Top Stories
ప్రధాన వార్తలు
మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం: సీఎం జగన్
విశాఖపట్నం, సాక్షి: అబద్ధాలకు రెక్కలుకట్టి గతంలో మేనిఫెస్టోలు ఇచ్చేవారని, తాము మాత్రం మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత గాజువాకలో మంగళవారం(మే7) జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మీటింగ్కు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించారు. ‘మీ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలివి. గతంలో ఎప్పుడూ ఎవరూ బటన్ నొక్కలేదు. నేరుగా అక్క చెల్లెల్లకు డబ్బులిచ్చిందీ లేదు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి స్కీమ్ కూడా పేదలకు గుర్తుకు రాదు. 59 నెలల్లో 2లక్షల31 వేల ఉద్యోగాలిచ్చాం. 59 నెలల్లోనే అనూహ్య మార్పులు తీసుకువచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. ఇది అభివృద్ధి కాదా. 59 నెలల పాలనలో 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా.ఒక్క ఉత్తరాంధ్రకే నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. వైస్ఆర్సీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయి. దశాబ్దాల నాటి ఉద్దానం సమస్యను పరిష్కరించాం. మూడు వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 400 సెల్టవర్లు పెట్టాం. భోగాపురం ఎయిర్పోర్టు శరవేగంగా పూర్తవుతుండడానికి కారణం ఎవరు. కుల,మత ప్రాంతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నాం. ఇంటి వద్దకే పెన్షన్, రేషన్ సౌకర్యం కల్పిస్తున్నాం. నాడు-నేడు ద్వారా బడులకు కొత్త రూపం తీసుకువచ్చాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన తీసుకువచ్చాం. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఈజ్ఆఫ్ డూయింగ్లో ఏపీని నెంబర్వన్గా నిలిపాం. బాబు హయాంలో కంటే ఎక్కువగా మీ బిడ్డ హయాంలో లక్ష కోట్లపైబడి పెట్టుబడులు వచ్చాయి’ అని సీఎం జగన్ వివరించారు. సీఎం జగన్ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలువిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తా.. జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే పాలన కొనసాగించేది విశాఖ నుంచేఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండిలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారుప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండివెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళ వారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయాబాబు, దత్తపుత్రుడు, మోదీగారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటిప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదుగాజువాకలో కూటమికి ఓటేస్తే స్టీప్లాంట్ అమ్మేయమన్నట్లేగాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందిఇక్కడ టీడీపీ, ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపడం సాధ్యం కాదు ఎందుకంటే దీన్నే వారు ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారుప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, తర్వాత జగన్ ఎంత ప్రయత్నించినా నీకెందుకయ్యా వారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అనకూలంగా తీర్పు ఇచ్చారంటారుఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
సాక్షి, అమరావతి: భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.చట్టం ముఖ్య ఉద్దేశంప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా?ల్యాండ్ టైట్లింగ్ చట్టం గెజిట్ జారీ అయినా ఇంకా అమల్లోకి రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏదైనా అమలులో ఉన్నట్లు లెక్క. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసెంబ్లీలో బిల్లు పాసైంది. దీనికి టీడీపీ కూడా మద్దతు తెలిపింది. రీ సర్వే ఇంకా జరుగుతుండటంతో నోటిఫికేషన్ జారీ చేయలేదు. చట్టం అమల్లోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ ఏర్పడుతుంది. ఆ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అప్పిలేట్ అధికారులు, ట్రిబ్యునళ్లను నియమిస్తుంది. ఇంకా అథారిటీయే ఏర్పడలేదు. కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్, అప్పిలేట్ అధికారులను నియమించలేదు. ఆ అధికారులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించలేదు. అసలు చట్టమే ఉనికిలో లేదు. ఎందుకంటే దాని అమలుకు ఎటువంటి మార్గదర్శకాలు, నిబంధనలను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. చట్టం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసి అందుకనుగుణంగా నిబంధనలు, మార్గదర్శకాలతో జీవో జారీ అయితేనే అమల్లోకి వచ్చినట్లు లెక్క. అదేమీ లేకుండానే చట్టం అమలైపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.ఈ చట్టం వల్ల వచ్చే లాభంల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం ఒకసారి మీ భూమి రికార్డుల్లోకి ఎక్కితే అదే తుది రికార్డు అవుతుంది. ఇతర రికార్డులు, కాగితాల కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరూ ఆ భూమిని లాక్కోలేరు. దౌర్జన్యం చేయలేరు. తప్పుడు పత్రాలు సృష్టించే అవకాశం ఉండదు. ఆ భూమి ఇతరుల పేర్ల మీదకు మారినా, మీకు తెలియకుండా మీ భూమి కోల్పోయినా, మీ ప్రమేయం లేకుండా రికార్డు మార్చినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుంది. అంటే ప్రజల భూములకు ప్రభుత్వమే రక్షణ, భద్రత కల్పిస్తుంది.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చరిత్రమన దేశంలో భూ రికార్డులు, లావాదేవీలు ఇప్పటివి కావు. 1526 నుంచి 1707 వరకు పాలించిన మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వస్తున్నాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు కొన్ని నియమాలు పెట్టి భూ రికార్డులు తయారు చేశారు. వాటినే ఇప్పటికీ మనం ఉపయోగిస్తున్నాం. 75 సంవత్సరాలుగా దేశంలో భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. వందల ఏళ్ల నాటి రికార్డులు కావడంతో ఇప్పటి పరిస్థితులకు సరిపోక భూ కబ్జాలు, తప్పుడు పత్రాలు సృష్టించడం, భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, సివిల్ కేసులు జనాన్ని పట్టి పీడిస్తున్నాయి.* 1986– తొలిసారిగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో రాజీవ్గాంధీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఆలోచన చేసింది. దీనిపై అధ్యయనం కోసం ప్రొఫెసర్ డీసీ వాధ్వా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ను నియమించింది. సుదీర్ఘ అధ్యయనం చేశాక ఆయన 1989లో గ్యారెంటీయింగ్ టైటిల్ ఆఫ్ ల్యాండ్ను రూపొందించారు. కానీ అది అమలుకు నోచుకోలేదు.* 2008ల్యాండ్ టైట్లింగ్ చట్టం మళ్లీ తెర మీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్ఎల్ఆర్ఎంపీ)ను ప్రవేశపెట్టింది. కెనడా, యూకే వంటి యూరోపియన్ దేశాల్లో అమలు చేస్తున్న టోరెన్స్ విధానాన్ని అమలు చేయాలని భావించింది. రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. కానీ అమలు చేయలేదు.