పశువులు కూడా సిగ్గు పడే భాష


సాక్షి, హైదరాబాద్: పశువులు కూడా సిగ్గు పడే భాషను కొంతమంది ఉపయోగిస్తున్నారని, తాను అలా మాట్లాడలేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక చోట్ల నీతి నిజాయితీ, విలువల గురించి మాట్లాడే చంద్రబాబునాయుడు ఏ విలువలను ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.



రేవంత్‌రెడ్డి వాడిన భాషను సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తప్పు చేయలేదని, డబ్బు తీసుకెళ్లలేదని, స్టీఫెన్‌సన్‌కు ఇవ్వలేదని, ఆ డబ్బుతో పార్టీకి సంబంధం లేదని, ఆడియో టేపులో ఉన్న సంభాషణ తనది కాదని చంద్రబాబు ఇంతవరకు చెప్పలేదన్నారు. సభ్యతలేని మనుషులు మాట్లాడే అసభ్యమాట లను మీడియా కూడా తొలగించాలని సూచించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top