గవర్నర్‌తో పళనిస్వామి భేటీ

గవర్నర్‌తో పళనిస్వామి భేటీ - Sakshi


చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌ రావును అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి మరోసారి కలిశారు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన రాజ్భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని పళనిస్వామి కోరారు. ఆయన వెంట 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.



నిన్న సాయంత్రం కూడా ఆయన గవర్నర్ విద్యాసాగర్‌ రావును కలిశారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌ కు అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి కోరారు. కాగా మరికాసేపట్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు కూడా గవర్నర్‌ను కలవనున్నారు. అసెంబ్లీలో బలనిరూపణకు సెల్వంకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. శశికళ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గవర్నర్ ఇక ఆలస్యం చేయడం తగదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.



తమిళనాడు మరిన్ని అప్‌డేట్స్ చూడండి..


 


 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top