* 2010అప్పటి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ల్యాండ్ టైటిల్ యాక్ట్–2010ని రూపొందించింది. విధి విధానాలు ఖరారు చేసి డ్రాఫ్ట్ను ఆన్లైన్లో పెట్టింది. రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించింది. కానీ అమలు జరగలేదు.* 2013యూపీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేసే ఉద్దేశంతో నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీ టైట్లింగ్ చట్టానికి సంబంధించిన రోడ్మ్యాప్ను రూపొందించింది.* 2019ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని భావించింది. ఆ దిశగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రూపొందించింది. ఇందుకోసం నీతి ఆయోగ్ ముసాయిదా చట్టాన్ని రూపొందించి 2019 నవంబర్ 25న దాన్ని విడుదల చేసింది. ‘ది మహారాష్ట్ర టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్’ తరహాలో దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో ఇదే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచించి చట్టం గెజిట్ విడుదల చేసింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్– ఇతను రిజిస్ట్రేషన్ల పత్రాలను పరిశీలించి సరిగా ఉన్నాయో లేదో చూస్తారు. తప్పుడు పత్రాలు ఉంటే వెంటనే తిరస్కరిస్తారు.– భూ యజమాని ఇచ్చిన సమాచారాన్ని బట్టి పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ భూమిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని ప్రజలను కోరతారు. ఇందుకు నిర్దిష్ట సమయం ఇస్తారు. – ఈ నోటీసుపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించి ఆ భూమి ఎవరిదో రికార్డుల ప్రకారం అక్కడే నిర్ధారిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలన, చుట్టుపక్కల అభ్యంతరాలను స్వీకరిస్తారు.– ఆ భూమిపై ఎలాంటి వివాదాలూ లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ నిలిపివేసి, పై అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లమని సూచిస్తారు.అప్పిలేట్ అథారిటీ– భూ లావాదేవీలు, సమస్యలను ఈ అథారిటీ పరిష్కరిస్తుంది. అప్పిలేట్ అధికారిగా జేసీ ఆ పైస్థాయి అధికారులు ఉంటారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉండదు.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సేవలు సంతృప్తిగా లేకపోయినా, అన్యాయం జరిగిందని భావించినా, తప్పుడు వివరాలు ఎక్కించారని తెలిసినా అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.– ఈ అథారిటీ టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులను పర్యవేక్షిస్తుంది. వారి విధులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తుంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తుంది.– టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి భూమి వివరాలను తప్పుగా ఎంట్రీ చేసినా, మీకు అన్యాయం జరిగినా అప్పిలేట్ అథారిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ల్యాండ్ రికార్డ్పై అనుమానం ఉంటే అథారిటీ ఆఫీసర్ సుమోటోగా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఆదేశిస్తారు.– భూమి రికార్డులను మార్చే అధికారం కేవలం అప్పిలేట్ అథారిటీ లేదా కోర్టుకు మాత్రమే ఉంటుంది. టైట్లింగ్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రమేయం ఏమాత్రం ఉండదు.కోర్టు..– అప్పిలేట్ అథారిటీ వద్ద అన్యాయం జరిగిందని భావిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టులో మీ కేసును వెంటనే పరిష్కరించడానికి ఒక బెంచ్ను ఏర్పాటు చేస్తారు.– అప్పిలేట్ అథారిటీపై వచ్చిన కేసులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఈ బెంచ్ పరిష్కరిస్తుంది. తద్వారా సత్వర న్యాయం అందుతుంది.– హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్. దీన్ని అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. ఈ తీర్పును మార్చే అధికారం అప్పిలేట్ అథారిటీ లేదా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు ఉండదు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రయోజనాలు– ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితోపాటు ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు.– ఇప్పటివరకు వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కారమవుతాయి. ఇప్పుడు జారీ చేసే రికార్డే ఫైనల్ రికార్డు. ఒకవేళ ఈ రికార్డులో మీకు అన్యాయం జరిగితే హైకోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ ఉంటుంది.– మీ భూమికి ప్రభుత్వం గ్యారెంటీగా నిలవడం వల్ల భరోసా పెరుగుతుంది. పొరపాటున మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వమే నష్ట పరిహారం చెల్లిస్తుంది. – ఈ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కుతుంది. ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం మేర కనుమరుగవుతాయి.– ఒక భూమికి క్లియర్ టైటిల్ ఉంటే అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. శాశ్వత భూ హక్కు చట్టం ద్వారా బ్యాంకుల్లో సులువుగా రుణాలు పొందవచ్చు. ఈ చట్టం వల్ల జీడీపీ కూడా పెరుగుతుందని శాస్త్రీయ లెక్కలు చెబుతున్నాయి.– మీ భూమిని మరొకరు దౌర్జన్యంగా లాక్కునే అవకాశం ఉండదు. తప్పుడు పత్రాలు సృష్టించే మార్గాలు మూసుకుపోతాయి. మీ భూమిపై మరొకరి ఆజమాయిషీ ఉండదు.– ల్యాండ్ టైట్లింగ్ చట్టం వల్ల మీ భూములకు శాశ్వత హక్కులు లభిస్తాయి. ఎలాంటి కబ్జాలకు ఆస్కారం ఉండదు. ఈ చట్టం వల్ల సరిహద్దు వివాదాలు, రికార్డుల తగాదాలు, గొడవలు తగ్గుతాయి. – ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్, అప్పిలేట్ ఆఫీసర్గా ప్రభుత్వ అధికారులనే నియమిస్తారు. ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం కానీ, ప్రలోభాలు కానీ ఉండవు. ఒకవేళ మీకు అన్యాయం జరిగినట్లు భావిస్తే నేరుగా హైకోర్టు బెంచ్ను ఆశ్రయించవచ్చు. అక్కడి తీర్పు ఆధారంగా మీ రికార్డులు మీరు పొందవచ్చు. నష్టపరిహారం కూడా తీసుకోవచ్చు.– భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మీ భూమి రికార్డుల్లోకి ఎక్కించేటప్పుడు మీ గ్రామంలోకి వచ్చి బహిరంగ ప్రకటన ఇస్తారు. మీ భూమి చుట్టుపక్కల రైతులతో మాట్లాడతారు. ఎలాంటి వివాదాలు లేకుంటేనే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకవేళ వివాదం ఉంటే డిస్ప్యూట్ రిజిస్టర్ కింద నమోదు చేసి, ఈ కేసును పరిష్కరిస్తారు.– ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల వల్ల భూములకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు కబ్జా చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఎవరు ఎక్కడి నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ సమస్యకు చెక్ పెడుతుంది.
హైదరాబాద్లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
మండుటెండలతో అల్లాడిన హైదరాబాద్కు మరో చిక్కొచ్చి పడింది. వేడి చల్లారుతుందనుకుంటే.. వరుణదేవుడు అంతకు మించిన ప్రతాపం చూపించాడు. సాయంత్రం 5.30గంటల నుంచి మొదలైన వర్షం ఒక్కసారిగా ఉదృతంగా మారింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు నగరజీవులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుడప్పుడే ఆఫీసుల నుంచి బయటకు వస్తోన్న ఉద్యోగులు గాలివానకు అల్లాడిపోయారు. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. టూవీలర్లు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది.హైదరాబాద్కు వార్నింగ్అయితే రాబోయే సమయంలో హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నార్త్ హైదరాబాద్ పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. వాతావరణాన్ని అంచనా వేసే వెబ్సైట్లు అక్యువెదర్ ప్రకారం ఈ సాయంత్రమంతా హైదరాబాద్తో పాటు ఏపీలోని కోస్తా ప్రాంతం, ఉత్తర తెలంగాణకు తీవ్ర వర్షం పొంచి ఉన్నట్టు తెలిపింది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఏపీలో వర్షాలు పడతాయని, సాయంత్రం నుంచి హైదరాబాద్లో వర్షాలు పడతాయని అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే భారీగా వర్షాలు కురుస్తున్నాయిహైదరాబాద్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉందని.. రాత్రి సమయంలో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములు, మెరుపులతో వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వానలు పడుతున్నాయి. హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం మొదలైంది. కూకట్పల్లి, నిజాంపేట, కేపీహెచ్బీ, లిగంపల్లితో పాటు మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.Heavy rains in #hyderabad #HyderabadRains pic.twitter.com/RD2sRYF8yS— Aditya ✪ (@Glorious_Aditya) May 7, 2024 సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్, మారేడ్పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్పల్లి, పేట్బషీరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది. నేటి వరకు ఎండలతో బెంలేతెత్తిన జనానికి.. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాకుండా ఈదురుగాలులు భయపెట్టించాయి. The First respite for this Blazing Summer 🌞 #Hyderabad #thunderstorms #Rains pic.twitter.com/aHQENktyuA— Vikrant 🇮🇳🇮🇳 (@KauVikk) May 7, 2024
Play Offs: స్టార్ ఓపెనర్ దూరం?... కేకేఆర్కు ఓ గుడ్న్యూస్!
ఐపీఎల్-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్ అయ్యర్ సేన.కేకేఆర్ ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్రౌండర్ నరైన్ 11 ఇన్నింగ్స్లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ స్టార్ ఫిలిప్ సాల్ట్ త్వరలోనే కేకేఆర్ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్తో మే 22 నుంచి టీ20 సిరీస్ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశలో కేకేఆర్కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్లో అడుగుపెట్టిన గుర్బాజ్ 11 మ్యాచ్లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్- నరైన్ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్ ఫేక్ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్లెస్ బ్లౌజ్తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్ఫేక్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది.కాగా.. అలియా డీప్ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్లో ఆమె ఫేస్ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. View this post on Instagram A post shared by Unfixface (@unfixface) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)
సోనియా గాంధీ భావోద్వేగ సందేశం.. వీడియో వైరల్
ఢిల్లీ: ఈ రోజు మూడోదశ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ తరుణంలో సోనియా గాంధీ ఓటర్లకు ఉద్వేగభరితమైన సందేశాన్ని వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తెగ వైరల్ అవుతోంది.మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి.. నిరుద్యోగం, మహిళలపై నేరాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్ష తారాస్థాయికి చేరింది. ఇవన్నీ ప్రధాని మోదీ, బీజేపీ నుంచి ఉత్పన్నమయ్యాయి. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. పేదలు వెనుకబడి ఉండటం నాలో వేదనను నింపుతోందని వీడియోలో సోనియా గాంధీ వెల్లడించారు.ఈ రోజు నేను మరోసారి మీ మద్దతును కోరుతున్నాను. కాంగ్రెస్ హామీల ప్రధాన ఉద్దేశ్యం దేశాన్ని ఏకం చేయడం. భారతదేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం పని చేయడం కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అబద్ధపు ప్రతిపాదకులను తిరస్కరించండి. అందరికీ ఉజ్వలమైన, సమానమైన భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి. హ్యాండ్ బటన్ను నొక్కండి. అందరి సహకారంతో మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మిస్తాం అని సోనియాగాంధీ వీడియోలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు.My dear brothers and sisters,Youth unemployment, crimes against women, and discrimination against Dalits, Adivasis, and minorities have reached unprecedented levels. These challenges stem from the ‘niyat’ and ‘niti’ of PM Modi and the BJP which aim for power rejecting… pic.twitter.com/4npHwd8DNW— Congress (@INCIndia) May 7, 2024
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ కేసులో జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై స్పందించారు. సోమవారం కస్టడీ ముగిసిన సందర్భంగా కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్ చేశారన్నారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలని కవిత కోరారు. లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మే 14 దాకా పొడిగించింది.కవిత కేసులో ఈడీ దూకుడు.. వారం రోజుల్లో ఛార్జ్షీట్ వేస్తామని వెల్లడిలిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వారంరోజుల్లో చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది. మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
వైద్యశాస్త్రానికే అంతుపట్టని కొన్ని విషయాలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తాయి. ఇది శాపమా? లేక పాపమా? అన్నంత బాధను కలగజేస్తాయి. ఏం చేయాలో తోచని స్థితి. అలాంటి భయానక పరిస్థితినే మహిళగా జీవిస్తున్న చైనాకు చెందిన అమ్మాయి ఎదుర్కొంటోంది. అది కూడా పెళ్లి కుదిరాక ఈ పరిస్థితి ఎదరవ్వడంతో ఆమెతో సహ తల్లిదండ్రలు కూడా నిశ్చేష్టులైపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు అని విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.ఏం జరిగిందంటే..? చైనాలోని 27 ఏళ్ల మహిళ లీ యువాన్కి గత కొద్దిరోజుల ముందే పెళ్లి కుదిరింది. తనకు రుతుక్రమం రాకపోవడంతో ఆందోళన చెంది వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు 18 ఏళ్ల సమయంలోనే ఈ పరిస్థితిని ఎదుర్కొంది. అసాధారణ హర్మోన్ స్థాయిలు, సంభావ్య అండాశయ వైఫల్యం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆమెను క్రోమోజోమ్ పరీక్ష కూడా చేయించుకోమని సూచించారు. అయితే లీ, ఆమె కుటుంబం ఆ సలహను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పెళ్లి కుదరడంతో లీ కుటుంబం ఆమెకు వైద్య పరీక్షలు చేయించింది. ఆ పరీక్షల్లో వాళ్లంతా జీర్ణించుకోలేని నిజం బయటపడింది. వైద్యులు ఆమె పొత్తి కడుపులో వృషణాలు ఉండటా గుర్తించారు. ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనే అరుదైన రుగ్మత ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. ఈ అరుదైన రుగ్మత సుమారు 50 వేల మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇన్నాళ్లు స్త్రీగా జీవిస్తున్న లీ ఇప్పుడూ వైద్య పరీక్షల్లో మగదిగా గైనకాలజిస్ట్ డువాన్ జీ తేల్చి చెప్పారు. ఆమెలో మగ క్రోమోజోమ్లు ఉన్నాయన్నారు. దీంతో లీకి ఒక్కసారిగా తన జీవితం అంతా తలకిందులైనట్లు అనిపించింది. ముఖ్యంగా లీ తల్లిందడ్రుల ఈ విషయం విని జీర్ణించుకోలేని అయోమయానికి గురయ్యారు. నిజానికి ఈ డిజార్డర్కి కారణమయ్యే జన్యువులు లీ తల్లిదండ్రులిద్దరు కలిగి ఉన్నారు. కాబట్టే లీకి ఈ పరిస్థితి ఎదురయ్యిందని చెప్పారు వైద్యులు. ఆ వైద్య పరీక్షల్లో లీ బోలు ఎముకల వ్యాధితో విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేగాదు పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తక్షణమే తొలగించాలని, లేనట్లయితే క్యాన్సర్కి దారితీస్తుందని చెప్పారు. దీంతో లీకి వైద్యలు ఏప్రిల్ మొదటి వారంలోనే శస్త్ర చికిత్స నిర్వహించి పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తొలగించారు. ఆమెకు ఇప్పుడు రెగ్యూలర్ ఫాలో అప్ పరీక్షలు, దీర్ఘకాలిక హార్మోన్ థెరపీ చేస్తున్నారు. ప్రస్తుతం లీ కథ ఇప్పుడు చైనాలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది. నెట్టింట లీ పట్ల సానుభూతి వెల్లువెత్తడమే గాక ఆమె ధైర్యాన్నికొనియాడుతున్నారు. కాగా, పుట్టకతో వచ్చే ఈ డ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనేది మనిషి అడ్రినల్ గ్రంధులను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత. ఈ గ్రంథులు శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ప్రధానంగా లైంగిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: 'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ కేఫ్లు ఎక్కడ ఉన్నాయంటే..)
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లలో ఒకరు సూపర్చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. తమకు అందిన ఈమెయిల్ స్క్రీన్షాట్ను లింక్డిన్లో షేర్ చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్చార్జింగ్ టీమ్తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్చార్జింగ్ టీమ్లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్రోబ్కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్తో, గ్లామ్డేస్ విభిన్నమైన నెక్లెస్లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
సినిమా
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అసలే వేసవికాలం.. బయటచూస్తే మండుటెండలు భయపెట్టేస్తున్నాయి. స్కూళ్లకు సైతం సెలవులు రావడంతో పిల్లలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసం ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను అందిస్తున్నాయి.తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ జానర్కు ఆడియన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే మర్డర్ ఇన్ మహిమ్ అనే పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.ఈనెల 10 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఏకంగా ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇది కేవలం జియో సినిమా ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది. Bas teen din mein milenge saare sawalon ke jawab🔪Murder In Mahim streaming 10th May onwards, exclusively on JioCinema Premium.Subscribe to JioCinema Premium at Rs. 29 per month. Exclusive content. Ad-free. Any device. Up to 4K. pic.twitter.com/kL5cnFp8Uy— JioCinema (@JioCinema) May 7, 2024
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
'మన్మథుడు' సినిమా పేరు చెప్పగానే కామెడీ డైలాగ్స్ గుర్తొస్తాయి. అలానే హీరోయిన్ అన్షు కూడా జ్ఞాపకమొస్తుంది. ఎందుకంటే మూవీలో ఉన్నది కాసేపే అయినా తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తుందని అనుకుంటే.. సడన్గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. దేశమే వదిలేసి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట.(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)లండన్లో పుట్టి పెరిగిన అన్షు.. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేసి, హీరోయిన్ అయిపోయింది. మన్మథుడు, రాఘవేంద్ర, మిస్సమ్మ సినిమాలు చేసింది. తమిళంలో మరో మూవీ చేసింది. హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. 2003లో సచిన్ నిగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరిగి లండన్ వెళ్లిపోయింది. యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది.ఇక కొడుకు, కూతురు పుట్టారు. కొన్నాళ్ల పాటు గార్మెంట్ బిజినెస్ కూడా చేసింది. గత కొన్నేళ్ల నుంచి మళ్లీ గ్లామర్ చూపిస్తూ వచ్చింది. అలా గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్లోనే ఉంటూ తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. అలా ఇప్పుడు సందీప్ కిషన్ కొత్త మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రావు రమేశ్కి జోడీగా ఈమె కనిపించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial)
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
గ్లోబల్ ఫ్యాషన్ షో మెట్ గాలాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరిసింది. ప్రత్యేకంగా రూపొందించిన శారీలో కనిపించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. గతేడాదే తొలిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్పై కనిపించిన ఆలియా.. ఈ ఏడాదిలో తళుక్కున మెరిసింది. అయితే ఈవెంట్లో ఆలియా ధరించిన శారీపైన బీటౌన్లో పెద్ద చర్చ మొదలైంది. తన స్టైలిశ్ లుక్తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆలియా ధరించిన శారీ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.ఆలియా భట్ ధరించిన ఈ షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి రూపొందించారు. గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్కు సరిపోయేలా ఈ గ్రీన్ శారీ.. దానికి సరిపడా నగలతో ఆలియా చాలా అందంగా షోలో ప్రత్యేకంగా నిలిచింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పూల చీరలో అలియా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. దీంతో ఆమె రెడ్ కార్పెట్ పైకి రాగానే కెమెరాల కళ్లన్నీ ఆలియావైపై ఉన్నాయి. అయితే ఈ చీర రూపొందించడంలో పెద్ద కథ ఉందనే విషయం బయటకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ఆలియా భట్ మాట్లాడింది. ఆలియా చీర వెనుక కథమెట్ గాలా ఈవెంట్లో ప్రపంచ వేదికపై మనదేశ మూలాలను చాటి చెప్పేందుకు భారతీయత ఉట్టిపడేలా శారీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ శారీ కోసం దాదాపు 1965 గంటలు అంటే దాదాపు 80 రోజులు పట్టిందని డిజైనర్ వెల్లడించారు. ఆలియా చీరను రూపొందించేందుకు 163 మంది హస్తకళాకారులు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం. ఇందులో పాల్గొన్న కళాకారులను తాను వ్యక్తిగతంగా కలవాలని అనుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలియా చెప్పింది. ఆరు గజాల చీరతో ఆకట్టుకోవడమే కాదు.. తన మాటలతోనే ఆలియా అక్కడి వాళ్ల మనసులు గెలుచుకుంది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమలేఖ వైరల్ అవుతోంది. అవును మీరు విన్నది నిజమే. 'నేను ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను' అని సల్మాన్ చేతిరాతతో రాసిన లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిపోయింది. అసలు ఇంతకీ ఈ లేఖ ఎవరికీ రాశారు? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)హీరో సల్మాన్ ఖాన్.. దాదాపు మూడు-నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పట్లో 'ప్రేమ పావురాలు' లాంటి డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచాడు. ఇప్పుడు మాత్రం కేవలం హిందీ చిత్రాలే చేస్తున్నాడు. అయితే గత కొన్నిరోజుల నుంచి సల్మాన్ వార్తల్లో నిలుస్తున్నాడు. సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరగడం అనేది షాకింగ్గా అనిపించింది.సరే ఇదంతా పక్కనబెడితే 'మైనే ప్యార్ కియా'(ప్రేమ పావురాలు) సినిమా రిలీజ్ తర్వాత.. తన చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం సల్మాన్ స్వయంగా ఓ లేఖ రాశాడు. ఇప్పుడదే మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే.. 'నన్ను అంగీకరించినందుకు, ప్రేమించినందుకు థ్యాంక్స్. ఇక నుంచి ఏ సినిమా చేసినా 'మైనే ప్యార్ కియా'తో పోలుస్తారని తెలుసు. కాబట్టి మంచి సినిమా చేయాలనే నా ప్రయత్నం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను-మీరు నన్ను ప్రేమిస్తూనే ఉంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం మానేసిన రోజు.. నేను సినిమాలు చేయడం ఆపేస్తాను. అది నా కెరీర్కి ముగింపు అవుతుంది' అని సల్మాన్ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)
ఫొటోలు
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
క్రీడలు
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. రాజస్తాన్ రాయల్స్ తరపున దక్షిణాఫ్రికా ఆటగాడు డోనోవన్ ఫెరీరా, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున నైబ్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నారు. అదే విధంగా ఈమ్యాచ్కు రాజస్తాన్ స్టార్ క్రికెటర్లు ధ్రువ్ జురెల్, హెట్మైర్ దూరమయ్యారు. హెట్మైర్ స్ధానంలో ఫెరీరా, జురెల్ ప్లేస్లో శుబమ్ దూబే వచ్చాడు. మరోవైపు ఢిల్లీ జట్టులోకి వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ రీ ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తమ జట్టుకు సంబంధించి అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘‘పంజాబ్ కింగ్స్లో మీకిష్టమైన ఆటగాడు ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ప్రీతి జింటా వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్క్రిస్ట్ పేర్లను చెప్పారు.ఈ మేరకు.. ‘‘డేంజరస్ వీరూగా ఉన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్రీతి జింటా.. ఆడం గిల్క్రిస్ట్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాయకుడిగా, ఆటగాడిగా అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కాగా 2014, 2015 సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దుమ్ములేపాడు. 30 మ్యాచ్లలో కలిపి 660 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్తో క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు 122 పరుగులు సాధించడం హైలైట్గా నిలిచింది.ఇక ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆడం గిల్క్రిస్ట్ సైతం 2011- 2103 మధ్య పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు. 34 మ్యాచ్లలో కలిపి 849 రన్స్ చేశాడు. నిలకడైన ఫామ్తో జట్టుకు విజయాలు అందించాడు. కెప్టెన్గానూ రాణించాడు.గిల్క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 2011లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 2012, 2013లో ఆరో స్థానం సంపాదించింది.ఇక ఫేవరెట్ ప్లేయర్ ప్రశ్న తర్వాత.. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు కోసం మీరింకా ఆలూ పరాఠాలు చేస్తున్నారా?’’ అని ఓ నెటిజన్ అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. అప్పట్లో సౌతాఫ్రికాలో ఓసారి మా జట్టు గెలిచిన తర్వాత పరాఠాలు చేసిచ్చాను. ఆ తర్వాత అలాంటివేమీ చేయలేదు’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్లలో కేవలం నాలుగు గెలిచి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనంటూ ప్రీతి జింటా ఇటీవల పేర్కొన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. కాగా టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ గతంలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అదే విధంగా.. శిఖర్ ధావన్ ప్రస్తుతం కెప్టెన్గా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతడు మ్యాచ్లకు దూరం కాగా సామ్ కరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
‘‘నాకు తెలిసి అతడు పూర్తిగా అలసిపోయాడు. టీమిండియా కెప్టెన్గా, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిగా విరామం లేని షెడ్యూల్తో బిజీగా గడుపుతున్నాడు.అతడికి కాస్త విశ్రాంతి అవసరం. బ్రేక్ తీసుకుని తిరిగి వస్తే తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్కు ముందు అతడు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు గమనించాను.వెన్నునొప్పితో బాధపడుతున్నట్లుగా అనిపించింది. అతడు పూర్తి ఫిట్గా, సంతోషంగా ఉంటేనే ముంబైకి, టీమిండియాకు శుభసూచకం. విశ్రాంతి లేకుండా ఆడితే మాత్రం ఇబ్బందులు తప్పవు.నిజానికి బ్యాటింగ్ పరంగా తనకు సమస్య లేదు. బ్రేక్ మాత్రం అవసరం’’ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అదొక్కటి తప్ప కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆరంభంలో బాగానే ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సునామీ సెంచరీతో విరుచుకుపడ్డాడు కూడా!కానీ గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదు ఐపీఎల్ మ్యాచ్లలో రోహిత్ సాధించిన పరుగులు కేవలం 33. ఇందులో నాలుగుసార్లు అతడు సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు.మరోసారి వైఫల్యంఇక సన్రైజర్స్తో సోమవారం నాటి మ్యాచ్లోనూ రోహిత్ వైఫల్యం కొనసాగింది. ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు రోహిత్. టైమింగ్ మిస్ అయి వికెట్ పారేసుకున్నాడు.అలా అయితే తిరిగి ఫామ్లోకిఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ఓవైపు టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో జట్టు ఎంపిక, కూర్పు, ప్రెస్మీట్లు.. మరోవైపు ముంబై ఇండియన్స్ మ్యాచ్లతో రోహిత్ అలసిపోయాడని పేర్కొన్నాడు.అందుకే కాస్త బ్రేక్ ఇస్తే తిరిగి పుంజుకోగలడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడిన 12 మ్యాచ్లలో కలిపి 330 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
అభిమాని పట్ల షకీబ్ దురుస ప్రవర్తన.. వీడియో వైరల్
షకీబ్ అల్ హసన్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్ సమకాలీన క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగతున్న షకీబ్.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. ఈ బంగ్లా స్టార్ ఆల్రౌండర్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరంగా ఉంటున్న షకీబ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబ్ మైదానంలో ఉండగా.. గ్రౌండ్ స్టాప్ ఒకరు అతడి దగ్గరకు వచ్చి సెల్పీ అడిగాడు.దానికే చిరెత్తుకుపోయిన షకీబ్ అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రౌండ్స్మన్ బాధపడుతూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షకీబ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి అంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతుకుముందు చాలా సందర్భాల్లో అభిమానులపై షకీబ్ చేయిచేసుకున్నాడు కూడా. Shakib… when a groundsman tried tontake a selfie with him 🤨 pic.twitter.com/BWbDX4LAsK— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2024
బిజినెస్
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.ఈ ఏడాది తొలిసారి యాపిల్ సంస్థ ఏప్రిల్ 7న ‘లెట్ లూస్’ ఈవెంట్లో కొత్త ఐపాడ్లపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఓల్ఈడీ ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్స్ను లాంచ్ చేయనుందని సమాచారం. టెక్ దిగ్గజం లాంచ్ చేయనున్న కొత్త ఐపాడ్ ప్రో తరహాలో మాక్ బుక్ ప్రో సైతం మరింత పవర్ఫుల్గా ఉండనుంది.యాపిల్ లెట్ లూస్ ఈవెంట్లో ప్రత్యేకతలు లెట్ లూస్ ఈవెంట్లో యాపిల్ సంస్థ విడుదల చేయనున్న ఐపాడ్ ప్రోలో ఓఎల్ఈడీ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని బ్లూమ్బెర్గ్ నివేదిక చెబుతోంది. అంతేకాదు బెటర్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్ ఆక్యురెన్స్ సైతం అప్గ్రేడ్ వెర్షన్ యూజర్లకు వినియోగం మరింత సులభం కానుందనే నివేదిక హైలెట్ చేసింది. స్క్రీన్ అప్గ్రేడ్తో పాటు కొత్త ఐపాడ్ ప్రో మోడల్లు ఓల్డ్ మోడళ్ల కంటే సన్నగా ఉండనుందని అంచనా. 12.9 అంగుళాల మోడల్కు 20 శాతం, 11 అంగుళాల మోడల్కు 15 శాతం వరకు సైజ్ తగ్గుతుంది. ఐపాడ్ ప్రోలో ఎం4 చిప్యాపిల్ నెక్ట్స్ జనరేషన్ ఎం4 చిప్ని ఐపాడ్ ప్రోలో అప్డేట్ చేయనుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రస్తుత ఎం3 చిప్ కంటే గణనీయమైన పనితీరు, సామర్థ్యం సైతం పెరగనుందని టెక్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఊహానాల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్లో స్పష్టత రానుంది. యాపిల్ లెట్ లూస్ ఐప్యాడ్ లాంచ్ను ఎలా చూడాలిఇక మే 7న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ను యూట్యూబ్, యాపిల్.కామ్, యాపిల్ టీవీలో వీక్షించవచ్చు.
