శిల్పాకు అక్కినేని ఫ్యాన్స్‌ మద్దతు | Sakshi
Sakshi News home page

శిల్పాకు అక్కినేని ఫ్యాన్స్‌ మద్దతు

Published Sun, Aug 20 2017 11:46 AM

శిల్పాకు అక్కినేని ఫ్యాన్స్‌ మద్దతు - Sakshi

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీకి మద్దతు పెరుగుతోంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చేవారి సంఖ్య రోజురోజుకు ఎగబాకుతోంది. ఆయనకు నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు నిన్న మద్దతు ప్రకటించారు. తాజాగా అక్కినేని అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా మోహన్‌రెడ్డికి ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించించింది. అక్కినేని అభిమానులు అందరూ శిల్పా మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కినేని ఫ్యాన్స్‌ ఆలిండియా అధ్యక్షుడు ఏవీ రామరాజు విజ్ఞప్తి చేశారు.

కాగా, సూపర్‌స్టార్‌ కృష్ణ, 'ప్రిన్స్‌' మహేశ్‌బాబు అభిమానులు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారని నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న పోలింగ్‌ జరగనుంది.

Advertisement
Advertisement