సెన్సెక్స్‌ ప్లస్, నిఫ్టీ మైనస్‌ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ ప్లస్, నిఫ్టీ మైనస్‌

Published Tue, May 7 2024 5:55 AM

Stock market: Sensex, Nifty 50 end mixed

ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకులు

అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్‌ సూచీలు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్లు లాభపడి 73,896 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,443 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కన్జూమర్‌ డ్యూరబుల్స్, సరీ్వసెస్, యుటిలిటీ, విద్యుత్, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీ షేర్లూ నష్టాలను చవిచూశాయి.

 బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ సూచీలు 1% నష్టపోయాయి. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఆశలతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియాలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్‌ దేశాల స్టాక్‌ మార్కెట్లు పనిచేయలేదు. చైనా, హాంగ్‌కాంగ్‌ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. నిర్మాణంలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణాల కేటాయింపు కఠినతరం చేస్తూ రూపొందించిన ముసాయిదాను ఆర్‌బీఐ ఆమోదించడంతో ప్రభుత్వరంగ బ్యాంకులు, కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

Advertisement
Advertisement