Breaking News

టీమిండియా ‘ప్రపంచ’ రికార్డు.. పాకిస్తాన్‌తో సమంగా

Published on Mon, 03/02/2026 - 10:17

వెస్టిండీస్‌తో సూపర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత జట్టు సమం చేసింది.

సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడి
శ్రీలంకతో కలిసి వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

వరుస విజయాలతో సెమీస్‌కు
అయితే, తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే (IND vs ZIM)ను భారీ తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌ రేసులో ముందుకు వచ్చిన భారత్‌.. ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ (IND vs WI)ను చిత్తు చేసి బెర్తును ఖరారు చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది.

విండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22 బంతుల్లో 37) అజేయ ఇన్నింగ్స్‌తో అలరించగా.. ఓపెనర్‌ రోస్టన్‌ ఛేజ్‌ (25 బంతుల్లో 40) టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

సంజూ స్పెషల్‌
ఇక లక్ష్య ఛేదనలో భారత్‌ ఆరంభంలో తడబడినా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 97 పరుగులతో అజేయంగా నిలిచి గెలుపును ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

పాక్‌ ప్రపంచ రికార్డు సమం
కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సెమీస్‌ చేరడం ఇది ఆరోసారి. తద్వారా పాకిస్తాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్‌ సమం చేసింది. ఇక ఇదే ఎడిషన్‌లో అందరి కంటే ముందే సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్న ఇంగ్లండ్‌ సైతం ఆరోసారి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి.. పాక్‌, భారత్‌ సరసన నిలిచింది. ఇక గురువారం నాటిమ్యాచ్‌లో ఫైనల్‌ బెర్తు కోసం టీమిండియా ఇంగ్లండ్‌ మధ్యమ్యాచ్‌ జరుగుతుంది. ఇందుకు ముంబై వేదిక.

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధికసార్లు సెమీ ఫైనల్‌ చేరిన జట్లు ఇవే
👉పాకిస్తాన్‌- ఆరుసార్లు (2007, 2009, 2010, 2012, 2021, 2022)
👉టీమిండియా- ఆరుసార్లు (2007, 2014, 2016, 2022, 2024, 2026)
👉ఇంగ్లండ్‌- ఆరుసార్లు (2010, 2016, 2021, 2022, 2024, 2026

చదవండి: ఇది సరిపోతుందా బాస్‌!.. విమర్శలకు సంజూ ’స్టైల్‌’ కౌంటర్‌

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)