ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ
పీఎస్యూ బ్యాంకుల్లో వాటా52 శాతానికి తగ్గిస్తాం
భూసేకరణ చట్టంలో సవరణలు
శీతాకాల సమావేశాల్లో బీమా ఎఫ్డీఐల బిల్లుకు మోక్షం
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదార్లకు ఆమోదయోగ్యమైన, హేతుబద్ధమైన పన్ను పాలసీని అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీనిచ్చారు. భారత్ను అత్యంత చౌక తయారీ ఉత్పత్తులకు గమ్యస్థానంగా మార్చాలంటే భారీస్థాయిలో పన్నుల విధింపు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ఆదివారమిక్కడ ఇండియా గ్లోబల్ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘మన ఆర్థిక వృద్ధి రేటు ఘోరంగా పడిపోయింది. కీలకమైన తయారీ రంగం కూడా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందుకే మేం దీనిపై దృష్టి కేంద్రీకరించాం. భారత్ను తయారీకి గమ్యంగా చేయడమే మా లక్ష్యం’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.
విశ్వాసం పెంచుతాం...
భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పెంచడమే తమ ప్రధానోద్దేశమని చెప్పారు. ప్రతిపక్షాలు మద్దతివ్వకపోయినా... భూసేకరణ చట్టంలో సవరణలను చేసి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణం సజావుగా జరగాలంటే ముందుగా భూసేకరణ చట్టాల్లోని కొన్ని అసంబద్ధ నిబంధనలను తొలగించాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు.
బీమా బిల్లు ఆమోదంపై ఆశాభావం...
మరోపక్క, రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రతిపాదిత బీమా చట్టాల సవరణ బిల్లుకు ఆమోదముద్రపడేలా చూస్తామని జైట్లీ తెలిపారు. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్డీఐ)ను ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ ప్రతిపాదనకు మోదీ సర్కారు ఇప్పటికే ఓకే చెప్పింది. పార్లమెంటులో ఆమోదముద్రపడితే చట్టబద్ధత వస్తుంది.
పీఎస్యూ బ్యాంకుల్లో వాటా 52%కి...
ప్రభుత్వ రంగ(పీఎస్యూ) బ్యాంకులు రూ. 3 లక్షల కోట్లమేర మూలధనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను 52 శాతానికి తగ్గించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం పీఎస్యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గించుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం వివిధ పీఎస్యూ బ్యాంకుల్లో ప్రభుత్వానికి 56.26 శాతం(బ్యాంక్ ఆఫ్ బరోడా)లను నుంచి 88.63 శాతం(సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్థాయిలో వాటాలు ఉన్నాయి.
అధిక పన్నులు విధించం
Published Sun, Nov 9 2014 11:46 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement