ఓటుకు నోటు కేసులో మరో 20 పేర్లు? | another 20 names likely to be in note for vote scam | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు కేసులో మరో 20 పేర్లు?

Jun 9 2015 2:25 PM | Updated on Jun 4 2019 6:33 PM

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంలో కొత్తగా మరో 20 పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంలో కొత్తగా మరో 20 పేర్లు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రం కోర్టుకు సమర్పించే కేసు డైరీలో ఏసీబీ వర్గాలు ఈ 20 పేర్లను ప్రస్తావిస్తాయని సమాచారం. ఇప్పటివరకు అరెస్టుచేసిన నిందితులను విచారించిన సందర్భంగా, ఆ విచారణలో బయటకు వచ్చిన పేర్లను ఈ డైరీలో చేరుస్తారని అంటున్నారు. స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఆడియో టేపులలో తెలుస్తుండటంతో.. ఆయన పేరు కూడా ఈ డైరీలో ఉండొచ్చని తెలుస్తోంది.

మధ్యవర్తులు ప్రస్తావించిన 'బాస్' చంద్రబాబేనని ఏసీబీ నిర్ధారణకు రావడంతో ఆయన పేరు కూడా పెట్టాలని అంటున్నారు. కొందరు రాజ్యసభ సభ్యులు, పారిశ్రామికవేత్తల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ ప్రస్తుతానికి సరిపోతుందని, తర్వాత అవసరమైతే మరోసారి తీసుకుంటామని ఏసీబీ అధికారులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement