష్కరాలు ఓ బస్సు డ్రైవర్ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. పుష్కరాలు ఆరంభమైన నాటి నుంచి విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తున్నరాజా హనమంతరావు అనే బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన శనివారం కొవ్వూరులో చోటు చేసుకుంది.
ఉచిత బస్సు సేవల్లో భాగంగా వరుసగా ఐదు రోజుల పాటు బస్సు డ్రైవర్ గా విధుల్లో ఉన్న హనుమంతరావు ఉన్నట్టుండి ఈ రోజు సాయంత్రం సొమ్ముసిల్లి పడిపోయాడు. అనంతరం అతన్ని ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. హనుమంతరావుది పశ్చిమగోదావరి జిల్లాలోని విస్సాకోడేరు గ్రామం.


