Breaking News

టీమిండియా సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు సమం

Published on Sat, 08/02/2025 - 20:16

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు సందర్భంగా టీమిండియా (IND vs ENG 5th Test) సరికొత్త చరిత్ర లిఖించింది. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక శతకాలు బాదిన జట్ల జాబితాలో చేరింది. తద్వారా ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా జట్ల సరసన నిలిచి ప్రపంచ రికార్డు సమం చేసింది. అయితే, విదేశీ గడ్డ మీద ఈ ఘనత సాధించిన రెండో టీమ్‌గా మరో అరుదైన ఫీట్‌ నమోదు చేసింది.

కాగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు పూర్తి కాగా.. ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఓవల్‌ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయగలదు.

జైసూ సెంచరీ
ఇక ఈ మ్యాచ్‌లో శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించాడు. 127 బంతుల్లో శతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 118 పరుగులు సాధించి నిష్క్రమించాడు. కాగా అతడి టెస్టు కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ.. ఈ సిరీస్‌లో రెండోది.

12 సెంచరీలు 
అదే విధంగా.. జైసూ శతకంతో ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ఇప్పటికి 12 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మూడు జట్లకు మాత్రమే ఈ ఘనత సాధ్యంకాగా.. తాజాగా టీమిండియా కూడా చరిత్ర పుటల్లోకెక్కింది. 

ఇదిలా ఉంటే.. 75/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. టీ బ్రేక్‌ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ధ్రువ్‌ జురెల్‌ 25, రవీంద్ర జడేజా 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్‌ శతకం (118), ఆకాశ్‌ దీప్‌ అర్ధ శతకం (66)తో అదరగొట్టారు. 

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌-2025లో ఇప్పటి వరకు శతకాలు బాదింది వీరే
యశస్వి జైస్వాల్‌- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్‌, ది ఓవల్‌- లండన్‌)
శుబ్‌మన్‌ గిల్‌- 4 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్‌, ఎడ్జ్‌బాస్టన్‌- బర్మింగ్‌హామ్‌, ఓల్డ్‌ ట్రఫోర్డ్‌- మాంచెస్టర్‌ )
రిషభ్‌ పంత్‌- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్‌)
కేఎల్‌ రాహుల్‌- 2 సెంచరీలు (హెడింగ్లీ- లీడ్స్‌, లార్డ్స్‌- లండన్‌)
రవీంద్ర జడేజా- 1 సెంచరీలు (ఓల్డ్‌ ట్రఫోర్డ్‌- మాంచెస్టర్‌)
వాషింగ్టన్‌ సుందర్‌- 1 సెంచరీలు (ఓల్డ్‌ ట్రఫోర్డ్‌- మాంచెస్టర్‌)

ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్లు
ఆస్ట్రేలియా- 1955లో వెస్టిండీస్‌ వేదికగా ఆతిథ్య జట్టు మీద- ఐదు టెస్టుల్లో- 12 సెంచరీలు
పాకిస్తాన్‌- 1982/83లో సొంతగడ్డపై టీమిండియా మీద ఆరు టెస్టుల్లో- 12 సెంచరీలు
సౌతాఫ్రికా- 2003/04లో సొంతగడ్డపై వెస్టిండీస్‌ మీద నాలుగు టెస్టుల్లో- 12 సెంచరీలు
టీమిండియా- 2025లో ఇంగ్లండ్‌ వేదికగా ఆతిథ్య జట్టు మీద- 12 సెంచరీలు

చదవండి: IND vs ENG: నేనైతే ఆకాశ్‌కు ఒక్కటి ఇచ్చేవాడిని: రిక్కీ పాంటింగ్‌

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)