Breaking News

ఆసీస్‌ను చిత్తు చేసి.. ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించిన టీమిండియా

Published on Mon, 02/20/2023 - 10:12

India vs Australia, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముగించుకున్న టీమిండియా ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించింది. రెండున్నర రోజుల్లోనే ఢిల్లీ మ్యాచ్‌నూ ముగించిన రోహిత్‌ సేన ఆదివారం మిగిలిన సమయాన్ని ఈ మేరకు మ్యూజియం దర్శనకు కేటాయించింది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన భారత క్రికెటర్లకు నిర్వాహకుల నుంచి ఘన స్వాగతం లభించింది.

రోహిత్‌, కోహ్లి సహా
హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సహా ఇతర క్రికెటర్లకు గైడ్‌ మార్గదర్శనం చేస్తుండగా.. అంతా కలిసి మ్యూజియం కలియదిరిగారు. భారత ప్రధానుల ఔన్నత్యం, స్వతంత్ర భారతాభివృద్ధిలో వారి పాత్ర తదితర విశేషాలు తెలుసుకుంటూ ఉల్లాసంగా గడిపారు.

చరిత్రను తెలుసుకుంటూ..
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘‘చరిత్ర.. స్వాతంత్ర్యం తర్వాత  దేశాన్ని అభివృద్ధి చేయడంలో భారత ప్రధానుల కృషిని తెలుసుకుంటూ టీమిండియా.. ఇలా పీఎం సంగ్రహాలయలో సమయం గడిపింది. స్వతంత్ర భారత ప్రయాణాన్ని తెలుసుకుంది’’ అని క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో, ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కాగా ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ టెస్టులో రోహిత్‌ సేన ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌ టెస్టు మాదిరే ఈ మ్యాచ్‌ను కూడా రెండున్నర రోజుల్లోనే ముగించింది. ఈ గెలుపుతో 2-0తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆధిక్యాన్ని సంపాదించింది.

ప్రత్యేకత ఏమిటి?
ప్రధానమంత్రి సంగ్రహాలయ న్యూఢిల్లీలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిలో ప్రధాన మంత్రుల పాత్ర ఏమిటన్న విశేషాలతో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. 

నవ భారత సామాజిక నిర్మితి, రాజకీయ, ఆర్థికాభివృద్ధిలో ప్రధానుల కృషి గురించిన వివరాలు ఇందులో పొందుపరిచారు. 2022 ఏప్రిల్‌ 14న ప్రధానమంత్రి సంగ్రహాలయ(గతంలో నెహ్రూ మోమొరియల్‌ మ్యూజియం)ను జాతికి అంకితం చేశారు. ప్రజాస్వామ్య నిలయంగా దీనిని అభివర్ణించారు. ఈ మ్యూజియం చైర్మన్‌గా న్రిపేంద్ర మిశ్రా ఉన్నారు.

చదవండి: Pat Cummins: ఉన్నపళంగా స్వదేశానికి ఆసీస్‌ కెప్టెన్‌..
పిచ్‌పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే

Videos

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Bhuma Kishore:స్టేజి ఎక్కితే ఏం మాట్లాడుతుందో అఖిల ప్రియకే అర్ధం కాదు

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)