-
మీ ధ్యాసంతా భ్రమరావతేనా?
చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్న తాపత్రయంతో రామోజీకి చెత్త రాతల ఉన్మాదం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే రోజుకో తప్పుడు కథనంతో ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికీ పనికి రాని చంద్రబాబు కలల రాజధాని భ్రమరావతిపై ఇంకా మోజు తీరక.. అక్కడేదో జరగరానిది జరిగిపోతున్నట్లు కల కంటున్నారు. అక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వివిధ గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పిస్తూ గెజిట్ జారీ చేస్తే.. అదంతా కుట్ర పూరితమంటూ వక్ర రాతలు రాశారు. చంద్రబాబు రైతులను వంచించి, అవసరానికి మించి భూములు లాక్కున్నప్పుడు మీరేం చేశారు రామోజీ? సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని పేరుతో తమ నుంచి బలవంతంగా భూములు సేకరించారని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలోనూ వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. బలవంతంగా సేకరించిన భూమిని వెనక్కి ఇస్తామని చెప్పారు. ఈ హామీకి అనుగుణంగా న్యాయ అడ్డంకులను దాటి వారికి భూమిని వాపస్ చేయడానికి ఇటీవల గెజిట్ జారీ చేశారు. అంతే.. అమరావతిపై మరో విచ్చిన్నకర కుట్ర అంటూ ఈనాడు రామోజీ శోకాలు పెట్టారు. రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి గుట్టుగా గెజిట్ విడుదల చేశారంటూ గగ్గోలు పెట్టారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తమ అనుమతి లేకుండానే రాజధాని పేరిట తమ భూములను బలవంతంగా తీసుకున్నారని పలువురు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి ప్రమేయం లేకుండానే తీసుకుని మాస్టర్ ప్లాన్లో పెట్టి రోడ్లకు కేటాయించేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆ రైతులందరూ సీఆర్డీఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల ఇబ్బంది పడ్డ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్డీఏ సమావేశంలో వారి భూములను భూసేకరణ పరిధి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 11న తీర్మానం చేశారు. కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, పిచ్చికల పాలెం, ఐనవోలు, రాయపూడి, కొండమారాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, మల్కాపురం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రామోజీకి ఆగ్రహం తెప్పించడంతో ఓ తప్పుడు కథనం వండిపడేశారు. అందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : గుట్టుగా గెజిట్ జారీ చేశారు వాస్తవం: రాజధాని నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం 34,281 ఎకరాలను సేకరించింది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రానిచోట్ల భూసేకరణకు నోటీసులు ఇచ్చింది. అలా 1,317.90 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి 274.86 ఎకరాలు పూలింగ్లో ఇచ్చేందుకు రైతులు ముందుకు రాగా, మిగిలిన భూమిని బలవంతంగా తీసుకున్నారు. అందులో 217.76 ఎకరాలు రోడ్లకు కేటాయించారు. కొన్ని చోట్ల రైతులకు తెలియకుండానే వారి స్థలాల్లో రోడ్లు వేయడమే కాకుండా రిటర్నబుల్ ప్లాట్ల కింద కొంత మందికి రిజి్రస్టేషన్ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన 625.25 ఎకరాల భూమిపై ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తు చేసింది. సీఆర్డీఏకు చెందిన డిప్యూటీ కలెక్టర్లతో పలుమార్లు సమావేశమై రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గెజిట్ జారీ చేశారు. ఆయా రైతులకు ఈ మేరకు సమాచారం అందించారు. ఆయా గ్రామాల సచివాలయాల్లో గెజిట్ను అందుబాటులో ఉంచారు. గెజిట్కు పత్రికా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో దాన్ని ఇవ్వలేదు. ఆరోపణ : భూసేకరణ ఉపసంహరణ గెజిట్లను విడుదల చేసే ముందు రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేయాలి వాస్తవం: ఇప్పుడు గెజిట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించలేదు. అందువల్ల అసలు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపుల ప్రసక్తే రాదు. ఉండవల్లి గ్రామంలో 113.60 ఎకరాలు, పెనుమాక గ్రామంలో 458.45 ఎకరాలను భూసేకరణ నుంచి మినహాయించింది. ఈ రెండు గ్రామాల్లో మాస్టర్ప్లాన్ కింద 117.18 ఎకరాలు కవర్ అయింది. ఇదిపోగా మిగిలిన 572.05 ఎకరాలను మాత్రమే మినహాయించింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లను రైతులు ఉపసంహరించుకుని, భవిష్యత్తులో ఎలాంటి నష్టపరిహారం అడగబోమన్న హామీ కింద మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల 21 గ్రామాల్లోని రైతులతో పాటు, ఉండవల్లి, పెనుమాక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది తట్టుకోలేని ఈనాడు కడుపుబ్బరంతో దిగజారి ప్రభుత్వంపై బురద జల్లే పనికి పూనుకుంది. ఆరోపణ: భూసేకరణ పరిధి నుంచి ఈ గ్రామాలను తప్పిస్తే మాస్టర్ ప్లాన్కు ఇబ్బందులు వస్తాయి వాస్తవం: ఈ అంశంపై అధికారులు భారీ కసరత్తు చేశారు. బాధిత రైతుల నుంచి కన్సెంట్ తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్లో వారి భూముల్లో నుంచి రోడ్లు వెళ్తుంటే వాటిని మినహాయించి మిగిలిన భూమికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఆ స్థలాల్లో దేనికైనా కేటాయింపులు జరిగి ఉంటే ఆ భూముల జోలికి వెళ్లలేదు. దేనికీ కేటాయించని భూములను మాత్రమే భూసేకరణ పరిధి నుంచి మినహాయించారు. -
సోలార్ ఇన్స్టలేషన్లు 44 శాతం డౌన్..
న్యూఢిల్లీ: స్థల సమీకరణ సమస్యల కారణంగా దేశీయంగా సౌర విద్యుత్ ఇన్స్టలేషన్లు 2023లో 7.5 గిగావాట్ల సామర్ధ్యానికి పరిమితమయ్యాయి. 2022లో నమోదైన 13.4 గిగావాట్ల (జీడబ్ల్యూ)తో పోలిస్తే 44 శాతం తగ్గాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ మెర్కామ్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశీయంగా మొత్తం స్థాపిత సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 72 జీడబ్ల్యూకి చేరింది. ఇందులో యుటిలిటీ స్థాయి ప్రాజెక్టుల వాటా 85.4 శాతంగా, రూఫ్టాప్ సోలార్ ప్రాజెక్టుల వాటా 14.6 శాతంగా ఉంది. 2022లో భారీ స్థాయి సోలార్ ఇన్స్టాలేషన్లు 11.7 గిగావాట్ల నుంచి 51 శాతం క్షీణించి 5.8 గిగావాట్లకు పరిమితమయ్యాయి. పలు భారీ ప్రాజెక్టులకు గడువు పొడిగించడం, స్థల సమీకరణ..కనెక్టివిటీ సమస్యలు మొదలైనవి ఇందుకు కారణమని నివేదిక వివరిచింది. కొత్తగా జోడించిన సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యల్లో భారీ ప్రాజెక్టుల వాటా 77.2 శాతంగాను, రూఫ్టాప్ సోలార్ వాటా 22.8 శాతంగాను ఉన్నట్లు పేర్కొంది. భారీ స్థాయి సోలార్ విద్యుత్ సామరŠాధ్యలు అత్యధికంగా రాజస్థాన్కి ఉండగా, కర్ణాటక, గుజరాత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
రైల్వే జోన్ పై కేంద్రందే కిరికిరి
-
కొన్నారు.. తిన్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా, ఏదైనా భారీ ప్రాజెక్టు/ సంస్థ రాబోతుందంటే చాలు చకాచకా పావులు కదపడం, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరకు కుటుంబసభ్యులు, బినామీల పేరిట కొనేయడం, సదరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగానే ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించేసి కోట్లకు పడగలెత్తడం.. విషయం తెలిసిన రైతులు లబోదిబోమనడం.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విషయంలోనూ ఇదే జరిగింది. ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం గమనార్హం. భూదాన్ భూములకూ కొందరు ఎసరు పెట్టడం కొసమెరుపు. కుటుంబసభ్యులు, బినామీల పేరిట దందా 2017లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్గల్ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమిని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నారనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందే తెలియడంతో బినామీలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. ఓ మాజీ ఐపీఎస్ రైతుల్ని బెదిరించి..! ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఎకరా రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల లోపే కొనుగోలు చేశారు. ఆయా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములను విక్రయించడానికి స్థానిక రైతులు కొందరు నిరాకరించినా, బినామీల ద్వారా రైతులను బెదిరింపులకు గురి చేసి భూములు అమ్మేలా ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బినామీల పేరిట ఉన్న 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఎకరం రూ.12.50 లక్షల చొప్పున ఫార్మాసిటీకి ఇచ్చేయడం గమనార్హం. కురి్మద్ద, తాడిపర్తి, నానక్నగర్ గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని ఫార్మాసిటీకి ఇచ్చేసి నష్ట పరిహారం కింద రూ.కోట్లు సంపాదించారు. కేసీఆర్ సర్కార్లో చక్రం తిప్పిన కీలక అధికారులు కొందరు కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలకు పైగా పట్టాభూమిని ఫార్మాసిటీకి తీసుకోవాలని రియల్ వ్యాపారులే స్వయంగా ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు ఇవ్వడం గమనార్హం. కాగా తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ఫార్మాసిటీకి అప్పగించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మీర్ఖాన్పేటలోని హెచ్ఎండీఏ వెంచర్లో అదనంగా ఎకరాల కొద్దీ ప్లాట్లు మంజూరు అయ్యాయి. భూదాన్ భూమిని కొల్లగొట్టిన నేతలు తాడిపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 104లో 468.34 ఎకరాల భూమి ఉంది. దాని యజమానులు అప్పట్లో 250 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారు. సదరు భూమిని తమ పేరున రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా 16/11/2005 లోనే భూదాన్బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు పహణీల్లోనూ నమోదు చేశారు. అయితే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎంపీ ఈ భూములను తమ బినామీ పేరున కొట్టేశారు. అంతేకాదు కొండలు, గుట్టలతో కూడిన ఈ భూమి సాగులో ఉన్నట్లు చూపించారు. భూ సేకరణలో భాగంగా ఈ భూములను ఫార్మాసిటీకి అప్పగించి ఎకరానికి రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారం పొందారు. ఇలా ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతేకాదు మీర్ఖాన్పేటలో ఎకరానికి 121 గజాల ఇంటి స్థలాన్ని కూడా పొందారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన వారిలో స్థానికులు కాకుండా అంతా ఇతర ప్రాంతాలకు చెందిన నేతల బినామీలే ఉండటం గమనార్హం. ఈ అంశంపై తాడిపర్తి గ్రామస్తులు అప్పటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఓ అధికారి భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి పరిధిలో మాజీ సీఎస్ కొనుగోళ్లు మాజీ సీఎస్ సోమేష్కుమార్ తన భార్య పేరున యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249, 260లలో 25.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సర్వే నంబర్ 244 నుంచి 269 వరకు ఉన్న 125 ఎకరాలు తన కుటుంబ సన్నిహితులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట కొనుగోలు చేయించారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా (2016 నుంచి 2018 వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సీఎస్గా పని చేశారు) ఉన్నారు. సాగుకు యోగ్యం లేని ఈ భూములకు రైతుబంధు పథకం కింద రూ.14 లక్షల వరకు లబ్ధి పొందినట్లు మాజీ సీఎస్పై ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ భూముల కొనుగోలుపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ బుధవారం యాచారం తహశీల్దార్ కార్యా లయానికి చేరుకుని పలు రికార్డులను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా తాను నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని సోమేష్ చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ భూములు ఇచ్చింది వాస్తవమే ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్తి గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాడు. ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో నక్కర్తమేడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 200 ఎకరాలకు పైగా భూమిని ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ఇచ్చేశాడు. ఆ అధికారి కొత్తపల్లి గ్రామంలో కూడా వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. – పాశ్ఛ భాషా, మాజీ సర్పంచ్ నక్కర్తమేడిపల్లి -
నిధుల పేచీతో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఎంతో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత, పేచీల కారణంగా ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. రైతుల నుంచి నిరసన వ్యక్తమైనా వేగంగా అలైన్మెంట్ను ఖరారు చేసిన జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ).. తీరా భూసేకరణ ప్రక్రియకు అవార్డులు పాస్ చేసే తరుణంలో చేతులెత్తేసింది. దీనితో ప్రాజెక్టుకు సంబంధించి గతంలో విడుదల చేసిన పలు గెజిట్ నోటిఫికేషన్లకు కాలదోషం పట్టి రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి ఆఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపులు సందిగ్ధంలో పడ్డాయి. త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. ప్రాజెక్టుకు మరింత జాప్యం తప్పదు. కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరేదాకా ఎదురుచూడక తప్పదు. అనుమతులకు దరఖాస్తే చేయలేదు పెద్ద రహదారుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కీలకం. అనుమతులొచ్చాకే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. భారతమాల పరియోజన–1లో కేంద్రం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని చేర్చింది. అలైన్మెంట్కు అనుమతులు రావటంతో ఎన్హెచ్ఏఐ అధికారులు గత ఏడాదే భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ సభలు నిర్వహించారు. రైతులు అభ్యంతరాలు లేవనెత్తినా ఎలాగోలా సభలను పూర్తిచేశారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇది జరగాలంటే ముందు ఈ రోడ్డుకు జాతీయ రహదారి పేరిట కొత్త నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కేంద్రం పెండింగ్లో పెట్టింది. భూపరిహార వాటా నిధులు అందనందుకే.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పరిహారంలో రాష్ట్రప్రభుత్వం సగం ఖర్చును భరించాల్సి ఉంది. రాష్ట్ర వాటా రూ.2,600 కోట్లు అవుతుందని తాత్కాలికంగా నిర్ధారించారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని ఎన్హెచ్ఏఐ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ అన్ని నిధులు ఒకేసారి ఇవ్వడం కుదరదని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాదించింది. దీంతో తొలివిడతగా కనీసం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ కోరింది. దీనిని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తెచి్చంది. కానీ నిధుల విడుదల కాలేదు. ఇలా నిధులు రాకుండా, అవార్డులు పాస్ చేయటం సరికాదని, ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కేంద్రం రీజనల్ రింగ్రోడ్డు పనిని పక్కన పెట్టేసింది. జాతీయ రహదారి నంబర్ కేటాయించలేదు. కీలక ప్రాజెక్టు కాస్తా పెండింగ్లో పడింది. -
మొత్తం ఒకేసారి చెల్లించక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని, ఈమేరకు ఇది వరకే కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సవివర లేఖ రాశారు. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి చెల్లించాల్సిన భూపరిహారంలో 50 శాతంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2585 కోట్లను చెల్లించాలంటూ ఇటీవల కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం విడుదల చేశారు. రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.100 కోట్లు చెల్లించటంతోపాటు, భూసేకరణకు సంబంధించి అవార్డు వారీగా, అవార్డు జారీ అయిన పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది వరకు అంగీకారం కుదిరిందని అందులో ప్రస్తావించారు. దాని ప్రకారం భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు. యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను మేమే చెల్లిస్తామన్నాం కదా..: యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను చెల్లించే పరిస్థితి లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొన్నా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐకి లేఖ రాసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఈమేరకు యుటిలిటీ చార్జీలకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు లేనట్టేనని స్పష్టం చేశారు. భారతమాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్న 11 జాతీయ రహదారులకు సంబంధించి 284 హెక్టార్లు మినహా భూసేకరణ చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారని కోమటిరెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు రీజినల్ రింగ్రోడ్డు మినహా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి 2377 హెక్టార్లకు గానూ 1531 హెక్టార్ల భూమిని సేకరించినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల పనులు వేగంగా జరిగేలా తెలంగాణ బిడ్డగా సహకరించాలని ఆయన కిషన్రెడ్డికి సూచించారు. -
సిరిసిల్లకు ఇప్పట్లో రైలు కూత లేనట్టే
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లకు ఇప్పట్లో రైలుకూత వినిపించే పరిస్థితి లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ వరకు రైలు సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్చి నాటికి సిరిసిల్ల స్టేషన్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీలునుబట్టి రైలు సర్వీసులను సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పొడిగించాలని అనుకుంది. డిమాండ్ సర్వేలో, ప్రయాణికుల సంఖ్య ఉంటుందని తేలితే సిరిసిల్ల నుంచి రైలు సర్విసులు నడిపే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు సిద్దిపేట–సిరిసిల్ల మధ్య కీలక ప్రాంతంలో పనులే జరగటం లేదు. ఫలితంగా రైలు సర్విసు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ సంగతి..: భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ రైల్వే అధికా రులు పనులు చేస్తూ వెళ్లారు. ఇలా సిద్దిపేట వరకు వేగంగా పూర్తి చేసి అనుకున్న సమయంలో రైలు సర్విసులు ప్రారంభించా రు. ఆ తర్వాత సిద్దిపేట –సిరిసిల్ల సెక్షన్ల మధ్య పనులు ప్రారంభించారు. కానీ, మధ్యలో 80 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులొచ్చాయి. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతు ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడివరకు వదిలి ఆపై భాగంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగించారు. తర్వా త సిద్దిపేట సమీపంలోని భూముల వివాదం పరిష్కారమైంది. భూయజమానులకు పరిహారం కింద రూ.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే సమ యంలో ఎన్ని కల కోడ్ రావడంతో ఆ చెల్లింపులు నిలిచిపోయా యి. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వం ఏర్పడ గానే ఆ డబ్బులు చెల్లింపు కోసం రైల్వే అధికారు లు ఒత్తిడి ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వర కు చెల్లింపు జాడే లేదు. దీంతో పెద్ద కోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. రైతులకు పరిహారం చెల్లిస్తే తప్ప ఆ భూములను రైల్వే స్వాదీనం చేసుకునే వీలు లేదు. సిరిసిల్ల సమీపంలో మాత్రం పనులు కొనసాగుతున్నా యి. అక్కడ పూర్తయినా, సిద్దిపేట సమీపంలో పెండింగ్లో ఉంటే రైల్వేలైన్ వేసే వీలుండదు. రాష్ట్రప్రభుత్వం పరిహారం చెల్లిస్తేనే పనులు మొదలవుతాయి. దీంతో పనులు కనీసం 4నెలలు వెనక బడ్డట్టు అయ్యిందని ఓ రైల్వే అధికారి వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే అన్నిరకాల పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం. పరిహారం చెల్లింపే కాకుండా ప్రాజెక్టు వ్యయంలోనూ మూడో వంతు ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పుడు ఆ మొత్తానికి సంబంధించి కూడా కొంత పేరుకుపోయిందని తెలుస్తోంది. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య 30 కిలోమీటర్ల మేర పనులకు రూ.480 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆ మార్గంలో కొంత గుట్టభూమి కూడా ఉండటంతో దాన్ని కట్ చేసి పనులు చేయాల్సి ఉంది. ఇది స్వతహాగానే ఆలస్యమయ్యే పని. భూపరిహారం పంపిణీలో జాప్యం, ఇతర పనులూ నెమ్మదించటం వెరసి.. ఈ 30 కిలోమీటర్ల పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం తప్పేలా కనిపించటం లేదు. -
బాలినేని కుటుంబానికి సంబంధం లేదు
ఒంగోలు అర్బన్/సబర్బన్: ‘నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు, ఫోర్జరీలతో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలతో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ స్పష్టంచేశారు. బాలినేనిపైన, ప్రభుత్వంపైన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఒంగోలు భూదందాపై సిట్ దర్యాప్తును బాలినేని కుటుంబం ముందుకు సాగనివ్వడంలేదంటూ కథనాలు ప్రచురించటం సరికాదని చెప్పారు. బాలినేని కుటుంబం దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. అవాస్తవాలను, అసత్య కథనాలను ప్రచురిస్తే అవి రాజకీయ జీవితంలో ఉండేవారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఇలాంటి కథనాలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు సరైన వివరణ తీసుకోవాలని చెప్పారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వివరాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. భూ కబ్జాలపై ఒంగోలు జెడ్పీటీసీ, మేయర్ గంగాడ సుజాత, మరికొందరు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు సిట్ ద్వారా నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే బాలినేని సోదరుడు వేణుగోపాల్రెడ్డి భూమి వివాదంలో ఉందని, దాన్ని భూ కబ్జా కోవలోకి తేవటం çసరికాదని అన్నారు. ఆ భూమి 40 ఏళ్లుగా బ్యాంకు లావాదేవీల ప్రక్రియలో ఉందన్నారు. సివిల్ పంచాయితీలను కూడా భూ కబ్జాల కింద కథనాలుగా ఇవ్వడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారన్నారు. సిట్లో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పని చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ విభాగం తరఫున జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖ, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు సిట్ సబ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంపై ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ఒకరు సెప్టెంబర్ 28న ఫిర్యాదు ఇవ్వడంతో భూ కబ్జాల వ్యవహారం వెలుగు చూసిందని కలెక్టర్ చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా లాయర్పేటలోని ఒక ఇంట్లో పూర్ణచంద్రరావు, మరికొందరితో కూడిన బృందం ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆ ఇంట్లో మీ సేవ బ్లాంక్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, పలు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు లభించాయన్నారు. ఇటువంటి అనేక ఫిర్యాదులు రావడంతో సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 572 డాక్యుమెంట్లు, 60 రబ్బర్ స్టాంప్లు, 1,224 జ్యుడిషియల్ స్టాంప్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మార్కాపురం, కనిగిరి పరిధిలో కూడా 5 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు ప్రభుత్వ భూముల డీకే పట్టాల విషయంలోనూ నకిలీ వ్యవహారాలు జరిగాయని తెలిపారు. ఈ దందా పన్నెండేళ్లకు పైగా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాళీ స్థలాలకు నకిలీ వీలునామా, జీపీఏ వంటివి సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎటువంటి సమస్యలు లేని స్థలాలకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని గొడవల్లోకి తెచ్చి, కోర్టుల్లో స్టే ఆర్డర్ వంటివి పొందినట్లు కూడా తెలిసిందన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం లేకుండా పూర్తి స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాలపై ఆరోపణలు చేయడం వారిని వ్యక్తిగతంగా బాధించడమే అవుతుందని చెప్పారు. విషయాలను పూర్తిగా తెలుసుకుని వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయాలన్నారు. ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నామని, సిట్ బృందం వేగంగా, నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయన్నారు. పూర్ణచంద్రరావు బృందంలో 72 మంది ఉన్నారని, వారిలో 38 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. సిట్ దర్యాప్తుపై బాలినేని ప్రభావం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. -
ప్లాట్ల కేటాయింపు వెనుక వాస్తవాలకు ఈనాడు తూట్లు
సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయటపెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరాలను సమీకరించింది. ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూముల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం. రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటాయించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన వారికి మేలుచేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదాల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది. అందుకు అనుగుణంగానే పూలింగ్కు భూములిచ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటాయించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
బుల్లెట్ రైలులో కదలిక
(ముంబై నుంచి సాక్షి ప్రతినిధి) : దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యల్లో కొన్ని పరిష్కారం కావడంతో నిర్మాణ సంస్థ పనులు పునరుద్ధరించింది. ముంబై–అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టును 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనేది టార్గెట్. అయితే భూసేకరణలో జాప్యం కారణంగా ఏడాదిన్నర ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో కలిసి హైదరాబాద్కు చెందిన పాత్రికేయ బృందం పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే కార్యాలయాలు, మ్యూజియం సందర్శించి రైల్వే కార్యకలాపాలు సహా వివిధ కార్యక్రమాలను అధ్యయనం చేసింది. ఇవీ ముంబై హెచ్ఎస్ఆర్ స్టేషన్ ప్రత్యేకతలు ముంబై–అహ్మదాబాద్–హెచ్ఎస్ఆర్ కారిడార్లో ఉన్న ఏకైక భూగర్భస్టేషన్ ముంబై హెచ్ఎస్ఆర్ స్టేషన్. ఈ స్టేషన్లో 6 ప్లాట్ఫారాలు ఉంటాయి. ప్రతీ ప్లాట్ఫారం పొడవు సుమారు 415 మీటర్లు. గ్రౌండ్ లెవల్ నుంచి 24 మీటర్ల లోతులో ఈ ప్లాట్ ఫారం నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందులో ప్లాట్ఫాం, కాన్కోర్స్, సర్విస్ ఫ్లోర్ సహా మూడు అంతస్తులు ఉంటాయి. ♦ స్టేషనుకు రెండు ప్రవేశ ద్వారాలు/నిష్క్రమణ గేట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒకటి మెట్రో లైన్ 2బీ సమీపంలో మెట్రో స్టేషన్కు, మరొకటి ఎంటీఎన్ఎల్ నిర్మాణం వైపు ప్రయాణికుల రాకపోకలకు తగినంత స్థలం, కాన్కోర్స్, ప్లాట్ఫాం స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా ఎగ్జిట్ గేట్లు రూపొందించారు. ♦ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి, సహజ లైటింగ్ వ్యవస్థకు ప్రత్యేక స్కైలైట్ ఏర్పాటు చేశారు. ♦ స్టేషన్లో ప్రయాణికుల కోసం సెక్యూరిటీ, టికెటింగ్, వెయిటింగ్ ఏరియా, బిజినెస్ క్లాస్ లాంజ్, నర్సరీ, రెస్ట్రూమ్, స్మోకింగ్ రూమ్, ఇన్ఫర్మేషన్ కియోస్్క, రిటైల్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్మెంట్ సిస్టమ్, సీసీటీవీ నిఘా తదితర సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా : సీపీఆర్ఓ సుమిత్ ఠాకూర్ రైల్వేకు చెందిన పలు ప్రాజెక్టులు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని పశ్చిమరైల్వే చీఫ్ పబ్లిక్రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ఠాకూర్ చెప్పారు.రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులు ప్రోత్సాహకరంగా సాగుతున్నాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిత్యం 80 లక్షల మంది ముంబై రైల్వే పరిధిలో ప్రయాణిస్తున్నారని, భారత్లో సెమీ స్పీడ్ రైళ్ల ప్రవేశానికి మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా హైస్పీడ్ రైళ్ల శకం కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. ముంబైలో బుల్లెట్ ట్రైన్ పనులు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుష్మ తెలిపారు. -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉన్నారు. -
‘మల్లన్నసాగర్’ గెజిట్ ప్రింటింగ్కు రాసిన లేఖ సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా ముట్రాజ్పల్లిలో భూసేకర ణకు సంబంధించి గెజిట్ జారీ కోసం ప్రింటింగ్కు రాసిన లేఖను సమర్పించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టును తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చేసిన పనులను సమర్థించుకునేందుకు తప్పులు చేస్తే సహించేది లేదని చెప్పింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం 102 ఎకరాల సేకరణ నిమిత్తం 2021, జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బాలాజీ స్పిన్నర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో అప్పీల్ వేసింది. ఈ అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. గతంలో గెజిట్ జారీకి సంబంధించి రిజిస్టర్లో ఎంట్రీలు నమోదు చేసిన వారి వివరాలను ప్రభుత్వ న్యాయవాది సంజీవ్కుమార్ అందజేశారు. -
ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం మధ్యసయోధ్య!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. భూసేకరణకు సంబంధించి పరిహార మొత్తంలో రాష్ట్రప్రభుత్వం తన వంతు సగం వాటా డబ్బులు డిపాజిట్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్ఏఐ లేఖ రాయటంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకేసారి తన వాటా మొత్తం కాకుండా, అవార్డులు పాస్ చేసిన కొద్దీ విడతల వారీగా వాటా చెల్లిస్తానంటూ తాజాగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఎన్హెచ్ఏఐ అంగీకరించింది. దీంతో భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. వారం రోజుల్లో అందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్హెచ్ఏఐ ప్రారంభించబోతోంది. త్వరలోనే భూసేకరణ ప్రాధికార సంస్థ (కాలా)ల వారీగా పరిహారం పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో రీజనల్ రింగురోడ్డు పనులు ప్రారంభించేందుకు వీలుగా టెండర్లు పిలిచేందుకు అవకాశం కలగనుంది. రూ.100 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ప్రధాన గెజిట్లు జారీ అయిన విషయం తెలిసిందే. భూ పరిహారం పంపిణీకి సంబంధించిన 3డీ గెజిట్ నోటిఫికేషన్లు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే వివరాలు గల్లంతైన భూములకు సంబంధించి మాత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. 3డీ గెజిట్లు విడుదలైన భూములకు సంబంధించి పట్టాదారులకు పరిహారం అందజేసేందుకు ఎన్హెచ్ఏఐ కేంద్ర కార్యాలయం అనుమతి మంజూరు చేయటంతో స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 162 కి.మీ. ఉత్తర భాగానికి సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సమీకరించాల్సి ఉంది. ఇందుకు పరిహారంగా రూ.5,170 కోట్లు అవసరమవుతాయని ఎన్హెచ్ఏఐ బడ్జెట్లో ఖరారు చేసింది. ఈ మొత్తంలో 50 శాతం రాష్ట్రప్రభుత్వం భరించాలి. అంటే రూ.2,585 కోట్లు, స్తంభాల వంటి వాటి తరలింపునకు అయ్యే వ్యయానికి సంబంధించి మరో రూ.363.43 కోట్లు.. మొత్తం 2,948.43 కోట్లు చెల్లించాలంటూ ఎన్హెచ్ఏఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే అవార్డ్ పాస్ చేసే 3డీ గెజిట్లు కూడా విడుదల కాకుండానే పరిహారం జమ చేయాలనటం సరికాదంటూ ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై ఎన్హెచ్ఏఐ మూడు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత అధికారులు చర్చించటంతో సయోధ్య కుదిరింది. ఇందులో భాగంగా తొలుత రూ.100 కోట్లు డిపాజిట్ చేసిన ప్రభుత్వం, పరిహారం చెల్లించే ప్రాంతాలకు అవార్డులు పాస్ చేసినప్పుడల్లా తన వాటా చెల్లిస్తాననడంతో ఎన్హెచ్ఏఐ అంగీకరించింది. తాజాగా 8 కాలాలకు సంబంధించి 3డీ గెజిట్లు విడుదల కావటంతో పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. యాజమాన్య పత్రాలు అందజేయాల్సిందిగా ఆదేశం.. ఏయే ప్రాంతాల్లో పరిహారం పంపిణీ చేయాలో గుర్తించిన ఎన్హెచ్ఏఐ తాజాగా, సంబంధిత భూముల యజమానులు వారేనని రూఢీ చేసే ఆధారాలు సమర్పించాల్సిందిగా పట్టాదారులకు సమాచారం పంపింది. వాటితోపాటు బ్యాంకు ఖాతా వివరాలు కూడా కోరింది. డాక్యుమెంట్లను ఆన్లైన్లో దాఖలు చేశాక, రికార్డులతో సరిచూసుకుని పరిహారాన్ని డిపాజిట్ చేయనున్నారు. పూర్తి వివరాలు సిద్ధమయ్యాక కాలాల వారీగా పత్రికాముఖంగా ప్రకటనలను కూడా వెల్లడించనుంది. భూములకు.. నిర్మాణాలకు.. చెట్లకు.. పట్టాదారుల భూములు, వాటిల్లో ఉన్న నిర్మా ణాలు, తోటలు, విలువైన చెట్లకు లెక్కకట్టి పరిహారం ఇస్తారు. ఆ ప్రాంతంలో మూడేళ్ల రిజి్రస్టేషన్ల విలువలను గుర్తించి వాటి సరాసరి లెక్కగట్టి.. దానికి మూడు రెట్లను గుణించి పరిహారంగా ఖాయం చేయనున్నారు. ఆస్తులు, చెట్లకు వాటి విలువ ఆధారంగా లెక్కగడతారు. -
గబ్బు మాటలెందుకు?.. ‘దిబ్బలు’ సేఫ్
సాక్షి, విశాఖపట్నం: తాను చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పు అనడం చంద్రబాబుకు రివాజు. చంద్రబాబు పాడే ప్రతి పాటకు డ్యాన్స్ చేయడం పవన్ అలవాటు. ఇదే విధానాన్ని విశాఖలోని ఎర్రమట్టి దిబ్బల పైనా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఇదే తప్పాట ఆడుతున్నారు. భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలకు ప్రస్తుతం, భవిష్యత్తులోనూ ఎటువంటి నష్టం కలగకుండా, రక్షణగా బఫర్ జోన్ పెట్టి, వాటికి దూరంగా అభివృద్ధి పనులు చేపట్టడం వీరిద్దరికీ కంటగింపుగా మారింది. ఎర్రమట్టి దిబ్బలకు నష్టం జరిగిపోతోందంటూ ఇద్దరూ వీరంగాలు వేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కొత్తవలసలో భూసమీకరణ చేపట్టిందే చంద్రబాబు సర్కారు. ఆ విషయాన్ని దాచిపెట్టి, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఎర్రమట్టి దిబ్బలకు నష్టం చేస్తున్నారంటూ నీచ రాజకీయాలకు ఒడిగట్టారు. దశాబ్దాలుగా జీడితోటలు సాగు చేసుకుంటూ 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి డీ–పట్టాలు పొందిన రైతుల భూములనే ప్రభుత్వం సమీకరించింది. ఈ భూములు ఎర్రమట్టి దిబ్బలైతే వాటికి డీ–పట్టాల్ని ప్రభుత్వం ఎలా ఇస్తుందన్న కనీస అవగాహన టీడీపీ నేతలకు, పవన్కు లేదు. వీరి తీరును టీడీపీకి చెందిన రైతులే ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రభుత్వం మంచి పరిహారం ఇస్తోందని, అది రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బఫర్ జోన్ ఆవలే అభివృద్ధి సర్వే నం.49లో నేరెళ్లవలస గ్రామం ఉంది. సర్వే నం.49/1లో మొత్తం 1067 ఎకరాలు ఉంది. ఇందులో 525 ఎకరాల్లో ఐఎన్ఎస్ కళింగ విస్తరించి ఉంది. మరో 287 ఎకరాలు ఓ బిల్డింగ్ సొసైటీకి చెందినవి. ఈ రెండింటి మధ్యలో ఎర్ర మట్టి దిబ్బలు విస్తరించి ఉన్న 262.92 ఎకరాలను జియో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. నేరెళ్లవలసను ఆనుకొనే ఉన్న కొత్తవలస గ్రామం సర్వే నం 75, 86, 87లో సుమారు 80 ఎకరాల్లో 80 ఏళ్లుగా రైతులు జీడితోటలు, తాటిచెట్లు పెంచుకుంటూ జీవిస్తున్నారు. వీరికి 1982లో అప్పటి ప్రభుత్వం డీ–పట్టాలిచ్చింది. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం అభివృద్ధి జరుగుతోంది. ఇందు కోసం సర్వే నంబర్ 86ని ప్రభుత్వం సబ్ డివిజన్ చేసింది. 86/3ని ఎర్రమట్టి దిబ్బల రక్షణ కోసం బఫర్ జోన్గా ఏర్పాటు చేసింది. 148 అడుగుల మేర ఉన్న ఈ బఫర్ జోన్కు అవతల అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి, ఎర్రమట్టి దిబ్బలకు ఎలాంటి సంబంధం లేదు. ఎర్రమట్టి దిబ్బలకు ఎటువంటి నష్టం కలిగించడంలేదన్నది 100 శాతం వాస్తవం. 2016లోనే జీవో ఇచ్చిన టీడీపీ.. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా వుడా (ప్రస్తుతం వీఎంఆర్డీఏ) ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల కోసం 2016 నవంబర్ 25న జీవో ఎంఎస్ నం.304ని జారీ చేసింది. తొలుత పెందుర్తి మండలం సౌభాగ్య రాయపురంలో 128.94 ఎకరాలు, దబ్బందలో 114.23 ఎకరాలు, కొమ్మాదిలో 116.64 ఎకరాలి్న, ఆ తర్వాత నేరెళ్లవలసలో సర్వే నం.49/1పీలో 114.34 ఎకరాల అసైన్డ్ భూములు, గండిగుండంలో 69 ఎకరాలు లాండ్ పూలింగ్కు ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత కొత్తవలసలోని సర్వే నం.75లో భూముల వివరాలు కోరింది. అప్పటి వుడా ప్రత్యేక తహశీల్దార్ సర్వే నం.75, 85, 86లో ఉన్న అసైన్డ్ భూములు, సరిహద్దులతో నోట్ పంపారు. వీటిని పూలింగ్లోకి తెచ్చింది. ఇలా భూ సమీకరణ కీలక ప్రక్రియ మొత్తం టీడీపీ హయాంలోనే జరిగింది. ఇప్పుడు అవే భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే టీడీపీ, పవన్ గగ్గోలు పెడుతున్నారు. టీడీపీకి చెందిన రైతు ఏమంటున్నారంటే.. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసమంటూ టీడీపీ, జనసేన చేస్తున్న ఆందోళనల్ని టీడీపీకి చెందిన రైతులే ఖండిస్తున్నారు. అసలు ఈ ప్రక్రియ మొత్తం టీడీపీ హాయాంలో జరిగితే.. ఏదో కొత్తగా చేస్తున్నట్లు మాట్లాడటంపై టీడీపీకి చెందిన పాసి నర్సింగరావు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘మా టీడీపీ హయాంలోనే దీనిపై జీవో వచ్చింది. అప్పుడే మేము పూలింగ్కి భూములు ఇచ్చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మాకు కొత్తవలస దగ్గర 5 ఎకరాలు ఉంది. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం మా పేరుతో డీ–పట్టాలిచ్చింది. రైతులంతా కూర్చొని పూలింగ్లో భూములిస్తే ఎంత పరిహారం అడగాలో మాట్లాడుకున్నాం. గ్రామ సభలకు రైతులందరం హాజరయ్యాం. అందరికీ మంచి పరిహారం ఇస్తామన్నారు. అప్పట్లో ప్రక్రియ ఆలస్యమైంది. దాని ప్రకారమే పరిహారం ఇస్తున్నారు. ఇదంతా అప్పుడే జరిగింది. ఇప్పుడు పవన్ వచ్చి విధ్వంసం చేస్తున్నారని మాట్లాడటం సరికాదు’ అని అన్నారు. -
ఫార్మాసిటీ కోసం ఆలయ భూములా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాల ఆలయ భూముల సేకరణను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దేవాదాయ శాఖ భూములను సాగునీటి ప్రాజెక్టుల కోసమే సేకరించాలని గతంలోనే ద్విసభ్య ధర్మాసనం చెప్పిందని, ఇతర అవసరాల కోసం కాదని స్పష్టంచేసింది. భూ సేకరణ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల సంస్థ (టీఎస్ఐఐసీ) పిటిషన్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సిన దేవాదాయ భూ సేకరణపై సింగిల్ జడ్జిని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, సింగారంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూ సేకరణపై యథాతథస్థితి విధించింది. నీటి ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రజావసరాలకు ఆలయ భూములు సేకరించవచ్చన్న నిబంధనలు ఏవైనా ఉంటే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ఐఐసీ ఎండీ, రెవెన్యూ–దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూ సేకరణపై ముందుకెళ్లరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దేవాదాయ భూముల సేకరణకు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నందివనపర్తి, సింగారం పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూముల సేకరణ కోసం టీఎస్ఐఐసీ గత నవంబర్లో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. భూ సేకరణకు అనుమతి ఇస్తూ అదే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమిని సేకరించాలని, ఆ వచ్చిన మొత్తం నగదును ఓంకారేశ్వర స్వామి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సదరు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి చెప్పారు. ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన భక్తులు మోతెకాని జంగయ్య, కుర్మిడ్డకు చెందిన దేవోజీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయ భూముల సేకరణకు ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి అని.. సింగిల్ జడ్జిని ఆశ్రయించి ఉత్తర్వులు పొందడం చెల్లదన్నారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రమే ఆలయ భూములు సేకరించాలని గతంలో డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు. భూసేకరణతో ఎలాంటి సంబంధం లేని టీఎస్ఐఐసీ పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆపాలని కోరారు. ఇతర అవసరాలకు సేకరించవచ్చు... ఇతర ప్రజావసరాలకు కూడా దేవాదాయ భూములను సేకరించవచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో దీనికి సంబంధించి పలు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. భూములు ఇచ్చేందుకు ఓంకారేశ్వర ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అంగీకరించాయని చెప్పారు. ఇందులో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. -
ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య గ్రీన్ఫీల్డ్ రయ్.. రయ్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది భూసేకరణతో కలిపి రూ.4,609 కోట్లతో ఈ ప్రాజెక్ట్ను ఖరారు చేయగా.. ఏలూరు జిల్లా పరిధిలో రూ.1,281.31 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నారు. భారతీమాల ప్రాజెక్టులో భాగంగా మంజూరైన ఈ రహదారి నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణతో కాకినాడ పోర్ట్ అనుసంధానం చేయడానికి ఈ ప్రాజెక్టు కీలకమైనదని కేంద్రానికి నివేదించి ఈ ప్రాజెక్ట్ మంజూరు చేయించింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల నుంచి జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి రూ.569.37 కోట్లు, గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు రూ.711.94 కోట్లను కేంద్రం కేటాయించింది. 53 కిలోమీటర్లు తగ్గనున్న దూరం ప్రస్తుతం ఖమ్మం–రాజమండ్రి నగరాల మధ్య దూరం 220 కిలోమీటర్లు. దీనిని 167 కిలోమీటర్లకు తగ్గించడానికి ఈ ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ఖమ్మం–రాజమండ్రి మధ్య దూరం 53 కిలోమీటర్లు తగ్గుతుంది. ఏలూరు జిల్లాలో 72 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం నుంచి కల్లూరు మీదుగా వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట నుంచి ఆంధ్రాలో జీలుగుమిల్లిలోకి ప్రవేశించి జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం గోపాలపురం, కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంటుంది. నూతనంగా నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారి ఖమ్మం, సత్తుపల్లికి దూరంగా రేచర్ల నుంచి నేరుగా ఆంధ్రాలోని చింతలపూడి మండలంలో ఎండపల్లి నుంచి రా«ఘవాపురం, రేచర్ల మీదుగా టి.నరసాపరం, గుర్వాయిగూడెం మీదుగా దేవరపల్లి రహదారిలో కలుస్తుంది. భూసేకరణ పూర్తి ఈ రహదారి కోసం మొత్తం 1,411 ఎకరాల భూమి అవసరమవుతోంది. అందులో 114 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. 1,297 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. ఇప్పటికే భూసేకరణ పనులు పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు. 70 మీటర్ల వెడల్పుతో ఎకనామిక్ కారిడార్గా ఈ రహదారిని వర్గీకరించారు. గ్రీన్ఫీల్డ్తో జిల్లాకు ఉపయోగం గ్రీన్ఫీల్డ్ రహదారితో మెట్ట ప్రాంతంలో రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. ఆంధ్రా–తెలంగాణ మ«ధ్య నూతన రహదారి వల్ల దూరం తగ్గడమే కాకుండా తెలంగాణ, కాకినాడ పోర్టు అనుసంధానానికి ఉపయోగపడుతుంది. –కోటగిరి శ్రీధర్, ఏలూరు ఎంపీ -
టీడీపీ హయాంలో భూ కబ్జాలపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం ‘జీరో’అవర్ సుదీర్ఘంగా సాగింది. రెండున్నర గంటలకు పైగా 46 మంది శాసన సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడారు. జీరో అవర్ను ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి నడిపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన భూకబ్జాలపై విచారణ జరపాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ వారి పర్యటనల్లో అధికార పక్ష నాయకులపై భూ కబ్జా ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. టీడీపీ హయాం నుంచి ఎంత ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందో సమగ్ర విచారణ చేయించాలి కోరారు. దీనిపై ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి స్పందిస్తూ.. ‘నేను ఇప్పు డు చైర్లో కూర్చున్నా. లేకుంటే శాసన సభ్యుడినే కదా. రెండు నెలల కిందట చంద్రబాబు విజయనగరంలో నాపైనా ఆరోపణలు చేశారు. ఏ భూములైతే ఆక్రమించానని ఆరోపిస్తున్నారో.. ఆ భూముల్లో చంద్రబాబు కూర్చుని ఆందోళన చేస్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పాను. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోపణలపై విచారణకు ఆదేశించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి వి డిపించి అర్హులైన పేదలకు ఇవ్వాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను త్వరితంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లోకేశ్ కబ్జా ఆరోపణలపై విచారణ చేయించాలి: ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరులో టీడీపీ నేత లోకేశ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తాను, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి ఆక్రమించుకున్నామని లోకేశ్ ఆరోపించారన్నారు. గతంలో తమ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి హయాంలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, 2014–19 మధ్య ఎంత భూమి మింగేశారు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఎంత కబ్జాకు గురైందో సీఐడీ, విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. తాను ఏనాడూ ప్రభుత్వ భూముల విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. పేజ్కు భూ కేటాయింపులపై వాస్తవాలు నిగ్గు తేల్చాలి టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండగా పేజ్ ఇండస్ట్రీకి 28 ఎకరాలు కారు చౌకగా ఎకరం రూ.10 లక్షలకు కేటాయించడంపై విచారణ జరపాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ ఎకరం రూ.4 కోట్లు ఉంటుందని, రూ.110 కోట్ల విలువైన స్థలాన్ని రూ.2.80 కోట్లకే రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల తర్వాత భూమిని విక్రయించుకోవచ్చని జీవో కూడా ఇచ్చారన్నారు. 2016లో భూమి ఇస్తే 2019 వరకు ఆసంస్థ కార్యకలాపాలు ప్రారంభించలేదన్నారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ హయాంలో రామగిరిలో రూ.1000 కోట్ల విలువైన గ్రానైట్ను ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండా తరలించారని అన్నారు. ఆన్లైన్ విధానంలో భూ యాజమాన్య మార్పులు చేసే వెసులుబాటుతో అనంతపురం రూరల్, రాప్తాడు నియోజకవర్గంలో వందల కోట్లు విలువ చేసే భూముల్లో బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని, ఇలాంటి దోపిడీల్లో ప్రభుత్వం వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టాలి సరైన గుర్తింపు లేని బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ చేపట్టి ప్రభుత్వ పథకాలు అందించాలని కొందరు సభ్యులు కోరారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని.. కేంద్ర కేబినెట్ ఆమోదంతో పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. బుడగ జంగాలు ఏ వర్గంలోకి వెళ్లాలనుకుంటున్నారో సంబంధిత కమిషన్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. -
ఆడబిడ్డల గోడు పట్టదా?
హుస్నాబాద్: ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వం ఇచ్ఛిన హామీలు నెరవేర్చాలంటూ సుమారు 100 మంది వివాహితలు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రాజెక్టు ని ర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్ఛినప్పుడు తమకు పెళ్లిళ్లు కాలేదని, ఇప్పుడు తమకు పెళ్లి అయ్యిందనే కారణంతో అనర్హుల్ని చేయడం స మంజసం కాదంటూ వారు వాపోతున్నారు. ప్రభు త్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నా రు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.6 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభించినప్పుడు.. దీనివల్ల ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని పల్లె, గిరిజన తండాల వారికి ఇతరత్రా హామీలతో పాటు కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వివాహంకాని యువతులు ఉంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.6 లక్షలనగదు పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామ ని ప్రభుత్వం హామీ ఇచ్ఛింది. ఈ మేరకు 2010 నుంచి 2015 వరకు కటాఫ్గా తీసుకుని 141 మంది అర్హుల్ని గుర్తించారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టును ప్రారంభించి వీరికి ఇచ్ఛిన హామీ మేర కు నగదు, ఇల్లు ఇచ్చేస్తే ఎలాంటి వివాదం త లెత్తేది కాదు. కానీ ప్రాజెక్టును ఆలస్యంగా ప్రారంభించడం, పనులు కొనసాగుతుండటం, హామీ అమలు చేయకపోవడంతో కటాఫ్ పెంచుతూ పోయారు. ఈ విధంగా 2015 నుంచి 2021 వరకు మరో 338 మందిని, 2022 డిసెంబర్ వరకు మరో 60 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు యువతుల పెళ్లికావడం, వీరికి ప్యాకేజీ వర్తించదని అధికారులు చెప్పడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జాబితా నుంచి తొలగింపు మధ్యలో రెండేళ్లు ప్రాజెక్టు నిలిచిపోగా, గతేడాది డిసెంబర్ 9న మళ్లీ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమయ్యాక యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెక్కులు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొత్తం 539 మంది అర్హుల్లో 2015 నుంచి 2022 మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంతో సుమారు వంద మంది మహిళల పేర్లను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జాబితా నుంచి అధికారులు తొలగించారు. దీంతో వారు లబోదిబోమన్నారు. పట్టించుకోని ప్రజా ప్రతినిధులు అధికారుల తీరును నిరసిస్తూ డిసెంబర్ 14 నుంచి అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. సుమారు 70 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల వారు హుస్నాబాద్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యేని కలిసి తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 24న హుస్నాబాద్ పర్యటనకు వచ్ఛిన మంత్రి హరీశ్రావుకు మొర పెట్టుకుందామని ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు పట్టణ పొలిమేరలకు తరిమేశారు. దీనిపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లకుండా రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను పట్టించుకోవాలని డిమాండ్ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇదేం న్యాయం? మా త్యాగానికి ఎంత ఇచ్ఛిన తక్కువే. పెళ్లి కాని యువతులకు ప్యాకేజీ ఇస్తామంటూ మమ్మల్ని గుర్తించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు మాకు పెళ్లి కాలేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు పెళ్లి అయిందనే సాకుతో ప్యాకేజీ వర్తించదని అనడం ఏం న్యాయం? – చుంచు రాణి, నిర్వాసితురాలు వయసు పెరుగుతుంది కానీ తగ్గుతుందా? గౌరవెల్లి ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తిచేస్తే ఈ సమ స్య ఉండేది కాదు. వయస్సు పెరుగుతుందే కానీ తగ్గుతుందా? ప్రభుత్వం తప్పు చేసి మాకు అన్యాయం చేస్తే ఎలా? మా బాధలను కనీసం మంత్రికి కూడా చెప్పుకోనివ్వరా? ప్యాకేజీ ఇస్తే మాదారి మేము వెతుక్కుంటాం. – భూక్య శిరీష, నిర్వాసితురాలు -
‘రీజనల్’కు రాష్ట్ర వాటా నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 50% నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సీఎం కె.చంద్రశేఖర్రావుకు లేఖ రాశారు. నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు త్వరగా డిపాజిట్ చేయాలని సూచించారు. హైదరాబాద్ నగరానికి తలమానికంగా రూ.26 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో దాదాపు 350 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న రీజనల్ రింగు రోడ్డు పూర్తి నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ వ్యయంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగాన్ని భరించేలా అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. కేటాయించిన నిధులూ విడుదల చేయరా? భారత్ మాల పరియోజనలో భాగంగా కేంద్రం రీజనల్ రింగు రోడ్డును మంజూరు చేసిందని.. ప్రాజెక్టు నిర్మాణ కార్యాచరణనూ వేగిరం చేసిందని కిషన్రెడ్డి వివరించారు. భూసేకరణ కోసం గెజిట్ నోటిఫి కేషన్ కూడా విడుదల చేసిందన్నారు. ‘‘భూసేకరణ వ్యయంలో 50శాతం మేర నిధులను డిపాజిట్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ రవాణా, రోడ్లు–భవనాల శాఖ కార్యదర్శికి జాతీయ రహదారుల శాఖ ప్రాంతీయ కార్యాలయం అధికారి ఇప్పటికే 5 సార్లు లేఖలు రాశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి లేవనెత్తిన సందేహాలను కూడా నివృత్తి చేశారు. అయి నా తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వలేదు. 2022–23 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో రీజనల్ రింగు రోడ్డు భూ సేకరణ పేరుతో రూ.500 కోట్లు కేటాయించినా వాటిని ఇంతవరకు విడుదల చేయకపోవడం దురదృష్టకరం..’’అని కిషన్రెడ్డి విమర్శించారు. సకాలంలో స్పందించండి రీజనల్ రింగు రోడ్డు వల్ల హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే వాహనాల రద్దీని నియంత్రించటంతోపాటు తెలంగాణ ప్రాంత ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తారని, మెజారిటీ ప్రజలకు మేలు జరుగుతుందని కిషన్రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. భూసేకరణ నిమిత్తమై తదుపరి 3డీ గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించడానికి సర్వే కూడా ముగిసిందన్నారు. ఈ ఏడాది మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వడానికి ముందుకు రానట్లయితే.. ఈ 3డీ గెజిట్ నోటిఫికేషన్ వృథా అయిపోతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఇదే జరిగితే ప్రాజెక్టు ప్రారంభం అనవసరంగా మరింతగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని, సకాలంలో నిధులు జమ చేయాలని స్పష్టం చేశారు. -
అప్పుడు పొగిడిన మీడియానే... నన్నిప్పుడు తిడుతోంది: రాహుల్
ఝలావార్: తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో 2004–08 కాలంలో పొగడ్తలతో ముంచెత్తిన మీడియా ఇప్పుడు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భూ సేకరణకు సంబంధించిన అంశాలపై మాట్లాడినందుకే మీడియా ఒక్కసారిగా రూటు మార్చి నాపై దాడికి దిగింది. పేదలకు భూమి దక్కాలన్నందుకు నాపై భగ్గుమంది. మోదీ సర్కారు ప్రజల నుంచి భూములను లాగేసుకుంటోంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే నిజాన్నెవరూ అణచలేరు, దాచలేరు. బీజేపీ కుటిల ప్రయత్నాలు నాకు బలాన్నిచ్చాయి. మంచి పని చేసిన ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి. అయినా నా మార్గాన్ని వదలలేదు. పోరాటాన్ని ఆపలేదు. ముందుకు సాగుతున్నా’’ అన్నారు. రాజస్తాన్లోకి జోడో యాత్ర మధ్యప్రదేశ్లో 12 రోజులు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లోకి ప్రవేశించింది. సరిహద్దుల్లోని ఝాలావాడ్ జిల్లాలో సీఎం అశోక్ గెహ్లోట్, ఆయన ప్రత్యర్థి సచిల్ పైలట్ ఇద్దరూ రాహుల్కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో 17 రోజులు, 500 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగనుంది. యాత్రతో ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయనన్నారు. -
బ్రేకులు పడినా.. ఆగేది లేదు...
