Breaking News

భార‌త్‌-బంగ్లాదేశ్ వైట్ బాల్‌ సిరీస్‌ల‌పై నీలినీడలు?

Published on Tue, 07/01/2025 - 11:30

ఈ ఏడాది ఆగ‌స్టులో భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రగాల్సిన వైట్‌బాల్ సిరీస్‌లపై అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ సిరీస్‌ల‌కు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్  అమీనుల్ ఇస్లాం కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ ప‌ర్యట‌నకు భార‌త జ‌ట్టును పంపేందుకు బీసీసీఐ(BCCI) ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుంద‌ని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.

వాస్త‌వానికి షెడ్యూల్ ప్ర‌కారం.. ఆగ‌స్టులో భార‌త జ‌ట్టు మూడు టీ20, మూడు వ‌న్డేల సిరీస్ కోసం బంగ్లాలో ప‌ర్యాటించాల్సి ఉంది. ఆగ‌స్టు 17 నుంచి టీమిండియా టూర్ ప్రారంభ‌మ‌వ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్‌-భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న రాజకీయ ఉద్రిక్తతల కార‌ణంగా ఈ సిరీస్‌లు జ‌ర‌గ‌డం అసంభవం అన్పిస్తోంది.

అయితే బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్‌ల‌కు ఆతిథ్య‌మిచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో వీలుకాకపోయినా, తర్వాతైనా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. "ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సిరీస్‌లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము. 

ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే తర్వాతైనా భారత్‌కు ఆతిథ్యమిస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా టూర్‌ను వాయిదా వేయలేదు. భారత జట్టు బంగ్లా పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉందని" బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో అమీనుల్ పేర్కొన్నారు. 

కాగా భార‌త జ‌ట్టు వ‌చ్చే నెల‌లో బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌క‌పోతే, బీసీబీ ఐపీఎల్‌-2026 వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వరిలో జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌కప్ వ‌ర‌కు టీమిండియా షెడ్యూల్‌ ముందుగానే ఫిక్స్‌ అయింది. పొట్టి ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ జరగనుంది. ​కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్‌ తర్వాతే భారత జట్టుకు కాస్త సమయం లభిస్తోంది. టీమిండియా చివరగా 2022లో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాలో పర్యటించింది.
చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్ట‌ర్ ప్లాన్‌! అత‌డికి పిలుపు?
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)