వైఎస్సార్ సీపీలో చేరిన కాంగ్రెస్ నేత బాలనాగిరెడ్డి


అనంతం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. జిల్లా కాంగ్రెస్ నేత బాలనాగిరెడ్డి శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. బాలనాగిరెడ్డితో సహా వెయ్యి మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, పార్టీ నేతలు తోపుదుర్తి కవిత, ఆలూరు సాంబశివారెడ్డిలు హాజరైయ్యారు.  బాలనాగిరెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి వైఎస్సార్ సీపీ కండువా కప్పారు. దీంతో ఆ జిల్లాకు చెందిన మంత్రి శైలజానాథ్కు ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top