Breaking News

కాంగ్రెస్‌ను చీల్చొద్దు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

Published on Thu, 03/17/2022 - 19:41

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓటమి ఫలితాలపై కాంగ్రెస్‌లో ముఖ్యంగా గాంధీ కుటుంబ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఇక గాంధీ కుటంబ నాయకత్వం ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సిందేన‌ని జీ23 గ్రూపు నేత‌లు పెద్ద ఎత్తును డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబ‌రం స్పందించారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట‌మికి.. గాంధీ కుటుంబ నాయకత్వం మాత్ర‌మే బాధ్యుల్ని చేయ‌డం సరికాదని అన్నారు. పరాజయం బాధ్య‌త నుంచి ఎవరు పారిపోవ‌డం లేద‌ని.. ఓట‌మికి తాము బాధ్య‌త వ‌హిస్తున్నామ‌ని గాంధీ కుటుంబం ప్ర‌క‌టించింద‌ని గుర్తుచేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట‌మికి తానూ బాధ్య‌త వ‌హిస్తున్నాన‌ని చిదంబరం తెలిపారు. అదే విధంగా మిగ‌తా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓట‌మికి కూడా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యనేతలు బాధ్య‌త వ‌హిస్తున్నార‌ని చెప్పారు.

జీ 23 గ్రూప్‌ నేత‌లు త‌మ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీని చీల్చ‌డానికి ప్రయత్నం చేయవద్దని చిదంబరం విజ్ఞ‌ప్తి చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆగస్ట్‌లో జరిగే అవకాశం ఉందని, అప్పటివరకు సోనియా గాంధీనే నాయకత్వం వహిస్తారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై గాంధీ కుటుంటాన్ని నిందించడాన్ని ఆయన తప్పుపట్టారు.

‘ఎవరూ బాధ్యత నుంచి పారిపోరు. బ్లాక్, జిల్లా, రాష్ట్ర  AICC(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) స్థాయిలో నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ బాధ్యత ఉంది. ఎ‍న్నికల ఓటమికి కేవలం ఏఐసీసీ నాయకత్వానిదే బాధ్యత అనడం సరికాదు’ అని చిదంబరం అన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్‌ పార్టీని తిరిగి గాడిలోకి తీసుకురావడానికి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని జీ23 గ్రూపు నేత‌ల్లో ఒకరైన సీనియర్‌ నేత కపిల్ డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

Photos

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)