-
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
-
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘మోసానికి, విశ్వసనీయతకు మధ్య పోటీ..ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య పోటీ’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తరపున ఆదివారం రాత్రి తుక్కుగూడ, శంషాబాద్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ఈనెల 13న గుజరాత్ వర్సెస్ తెలంగాణ మధ్య పోటీ జరుగుతోంది. తెలంగాణకు చాంపియన్షిప్ తెచ్చే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. కందుకూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తాం. ఎన్నికల తర్వాత స్వయంగా వచ్చి కొబ్బరికాయ కొడతా. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా రావాలన్నా.. కందుకూరు వరకు మెట్రో రావాలన్నా..వికారాబాద్లో పుట్టి నేరేడుచర్లలో ముగిసే మూసీ సుందరీకరణ జరగాలన్నా..కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి. రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తినందుకే నాపై కేసులు గత సెపె్టంబర్ 17న ఇదే తుక్కుగూడ వేదిక నుంచి ఆరు గ్యారంటీల హామీ ఇచ్చాం. 65 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. అదే స్ఫూర్తితో మళ్లీ ఇదే తుక్కుగూడ నుంచి దేశంలో గెలుపునకు ఐదు గ్యారంటీల మేనిఫెస్టో విడుదల చేశాం. ఆ రోజు నుంచి మోదీ, అమిత్షాకు నిద్రపట్టడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తినందుకు నాపై కేసులు పెట్టారు. ఢిల్లీ నుంచి పోలీసులను పంపాడు. అరెస్ట్ చేస్తామని అమిత్షా చెప్పుతుండు. విధానాలతో కొట్లాడతారో? కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడతారో? బీజేపీ నేతలే తేల్చుకోవాలి. నాకు కేసులు కొత్తకాదు. రాముడిని మోసం చేశారు ఎవరైనా పెళ్లయిన తర్వాత అక్షింతలు చేతికిస్తారు. కానీ బీజేపీ నేతలు రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముందే అక్షింతలు పంపారు. రేషన్బియ్యం తెచ్చి, స్థానికంగా పసుపు కలిపి, అయోధ్య అక్షింతలని చెప్పి రాముడిని మోసం చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని తెలంగాణలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారు. అవి నిజంగా అక్షింతలేనా? భద్రాచలం రాముడిపై ఒట్టేసి చెప్పగలరా? దేవుడంటే మీకు ఓట్లు కావొచ్చు, కానీ మేము హనుమంతునిలా విశ్వసిస్తాం. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్న వారంతా నకిలీ హిందువులే. పొలిమేర్ల దాకా తరిమికొట్టాలి తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకొని ఒకరు..దేవుడిని అడ్డం పెట్టుకొని మరొకరు ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణ తల్లి సెంటిమెంట్ను బీఆర్ఎస్ అడ్డుపెట్టుకొని వందల ఎకరాల్లో ఫాంహౌస్లు, వేలకోట్లు కొల్లగొట్టారు. అదే మోదీ దేవుడి పేరుతో దేశాన్ని కొల్లగొట్టేందుకు కుట్రపన్నారు. వీరు నకిలీ హిందువులు. పదేళ్లలో ఆయన చేసిందేమీ లేదు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఆయనకు లేదు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోదీని, ఆయన పార్టీని పొలిమేర్ల దాకా తరిమికొట్టాలి. చీరకట్టుకొని చింతమడకకెళ్లు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. గ్యారంటీలు అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పథకాలు ఆయన కళ్లకు కనిపించడం లేదు. కేటీఆర్ నీవు ఒకసారి చీరకట్టుకొని బసెక్కి..చింతమడక, సిరిసిల్ల వరకు వెళ్లిరా. బస్సులో టికెట్ అడిగితే మా ఆరు గ్యారంటీలు అమలు చేయనట్లే. సబితమ్మా నీకు ఇది న్యాయమా? సబితక్క..బీఆర్ఎస్లో ఉంది. బీజేపీకి ఓటు వేయాలని చెబుతోంది. నమ్మిన పార్టీని, నమ్మిన నాయకున్ని, నమ్ముకున్న కార్యకర్తను నట్టేట ముంచుతున్నావు. సబితమ్మా నీకు ఇది న్యాయమా? నీ పార్టీ కోసం కొట్లాడు. కానీ బీజేపీ గెలుపు కోసం ఎలా పని చేస్తావు? ఆనాడు నువ్వు కాంగ్రెస్ నుంచి గెలిచినా కేసీఆర్ నీకు మంత్రి పదవి ఇచ్చారు. ఈనాడు ఆయన్ను కూడా మోసం చేయడం కరెక్టేనా’అని రేవంత్ ప్రశిం్నంచారు. -
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
సాక్షి, నిర్మల్: దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని తెలిపారు. నిర్మల్లో కాంగ్రెస్ జన జాతర భారీ బహరంగ సభ ఏర్పాటుచ ఏసింది. ఈ సబకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. ఆదివాసీ అంటే భూమిపై హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు అని అర్థమన్న ఆయన.. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం.. కేంద్రంలో కూడా ఏర్పడబోతోందన్నారు రాహల్ గాంధీ.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 400 ఇస్తామని తెలిపారు.కాంగ్రెస్ దేశంలో కులగణను చేపట్టబోతుందని, కులగణనతో దేశంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. ఏ వర్గం వారి దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకమని మండిపడ్డారు. 50 శాతం ఉన్న రిజర్వేషన పరిమితికి కాంగ్రెస్ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేయడానికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రవైవేటీకరణ అంటేను రిజర్వేషన్లను తొలగించడమని చెప్పారు. -
ఈ నెల 8లోగా రైతు భరోసా... లేకుంటే ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 8వ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని.. లేకుంటే 9వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాస్తానని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. మరి అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు. ఆగస్టు 15 నాటికల్లా రైతుల రుణమాఫీ చేస్తామని.. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ రెడీ పెట్టుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే.. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. ఈ నెల 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ మధ్య ఫైనల్స్ జరగనున్నాయని.. తెలంగాణ చాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభ, వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో రేవంత్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా మీద రూ.ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లారు. ఈరోజు ఆయన రైతు భరోసా ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు. మేం రైతు భరోసా స్కీంను డిసెంబర్లోనే మొదలుపెట్టాం. రాష్ట్రంలో మొత్తం 69లక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటికే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ చేశాం. మిగతా 4 లక్షల మంది ఖాతాల్లో ఈనెల 8వ తేదీలోగా రైతుబంధు తప్పకుండా జమ చేస్తాం.ఏ ఒక్క రైతు ఖాతాలోనైనా రైతుబంధు జమ కాలేదని నిరూపిస్తే.. అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతా. అర్హులందరికీ రైతుబంధు అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. సిద్ధమా? రాష్ట్రంలో కరెంటు కోతలంటూ కేసీఆర్ కోతలరాయుడిలా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన పని అయిపోయింది. దింపుడు కల్లం ఆశలు పెట్టుకోవడం కూడా వృథా. మే 13న ఫైనల్స్డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్స్ లాంటివి. ప్రజలు బీఆర్ఎస్ను మట్టికరిపించి కాంగ్రెస్ను ఆదరించారు. మే 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో గెలిచి తెలంగాణ చాంపియన్గా నిలవాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి.హరీశ్ రాజీనామాతో రెడీగా ఉండు.. బీఆర్ఎస్ పాలనలో 2014లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడేళ్లయినా ఇవ్వలే. తునకలుగా ఇస్తే ఆ పైసలు మిత్తికి కూడా చాలలేదు. నేను అలా సోయి లేనోడిని కాదు. కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్తున్నా.. ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేస్తా. హరీశ్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండు. రైతులకు బాకీల నుంచి, బ్యాంకుల నుంచి స్వాతంత్య్రం ఇప్పిస్తా.. సిద్దిపేటకు నీ నుంచి విముక్తి కల్పిస్తా. బీజేపీకి వాత పెట్టాలి రాష్ట్ర విభజనపై ప్రధాని హోదాలో మోదీ మాట్లాడుతూ.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణను అవమానించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ట్రిపుల్ ఐటీ, గిరిజన వర్సిటీ.. ఇలా ఏమీ ఇవ్వకుండా గాడిద గుడ్డు చేతిలో పెట్టిన బీజేపీ ఓటేద్దామా..? లేక కర్రు కాల్చి వాతపెడదామా ప్రజలే చెప్పాలి. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లుగా బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తూనే ఉంది. అందుకే కాంగ్రెస్ గెలవొద్దని బీఆర్ఎస్, బీజేపీ కలసి కుట్రలు చేస్తున్నాయి. ఎవరిని చెప్పుతో కొట్టాలి? రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్లని చెప్పుతో కొట్టాలని బీజేపీ నేతలు అంటున్నారు. నిన్ననే బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం ప్రియాంబుల్ (ప్రవేశిక)ను మార్చేస్తామన్నారు. మరి ఇప్పుడు దుష్యంత్™ కుమార్ను చెప్పుతో కొట్టాలా? అబద్ధాలు చెప్తున్న నేతలను చెప్పుతో కొట్టాలా? ఎవర్ని కొట్టాలో బీజేపీ నేతలే చెప్పాలి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది. ఆ పార్టీ దేశ ప్రజల నెత్తిపై వేలాడుతున్న కత్తి లాంటిది. పాలమూరు బిడ్డపై కుట్ర.. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పాలమూరు బిడ్డను సీఎంగా ఎన్నుకుని 150 రోజులు కాలేదు. అప్పుడే దిగిపొమ్మని అంటున్నారు. ఢిల్లీ నుంచి పడగొడతామని బయలుదేరుతున్నారు. రేవంత్రెడ్డి నా మీద పగబట్టిండని డీకే అరుణమ్మ అంటోంది. నీకు, నాకు గెట్టు పంచాయతీ ఏముంది? ప్రజల దీవెన, సోనియమ్మ ఆశీర్వాదంతో నాకు సీఎం పదవి వచ్చింది. కానీ నన్ను దించేందుకు, ఢిల్లీ పోలీసులతో అరెస్ట్ చేసేందుకు అమిత్ షాతో మాట్లాడి స్కెచ్ వేస్తోంది. నేనేం తప్పు చేశా? బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్నదని చెప్పిన. ఆ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను లోపలేసి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటున్నారు.’’ ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదు కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ప్రసంగించారు. – బ్రిటీషర్లకు ఎదురు నిలిచిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని, తెలంగాణ సీఎంపై బెదిరింపులకు పాల్పడుతున్న ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. – బీజేపీ రాముడిని రాజకీయాల్లోకి తెచ్చి నాలుగు అక్షింతలు చల్లి ఊరుకుందే తప్ప చేసిందేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సీఎంగా ఏనాడూ ఖమ్మం జిల్లాకు రాని కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చి కల్లి»ొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. – రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నవారికి ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దమ్ముంటే యోధుడైన రేవంత్ను టచ్ చేసి చూడాలని ప్రత్యర్థి పారీ్టలకు సవాల్ విసిరారు. – పాలమూరు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్నికలు జరగబోతున్నాయని కొత్తకోట కార్నర్ మీటింగ్లో మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు ఎవరి హయాంలో ఎక్కువ నిధులొచ్చాయో చర్చకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసి రారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 2004–14 మధ్య యూపీఏ సర్కార్ ఇచ్చిన నిధులు, 2014–24 మధ్య తమ ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అందించిన నిధులపై అర్థవంతమైన చర్చ చేపడదామన్నారు. ఎవరి పాలనలో ఎక్కువ నిధులొచ్చాయో ఆధారాలతో ప్రజల ముందు చర్చిద్దామని సూచించారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులు అందించిందని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో విభేదిస్తే తనతో సీఎం చర్చకు రావాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్కు కిషన్రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘కొడంగల్ లేదా అమరవీరుల స్తూపం లేదా కృష్ణా, గోదావరి ఒడ్డునైనా సరే తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. స్థలం, సమయం, తేదీ నిర్ణయించాలని రేవంత్ను లేఖలో కోరారు. అయితే చర్చ సందర్భంగా ఉపయోగించే భాష హుందాగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సవాల్ను స్వీక రించి అర్థవంతమైన చర్చలో పాల్గొనేందుకు సీఎం సాను కూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుడదామన్నారు.‘గాడిద గుడ్డు’ను ఖండిస్తున్నాం..‘2014–24 కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ మీరు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ కేబినెట్లో భాగస్వామిగా వ్యక్తిగతంగానూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’అని కిషన్రెడ్డి లేఖలో స్పష్టంచేశారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి పదవినే దిగజారుస్తుందని మండిపడ్డారు. అబద్ధాల ప్రచారం సరికాదు..‘పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా గతంలో యూపీఏ సాధించిన ఘనతలు, విజయాలను మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఎన్డీయే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కూడా మీరు విమర్శించవచ్చు. కానీ మీరు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలను ఆశ్రయించడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే’అవుతుంది అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చింది రూ. 45 వేల కోట్లే‘మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. కేవలం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కిందనే ఏకంగా రూ. 2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి రూ. 1.32 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా రూ. 45,000 కోట్లు మించదు. అంటే యూపీఏ హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ కు 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చింది. 1947 నుంచి 20 14 వరకు 67 ఏళ్లలో తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్లకుపైగా వెచ్చించి కొత్తగా మరో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించింది. నిర్మాణానికి 100%, భూసేకరణకు 50% కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు సహా మరో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాం. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చాం’అని కిషన్రెడ్డి తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement