Breaking News

వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్‌

Published on Sun, 11/16/2025 - 15:35

సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను టీమిండియా ఓటమి (IND vs SA)తో ఆరంభించింది. కోల్‌కతా వేదికగా ఈడెన్‌ గార్డెన్స్‌లో సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో టీమిండియా నిలిచింది.

అందుకే ఓడిపోయాం
ఈ నేపథ్యంలో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Risbah Pant) ఓటమిపై స్పందించాడు. ఒత్తిడిలో తాము చిత్తయ్యామని పేర్కొన్నాడు. ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే లక్ష్యాన్ని ఛేదించే వాళ్లమని తమ వైఫల్యాన్ని అంగీకరించాడు.

వాళ్లిద్దరు అద్భుతం
ఈ మేరకు.. ‘‘124 పరుగుల టార్గెట్‌ను మేము ఛేదించి ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్‌లో మాపై ఒత్తిడి బాగా పెరిగింది. అయితే, మేము దానిని అధిగమించలేకపోయాము. తెంబా, బాష్‌.. అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి.. తమ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేసుకున్నారు.

ఇలాంటి పిచ్‌పై 120 పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు. అయితే, మేము మాత్రం ఈ విషయంలో సఫలం కాలేకపోయాము. మ్యాచ్‌ ఇప్పుడే ముగిసింది. ఫలితాన్ని విశ్లేషించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నాడు.

బవుమా ఫిఫ్టీ.. నిలబడిన బాష్‌
కాగా భారత్‌- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం మొదలైన తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోయింది. 93/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆదివారం నాటి ఆట మొదలుపెట్టిన సఫారీ జట్టుకు కెప్టెన్‌ తెంబా బవుమా, టెయిలెండర్‌ కార్బిన్‌ బాష్‌ అద్భుత బ్యాటింగ్‌తో మెరుగైన స్కోరు అందించారు.

తొలి ఇన్నింగ్స్‌(3)లో విఫలమైన బవుమా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విలువైన అజేయ అర్ధ శతకం (136 బంతుల్లో 55) బాదాడు. మరోవైపు.. బాష్‌ 37 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి 79 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా సౌతాఫ్రికా 153 పరుగులు చేయగలిగింది. 

ఆది నుంచే తడబాటు
ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 30 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించినందున.. విజయ లక్ష్యం 124 పరుగులుగా మారింది. అయితే, లక్ష్యఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (1), యశస్వి జైస్వాల్‌ (0) పూర్తిగా విఫలం కాగా.. ధ్రువ్‌ జురెల్‌ (13), రిషభ్‌ పంత్‌ (2) నిరాశపరిచారు.

ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌ (31) ఓ మోస్తరుగా రాణించగా.. రవీంద్ర జడేజా (18), అక్షర్‌ పటేల్‌ (17 బంతుల్లో 26) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఆఖర్లో కుల్దీప్‌ యాదవ్‌ (1), సిరాజ్‌ (0) చేతులెత్తేయగా.. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అబ్సెంట్‌ హర్ట్‌ కావడంతో టీమిండియా ఆలౌట్‌ అయింది. 

కాగా మెడనొప్పి వల్ల తొలి ఇన్నింగ్స్‌ మధ్యలోనే నిష్క్రమించిన గిల్‌.. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ పంత్‌.. తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.

చదవండి: పంత్‌ ఫెయిల్‌.. గంభీర్‌ ప్లాన్‌ అట్టర్‌ఫ్లాప్‌.. టీమిండియా ఓటమి

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)