Breaking News

తొలుత ముంబై.. తర్వాత లండన్‌కు పంత్‌.. ఎందుకంటే!

Published on Wed, 01/04/2023 - 14:04

Rishabh Pant- Car Accident- Treatment- BCCI: కారు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ను ముంబైకి తరలించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డెహ్రాడూన్‌ ఆస్పత్రిలో ఉన్న 25 ఏళ్ల ఈ బ్యాటర్‌కు మెరుగైన చికిత్స అందించడం కోసం బీసీసీఐ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది డిసెంబరు 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న సమయంలో పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

తీవ్ర గాయాలు
ఈ దుర్ఘటనలో అతడి కారు పూర్తిగా దగ్ధమైపోగా.. అదృష్టవశాత్తూ తను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. నుదురు, కుడి మోకాలి భాగం, కుడి ముంజేయి, పాదం, వెన్నెముకకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. సోమవారం అతడిని ఐసీయూ నుంచి ప్రైవేట్‌ వార్డుకు మార్చారు.

బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ
ఇదిలా ఉంటే.. పంత్‌ ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించిన బీసీసీఐ.. స్పెషలిస్టులతో వైద్యం చేయించాలనే యోచనలో ఉంది. బీసీసీఐ ప్యానెల్‌ డాక్టర్లు పంత్‌ మెడికల్‌ రిపోర్టులు పరిశీలించిన తర్వాత అతడిని ముంబైకి షిఫ్ట్‌ చేయాలా లేదంటే విదేశాలకు పంపాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అవసరమైతే అమెరికా లేదంటే లండన్‌కు పంత్‌ను తరలించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  గురించి ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘ మెరుగైన చికిత్స కోసం క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ను ముంబైకి షిష్ట్‌ చేయనున్నారు’’ అని పేర్కొన్నాడు.

చదవండి: Sanju Samson: క్యాచ్‌ డ్రాప్‌ చేసిన సంజూ! హార్దిక్‌ పాండ్యా రియాక్షన్‌ వైరల్‌
Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌.. త్వరలోనే అక్తర్‌ను కూడా!
Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..
పంత్‌ను ప్రత్యేకంగా కలిసిన ఇద్దరు.. ఎవరో తెలుసా?

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)