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అలైన్మెంట్, పరిహారం, ఇతర అంశాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగానే ముందుకు వెళుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు కింద కోల్పోతున్న భూమికి బదులుగా నామమాత్రపు పరిహారం ఇస్తే ఊరుకోబోమని, భూమికి బదులు భూమినే ఇవ్వాలని రైతులు ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) సభల్లో డిమాండ్ చేస్తున్నారు. తమకు కచ్చితమైన హామీ ఇవ్వకుండా భూసేకరణ ప్రక్రియ కొనసాగిస్తుండటంపై మండిపడుతున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సంబంధించి నిర్వహించిన రెండు సభల్లో కూడా జనం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటంతో అర్ధంతరంగా ముగిశాయి. ఈనెల 28న యాదాద్రి జిల్లాలో, తర్వాత సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సభలు జరగనున్నాయి. ఇప్పటికే యాదాద్రిలో రైతులు, భూయజమానులు ఆందోళనలు చేస్తుండటంతో.. అక్కడ జరగబోయే సభ కూడా రసాభాసగా మారొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రహదారి హద్దులు నిర్ధారించే సర్వే కోసం వచ్చిన అధికారులను సంగారెడ్డి శివారు ప్రాంతాల్లో భూయజమానులు అడ్డుకుని, ఆందోళనకు దిగడంతో సర్వే ఆగిపోయింది. ఈ పరిస్థితులతో ఇక ముందు పోలీసు పహారా మధ్య భూసేకరణ ప్రక్రియ నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. సంగారెడ్డి శివారులో పోలీసు భద్రత మధ్య సర్వే పూర్తిచేసి, ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా.. ముందుకు సాగే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతుల ఆందోళన కారణంగా ప్రజాభిప్రాయ సేకరణ సభలు సరిగా జరగకున్నా ఈ ప్రక్రియ పూర్తయినట్టుగానే నమోదు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. భూముల ధరలు భారీగా పెరగటంతో.. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విషయం దాదాపు నాలుగేళ్లుగా నానుతోంది. మూడేళ్ల క్రితమే రోడ్లు–భవనాల శాఖ ఆధ్వర్యంలో ఓ అలైన్మెంట్ రూపొందించారు. అది జనంలోకి వెళ్లింది. దానితో ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా భూములు కొన్నారు. తర్వాత ఆ అలైన్మెంటు కొంత మారి తుది అలైన్మెంట్ ఖరారైంది. అయితే ఇప్పుడా ప్రాంతాలన్నిటా భూముల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని, లేకుంటే కోల్పోయే భూమికి సమానంగా సమీపంలోనే భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రెట్లు పెంచి పరిహారం! భూములకు ప్రస్తుతం ప్రభుత్వం నిర్ధారించిన ధరనే పరిహారంగా ఇవ్వరని.. దానికి మూడు రెట్లు పెంచి పరిహారంగా ఇస్తారని అధికారులు చెప్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గత మూడేళ్లలో జరిగిన భూక్రయ విక్రయ లావాదేవీల్లో ఎక్కువ ధర పలికిన భూముల సగటును గుర్తిస్తారని.. దానికి మూడు రెట్ల మొత్తాన్ని పరిహారంగా నిర్ధారించి పంపిణీ చేస్తారని అంటున్నారు. 3డి నోటిఫికేషన్ వచ్చాక.. పరిహారం లెక్క.. 3డి గెజిట్ నోటిఫికేషన్ వెలువడ్డాక.. ప్రతి పట్టాదారు కోల్పోతున్న భూమి, అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లను లెక్కగట్టి.. ఎంత పరిహారం అందనుందో తేల్చి చెప్పనున్నారు. దానికి అంగీకరించిన వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్మును జమ చేస్తారు. పరిహారం తీసుకోవడానికి నిరాకరించే వారి విషయంలో సంబంధిత న్యాయస్థానంతో కలిపి జాయింట్ ఖాతా తెరిచి అందులో సొమ్ము జమ చేస్తారు. ఈ విషయాన్ని భూయజమానికి తెలిపి భూమిని సేకరిస్తారు. యజమాని తీసుకునేంతవరకు ఆ పరిహారం జాయింట్ ఖాతాలో ఉంటుంది. తీసుకునే రోజునాటికి బ్యాంకు వడ్డీ జత చేసి వస్తుంది. -
భావనపాడు కలపై.. అచ్చెన్న కుయుక్తులు!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా అభివృద్ధికి టీడీపీ నేతలు అడ్డంకిగా మారుతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డైరెక్షన్లో ప్రగతిని అడ్డుకుంటున్నారు. వారే మరోవైపు అభివృద్ధి జరగడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్య పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చేందుకు ప్రయత్నిస్తే న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం వాటిన్నింటిని అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇటీవల పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ప్రకటిస్తే.. విశాఖ రాజధాని వద్దంటూ తమ రియల్ ఎస్టేట్ భూముల కోసం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలన్న కుట్రలతో ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్నారు. తాజాగా భావనపాడు పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సిద్ధమై భూసేకరణ చేస్తుంటే కుట్రలకు దిగుతున్నారు. తమ అనుయాయులను రెచ్చగొట్టి, గలాటా సృష్టించి రాజకీయ ముసుగులో చలి కాచుకుంటున్నారు. పోర్టు వద్దనే నినాదంతో కొందర్ని వెనకుండి నడిపిస్తున్నారు. దశాబ్దాల నాటి కల.. జిల్లా ప్రజల దశాబ్దాల కల భావనపాడు పోర్టు ని ర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లాకు మేలు జరిగే ప్రాజెక్టు ఇది. తూర్పు తీరంలో ఉత్తరాంధ్రలో ప్రస్తుతం విశాఖపట్టణం పోర్టు ఒక్కటి మాత్రమే జల మార్గంలో వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడి శా, చత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్లకు జల మా ర్గంలో అతి తక్కువ దూరం కలిగిన పోర్టు మరొకటి లేదు. ►టెక్కలి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నీలి గ్రానైట్ తదితర ఖనిజాలు లభ్యమవుతున్నా యి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉన్న గ్రానైట్కు సంబంధించి 65 గ్రానైట్ క్వారీలు, వందకు పైగా పాలిషింగ్ యూనిట్లు ఇక్కడే ఉన్నాయి. ఈ గ్రానైట్ను అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ►జిల్లాలో విస్తారమైన 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 11 మండలాల పరిధిలో 145 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది చేపల వేట సాగిస్తున్నారు. జాతీయ స్థాయి లో 40 శాతం విదేశీ మారక ద్రవ్యం మెరైన్ సెక్టార్ నుంచే వస్తోంది. అందులో సిక్కోలు మత్స్యకారుల వాటానే ఎక్కువ. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క 2020– 21లో లక్షా 95వేల 230 మెట్రిక్ టన్నుల మత్స్య సంపద లభించింది. ఇలాంటి సంపదకు మంచి మార్కెట్ కల్పించేందుకు పోర్టు ఉపయోగపడుతుంది. ►ఉక్కు తయారీ కంపెనీలకు కావాల్సిన బొగ్గు, ముడి ఇనుము ఎగుమతి, దిగుమతులకు, మత్స్య ఎగుమతులకు భావనపాడు ఓడరేవు అనుకూల మని ఇప్పటికే నిపుణులు సూచించారు. ముఖ్యంగా సముద్ర ఆధారిత ఆదాయం పెంచుకునేందుకు భావనపాడు పోర్టు ఉపయోగపడుతుంది. భూసేకరణలో నిమగ్నం.. పోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఫేజ్ 1 పనులను చేపట్టేందుకు విశ్వ సముద్ర గ్రూప్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ప్రస్తుతం భూసేకరణలో యంత్రాంగం నిమగ్నమైంది. 675.60 ఎకరాలను సేకరిస్తోంది. ఇందులో ప్రైవేటు భూములు 433.71 ఎకరాలు కాగా, ప్రభుత్వ భూమి, కోస్టల్ తీరం కలిపి 241.89 ఎకరాలు ఉన్నాయి. టెక్కలి మండలం బూరగాంలో 32.78ఎకరాలు, పాత నౌపడలో 5.50 ఎకరాలు, కొండ భీంపురంలో 5.69 ఎకరాలు, నందిగాం మండలంలోని డిమ్మిలాడలో 21.17 ఎకరాలు, నర్సీపురంలో 12.15 ఎకరాలు, దేవలబద్రలో 3.56 ఎకరాలు, సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో 27.38 ఎకరాలు, కస్పా నౌపడలో 5.17 ఎకరాలు, రాజపురంలో 320.31 ఎకరాల సేకరణ కోసం ఇప్పటికే రైతులతో సంప్రదింపులు చేసింది. సేకరించిన భూముల్లో రోడ్డు కనెక్టవిటీ కోసం 327.75 ఎకరాలు, రైల్వే కనెక్టవిటీ కోసం 100.27ఎకరాలు, మిగతాది పోర్టు కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు. రైతులంతా సానుకూలత వ్యక్తం చేశారు. మెరుగైన పరిహారం టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతుల భూములను సేకరిస్తుండగా, మరోవైపు పోర్టు కో సం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లోని 420 కట్టడాలు ప్రభావితమవుతున్నాయి. వీరికి పునరావా సం కల్పిస్తున్నారు. విష్ణు చక్రం గ్రామానికి చెందిన వారికి కె.