స్పెషల్‌ ఒలింపిక్స్‌కు జిల్లా క్రీడాకారులు | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ఒలింపిక్స్‌కు జిల్లా క్రీడాకారులు

Published Tue, Feb 28 2017 1:25 AM

స్పెషల్‌ ఒలింపిక్స్‌కు జిల్లా క్రీడాకారులు - Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆస్ట్రియాలో మార్చి 13 నుంచి 21 వరకు జరగనున్న వింటర్‌ స్పెషల్‌ ఒలింపిక్స్‌కు జిల్లా క్రీడాకారులు లోక్‌సాయి, సబియాలు ఎంపికయ్యారని ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి తెలిపారు. సోమవారం ఆర్డీటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. మానసిక వికలాంగుల్లో క్రీడాప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు. జిల్లా నుంచి అనేక మంది స్పెషల్‌ ఒలింపిక్స్‌లో దేశం తరఫున ఎంపికయ్యారన్నారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి ఎంపిౖకెన క్రీడాకారులు 41 పతకాలు సా«ధించారన్నారు. రైతు కూలి నేపథ్యం కలిగిన వీరు అంతర్జాతీయ ఫ్లోర్‌బాల్‌ క్రీడా పోటీలకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. డైరెక్టర్‌ దశరథరాముడు మాట్లాడుతూ ఈసారి భారత్‌ నుంచి 140 మంది క్రీడాకారులు స్పెషల్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారన్నారు. వారిలో జిల్లాకు చెందిన లోక్‌సాయి (బుక్కరాయసముద్రం, రెడ్డిపల్లి), సబియా (బత్తలపల్లి మండలం సంగాల) ఉండటం చాలా గర్వకారణమన్నారు. ఎంపికైన క్రీడాకారులు మార్చి 3 నుంచి 12 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోదన్లో జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు జేవియర్, నిర్మల్‌కుమార్, సుధీర్, సిరప్ప, కమ్యూనికేషన్స్   ఏడీ నాగప్ప, కోచ్‌లు వెంకటేష్, రాధిక, శంకర్‌ పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement