Short Stories | Sakshi
1

పెళ్లిపై అల్లు శిరీష్ నాట్ ఇంట్రెస్ట్

పుష్ప 2 సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న అ‍ల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ పెళ్లి చేసుకోనని అంటున్నాడు. తండ్రి పదేళ్లుగా అడుగుతున్నా సరే నో అనే సమాధానం చెబుతున్నాడు. దానికి కారణాన్ని కూడా తాజాగా ఓ ఈవెంట్ లో శిరీష్ బయటపెట్టాడు.
Read More
2

లారెన్స్ మంచి మనసు.. వాళ్లకు గుర్తుండిపోయే సాయం

కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ తన మంచి మనసు చాటుకున్నాడు. అనుకోని ఇబ్బంది ఎదురై ఆర్థికంగా కుదేలైన ఓ పేద కుటుంబానికి తన వంతు ఆర్థిక సాయం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి సంగతి?
Read More
3

పిలుపొస్తే.. కదన రంగంలోకి దూకుడే!

దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్మీనే. కుటుంబాలకు దూరంగా ఉంటూ భరతభూమికి వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. సైనికులే మన ధైర్యం.మండల పరిధిలోని హస్నాబాద్‌ గ్రామం నుంచి వంద మందికి పైగా దేశ రక్షణలో సైనికులుగా చేరారు. ప్రతీ సెలక్షన్‌ నుంచి ఇద్దరి నుంచి ఐదుగురు వరకు సైన్యంలో చేరతారు. . 70 ఏళ్ల నుంచీఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున సైన్యంలో విధులు నిర్వహిస్తుండటం విశేషం.
Read More
4

తిరుమల దర్శనం.. 'హిట్ 3' దర్శకుడికి షాకింగ్ అనుభవం

హిట్ 3 సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను.. తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని ట్వీట్ లో పంచుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
Read More
5

IPL 2025: రాజస్థాన్‌ రాయల్స్‌లో మరో కీలక మార్పు

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్‌ రాయల్స్‌, జట్టులో మరో కీలక మార్పు చేసింది. గాయపడిన సందీప్‌ శర్మ స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన నండ్రే బర్గర్‌ జట్టులోకి తీసుకుంది. బర్గర్‌ను రాయల్స్‌ రూ. 3.5 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అంతకుముందు మరో గాయపడిన ఆటగాడు నితీశ్‌ రాణాకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికాకే చెందిన లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌ను ఎంపిక చేసుకుంది.
Read More
6

IPL 2025: చరిత్ర సృష్టించిన ధోని

సీఎస్‌కే స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 200 మందిని ఔట్‌ చేయడంలో భాగమైన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మే 7) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్‌, ఓ స్టంపౌట్‌ చేసిన ధోని ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 276 మ్యాచ్‌లు ఆడిన ధోని 153 క్యాచ్‌లు, 47 స్టంపింగ్‌లు చేశాడు.
Read More
7

గూగుల్‌ 200 ఉద్యోగాల్లో కోత!

విస్తృత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగాలను పర్యవేక్షించే గ్లోబల్ బిజినెస్ యూనిట్ నుంచి గూగుల్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. టీమ్ సహకారాన్ని పెంపొందించడానికి, కస్టమర్ సేవను మెరుగుపరచడానికి, క్రమబద్ధమైన కార్యకలాపాలను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
Read More
8

మహిళలకు గండంగా.. సైలెంట్‌గా ఒవేరియన్‌ కేన్సర్‌

ఒవేరియన్‌ (అండాశయ) కేన్సర్‌. స్త్రీలలో వచ్చే కేన్సర్లలో మూడోస్థానంలో ఉంటుంది. అండాశయ కేన్సర్‌ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. ఇది చాపకింద నీరులా శరీరంలో ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీన్ని నిశ్శబ్దహంతకిగా పేర్కొంటారు. ఈ కేన్సర్‌ తొలి రెండో దశల్లో స్వల్ప లక్షణాలు ఉండటంతో పెద్దగా పట్టించుకోరు. 60 నుంచి 70శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యులను ఆశ్రయిస్తుండటంతో చాలా మంది మరణం అంచులకు వెళ్తున్నారు.
Read More
9

మరిగి మరిగి మడ్డిలా మారిన నూనెను..

సాధారణంగా ఏదైనా పిండి వంటలు చేసినపుడు ముఖ్యంగా జంతికలు, కారప్పూస, అరిసెలు, బూందీ తదితర పిండివంటలు చేయాలంటే ఆయా పదార్థాలని నూనెలో ఫ్రై చేస్తుంటాం. అలాగే పకోడీ, బజ్జీ లాంటి స్నాక్స్ చేసినప్పుడు కూడా డీప్‌ ప్రై చేస్తాం. అప్పుడు వాటికి సంబంధించిన మడ్డి, చిన్న చిన్న తునకలు నూనెలో మిగిలిపోతాయి. మాడిపోయి నల్లగా కనిపిస్తుంటాయి. అలా ఉపయోగించిన నూనెను పాప్‌కార్న్ పిండితో సులభంగా శుభ్రం చేయవచ్చు.
Read More
10

పో.. పో!.. వరుణ్‌ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) స్టార్‌ క్రికెటర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy)కి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)తో మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గానూ.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడికి మొట్టికాయలు వేసింది. మ్యాచ్‌ ఫీజులో ఇరవై ఐదు శాతం మేర కోత విధించింది.
Read More
11

పెళ్లి రూమర్స్.. సమంత పోస్ట్ వైరల్

సమంత మళ్లీ చాలారోజుల తర్వాత మీడియా ముందుకొచ్చింది. తను నిర్మించిన 'శుభం' మూవీ కోసం ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సందర్భంగా న్యూ బిగినింగ్స్ అని కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఇంతకీ పోస్టులో ఏముందంటే?
Read More
12

చిన్న సినిమా పెద్ద సౌండ్.. ఓటీటీ డేట్ ఫిక్సయిందా?

తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో ప్రేక్షకుల్ని తెగ అలరిస్తున్న సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. సూర్యగా హీరోగా నటించిన రెట్రో చిత్రానికి పోటీగా రిలీజై సక్సెస్ అయింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఓటీటీలోకి ఎప్పుడు రావొచ్చు?
Read More
13

క్రికెటర్ విడాకులకి భార్య సినిమాలే కారణమా?

టీమిండియా స్పిన్నర్ చాహల్ విడాకులు తీసుకోవడానికి భార్య చేస్తున్న సినిమాలే కారణమా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిరోజుల క్రితమే విడాకులు తీసుకున్న ఈమె వరస సినిమాలు చేస్తోంది. ఇంతకీ ఏంటీ సంగతి?
Read More
14

IPL 2025 షెడ్యూల్‌లో మార్పులు?.. దేశ ప్రయోజనాలే ముఖ్యం

‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)నేపథ్యంలో ఐపీఎల్‌-2025లో షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి. ఐపీఎల్‌ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని.. లీగ్‌ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశాయి. అయితే..
15

సీమంతం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భార్య, హీరోయిన్ రహస్య గోరఖ్ సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇంతకీ విషయం ఏంటి?
Read More
16

టీవీలోకి వచ్చేస్తున్న ‘రాబిన్‌హుడ్‌’

నితిన్‌ హీరోగా నటించిన రాబిన్‌ హుడ్‌.. ఈ ఏడాది మార్చిలో విడుదలై డిజాస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది. ఓటీటీలో అయినా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్రబృందంలో బలంగా ఉంది. అయితే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ని కొనుగోలు చేసిన జీ5 సంస్థ.. మే 10న ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్‌ చేయనుంది. ఆ తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
Read More
17

సింహాచలం బాధితులకు రెండు లక్షలు అందజేత

సింహాచలం ఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించాము. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎండోమెంట్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి.
Read More
18

భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్‌ జగన్‌

ఆపరేషన్‌ సిందూర్‌పై వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు.
Read More
19

హ్యాపీ దివాళీ, హ్యాపీ మిడ్‌ నైట్‌ సన్‌రైజ్‌.. పాకిస్తాన్‌పై ఫన్నీ కామెంట్స్‌

భారత దాడుల సందర్భంగా పాకిస్తాన్‌లో పరిస్థితులపై సోషల్‌ మీడియా వేదికగా పలువురు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. అర్థరాత్రి రెండు గంటలకే పాకిస్తాన్‌లో సూర్యోదయం వచ్చిందని కర్ణాటక బీజేపీ ట్విట్టర్‌లో ఫన్నీ పోస్టును పెట్టింది. ఇక, పలువురు నెటిజన్లు వీడియోలు ఫోస్టు చేస్తూ దివాళి ముందే వచ్చేసిందనే సినిమా డైలాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.
Read More
20

ఆపరేషన్‌ సిందూర్‌.. అర్ధరాత్రి దాడులు ఇలా..

ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక
Read More
21

ఆపరేషన్‌ సిందూర్‌.. పాక్‌ ప్రధాని రియాక్షన్‌ ఇదే..

భారత్‌ దాడులను పాక్‌ సైన్యం ధ్రువీకరించింది. భారత్‌ దాడులపై పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘పాక్‌ శత్రువు భారత్‌.. మా దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్‌ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్‌ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్‌ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ..
Read More
22

ప్రభుత్వ రుణం దిగిరావాలి

పెరిగిన ప్రభుత్వ రుణం మోస్తరు స్థాయికి దిగిరావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్‌ అన్నారు. తద్వారా వడ్డీ చెల్లింపులు తగ్గుతాయని, అప్పుడే రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ అవుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అనిశ్చితులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్‌ ఏదో ఒక నిర్ధిష్టమైన మార్గానికి పరిమితం కాకూడదన్నారు.
Read More
23

టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే

గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమిపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) స్పందించాడు. ఆఖరి వరకు తమ జట్టు పోరాడిన తీరు అద్భుతమని కొనియాడాడు. అయితే, నో బాల్స్‌ వేయడం ప్రభావం చూపిందన్న హార్దిక్‌.. టీ20లలో ఇలా చేయడం నేరంతో సమానమని పేర్కొన్నాడు.
Read More
24

ఆపరేషన్‌ సిందూర్‌.. స్టాక్‌ మార్కెట్‌పై ‍ప్రభావం ఎంత?

భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్‌ దాయాది దేశంపై పంజా విసిరింది.
Read More
25

ఎన్‌బీఎఫ్‌సీ గోల్డ్‌ లోన్లకు కష్టాలు

ఆర్‌బీఐ ప్రతిపాదించిన నూతన ముసాయిదా నిబంధనలు ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) బంగారం రుణ ఆస్తులు నిదానించేలా చేస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. లోన్‌ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం), రుణాల పునరుద్ధరణ, టాపప్‌ బుల్లెట్‌ రుణాలపై ఈ ముసాయిదా దృష్టి పెట్టిందని.. ఈ నిబంధనలు ఎన్‌బీఎఫ్‌సీ రుణ ఆస్తుల వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.
Read More
26

'బలగం' నటుడికి తీవ్ర అనారోగ్యం

బలగం సినిమాలో నటించిన జీవీ బాబు అనే నటుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆయనకు ఏమైంది? ఇప్పుడెలా ఉందంటే?
Read More
27

చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!

కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.
Read More
28

IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌. ఈ జట్టుకు సారధిగా రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్‌ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. ఈ జట్టులో రాహుల్‌ త్రిపాఠి, రచిన్‌ రవీంద్ర, ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, మ్యాక్స్‌వెల్‌, లివింగ్‌స్టోన్‌, దీపక్‌ హుడా, అశ్విన్‌, పతిరణ, షమీకి చోటు కల్పించింది.
Read More
29

దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష

దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
Read More
30

అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా: విరాట్‌ కోహ్లి

టీమిండియా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్‌ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది ఆర్సీబీ కెప్టెన్‌గానూ వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.ప్రస్తుతం ఐపీఎల్‌-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న కోహ్లి ఈ విషయాలపై తాజాగా మాట్లాడాడు.
Read More
31

క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత

అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది.
Read More
32

Thudarum Movie: మోహన్ లాల్ సినిమాకు పైరసీ బెడద

మలయాళ సూపర్ స్టార్‌ మెహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'తుడరుమ్'. ఈ చిత్రంలో శోభన హీరోయిన్‌గా కనిపించింది. మలయాళంలో హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి జతకట్టారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లతో మలయాళ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Read More
33

ఎకాఎకి భారీగా పెరిగిన బంగారం ధరలు!

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి రెండు రోజుల నుంచి క్రమంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
Read More
34

ఢిల్లీ క్యాపిటల్స్‌ది తప్పుడు నిర్ణయం: వాట్సన్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (SRH vs DC) అనుసరించిన వ్యూహాలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ విమర్శించాడు.ప్లే ఆఫ్స్‌ చేరాలంటే కీలకమైన మ్యాచ్‌లోనూ ఓపెనింగ్‌ జోడీని మార్చడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బుద్ధిలేని చర్యగా అభివర్ణించాడు.
Read More
35

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అగ్రస్థానం ఈ బ్రాండ్‌దే..

దేశీయంగా మార్చి త్రైమాసికంలో టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 25 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ 8 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకుంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ పెరుగుతుండటం, రిటైల్‌ స్టోర్స్‌ను కంపెనీ విస్తరించడం, ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు ఇందుకు గణనీయంగా దోహదపడ్డాయి.
Read More
36

ఈ ఏడాదిలో ఆర్‌బీఐ మరోసారి తీపికబురు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మొత్తం మీద 125 బేసిస్‌ పాయింట్ల మేర (1.25–1.5 శాతం) రేట్లను తగ్గించొచ్చని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక అంచనా వేసింది. దీంతో మొత్తం మీద రేట్ల తగ్గింపు 150 బేసిస్‌ పాయింట్లుగా ఉంటుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అంచనాలకు వచ్చింది. 0.25 శాతం స్థానంలో 0.50 శాతం చొప్పున జంబో రేటు తగ్గింపు చేపడితే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చే
Read More
37

సన్‌రైజర్స్‌ అవుట్‌.. మరి ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ రేసులోనే ఉందా?

ఐపీఎల్‌ గత సీజన్‌ రన్నరప్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట ఈసారి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలుండగానే ముగిసింది. సొంతగడ్డపై సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ రద్దు కావడంతో ముందుకెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. మరి ఢిల్లీ పరిస్థితి ఏమిటి?...
Read More
38

చిరంజీవికి హీరోయిన్ దొరికేసిందా?

మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడితో త్వరలో సినిమా చేయబోతున్నారు. దీని షూటింగ్ కూడా త్వరలోనే మొదలవనుంది. ఇప్పుడీ ఈ చిత్రంలో హీరోయిన్ గా కేథరిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈమె గతంలో బన్నీ సరసన ఇదరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో చేసింది.
Read More
39

అతడు మరో ఆరేళ్లపాటు ఐపీఎల్‌ ఆడతాడు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (Andre Russel)పై ఆ జట్టు బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్‌ కాబోడని.. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్‌ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు కేకేఆర్‌ రసెల్‌ను రూ. 12 కోట్లకు అతడిని రిటైన్‌ చేసుకుంది.
40

బనానాతో హెల్దీగా.. టేస్టీగా!

వేసవి సెలవులొచ్చేశాయి. ఈ సమయంలో పిల్లలకి పోషకమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరం. పిల్లలు సైతం సిద్ధం చేసుకోగలిగే ఈజీ రెసిపీల గురించి తెలుసుకుందాం. వీటిల్లో బనానా రెసిపీలు మొదటి వరసలో ఉంటాయి. పైగా అవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.
Read More
41

పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు

దిగ్గజ ఇన్వెస్టర్ & బెర్క్‌షైర్ హాత్వే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) వారెన్ బఫెట్.. ఇటీవల తన వాటాదారుల ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక లోటుకు సంబందించిన విషయాలను హైలెట్ చేస్తూ.. పెట్టుబడిదారులు కేవలం యూఎస్ డాలర్ మీద మాత్రమే కాకుండా, ఇతర కరెన్సీలలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు.
Read More
42

తప్పతాగి పిచ్చి చేష్టలు, తిక్క కుదిర్చిన ఇండిగో

ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడో వ్యక్తి. మద్యం తాగి, ఆమె పట్ల అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను వేధించాడన్న ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read More
43

ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?

2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.
Read More
44

భువనగిరి సినిమాలకు సిరి

హైదరాబాద్‌ శివారులోని యాదాద్రి భువనగిరి జిల్లా.. సినిమాలు, టెలిఫిల్మ్‌లు, యాడ్‌ ఫిల్మ్‌ల షూటింగ్‌లకు అనుకూలంగా ఉండటం దర్శక నిర్మాతలకు కలిసొస్తోంది. పేరు మోసిన డైరెక్టర్లు, హీరో, హీరోయిన్లతో ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. పల్లె వాతావరణం, ప్రకృతి రమణీయత, పచ్చని వరి పొలాలు, చెరువులు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, గుట్టలు ఫిలిం సిటీ పక్కనే ఉండటం..సినిమా నిర్మాణానికి అనుకూలంగా ఉంది.
Read More
45

కాపురాల్లో డబ్బు చిచ్చు!

మానవ సంబంధాల్లో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేమగా మాట్లాడాలన్నా, అభిమానాన్ని ఎదుటివ్యక్తికి తెలియజేయాలన్నా డబ్బు అవసరం లేకపోవచ్చు.. కానీ ఆ ప్రేమను, అభిమానాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే మాత్రం కచ్చితంగా డబ్బు కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది.
Read More
46

IND vs ENG: బుమ్రాకు భారీ షాక్‌!

ఇంగ్లండ్‌ పర్యటనలో రోహిత్‌ స్థానాన్ని పేస్‌ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్‌ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇందుకు కారణం ఏమిటంటే..
Read More
47

విశాఖలో విషాదం

విశాఖలోని సీతమ్మధారలో విషాదం నెలకొంది. సితార అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్‌ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి.
Read More
48

హైవే-363ని జాతికి అంకితమిచ్చిన గడ్కరీ

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో నితిన్‌ గడ్కరీ జాతీయ రహదారి 363ని గడ్కరీని జాతికి అంకితం చేశారు. జాతీయ రహదారులతో దేశాన్ని అనుసంధానిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్రమంత్రిగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నేను ఇంజనీర్‌ను కాదు.. కానీ, 13 డాక్టరేట్లు వచ్చాయి. చీకటి ఉన్న చోటనే వెలుగు
Read More
49

బోర్డర్‌ టెన్షన్‌.. జమ్ముకశ్మీర్‌లో జైళ్లకు భద్రత పెంపు

కశ్మీర్‌ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్‌ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్‌, కోట్‌ బాల్వాల్‌ జైల్‌, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్‌ సెల్స్‌, ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన..
Read More
50

రైతులకు బాసటగా..

తాడేపల్లి: అకాల వర్షాలు పడతాయని తెలుసు. అయినా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. అధికార యంత్రాంగం నిస్తేజంలో ఉండిపోయింది. ఫలితంగానే.. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. కానీ, ప్రభుత్వం నుంచి వాళ్లకు పరిహారం ఇప్పించాల్సిన బాధ్యత మనది. అందుకే నష్టపోయిన రైతుల వద్దకు వెళ్లండి. వాళ్లను పరామర్శించండి అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..
Read More