రోడ్డు ప్రమాదంలో బస్సు క్లీనర్‌ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బస్సు క్లీనర్‌ మృతి

Published Thu, Oct 13 2016 10:39 PM

cleaner dies in road accident

చిలమత్తూరు : మండలంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారి కోడూరు తోపు సమీపంలో గల జువారి ఫ్యాక్టరీ ఎదుట గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పరిగి మండలం కొడిగెనహళ్లికి చెందిన మహమ్మద్‌ మన్సూర్‌(35) మతి చెందినట్లు ఎస్‌ఐ జమాల్‌బాషా తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరిన (బెంగళూరులోని నేషనల్‌ ట్రావెల్స్‌కు చెందిన) బస్సు కోడూరు సమీపంలోని జువారి ఫ్యాక్టరీ వద్దకు రాగానే లారీని ఓవర్‌టెక్‌ చేయబోయి ఢీకొనడంతో బస్సు క్లీనర్‌గా పని చేసే మన్సూర్‌ అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. మతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement