Breaking News

IND vs SL: ఇదే కదా జరగాల్సింది! ఇకపై పంత్‌ కంటే ముందు వాళ్లిద్దరు!

Published on Wed, 12/28/2022 - 09:57

India Vs Sri Lanka Series- Rishabh Pant: శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌కు జట్టులో చోటుదక్కలేదు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు టీ20 టీమ్‌లో ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంపై స్పందించిన క్రికెట్‌ కామెంటేటర్‌ హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కాగా గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ పెద్దగా రాణించడం లేదన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ద్విశతకంతో సత్తా చాటాడు ఇషాన్‌ కిషన్‌. మరోవైపు.. గత సిరీస్‌లలో వచ్చిన ఒకటీ అరా అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకున్నాడు సంజూ శాంసన్‌.

ఇలానే కదా జరగాల్సింది
ఈ నేపథ్యంలో లంకతో  టీ20 సిరీస్‌ జట్టు ఎంపికపై హర్ష భోగ్లే ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘‘టీ20లలో రిషభ్‌ పంత్‌ కంటే ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌ ముందు వరుసలో ఉన్నారన్నమాట! ఇలానే కదా జరగాల్సింది. 

ఇప్పుడు ఇషాన్‌ , రుతురాజ్‌, సంజూ, సూర్యకుమార్‌ టాప్‌-4లో చక్కగా సరిపోతారు. ఇక రజత్‌ పాటిదార్‌కు మాత్రం హుడా, త్రిపాఠితో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పోటీ పడాల్సి ఉంటుంది’’ అని హర్ష పేర్కొన్నాడు. కాగా రజత్‌ పాటిదార్‌ సైతం తనను నిరూపించుకుంటే జట్టులో చోటు దక్కడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, ముఖేష్ కుమార్.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)