గొలుగొండ: విశాఖ జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో కొత్తగా రంగు రాళ్ల క్వారీ వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం గ్రామ సమీపంలో ఉన్న జిరాయితీ భూమిని చదును చేస్తుండగా చిన్న మెట్ట అంచున రంగురాయి బయటపడింది. కొందరు అనుభవజ్ఞులు ఇక్కడి మట్టిని పరిశీలించి రంగురాళ్లు ఉండే అవకాశముందని చెప్పడంతో.. ఆ విషయం తెలిసి వందలాదిమంది మంగళవారం అర్ధరాత్రి ఎక్కడికక్కడ తవ్వకాలు చేపట్టారు. బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ ధనుంజయ్నాయుడు సిబ్బందితో గ్రామానికి వెళ్లగా.. తవ్వకాలు చేపట్టిన వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా, ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంగురాళ్లకు పుట్టినిల్లు
గొలుగొండ మండలంలో ఏటా ఏదో ఒకచోట రంగురాళ్ల క్వారీలు బయటపడుతున్నాయి. 1996లో తొలిసారిగా పప్పుశెట్టిపాలెం క్వారీ బయటపడింది. ఆశకొద్దీ లోతుగా తవ్వడంతో ఏడాది కాలంలో క్వారీ కూలి 14 మంది చనిపోయారు. 1999లో కరక రంగురాళ్ల క్వారీని కనుగొన్నారు. ఇక్కడ 15 వరకు క్వారీలు వెలుగుచూడగా రూ.వేలకోట్ల విలువైన రంగురాళ్లు దొరికాయి.
అప్పట్లో ఈ 15 క్వారీల్లో ప్రమాదాలు జరిగి 100 మంది వరకు మృత్యువాతపడ్డారు. దీంతో అప్పటి కలెక్టర్ ప్రవీణ్ప్రకాశ్ క్వారీ ప్రాంతాలను మూయించారు. 2002లో సాలిక మల్లవరం, 2004లో పొగచట్లపాలెం, 2006లో దోనిపాలెం, 2008లో తిరిగి సాలిక మల్లవరం, 2009లో ఆరిలోవలో కొత్త క్వారీలు ఏర్పడ్డాయి. పప్పుశెట్టిపాలెంలో బుధవారం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీని రప్పించి క్వారీ ప్రాంతంలో తవ్వకందారులు తీసిన గోతులను మూయించివేశారు.
విషయం తెలియడంతో తవ్వకాలు మొదలుపెట్టిన జనం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో
Published Thu, Jan 13 2022 4:08 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
- హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
- Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!
- ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ప్యాడ్ ఉమన్
- జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
- మేడిగడ్డ కింద అగాధం!
- మళ్లీ సుర్రుమన్న ‘సూరీడు’
- ఎరువులు, విత్తనాల సరఫరాలో సమస్య రావొద్దు
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
Advertisement