Breaking News

IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌

Published on Sat, 11/08/2025 - 11:21

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా (IND vs SA)కు భారీ షాక్‌ తగిలింది. భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant Injured) మరోసారి గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ.. రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. కాగా సఫారీ జట్టుతో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే.

ఇందుకు సన్నాహకంగా భారత్‌- ‘ఎ’- సౌతాఫ్రికా - ‘ఎ’ జట్లు ముందుగా అనధికారిక టెస్టు సిరీస్‌ ఆడుతున్నాయి. ఇంగ్లండ్‌ పర్యటనలో గాయపడ్డ పంత్‌ భారత్‌- ‘ఎ’ కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు. ఇక బెంగళూరులోని బీసీసీఐ (BCCI) ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్టేడియం వేదికగా.. తొలి అనధికారిక టెస్టులో పంత్‌ సేన గెలుపొందింది.

ధ్రువ్‌ జురెల్‌ అజేయ శతకం
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో అనధికారిక టెస్టు మొదలుకాగా.. టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్‌ అయింది. ధ్రువ్‌ జురెల్‌ అజేయ శతకం (132) కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది.

అయితే, తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా పంత్‌ గాయపడ్డాడు. సఫారీ పేసర్‌ షెపో మొరేకి వేసిన రాకాసి బౌన్సర్‌ పంత్‌ చేతి వేలికి బలంగా తాకింది. ఫిజియో వచ్చి పరిశీలించగా.. పంత్‌ బ్యాటింగ్‌ కొనసాగించాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి మొరేకి బౌలింగ్‌లో అవుటయ్యాడు.

34 పరుగుల స్వల్ప ఆధిక్యం
ఇక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే ఆలౌట్‌ కావడంతో భారత్‌కు.. 34 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కగా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 24 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్‌ 78 పరుగులు చేసింది.

ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆటలో ఆదిలోనే స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (60 బంతుల్లో 27) వికెట్‌ను భారత్‌ కోల్పోగా.. పంత్‌ క్రీజులోకి వచ్చాడు. భారత్‌ స్కోరు 108-4గా ఉన్న వేళ పంత్‌కు రెండుసార్లు గాయమైంది. 

రెండుసార్లు బంతి బలంగా తాకడంతో
మొరేకి బౌలింగ్‌లో తొలుత పంత్‌ ఎడమ మోచేతికి గాయమైంది. తర్వాత గజ్జల భాగంలో బంతి బలంగా తాకింది. దీంతో 22 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నవంబరు 14 నుంచి టెస్టు సిరీస్‌ మొదలు కానుండగా.. పంత్‌ రూపంలో కీలక ఆటగాడు గాయపడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో భారత్‌ 43 ఓవర్ల ఆట ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి.. 158 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

చదవండి: ఐసీసీ కీలక నిర్ణయం

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)