రణస్థలం: గ్రామాలకు కనీసం తాగునీరు అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని వైఎస్ఆర్ సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్, జెడ్పీటీసీ సభ్యులు గొర్లె రాజగోపాల్లు తెలిపారు. అల్లివలస గ్రామంలో తాగునీటి సమస్యపై ఈ నెల 17న సాక్షిలో ‘గొంతెండుతోంది’ అన్న శీర్షికన కథనం వెలువడింది. దీనికి స్పందించిన జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్ మంగళవారం అల్లివలసకు తన సొంత డబ్బుతో తాగునీటి బోరు ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో బాధ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని కిరణ్, రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశంలో ప్రస్తావించినా లాభం లేకపోయిందని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకున్నా వైఎస్ఆర్ సీపీ ప్రజలకు అండగా ఉంటోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి పిన్నింటి సాయికుమార్, అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్, వి.ఎల్లయ్య, సోరాడ కోర్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
అల్లివలసకు తాగునీటి మోటారు అందించిన జెడ్పీటీసీ
Published Tue, Jul 19 2016 9:05 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement