పాఠ్యాంశంగా సోనియా జీవిత చరిత్ర !
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జీవిత విశేషాలను తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యాంశంగా పెట్టాలని సీఎం కేసీఆర్ను కోరామని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జీవిత విశేషాలను తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యాంశంగా పెట్టాలని సీఎం కేసీఆర్ను కోరామని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందుకు కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. మంగళవారం గాంధీ భవన్లో నిర్వహించిన సోనియా 68వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.


