ఇదీ కేసీఆర్ ‘పంచ్’..
హైదరాబాద్:
-
కిరికిరినాయుడు..పొమ్మన్నా పోతలేడు. పొద్దున లేస్తే ప్రతి పనిలోనూ అడ్డుపుల్ల పెడ్తడు. ఆయనకు రాజ్యం ఉన్నా అక్కడికి పోతలేడు. రైతు రుణాలు మాఫీ చేయకుండా వారిని మోసం జేస్తుండు. ప్రజలెమ్మడి పొయ్యి చావు పో. (చంద్రబాబు నాయుడును ఉద్దేశించి) -
మహబూబ్నగర్లో టీడీపీ సభకు వచ్చిన జనం...పరేడ్గ్రౌండ్స్లో బఠాణీలు అమ్ముకునేందుకు వచ్చిన వారితో సమానం. -
బాబు 4 పెంపుడు కుక్కలను పెట్టుకొని మొరిగి స్తుండు. గాడిదలుంటెనే గుర్రాల విలువ తెలుస్తది. -
తెలంగాణ ఉద్యమంలో ప్రజలు తొడగొట్టి...జబ్బజరిచి..బరిగీసి తెలంగాణ ఈడ పెట్టుర్రి అని గర్జించారు. -
10తులాల బంగరు పతకం చేసి బంగారు తెలంగాణ అనుడు కాదు...ప్రతి తెలంగాణ పౌరుని ముఖం బంగారు నాణెంలా నిగనిగలాడాలె. -
తెలంగాణ పల్లెల్లో నీళ్లమ్మేందుకు మిషన్లు మోపయినయ్...బ్రహ్మంగారు చెప్పినట్లు నీళ్లమ్మే రోజులొచ్చినయి. -
వలస ముష్కరుల పాలనలో మన గుండె లపై పేరుకుపోయిన పూడిక ఇది (చెరువుల పునరుద్ధరణపై మాట్లాడుతూ..). -
సంక్షేమ కార్యక్రమాల అమలుకు వెచ్చించే మొత్తాన్ని దొంగతనం చేసి తెస్తలేను...ఇక్కడి బడ్జెట్నే పథకాల అమలుకు ఖర్చు చేస్తున్నా.