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. మంగళవారం పసిడి ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.330 పెరిగింది.దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందివైజాగ్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిచెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,430 గా ఉందిముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందికోల్కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉంది
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖా ఝున్ఝున్వాలాకు చెందిన టైటన్ కంపెనీ షేర్లు సోమవారం భారీగా క్షీణించడంతో రూ.800 కోట్లకు పైగా సంపద నష్టపోయారు.టాటా గ్రూప్ కంపెనీ అయిన టైటన్ రాకేష్ ఝున్ఝున్వాలా కుటుంబానికి భారీగా సంపద సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందుకోకపోవడంతో మదుపరులు సోమవారం భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రేఖా మార్చి 31, 2024 నాటికి టైటన్లో 5.35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం ముగింపు నాటికి ఆమె వద్ద ఉన్న షేర్ల విలువ రూ.16,792 కోట్లుగా ఉంది.త్రైమాసిక ఆదాయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సోమవారం షేరు ధర 7 శాతం పడిపోయింది. షేర్ రూ.3,352.25 కనిష్ట స్థాయిని తాకింది. బీఎస్ఈలో రూ.3,281.65 వద్ద ముగిసింది. దాంతో కంపెనీ నికర విలువ రూ.3 లక్షల కోట్ల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.2,91,340.35 కోట్లకు చేరింది. సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువలో దాదాపు రూ.22,000 కోట్లకు పైగా సంపద తుడిచి పెట్టుకుపోయింది.ఇదీ చదవండి: గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీటైటన్ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.771 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.736 కోట్ల కంటే ఇది 5% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9419 కోట్ల నుంచి రూ.11,472 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3496 కోట్లకు పెరిగింది. 2022-23లో ఈ మొత్తం రూ.3274 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం కూడా రూ.38,675 కోట్ల నుంచి రూ.47,501 కోట్లకు పెరిగింది.
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్లో తప్పక పాల్గొనాలి. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.ముఖేశ్ అంబానీ కుటుంబంముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద విలువ: సుమారు రూ.18.9 లక్షల కోట్లు.2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్: రూ.3.5లక్షల కోట్లు.గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.2019 లోక్సభ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్లో ఓటు వేశారు.ఆనంద్ మహీంద్రామహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్రా సారథ్యం వహిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండడం ఈయన ప్రత్యేకత. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ మహీంద్రా ముంబయిలో తన ఓటు వేశారు.అనిల్ అంబానీరిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ ఛైర్మన్గా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని కఫ్ పరేడ్లోని జిడి సోమాని స్కూల్లో 17వ లోక్సభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు.నరేష్ గోయల్జెట్ ఎయిర్వేస్ ఎయిర్లైన్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత 2019లో ముంబయిలో ఓటువేశారు.శక్తికాంత దాస్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్ పనిచేస్తున్న శక్తికాంత దాస్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు వేశారు.ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునే వారు చరిత్రలో తెలుసుకోవాల్సినవి..1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 భవితవ్యంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు. 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.1999 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్పేయీ ప్రభుత్వం పడిపోయింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.2008లో రాజస్థాన్లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
వీడియోలు
ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!
జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ
గాజువాకలో జనజాతర
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
బాబును చీల్చి చెండాడిన మహిళలు
ఫ్యామిలీ
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
హైదరాబాద్ కుమారాంటీ తరహాలో సంచలనం రేపిన వడా పావ్ గర్ల్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఖరీదైన కారుతో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లగ్జరీ, దాదాపు కోటి రూపాయల అద్భుతమైన ఫోర్డ్ మస్టాంగ్లో వడా పావ్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్గా మారింది.ఢిల్లీకి చెందిన "వడా పావ్ గర్ల్" చంద్రికా దీక్షిత్ మంగోల్పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్ను నిర్వహిస్తుంది. రోజూ వందల మందికి వడ పావ్ను విక్రయిస్తుంది. అలా వడా పావ్ గర్ల్గా బాగా ఫేమస్ అయింది. ఇన్స్టాలో 31 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఫోర్డ్ ముస్టాంగ్ కారులో వడాపావ్ అమ్ముతానంటూ ఇన్స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "వడ పావ్ అమ్మాయి ముస్తాంగ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించింది." అని ప్రకటించింది. అంతేకాదు వెయట్ చేయండి.. వడాపావ్తో పాటు త్వరలో ఒక పెద్ద ప్రకటన రాబోతోంది అని కామెంట్ చేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా చప్పట్ల మోత మోగించారు. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసింది. భారత మార్కెట్లో ఈ కారులే టెస్ట్ వెర్షన్ ధర సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Chandrika Gera Dixit official (@chandrika.dixit) కాగా ఇటీవల తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒకవీడియో వైరల్ అయింది. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదని ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ముస్తాంగ్ కారు నుండి బయటికి రావడం, సరికొత్త ఐఫోన్, ఐవాచ్, ఎయిర్పాడ్లను కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన రీల్స్ చేసింది. అలాగే పోర్స్చేతో సహా ఖరీదైన కార్లతో పోజులిచ్చింది.
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్తో రిలాక్స్డ్గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం. ఎందుకంటే ఇలా..డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం. ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్లోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!)
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
వైద్యశాస్త్రానికే అంతుపట్టని కొన్ని విషయాలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తాయి. ఇది శాపమా? లేక పాపమా? అన్నంత బాధను కలగజేస్తాయి. ఏం చేయాలో తోచని స్థితి. అలాంటి భయానక పరిస్థితినే మహిళగా జీవిస్తున్న చైనాకు చెందిన అమ్మాయి ఎదుర్కొంటోంది. అది కూడా పెళ్లి కుదిరాక ఈ పరిస్థితి ఎదరవ్వడంతో ఆమెతో సహ తల్లిదండ్రలు కూడా నిశ్చేష్టులైపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు అని విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.ఏం జరిగిందంటే..? చైనాలోని 27 ఏళ్ల మహిళ లీ యువాన్కి గత కొద్దిరోజుల ముందే పెళ్లి కుదిరింది. తనకు రుతుక్రమం రాకపోవడంతో ఆందోళన చెంది వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు 18 ఏళ్ల సమయంలోనే ఈ పరిస్థితిని ఎదుర్కొంది. అసాధారణ హర్మోన్ స్థాయిలు, సంభావ్య అండాశయ వైఫల్యం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆమెను క్రోమోజోమ్ పరీక్ష కూడా చేయించుకోమని సూచించారు. అయితే లీ, ఆమె కుటుంబం ఆ సలహను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పెళ్లి కుదరడంతో లీ కుటుంబం ఆమెకు వైద్య పరీక్షలు చేయించింది. ఆ పరీక్షల్లో వాళ్లంతా జీర్ణించుకోలేని నిజం బయటపడింది. వైద్యులు ఆమె పొత్తి కడుపులో వృషణాలు ఉండటా గుర్తించారు. ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనే అరుదైన రుగ్మత ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. ఈ అరుదైన రుగ్మత సుమారు 50 వేల మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇన్నాళ్లు స్త్రీగా జీవిస్తున్న లీ ఇప్పుడూ వైద్య పరీక్షల్లో మగదిగా గైనకాలజిస్ట్ డువాన్ జీ తేల్చి చెప్పారు. ఆమెలో మగ క్రోమోజోమ్లు ఉన్నాయన్నారు. దీంతో లీకి ఒక్కసారిగా తన జీవితం అంతా తలకిందులైనట్లు అనిపించింది. ముఖ్యంగా లీ తల్లిందడ్రుల ఈ విషయం విని జీర్ణించుకోలేని అయోమయానికి గురయ్యారు. నిజానికి ఈ డిజార్డర్కి కారణమయ్యే జన్యువులు లీ తల్లిదండ్రులిద్దరు కలిగి ఉన్నారు. కాబట్టే లీకి ఈ పరిస్థితి ఎదురయ్యిందని చెప్పారు వైద్యులు. ఆ వైద్య పరీక్షల్లో లీ బోలు ఎముకల వ్యాధితో విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేగాదు పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తక్షణమే తొలగించాలని, లేనట్లయితే క్యాన్సర్కి దారితీస్తుందని చెప్పారు. దీంతో లీకి వైద్యలు ఏప్రిల్ మొదటి వారంలోనే శస్త్ర చికిత్స నిర్వహించి పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తొలగించారు. ఆమెకు ఇప్పుడు రెగ్యూలర్ ఫాలో అప్ పరీక్షలు, దీర్ఘకాలిక హార్మోన్ థెరపీ చేస్తున్నారు. ప్రస్తుతం లీ కథ ఇప్పుడు చైనాలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వుతుంది. నెట్టింట లీ పట్ల సానుభూతి వెల్లువెత్తడమే గాక ఆమె ధైర్యాన్నికొనియాడుతున్నారు. కాగా, పుట్టకతో వచ్చే ఈ డ్రినల్ హైపర్ప్లాసియా (CAH) అనేది మనిషి అడ్రినల్ గ్రంధులను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత. ఈ గ్రంథులు శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ప్రధానంగా లైంగిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: 'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ కేఫ్లు ఎక్కడ ఉన్నాయంటే..)
న్యూస్ పాడ్కాస్ట్
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
మోసగాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి.. ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ..ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో మరింత సంక్షేమం.. మరింత అభివృద్ధి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... నవరత్నాల పథకాలన్నీ కొనసాగింపు..ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
సుల్తానాబాద్రూరల్: డ్రైవర్ సీటు కింది స్ప్రింగ్ ఊడిపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్ మండలం చిన్న కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు. పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న స్ప్రింగ్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్ చేజారి ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంకటేశ్కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, నాయకులు నల్ల మనోహర్రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే తండ్రి మృతి
కోరుట్ల: పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే వాంతులు చేసుకొని, మృతిచెందాడు కోరుట్లకు చెందిన ఓ ఆటోడ్రైవర్. వైద్యులు సమయానికి చికిత్స అందించక పోవడం వల్లే చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసి, దవాఖానా ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హాజీపురకు చెందిన నజీబుర్ రెహ్మాన్(48) ఆటోడ్రైవర్. ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్ ఆటో అడ్డా వద్ద వాంతులు చేసుకున్నాడు. అక్కడున్నవారు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించకుండా గంటసేపు కాలయాపన చేసి, చివరికి నజీబుర్ రెహ్మాన్ మృతిచెందినట్లు చె ప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబితే మరో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారమని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులతో కలి సి ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆందో ళన చేపట్టారు. వైద్యుడు శ్రవణ్, సిబ్బందిపై గొడవకు దిగడంతో ఓ గదిలోకి వెళ్లి, దాక్కున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ గొడవ సద్దుమణగలేదు. బాధితులు వైద్య సిబ్బంది దాక్కున్న గదిలోకి పెట్రోల్ విసరడంతో అప్రమత్తమయ్యారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. సుమారు 4 గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేశ్బాబు, ఎస్సైలు చిరంజీవి, శ్యాంరాజ్, నవీన్ మృతుడి బంధువులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ నెల 17న పెద్ద కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో నజీబుర్ రెహ్మాన్ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వాంతులు చేసుకున్న కోరుట్లవాసి వైద్యులు చికిత్స అందించలేదని కుటుంబసభ్యుల ఆరోపణ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందితో గొడవ ఫర్నిచర్ ధ్వంసం