Breaking News

పంత్‌ పని అయిపోయింది.. ఇక మిగిలింది అదే..!

Published on Mon, 12/12/2022 - 19:44

భావి భారత కెప్టెన్‌గా చిత్రీకరించబడి, అనతి కాలంలోనే ఏ భారత క్రికెటర్‌కు దక్కనంత హైప్‌ దక్కించుకుని, ప్రస్తుతం కెరీర్‌లో దుర్దశను ఎదుర్కొంటున్న రిషబ్‌ పంత్‌ను త్వరలోనే జట్టు నుంచి తప్పించబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా పంత్‌ను వైస్‌ కెప్టెన్సీ (బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌) నుంచి తప్పించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.

బంగ్లాతో వన్డే సిరీస్‌కు సైతం పంత్‌ ఫిట్‌గానే ఉన్నప్పటికీ.. గాయం నెపంతో బీసీసీఐ కావాలనే పంత్‌ను పక్కకు పెట్టిందన్న ప్రచారం​ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి పంత్‌ను వైస్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన బీసీసీఐ.. మున్ముందు అతన్ని జట్టులో నుంచి పూర్తిగా తొలగిస్తుందని భారత క్రికెట్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. 

బంగ్లాతో ఆఖరి వన్డే వరకు పంత్‌ (టీమిండియా వికెట్‌కీపర్‌ స్థానానికి)కు సంజూ శాంసన్‌ నుంచి మాత్రమే పోటీ ఉండేది. అయితే బంగ్లాతో మూడో వన్డేలో అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌ మెరుపు డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో పంత్‌ కూసాలు కదలడం పక్కా అని తేలిపోయింది.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సంజూ, ఇషాన్‌ కిషన్‌ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న పంత్‌.. తనకు మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన టెస్ట్‌ల్లో సైతం తన స్థానాన్ని ప్రమాదంలోకి పడేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతనికి శ్రీకర్‌ భరత్‌ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు పంత్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించిన మేనేజ్‌మెంట్‌.. తుది జట్టులో ఆడించడం కూడా కష్టమేనన్న పరోక్ష సంకేతాలు పంపింది. వరుస అవకాశాలు ఇచ్చినా పంత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాడని గుర్రుగా ఉన్న బీసీసీఐ.. టెస్ట్‌ల్లో శ్రీకర్‌ భరత్‌ను పరీక్షించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ బంగ్లాతో తొలి టెస్ట్‌లో పంత్‌కు స్థానం లభించకపోతే, అతని కెరీర్‌ సమాప్తమైనట్టేనని క్రికెట్‌ అభిమానులు చర్చించకుంటున్నారు. పంత్‌ వ్యతిరేకులు అయితే.. అతని పని అయిపోయిందని, ఇక మిగిలింది అతన్ని జట్టు నుంచి గెంటివేయడమేనని బహిరంగ కామెంట్లు చేస్తున్నారు. భారత క్రికెట్‌ చరిత్రలో ఏ క్రికెటర్‌కు దక్కనన్ని అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేని పంత్‌కు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని శాపనార్ధాలు పెడుతున్నారు. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)