లింగుడు, సంతబొమ్మాళి, మూలపేటకు చెందిన వారికి కె.లింగుడు, ఇజ్జుపురంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 20లక్షలు పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారి ఇంటిలో ఉన్న 18 ఏళ్ల పైబడిన వయసు కలిగిన 590 మందికి రూ.10లక్షలు చొప్పున పీడీఎఫ్ ప్యాకేజీ ఇస్తున్నారు. 434 మందికి ఇంటి నిర్మాణం కోసం ఐదు సెంట్ల భూమి ఇచ్చి మోడల్ ఆర్ఆండ్ఆర్ కాలనీగా తీర్చిదిద్దనున్నారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నారు. దీంతో అక్కడి రైతు లు, ఇళ్లు కోల్పోతున్న వారు అంగీకారం తెలిపారు. రెచ్చగొట్టే పనిలో అచ్చెన్న అండ్కో.. భావనపాడు పోర్టుకు మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు అనుకూలంగా ఉన్నారు. భూ సర్వే, ఇళ్ల కొలతలన్నీ గ్రామస్తుల అభిప్రాయం మేరకే జరిగాయి. పోర్టుకు అందరు అనుకూలమని చెప్పినప్పటికీ అచ్చెన్నాయుడు డైరెక్షన్లో కొందరు గలాటా సృష్టిస్తున్నారు. పోర్టుకు వ్యతిరేకంగా కేకలు వేయడం, పోర్టు వద్దని నినాదాలు చేయడం వంటివి చేస్తున్నారు. భావనపాడు నిర్మాణం జరిగితే టీడీపీకి ప్రజలు ముఖం చాటేస్తారన్న భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుంది. ఆ ప్రాంతం అభివృద్ధి జరిగితే అక్కడి ప్రజలకు మేలు జరిగితే తమ చెప్పు చేతుల్లో ఉండరనే అభద్రతా భావం అచ్చెన్న అండ్కోకు వెంటాడుతోంది. జిల్లాకు మేలు జరిగి, అభివృద్ధికి దోహదపడే భావనపాడు పోర్టును కుట్రపూరితంగా అడ్డుకునే పనిలో పడ్డారు. తమ మాటలను నమ్మే కొందరిని రెచ్చగొట్టి పోర్టు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు. జిల్లా చిరకాల కల ను భగ్నం చేసే పనిలో పడ్డారు. గతంలో ఇళ్ల స్థలాల విషయంలో ఇదే రకంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారి కుట్రలను చేధించి, పన్నాగాలను తిప్పి కొట్టి ప్రభు త్వం పేదలకు మేలు చేసింది. ప్రస్తుతం విశాఖ రాజధాని విషయంలో అదే రకంగా అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజధాని వస్తే తమ రాజకీయాలు చెల్లవని, అమరావతిలో ఉ న్న భూములకు విలువ తగ్గి నష్టపోతామన్న భ యంతో విషం చిమ్ముతున్నారు. ఇప్పుడా జాబి తాలోకి భావనపాడు పోర్టును చేర్చారు. -
‘ఉత్తర రింగు’లో 84 ఊళ్లే!
సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికిగాను అవసరమైన భూమిని సేకరించే గ్రామాల సంఖ్యలో స్పష్టత వచి్చంది. ఉత్తర భాగం పరిధిలో వంద మీటర్ల వెడల్పుతో 162.46 కి.మీ. మేర రింగురోడ్డు నిర్మించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మించనున్న నాలుగు వరసల రోడ్డును భవిష్యత్తులో ఎనిమిది వరసలకు విస్తరించనున్నారు. ఎనిమిది వరసలు, స్తంభాలు, చెట్లు, ఇతర అవసరాలకు కావాల్సిన భూమిని ఇప్పుడే సేకరిస్తారు. ఇందుకు 4,638 హెక్టార్లు అవసరమవుతాయని అధికారులు లెక్క తేల్చారు. తొలుత 4,200 హెక్టార్లు సరిపోతుందని భావించినా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇంటర్ఛేంజర్లను మరింత విశాలంగా నిర్మించాలని నిర్ణయించటంతో అదనంగా మరికొంత భూమిని సేకరిస్తున్నారు. ఇందుకు అదనపు గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు. కానీ, గెజిట్లో మాత్రం 4,942 ఎకరాలు అవసరమవుతాయని ప్రాథమికంగా పేర్కొన్నారు. భూసేకరణలో భాగంగా స్వల్ప మొత్తం భూమి పక్క గ్రామ సర్వే నంబర్ పరిధిలో ఉన్నా.. దాని వివరాలను కూడా గెజిట్లో పొందుపరచాల్సి ఉంటుంది. సర్వే నంబర్లవారీగా భూమి వివరాల నమోదుకు సమయం పట్టనున్నందున, ప్రాథమికంగా అలైన్మెంట్కు రెండువైపులా అర కి.మీ. పరిధిలోని 122 గ్రామాలను తొలుత గుర్తించారు. ఇప్పుడు స్పష్టంగా వివరాలు నమోదు చేయటంతో గ్రామాల సంఖ్య 84కు పరిమితమైంది. 3ఏ, 3 ఏ (క్యాపిటల్) గెజిట్ నోటిఫికేషన్లు ఇప్పటికి 3ఏ, 3 ఏ (క్యాపిటల్) గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సేకరించే భూమికి రూ.5,200 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవలే బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. భూసేకరణ ప్రక్రియ మొదలవుతున్నందున ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సిందిగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆయా ఆర్డీవోల పరిధిలో భూమిని సేకరించే గ్రామాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామాల వివరాలు ఇవే... ఆర్టీవో సంగారెడ్డి: మల్కాపూర్, గిర్మాపూర్, పెద్దాపూర్, నాగపూర్, ఇరిగిపల్లె, చింతపల్లి, కలబ్గూర్, సంగారెడ్డి, తాడ్లపల్లి, కులబ్గూర్, కాసాల, దేవల్పల్లె, సికిందర్పూర్, దౌల్తాబాద్ కొత్తపేట ఆర్టీవో ఆందోల్–జోగిపేట: శివంపేట, వెండికోల్, అంగడి కిష్టాపూర్, లింగంపల్లె, కోర్పోల్ ఆర్డీవో నర్సాపూర్: నాగులపల్లె, మూసాపేట్, జానకంపేట, పెద్దచింతకుంట, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, ఖాజీపేట్, తిర్మల్పూర్, తుజల్పూర్, లింగోజిగూడ, కొత్తపేట, రత్నాపూర్, పాంబండ, ఉసిరికపల్లె, పోతులబోగూడ, గుండ్లపల్లి, కొంతాన్పల్లె ఆర్డీవో తూప్రాన్: వట్టూరు, నాగులపల్లె, ఇస్లాంపూర్, దాతర్పల్లె, గుండారెడ్డిపల్లె, కిష్టాపూర్, వెంటకాయపల్లె, నర్సంపల్లె. ఆర్డీవో గజ్వేల్: బేగంపేట, యాల్కల్, బంగ్లా వెంకటాపూర్, నెమ్టూరు, మఖత్ మాసాన్పల్లె, జబ్బాపూర్, మైలారం మక్తా, సంగాపూర్, ముట్రాజ్పల్లె, ప్రజ్ఞాపూర్, పాములపర్తి, చేబర్తి, అంగడి కిష్టాపూర్, ఎర్రవల్లి, అల్రాజ్పేట, ఇటిక్యాల, పీర్లపల్లె. యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్: వీరారెడ్డిపల్లె, కోనాపురం, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వేల్పుపల్లె, మల్లాపూర్, దత్తార్పల్లె. ఆర్టీవో భువనగిరి: రాయగిరి, కేసారం, పెంచికల్పహాడ్, తుక్కాపూర్, గౌస్నగర్, ఎర్రంబల్లె ఆర్డీవో చౌటుప్పల్: పహిల్వాన్పూర్, రెడ్లరాపాక, పొద్దటూరు, వెర్కట్పల్లె, గోకారం, నేలపట్ల, చిన్నకొండూరు, తలసింగారం, చౌటుప్పల్, లింగోజిగూడ. -
రామాయపట్నం 'రయ్.. రయ్'
రామాయపట్నం పోర్టు నుంచి చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి ప్రతినిధి: ఎక్కడైనా ఓ అభివృద్ధి పథకం కోసమో.. లేక ప్రాజెక్టు కోసమో ప్రభుత్వం భూ సేకరణకు దిగిందంటే ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు పెల్లుబుకుతుంటాయి. అయితే రామాయపట్నం పోర్టు నిర్మాణం విషయంలో మాత్రం అందుకు విరుద్దంగా స్థానికులే ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నారు. పరిహారం, పునరావాసం విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మానవతా దృక్ఫథ విధానం వల్లే స్థానిక గ్రామాల నుంచి పూర్తి మద్దతు వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూలై 20న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఒక్క రోజు కూడా విరామం లేకుండా రేయింబవళ్లు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పైలాన్ ఆవిష్కరించి వెళ్లిపోయిందని, అయితే ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన రోజు నుంచే పనులు ప్రారంభించిందని ప్రశంసిస్తున్నారు. రామాయపట్నం పోర్టు రాక వల్ల తమ ప్రాంతం అభివృద్ధి కానుండటంతో సంతోషంగా తమ గ్రామాలను ఖాళీ చేయడానికి గ్రామస్తులు ముందుకు వస్తున్నారు. భూ సేకరణ దగ్గర నుంచి పునరావాస ప్యాకేజీ వరకు ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించిందని, దీంతో గ్రామాలను ఖాళీ చేయడానికి అంగీకరిస్తున్నామని మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామస్తులు ‘సాక్షి’కి వివరించారు. ప్రభుత్వం పోర్టు కోసం 850 ఎకరాలు సేకరించి, నష్ట పరిహారం కింద రూ.89 కోట్లు చెల్లించింది. ఇప్పుడు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో మూడు గ్రామాలను ఖాళీ చేయించడంపై దృష్టి సారించింది. మూడు గ్రామాలకు తోడు సమీపంలోని సాలిపేట గ్రామం వద్ద ఉన్న 25 కుటుంబాలతో కలిపి మొత్తం 594 కుటుంబాలను ఖాళీ చేయించనున్నారు. తొలి దశలో మొండివారిపాలెం, ఆవులవారిపాలెంకు చెందిన 220 కుటుంబాలకు మంగళవారం నుంచి పరిహారం చెక్కుల పంపిణీ ప్రారంభించనున్నారు. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.9.96 లక్షలు, 5 సెంట్ల భూమిని ఇవ్వనుంది. ఒక కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ఆడ లేదా మగ పిల్లలు ఉన్నా, లేక పెద్ద వయసుఉన్న తల్లిదండ్రులు ఉన్నా.. వారిని వేరే కుటుంబాలుగా లెక్కించి పరిహారం అందించడాన్ని గ్రామస్తులు స్వాగతిస్తున్నారు. ఈ విధంగా 594 ఇళ్లకు గాను సుమారు 675 కుటుంబాలుగా పరిగణించి, పునరావాస ప్యాకేజీ అందిస్తున్నారు. ఇంటి విస్తీర్ణం ప్రకారం విలువ లెక్కించి మార్కెట్ విలువ కంటే రెట్టింపు పరిహారం ఇస్తున్నారు. పునరావాస ప్యాకేజీ కింద రూ.160 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. సర్కారు పెద్ద మనసు.. ► తాజాగా 3 గ్రామాలకు చెందిన 594 ఇళ్లు ఖాళీ చేయిస్తున్న అధికారులు ► వీరికి తెట్టుగ్రామం వద్ద 23 ఎకరాల్లో 675 ప్లాట్ల కేటాయింపు ► మేజర్ పిల్లలు, వృద్ధులు ఉంటే వేరే కుటుంబంగా పరిగణన ► రూ.19 కోట్లతో పాఠశాల, ఆస్పత్రి, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన ► ఒక్కో కుటుంబానికి రూ.9.96 లక్షలు చొప్పున పునరావాస ప్యాకేజీ ► ఇప్పుడున్న ఇంటి విస్తీర్ణం విలువ మదింపు చేసి రెట్టింపు పరిహారం 23 ఎకరాల్లో పునరావాస గ్రామ నిర్మాణం రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెంటు గ్రామం వద్ద ప్రభుత్వం 23 ఎకరాల్లో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల భూమి చొప్పున 675 మందికి కేటాయిస్తూ.. ఇందుకు అనుగుణంగా రహదారులు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పాఠశాల, వైద్యశాల, కమ్యూనిటీ భవనాలు వంటి అన్ని సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. కేవలం మౌలిక వసతుల కల్పనకే రూ.19 కోట్లు వ్యయం చేస్తోంది. ఇప్పటికే 23 ఎకరాలను చదును చేసి, ప్లాట్లుగా విభజించే కార్యక్రమం మొదలు పెట్టారు. గ్రామస్తులు తామే ఇంటిని నిర్మించుకుంటామని చెప్పడంతో ఆ విధంగా పునరావాస ప్యాకేజీ అందిస్తున్నామని, రెండు గ్రామాల ప్రజలు దీనికి అంగీకరిస్తూ సంతకాలు చేసినట్లు రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. రూ.3,600 కోట్లతో పోర్టు అభివృద్ధి సుమారు రూ.3,600 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు తొలి దశలో నాలుగు బెర్తుల నిర్మాణానికి సంబంధించి రూ.2,634 కోట్ల విలువైన పనుల కోసం అరబిందో నవయుగ గ్రూపు భాగస్వామ్య కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇందులో ఒకటి కేవలం బొగ్గు దిగుమతికి సంబంధించిన కోల్ బెర్తు కాగా, మిగతా మూడు మల్టీమోడల్ బెర్తులు. ఇప్పటికే 850 ఎకరాల భూమిలోని చెరువులను పూడ్చి చదును చేయడంతో పాటు, పోర్టులో కీలకమైన బ్రేక్ వాటర్ పనులు చేపట్టారు. ఉత్తర, దక్షిణాలకు చెందిన బ్రేక్ వాటర్ పనులు అర కిలోమీటరు పైగానే పూర్తయ్యాయి. త్వరలో డ్రెడ్జింగ్తో పాటు, భవన నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు ఆథారిత పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వం వలే శంకుస్థాపనలకు పరిమితం కాకుండా, రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టుకు ఆనుకొనే రూ.43,000 కోట్లతో ఇండోసోల్ భారీ సోలార్ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులు కూడా ప్రారంభిస్తాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తొలిషిప్ నిర్దేశిత లక్ష్యం కంటే ముందుగానే పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ నాటికి తొలి ఓడను రామాయపట్నం పోర్టుకు తీసుకొస్తాం. తొలి దశలో నాలుగు బెర్తులకు అదనంగా మరో క్యాపిటివ్ బెర్త్ నిర్మాణం కోసం చర్చలు జరుగుతున్నాయి. వర్షాకాలం ముగియడంతో పనుల్లో వేగం మరింత పెంచుతాం. – ప్రతాప్ రెడ్డి, ఎండీ, రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ గత ప్రభుత్వం సర్వే కూడా చేయలేదు గత ప్రభుత్వం ఎన్నికల ముందు రామాయపట్నం పోర్టు పైలాన్ ఆవిష్కరించి వెళ్లిపోయింది. ఏ ఒక్క అనుమతి రాలేదు. సర్వే కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో సహా అన్ని తెచ్చి, భూ పరిహారం ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించింది. గత మూడు నెలలుగా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అనేక మంది స్థానికులకు ఉపాధి లభిస్తోంది. పోర్టు ప్రారంభమైన తర్వాత విద్యార్హతలను బట్టి 50 శాతం ఉద్యోగాలు స్థానిక గ్రామ ప్రజలకే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ బాగా ఇవ్వడం వల్లే గ్రామాన్ని ఖాళీ చేయడానికి అంగీకరించాం. – కొల్లూరి సుధాకర్, స్థానిక రైతు, మొండివారిపాలెం కొంచెం బాధ.. అంతకంటే ఎక్కువ సంతోషం నాలుగు తరాలుగా ఇక్కడే ఉంటున్నా. గతంలో తుపాను సమయంలో ఇండ్లు కూలిపోతే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారు. అటువంటి గ్రామాన్ని ఖాళీ చేయాలంటే కొంచెం బాధగా ఉన్నప్పటికీ, ఈ పోర్టు వల్ల అందరం అభివృద్ధి చెందుతామని రెట్టింపు ఆనందంగా ఉన్నాం. చివరి రోజు గ్రామస్తులందరం రాములోరి సంబరం చేసుకొని కళశం తీసుకొని తెంటు గ్రామానికి వెళ్లిపోతాం. – పోలయ్య, గ్రామపెద్ద, మొండివారిపాలెం -
‘ఆర్ఆర్ఆర్’పై హైస్పీడ్లో భూసేకరణ.. నవంబర్లో రంగంలోకి కలెక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగిరం చేశారు. ఇప్పటికే సర్వే పూర్తిచేసిన అధికారులు.. భూసేకరణ అవార్డ్ పాస్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించారు. అవార్డ్ పాస్ చేయాలంటే కచ్చితంగా పర్యావరణ అనుమతి వచ్చి ఉండాలి, ఇది రావాలంటే అటవీ అనుమతుల్లో స్టేజ్–1 మంజూరు కావాలి. ఈ రెండింటిని త్వరగా పొందేందుకు చర్యలు చేపట్టారు. అటవీ అనుమతులు.. గ్రామసభలు రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగంలో 70 హెక్టార్ల మేర అటవీ భూములు పోనున్నాయి. అంతమేర స్థలాన్ని అటవీశాఖకు అప్పగిస్తే చెట్లను పెంచుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ స్థలాలిచ్చే అవకాశం లేదు. బదులుగా ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో రెట్టింపు స్థలంలో మొక్కలను పెంచనున్నారు. మొక్కలు నాటి, ఐదేళ్ల వరకు సంరక్షించేందుకు అయ్యే ఖర్చును అటవీ శాఖకు జాతీయ రహదారుల సంస్థ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి స్పష్టమైన హామీతో అటవీశాఖ స్టేజ్–1 అనుమతిని ఇస్తుంది. డబ్బులు డిపాజిట్ చేశాక స్టేజ్–2 అనుమతులు వస్తాయి. ఇక పర్యావరణ అనుమతుల కోసం నవంబర్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులు 4 జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. కలెక్టర్లు గ్రామసభల తేదీలను ప్రకటించి, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వివరిస్తారు. గ్రామసభల ఆమోదంతో పర్యావరణ అనుమతులు రానున్నాయి. ఆరు నెలలకోసారి వాహన శబ్దాలపై సమీక్ష రీజనల్ రింగ్ రోడ్డు యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే అయినందున వాహనాలు వేగంగా ప్రయాణిస్తాయి. ఈ రోడ్డును ప్రధాన పట్టణాలకు చేరువగా నిర్మిస్తుండటంతో శబ్ద కాలుష్యం జనావాసాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో అవసరమైన ప్రాంతాల్లో శబ్దాన్ని నిరోధించే నాయిస్ బారియర్లను ఏర్పాటు చేస్తారు. మిగతా ప్రాంతాల్లో జనావాసాల్లోకి వెళ్లే శబ్దాన్ని అడ్డుకునేలా రోడ్ల పక్కన పొడవుగా ఉండే చెట్లను పెంచుతారు. వెలువడే శబ్దం పరిస్థితి పరికరాల ద్వారా ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షిస్తారు. శబ్ద కాలుష్యం నిర్ధారిత పరిమాణాన్ని మించి ఉంటే మరిన్ని చర్యలకు సిఫార్సు చేస్తారు. ఈ వివరాలను వచ్చే నెలలో జరిగే గ్రామసభల్లో వివరించనున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement