నైనా, శ్రీజలకు స్వర్ణాలు | Sakshi
Sakshi News home page

నైనా, శ్రీజలకు స్వర్ణాలు

Published Sun, Aug 31 2014 1:44 AM

నైనా, శ్రీజలకు స్వర్ణాలు - Sakshi

సాక్షి, హైదరాబాద్: పాకిస్థాన్‌లో జరిగిన దక్షిణాసియా జూనియర్, క్యాడెట్స్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారులు స్వర్ణాలతో మెరిశారు. ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన ఈ టోర్నీలో నైనా జైస్వాల్, ఆకుల శ్రీజలు రెండేసి స్వర్ణాలు సాధించగా, ఆర్.స్నేహిత్ ఓ స్వర్ణం, రజతం సాధించాడు. క్యాడెట్ బాలికల సింగిల్స్, టీమ్ ఈవెంట్‌లలో నైనా స్వర్ణాలు గెలవగా... శ్రీజ టీమ్ ఈవెంట్‌తోపాటు డబుల్స్‌లో పసిడి పతకాలు సాధించింది. ఇక స్నేహిత్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణంతోపాటు క్యాడెట్ బాలుర సింగిల్స్‌లో రజతం దక్కించుకున్నాడు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement