Breaking News

మజ్లిస్‌ ముందు మోకరిల్లుతున్నాయ్‌

Published on Sun, 11/02/2025 - 06:19

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మజ్లిస్‌కు మోకరిల్లుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ ఇప్పుడు మజ్లిస్‌ కనుసన్నల్లో ఉందని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు మజ్లిస్‌ ఓటు బ్యాంకే ముఖ్యంగా మారిందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల నుంచి జూబ్లీహిల్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితమైంది కాదని.. మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసేలా కీలకంగా మారిందని చెప్పారు. మజ్లిస్‌ సానుభూతిపరుల ఓట్ల కోసమే సోనియా, రాహుల్‌గాం«దీలు అజహరుద్దీన్‌ను మంత్రి పదవి కట్టబెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌ అవకాశవాద రాజకీయాలపై కార్పెట్‌ బాంబింగ్‌ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 

కేసీఆర్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరిట, రేవంత్‌ సర్కార్‌ ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదలను దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు, వివాహమైతే తులం బంగారం వంటి పథకాలను అమలు చేయాలంటూ ప్రచారానికి వచ్చే కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని ప్రజలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని.. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్‌ సొంత కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని విమర్శించారు. డబుల్‌ బెడ్రూం పథకం కేవలం ప్రచారానికి వాడుకొని కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ప్రజలకు ఏం చేశాయని పార్టీలకు ప్రజలు ఓటు వేయాలని కిషన్‌రెడ్డి నిలదీశారు.  

పాకిస్తాన్‌ అంటే వాళ్లకు ప్రేమ 
శత్రు దేశమైన పాకిస్తాన్‌పై కాంగ్రెస్‌ పార్టీ గురు, శిష్యులకు ప్రేమ ఎక్కువని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సర్జికల్‌ స్ట్రైక్స్, ఆపరేషన్‌ సిందూర్‌ను చులకన చేసి భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం కాంగ్రెస్‌ పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పాక్‌కు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న బీజేపీకి ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)