ఈ సాగు విధానంలో నేలను సిద్ధం చేసుకోవడం, మొక్కలు నాటడం కీలకమైనవి. అరెకరంలోనే వేయాల నేం లేదు. పావెకరంలోనూ.. వీలయితే ఎకరం పొలం లోనూ ఈ సాగు చేపట్టొచ్చు. ముందుగా పొలం చుట్టూ ఒకటిన్నర అడుగుల వెడల్పు, అర అడుగు లోతు కాలువ తవ్వుకోవాలి. తరువాత ఏడు అడుగులకు ఒక బెడ్(మట్టి పరుపు)ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు మట్టి పరుపుల మధ్య 2 అడుగుల వెడల్పు కాలువ తవ్వుకోవాలి. దీని వలన మట్టి పరుపు మీద పడిన నీరు అదనంగా నిలవ కుండా జారిపోతుంది. వర్షాకాలంలో నీరు తీసివేయ డానికి, ఎండాకాలంలో నీరు పెట్టడానికి వీలవుతుంది.
కంపోస్టు లేదా చెరువు మట్టి + పశువుల ఎరువు..
మట్టి పరుపు మీద వర్మీ కంపోస్టు, నాడెపు కంపోస్టు లేదా చెరువు మట్టి, పశువుల ఎరువు కలిపి ఆరు నుండి ఎనిమిది అంగుళాల మందాన పరవాలి. మొదటి మట్టి పరుపు మీద మూడున్నర అడుగుల స్థలం వదిలి ప్రతి ముపై ్ప ఆరు అడుగులకు ఒకటి చొప్పున.. ఎత్తుగా ఎదిగే పండ్ల మొక్క (మామిడి, ఉసిరి, నేరేడు, పనస)ను నాటుకోవాలి. ఇవి అర ఎకరంలో దాదాపు పదహారు వరకు వస్తాయి. తరువాత ఈ మొక్కల మధ్య ప్రతి 18 అడుగులకు ఒకటి చొప్పున జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి లాంటి మొక్కలు నాటుకోవాలి. ఆ తరువాత ప్రతి తొమ్మిది అడుగుల దూరానికి ఒకటి చొప్పున పెద్దగా కొమ్మలు రాని బొప్పాయి, అరటి లాంటి మొక్కలు నాటుకోవాలి. వీటి మధ్య ఒక పావు ఎకరంలో పలు రకాల కూరగాయ విత్తనాలు విత్తుకోవాలి.
‘మా పిల్లలు మంచిగా తింటున్నారు’
మావన్నీ మెట్ట భూములు వానలు లేక ఏం పండేది కాదు. నేను ఒంటరిదాన్ని. ఇద్దరు పిల్లల్ని ఎలా చదివించాలా అని బాధపడేదాన్ని. పారినాయుడు సారు అన్నపూర్ణ పద్ధతి బాగుంటదని చెపితే, అరెకరంలో పంటలు, పండ్ల మొక్కలు వేసుకున్నాం. మా పిల్లలు మంచిగా తింటున్నారు. ఈ సీజన్లో రూ.25,500 ఆదాయం కూడా వచ్చింది.
- కమలకుమారి, పెంగువ, గుమ్మలక్ష్మీపురం మండలం
కడుపు నిండా తింటున్నాం!
ఇంతకు మునుపు ఏడాదంతా పనిచేసినా డబ్బులకు ఇబ్బందిగా ఉండేది. 13 జాతుల విత్తనాలు వేశాం. ‘అన్నపూర్ణ’ వల్ల మేం కడుపునిండా తింటున్నాం. ఈ పంటకాలంలో (4-5 నెలలు) మేం తిన్నది కాక రూ.32,500 ఆదాయం వచ్చింది.
- చంద్రమ్మ, మర్రిగూడ, కురుప మండలం
ఇతర రాష్ట్రాల్లోనూ అమలు..!
‘అన్నపూర్ణ’ సాగు పద్ధతి పేద రైతులకు చాలా ఉపయోగకరం. వర్షపాతం తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో కూడా ఏడాది పొడవునా పంటలు పండించడానికి ఈ పద్ధతి చాలా అనువైనది. కేవలం అర ఎకరంలో బహుళ పంటల సాగుతో సంవత్సరం పొడవునా రైతుకు ఆహారం, ఆదాయం సమకూరడం ఇందులో చాలా కీలకమైనవి. సెర్ప ద్వారా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న దీన్ని ఇతర రాష్ట్రాల్లోనూ మహిళా సంఘాల ద్వారా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
- విజయ్కుమార్,
సంయుక్త కార్యదర్శి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ,
డెరైక్టర్, జాతీయ గ్రామీణాభివృద్ధి మిషన్
ఏడు అడుగులకు ఒక బెడ్...
Published Sun, Feb 2 2014 11:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement