Breaking News

సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?

Published on Wed, 11/05/2025 - 18:53

సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సారథ్యంలోని ఈ టీమ్‌కు పదిహేను మంది సభ్యులను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఇక ఇంగ్లండ్‌ పర్యటనలో గాయపడిన వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant).. ప్రొటిస్‌ జట్టుతో సిరీస్‌ ద్వారా టీమిండియా తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటికే పంత్‌.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ (IND A vs SA) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

పడిక్కల్‌పై సెలక్టర్ల నమ్మకం
బెంగళూరు వేదికగా జరిగిన తొలి అనధికారిక టెస్టులో పంత్‌ 90 పరుగులతో రాణించి.. భారత్‌ను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. సాయి సుదర్శన్‌తో పాటు దేవదత్‌ పడిక్కల్‌కు సెలక్టర్లు చోటు ఇచ్చారు.

ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. ఇటీవల సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో విఫలమైనా పడిక్కల్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం విశేషం. మరోవైపు.. పంత్‌ వికెట్‌ కీపర్‌గా రీఎంట్రీ ఇవ్వగా.. ధ్రువ్‌ జురెల్‌ స్పెషలిస్టు బ్యాటర్‌గా తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

షమీకి మరోసారి మొండిచేయి
ఇక స్పిన్నర్ల కోటాలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌తో పాటు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ స్థానం సంపాదించగా.. పేసర్ల కోటాలో జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు మొహమ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఈ క్రమంలో వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీకి మరోసారి మొండిచేయే ఎదురైంది. రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో ఇటీవల బెంగాల్‌ తరఫున షమీ సత్తా చాటినా సెలక్టర్లు అతడిని కనికరించలేదు. మరో బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌కు చోటిచ్చి షమీని మాత్రం పక్కనపెట్టారు.  

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. నవంబరు 14- నవంబరు 26 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక కాగా.. రెండో టెస్టుకు  గువాహటిలోని బర్సపరా క్రికెట్‌ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌/వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌.

చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా డీకే.. పన్నెండు జట్ల వివరాలు ఇవే

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)